breaking news
-
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
పాకిస్తాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్కు బిస్మా మరూఫ్ రిటైర్మెంట్ ప్రకటించింది. తన నిర్ణయాన్ని మరూఫ్ సోషల్ మీడియా వేదికగా గురువారం వెల్లడించింది. "నేను చాలా ఇష్టపడే ఆట(క్రికెట్) నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.నా 17 ఏళ్ల ప్రయాణం ఎన్నో సవాళ్లు, విజయాలు, మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉంది. నా క్రికెట్ ప్రయాణంలో అరంగేట్రం నుంచి ఇప్పటి వరకు నాకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.నాపై నమ్మకం ఉంచి, జట్టును నడిపించే బాధ్యతను తనకు అప్పగించినందుకు పీసీబీకి ప్రత్యేక ధన్యవాదాలు. చివరగా నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని" బిస్మా పేర్కొన్నట్లు పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది.కాగా 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మరూఫ్ 17 ఏళ్ల పాటు పాకిస్తాన్ క్రికెట్కు తన సేవలు అందించింది. పాకిస్తాన్ మహిళ క్రికెట్ జట్టు తరపున వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికి మరూఫ్ పేరునే ఉంది. ఆమె పాక్ తరపున 136 వన్డేల్లో 3369 పరుగులతో పాటు 44 వికెట్లు, 146 టీ20ల్లో 2893 పరుగులతో పాటు 36 వికెట్లు పడగొట్టింది.96 మ్యాచ్ల్లో పాక్ జట్టుకు కెప్టెన్గా మరూఫ్ వ్యవహరించింది. మరూఫ్ చివరగా స్వదేశంలో వెస్టిండీస్ మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్లో పాక్ జట్టు తరపున ఆడింది. విండీస్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో కూడా మరూఫ్ భాగమైంది. కానీ ఈ సిరీస్లో ఆడుతారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. -
పాకిస్తాన్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు
పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా పంజాబ్ కింగ్స్ మాజీ ఆటగాడు అజహర్ మహమూద్ ఎంపికయ్యాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ ఆల్రౌండర్ కూడా అయిన అజహర్.. పాక్ త్వరలో న్యూజిలాండ్తో ఆడబోయే టీ20 సిరీస్కు కోచ్గా వ్యవహరించనున్నాడు. అజహర్ను ప్రస్తుతం ఈ సిరీస్కు మాత్రమే కోచ్గా ఎంపిక చేశారు. న్యూజిలాండ్ సిరీస్కు టీమ్ మేనేజర్గా పాక్ మాజీ బౌలర్ వహాబ్ రియాజ్ నియమించబడ్డాడు. న్యూజిలాండ్ సిరీస్కు మహ్మద్ యూసుఫ్, సయీద్ అజ్మల్ బ్యాటింగ్, బౌలింగ్ కోచ్లుగా వ్యవహరించనున్నారు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు పాక్లో పర్యటింనుంది. ఈ సిరీస్ ఏప్రిల్ 18, 20, 21, 25, 27 తేదీల్లో జరుగుతుంది. ఈ సిరీస్లోని తొలి మూడు మ్యాచ్లకు రావల్పిండి వేదిక కానుండగా.. ఆఖరి రెండు మ్యాచ్లు లాహోర్లో జరుగనున్నాయి. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఇదివరకే ప్రకటించబడగా.. పాక్ జట్టును ప్రకటించాల్సి ఉంది. కాగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గత కొంతకాలంగా ఫుల్టైమ్ హెడ్ కోచ్ కోసం అన్వేషిస్తుంది. ఈ పదవిని భర్తీ చేయడం కోసం పీసీబీ పెద్ద కసరత్తే చేసింది. ఒకానొక సమయంలో పాక్ హెడ్ కోచ్గా ఆసీస్ మాజీ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ను ఎంపిక చేశారనే ప్రచారం జరిగింది. వాట్సన్ పీసీబీ ప్రతిపాదనను తోసిపుచ్చడంతో అజహర్ పాక్ హెడ్ కోచ్గా ఎంపికయ్యాడు. గ్రాంట్ బ్రాడ్బర్న్ నిష్క్రమణ తర్వాత పాక్ క్రికెట్ జట్టుకు పూర్తి స్థాయి హెడ్ కోచ్ లేడు. ఇదిలా ఉంటే, 49 ఏళ్ల అజహర్ మహమూద్కు గతంలోనూ కోచింగ్ అనుభవం ఉంది. అతను 2017 నుంచి 2019 వరకు పాక్ జాతీయ జట్టు బౌలింగ్ కోచ్గా పనిచేశాడు. అజహర్ పాకిస్తాన్ సూపర్ లీగ్లోనూ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పాక్ తరఫున 21 టెస్ట్లు, 143 వన్డేలు ఆడిన అజహర్.. 162 వికెట్లు తీసి 2400 పైచిలుకు పరుగులు సాధించాడు. అజహర్ టెస్ట్ల్లో 3 సెంచరీలు కూడా చేశాడు. 2012-2015 మధ్యలో ఐపీఎల్లో పాల్గొన్న అజహర్.. పంజాబ్ కింగ్స్, కేకేఆర్ తరఫున ఆడాడు. ఐపీఎల్లో 23 మ్యాచ్లు ఆడిన అజహర్ 29 వికెట్లు తీసి 388 పరుగులు చేశాడు. అజహర్ ఐపీఎల్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. -
న్యూజిలాండ్కు బిగ్ షాకిచ్చిన పాకిస్తాన్.. 10 వికెట్ల తేడాతో ఘన విజయం
అండర్-19 వరల్డ్కప్-2024లో పాకిస్తాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని పాక్ అందుకుంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం ఈస్ట్ లండన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 25.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. పాక్ ఓపెనర్లు షాజైబ్ ఖాన్(80 నాటౌట్), షమీల్ హుస్సేన్(54నాటౌట్) మ్యాచ్ను ఫినిష్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్.. పాక్ బౌలర్ల దాటికి కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. పాక్ బౌలర్లలో ఉబైద్ షా, ఆరాఫాట్ మిన్హాష్ తలా 3 వికెట్లు పడగొట్టి బ్లాక్ క్యాప్స్ పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు నవీద్ రెండు,అలీ, జీషన్ ఒక్కో వికెట్ సాధించారు. ఈ విజయంతో పాకిస్తాన్ గ్రూపు-డి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది. చదవండి: IND vs ENG: సెంచరీతో చెలరేగిన పోప్.. రసవత్తరంగా భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు -
పాకిస్తాన్ క్రికెట్కు భారీ షాక్.. దేశాన్ని వీడనున్న స్టార్ ఆటగాడు!?
పాకిస్తాన్ మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ నుంచి యునైటెడ్ కింగ్డమ్కు తన మకాం మార్చాలని సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టెస్టుల్లో పాక్ వికెట్ కీపర్గా కొనసాగుతున్న సర్ఫరాజ్ అహ్మద్కు.. మహ్మద్ రిజ్వాన్తో పాటు యువ వికెట్ కీపర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురువుతోంది. దీంతో అతడిని సెలక్టర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక వేళ సెలక్టర్లు ఎంపిక చేసినా.. తుది జట్టులో చోటు అంతంతమాత్రమే. తన క్రికెట్ భవిష్యత్తు సందిగ్ధంలో పడడంతో పాకిస్తాన్ను విడిచిపెట్టి లండన్ వెళ్లాలని సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. యూకేలో ఉంటూ కౌంటీలు, ఫ్రాంచైజీ క్రికెట్లో ఆడాలని సర్ఫరాజ్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే అహ్మద్ తన సొంత దేశాన్ని వదిలి యూకేకు వెళ్లినా త్వరలో పాకిస్తాన్లో జరగనున్న పీఎస్ఎల్ లో మాత్రం ఆడతానని సర్ఫరాజ్ సృష్టం చేసినట్లు వినికిడి. ఇప్పటికే తన ప్రాతినిథ్యం వహిస్తున్న క్వెట్టా గ్లాడియేటర్స్ ఫ్రాంచైజీకి సర్ఫరాజ్ ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. అయితే దేశం విడిచి వెళ్లడంపై సర్ఫరాజ్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టులలో పాకిస్తాన్ తరపున సర్ఫరాజ్ ఆడాడు. తొలి టెస్టుకు ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకున్న అహ్మద్.. రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని రెండో టెస్టుకు జట్టు మేనెజ్మెంట్ పక్కన పెట్టేసింది. రెండో టెస్టుకు సర్ఫరాజ్ స్ధానంలో మహ్మద్ రిజ్వాన్ తుది జట్టులోకి వచ్చాడు. ఓవరాల్గా సర్ఫరాజ్ తన కెరీర్లో ఇప్పటివరకు 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20ల్లో పాకిస్తాన్కు ప్రాతినిథ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో 6 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 6,164 పరుగులు చేశాడు. కాగా 2017లో అతడి సారథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ సొంతం చేసుకుంది. చదవండి: Sania Mirza: సానియా మీర్జాకు విడాకులు?.. నటిని పెళ్లాడిన షోయబ్ మాలిక్! -
పాక్ క్రికెట్లో భారీ కుదుపు.. ఒకేసారి తప్పుకున్న ముగ్గురు కీలక వ్యక్తులు
పాకిస్తాన్ క్రికెట్ భారీ కుదుపునకు లోనైంది. ఆ జట్టుకు సంబంధించిన ముగ్గురు కీలక వ్యక్తులు తమతమ పదవులకు రాజీనామా చేశారు. పాక్ క్రికెట్ జట్టు డైరెక్టర్ మిక్కీ ఆర్థర్, హెడ్ కోచ్ గ్రాంట్ బ్రాడ్బర్న్, బ్యాటింగ్ కోచ్ ఆండ్రూ పుటిక్ ఒకేసారి విధుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పీసీబీతో తమ అనుబంధం ఈ నెలాఖరుతో ముగుస్తుందని ఈ ముగ్గురు వెల్లడించారు. తమ రాజీనామాలను పాక్ క్రికెట్ బోర్డు కూడా అంగీకరించిందని వారు తెలిపారు. మిక్కీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్బర్న్, ఆండ్రూ పుటిక్ ఆయా హోదాల్లో గతేడాదే నియమితులయ్యారు. అంతకుముందు కూడా వీరికి పాక్ జట్టుతో అనుబంధం ఉండింది. అయితే వన్డే వరల్డ్కప్కు ముందు పీసీబీ వీరి పదవులను మార్చింది. మిక్కీ ఆర్థర్.. గతంలో పాక్ జట్టు హెడ్ కోచ్గా.. బ్రాడ్బర్న్ ఎన్సీఏ హై పెర్ఫార్మింగ్ కోచ్గా పని చేశారు. ఈ ఇద్దరు ఆయా పదవుల్లో అద్భుతంగా రాణించి, పాక్ జట్టును అత్యున్నత స్థాయిలో నిలిపారు. అయితే కొత్త పదవుల్లోనే మాత్రం వీరు సత్తా చాటలేకపోయారు. ఆర్థర్ డైరెక్టర్గా, బ్రాడ్బర్న్ కోచ్గా బాధ్యతలు చేపట్టాక పాక్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. వన్డే వరల్డ్కప్లో లీగ్ దశలోనే ఇంటిముఖం, ఆ తర్వాత ఆసీస్తో టెస్ట్ సిరీస్లో క్లీన్ స్వీప్ పరాభవం.. తాజాగా న్యూజిలాండ్ చేతిలో టీ20 సిరీస్ ఓటమి.. ఇలా వరుస సిరీస్ల్లో పాక్ చెత్త ప్రదర్శన చేసింది. ఈ నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డే వీరిని తమ పదవులకు రాజీనామా చేయాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. వన్డే వరల్డ్కప్ అనంతరం కెప్టెన్ను మార్చిన పాక్.. తాజాగా ప్రధాన నాన్ ప్లేయింగ్ స్టాఫ్ను మార్చడం ఆసక్తికర పరిణామంగా మారింది. కాగా, వన్డే వరల్డ్కప్లో ఓటమి నేపథ్యంలో బాబార్ ఆజమ్ పాక్ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో పీసీబీ మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను నియమించింది. షాన్ మసూద్ సారథ్యంలోని పాక్ టెస్ట్ జట్టు ఆస్ట్రేలియాలో 0-3తో సిరీస్ కోల్పోయి ఘోర పరాభవాన్ని ఎదుర్కొనగా.. తాజాగా షాహీన్ అఫ్రిది నేతృత్వంలోని పాక్ టీ20 జట్టు న్యూజిలాండ్ చేతిలో టీ20 సిరీస్ను 0-3 తేడాతో (మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే) కోల్పోయింది. పాక్ ఇవాళ (జనవరి 19) న్యూజిలాండ్తో నాలుగో టీ20లో తలపడనుంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019