breaking news
-
ఎన్నికల యుద్ధానికి సై.. ఈ రాష్ట్రాల్లో గెలుపెవరిది?
సార్వత్రిక ఎన్నికల భేరి మోగింది. ఎన్నికల క్షేత్రంలో నువ్వా.. నేనా?.. విజయమా.. పరాజయమా? తేల్చుకోవాల్సిన సమయం అన్ని పార్టీలకు, ఆయా పార్టీల నాయకులకు ఆసన్నమైంది. ఓ వైపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ 400 సీట్ల లక్ష్యంతో పర్యటిస్తున్నారు. మరో వైపు ఇండియా కూటమి కూడా తనదైన రీతిలో ప్రచారం సాగిస్తోంది. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మాత్రమే కాకుండా ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఈ కథనంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఏ పార్టీ బలంగా ఉంది.. కీలక నేతలు ఎవరనే వివరంగా వివరంగా తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా.. 'మమతా బెనర్జీ, అధీర్ రంజాన్ చౌదరి, సువెందు అధికారి' కీలక నేతలుగా ఉన్నారు. కాగా 2019లో మొత్తం 42 లోక్సభ స్థానాల్లో 22 టీఎంసీ, 18 బీజేపీ, 2 కాంగ్రెస్ సొంతం చేసుకున్నారు. ఇక జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలుపొందనుందనే విషయం త్వరలోనే తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరో వైపు సందేశ్ఖాలీ దురాగతాలపై కూడా విమర్శలు జోరందుకున్నాయి. సీఏఏ అమలుపై టీఎంసీ ప్రభుత్వం వ్యతిరేకతను చూపుతోంది. ఈ తరుణంలో జరగనున్న 294 అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుంది. ఏ ప్రభుత్వం అమల్లోకి వస్తుందనే విషయాలు తెలియాల్సి ఉంది. మధ్యప్రదేశ్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివరాజ్సింగ్ చౌహన్, మోహన్ యాదవ్, కమల్నాథ్, జ్యోతిరాదిత్య సింధియా కీలకనేతలుగా ఉన్నారు. 2019లో బీజేపీ 28, కాంగ్రెస్ 1 లోక్సభ స్థానాలను కైవసం చేసుకున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హిందుత్వ వాదం, కుల సమీకరణ, నిరుద్యోగం వంటివి ప్రధాన సమస్యలుగా ఉన్న తరుణంలో 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుంది. కాగా ఫలితాలు వెల్లడైన తరువాత మధ్యప్రదేశ్ ఏ పార్టీ హస్తగతం చేసుకోనుందనే విషయం తెలియాల్సి ఉంది. ఝార్ఖండ్ 14 లోక్సభ స్థానాలకు, 81 అసెంబ్లీ స్థానాలకు ఝార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ 2019లో ఎన్డీఏ 12 స్థానాల్లో యూపీఏ 2 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఆరోపణలు, నగదు అక్రమ చలామణి కేసులో హేమంత్ సోరెన్ అరెస్ట్ వంటి విషయాలు కీలకమైన అంశాలుగా చెలరేగుతున్నాయి. ఒడిశా బిజూ జనతాదళ్ (బీజద), బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్న ఒడిశాలో ఈ సారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో మరి కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. నవీన్ పట్నాయక్ఎం మన్మోహన్ సామల్ కీలక నేతలుగా ఉన్న ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో అవినీతి వంటి అంశాలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. కాగా 2019 లోక్సభ ఎన్నికల్లో బీజద 12, బీజేపీ 8, కాంగ్రెస్ 1 స్థానాలను సొంతం చేసుకున్నాయి. అస్సాం 2019లో ఎన్డీఏ 9, కాంగ్రెస్ 3, ఇతరులు 2 లోక్సభ స్థానాలను కైవసం చేసుకున్న అస్సాం రాష్ట్రంలో ఈ సారి ఏ పార్టీ ఆధిక్యంలో ఉంటుందనేది తెలియాల్సి ఉంది. 126 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో హిమంత బిశ్వశర్మ, బద్రుద్దీన్ అజ్మల్, భూపేన్ కుమార్ బోరా కీలక నేతలుగా ఉన్నారు. ఛత్తీస్గఢ్ 90 స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఛత్తీస్గఢ్ ఎవరి చేతుల్లోకి వెళుతుందనేది తెలియాల్సిన విషయం. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 9, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందింది. విష్ణుదేవ్ సాయ్, రమణ్ సింగ్, భూపేశ్ బఘేల్ కీలక నేతలుగా ఛత్తీస్గఢ్ ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్యలతో సతమతమవుతోంది. అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ రెండు లోక్సభ స్థానాలను 2019లో బీజేపీ హస్తగతం చేసుకుంది. అయితే ఈ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరనున్నాయి. పెమా ఖండూ, నబమ్ తుకి కీలక నేతలుగా రాష్ట్రంలో సరిహద్దు ప్రాంత అభివృద్ధి మాత్రమే కాకుండా.. మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు సమాచారం. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. మణిపూర్ ఎన్డీఏ అధికార పక్షంగా ఉన్న మణిపూర్ రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 2019లో బీజేపీ1, నేషనల్ పీపుల్స్ పార్టీ 1 లోక్సభ స్థానాలను గెలుచుకున్నాయి. ఎన్. బీరేన్ సింగ్, ఇబోబి సింగ్ కీలక నేతలుగా ఈ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ, శాంతి భద్రతల సమస్యలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రధాన పార్టీలుగా బీజేపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. మేఘాలయ నేషనల్ పీపుల్స్ పార్టీ అధికారంలో ఉన్న మేఘాలయలో.. అస్సాం సరిహద్దు, నిరుద్యోగం వంటి సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. ఇక్కడ కెలక నేతలుగా కాన్రాడ్ సంగ్మా, ముకుల్ సంగ్మా కీలక నేతలుగా ఉన్నారు. 60 స్థానాలకు అసెంబ్లీ జరగాల్సి ఉంది. అయితే 2019లో ఇక్కడున్న రెండు లోక్సభ స్థానాలను కాంగ్రెస్, NPP చెరొకటి సొంతం చేసుకున్నాయి. త్రిపుర బీజేపీ అధికారంలో ఉన్న త్రిపురలోని రెండు లోక్సభ స్థానాలను భాజపా హస్తగతం చేసుకుంది. ఇక్కడ బీజేపీ, సీపీఎం ప్రధాన పార్టీలుగా.. మాణిక్ సాహా, మాణిక్ సర్కార్ కీలక నేతలుగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ధరల పెరుగుదల ప్రధాన సమస్యగా ఉంది. త్రిపురలో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. మిజోరం మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ ఉన్న ఒక్క లోక్సభ స్థానం సొంతం చేసుకోగా.. అధికార పక్షంలో ZPM ఉంది. ఇక్కడ 40 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన నేతలుగా లాల్ దుహోమా, జోరథంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో రైతు సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేఖత, హిందూ క్రిస్టియన్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. నాగాలాండ్ యునైటెడ్ డెమొక్రాటిక్ అలయెన్స్ కూటమి అధికారంలో ఉన్న నాగాలాండ్ రాష్ట్రంలో 'నెప్యూ రియో' కీలక నేతగా ఉన్నారు. బీజేపీ, నేషనల్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ పార్టీలు ప్రధానంగా ఉన్న ఈ రాష్ట్రంలో నేషనల్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏట నాగాలాండ్ రాష్ట్రంలో ఏ పార్టీ జెండా ఎగురుతుందో చూడాలి. సిక్కిం 32 అసెంబ్లీ స్థానాలు, 1 లోక్సభ స్థానం ఉన్న సిక్కిం రాష్ట్రంలో సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM), బీజేపీ కూటమి అధికార పక్షంగా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రేమ్సింగ్ తమాంగ్, పవన్ కుమార్ చామ్లింగ్ కీలక నేతలుగా ఉన్నారు. సిక్కిం 1 లోక్సభ స్థానాన్ని 2019లో SKM సొంతం చేసుకుంది. ఈ ఏట ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలుసుకోవడానికి మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 2024 ఏప్రిల్ 19న ప్రారంభమై.. ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో మొత్తం ఏడు దశల్లో జరుగుతుంది. భారతీయ పౌరులు తప్పకుండా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును తప్పకుండా ఉపయోగించుకోవాలి. మందుకు, విందుకు, కరెన్సీ నోటుకు నీ ఓటును అమ్ముకుంటే.. భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుంది. కులానికో.. మతానికో కాకుండా సమర్ధుడైన నాయకున్ని ఎన్నుకుంటే సమర్థవంతమైన పాలన సాగుతుంది. మేలుకో.. తెలుసుకుని మసలుకో. -
India Meteorological Department: చలి తీవ్రత ఈసారి తక్కువే
ఢిల్లీ: దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో ఈసారి డిసెంబర్ నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా కాస్తంత అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ‘‘ఉత్తర, వాయవ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో చలి గాలుల తీవ్రత సాధారణ స్థాయి కన్నా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఈసారి డిసెంబర్లో చలి తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ డిసెంబర్–ఫిబ్రవరి సీజన్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగా కన్నా కాస్తంత ఎక్కువ నమోదవ్వొచ్చు. ఈసారి ఎల్నినో పరిస్థితులు ఉండటమూ ఇందుకు మరో ప్రధాన కారణం’’ అని విశ్లేషించింది. -
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల షెడ్యూల్ విడుదల
-
రెండ్రోజులపాటు 70వ ఎన్ఈసీ సమావేశాలు
గువాహటి నుంచి సాక్షి ప్రతినిధి: ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధే లక్ష్యంగా ఏర్పాటైన ఈశాన్య రాష్ట్రాల మండలి (నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్) 70 వ ప్లీనరీ సమావేశాలు నేటి నుంచి రెండు రోజుల పాటు అసోం రాజధాని గువాహటిలో జరగనున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి, ఎన్ఈసీ ఎక్స్–అఫిషియో చైర్మన్ అమిత్ షా నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశాల్లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, ఉన్నతాధికారులతో పాటు ఎనిమిది రాష్ట్రాల గవర్నర్లు కూడా పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి స్థాపన తర్వాత మారుతున్న పరిస్థితులు, ఈ ఎనిమిది రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక మద్దతు, వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత (రైలు, రోడ్డు, విమాన, జలమార్గాల్లో), ఉడాన్ పథకంలో భాగంగా జరుగుతున్న విమానాశ్రయాల నిర్మాణం, టెలికామ్ అనుసంధానత, విద్యుత్, ఎనర్జీ రంగాలు, విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో గతంలో నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఎంతవరకు చేరుకున్నారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి లక్ష్యాల నిర్దేశం తదితర అంశాలపై కూలంకశంగా చర్చించనున్నారు. దీంతోపాటుగా యువతకు ఉపాధి కల్పన, పరిశ్రమలు, పర్యాటకం, ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానత తదితర అంశాలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి జీ–20 సదస్సుకు భారతదేశం నేతృత్వం వహిస్తున్న సందర్భంలో.. ఈ సమావేశాల్లో ఈశాన్య రాష్ట్రాల భాగస్వామ్యం తదితర అంశాలను కూడా చర్చించనున్నారు. అంతేగాక ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటనలో భాగంగా జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఈశాన్య రాష్ట్రాలతో సంబంధాలు మెరుగుపరిచేందుకు ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీసుకొని బంగ్లాదేశ్లో పర్యటించాల్సిందిగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్రెడ్డిని కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో బంగ్లాదేశ్ పర్యటనకు సంబంధించిన అంశాలపై కూడా ప్లీనరీలో చర్చించే అవకాశం ఉంది. కాగా గతేడాది మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో 69వ ఎన్ఈసీ సమావేశాలు జరిగాయి. చదవండి: నేనేం సోనియా రిమోట్ను కాను -
కరోనా నుంచి బయటపడ్డ 5 రాష్ట్రాలు
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లోని ఐదు రాష్ట్రాలు కరోనా మహమ్మారి బారి నుంచి బయటపడ్డాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, త్రిపుర కోవిడ్-19 లేని రాష్ట్రాలుగా నిలిచాయని ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఈశాన్య ప్రాంతంలోని మిగతా మూడు రాష్ట్రాలైన అసోం, మిజోరం, మేఘాలయా.. కరోనా ఫ్రీ కానప్పటికీ తాజాగా కోవిడ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్టమైన చర్యల కారణంగానే ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా ముప్పు తక్కువగా ఉందన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఆరేళ్ల నుంచి ఈశాన్య ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసిందని చెప్పుకొచ్చారు. (కరోనా వైరస్.. మరో దుర్వార్త) ‘దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యవసర సరుకుల కొరత రాకుండా కార్గో విమానాల ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరుకులు తరలిస్తున్నాం. ఎయిర్ ఇండియా, ఇండియన్ వాయుసేన ద్వారా ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూకశ్మీర్, లద్దాఖ్లకు ప్రాధాన్యతా క్రమంలో సరుకులు పంపిస్తున్నామ’ని జితేంద్ర సింగ్ తెలిపారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కట్టడికి షిల్లాంగ్లోని ఈశాన్య అభివృద్ధి మండలితో కలిసి సమన్వయంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. లాక్డౌన్ కంటే ముందే కేంద్రం నుంచి ఈశాన్య రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించామన్నారు. (లాక్డౌన్ సడలింపా.. అదేం లేదు: సీఎం)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019