breaking news
-
Kuppam: బాబుకు ఓటమి భయం!
కుప్పం కోటపై చంద్రబాబుకు నమ్మకం సడలుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయం వెంటాడుతోంది. ఇన్నేళ్లుగా మోసిన జనం ఇప్పుడు ముఖం చాటేస్తుండడంపై ఆందోళన పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే టీడీపీ అధినేతకు తెలుగు తమ్ముళ్ల సమర్థతపై అనుమానం మొదలైంది. అందుకే ఇతర ప్రాంతాల నుంచి సొంత మనుషులను కుప్పానికి తరలిస్తున్నారు. ఎలక్షన్ మేనేజర్ల పేరిట నేతల ఇళ్లలో తిష్ట వేయిస్తున్నారు. ప్రచారం నుంచి తాయిలాల పంపిణీ వరకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేలా చర్యలు చేపడుతున్నారు. బాబు వ్యవహారిశైలికపై స్థానిక నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన తమను విశ్వసించకుండా బయటి వారిని తెచ్చిపెట్టడంపై లోలోపల రగిలిపోతున్నారు. శాంతిపురం : కుప్పం నియోజకవర్గంలోని టీడీపీ నాయకులను నమ్మకుండా ప్రకాశం జిల్లా నుంచి తన సామాజికి వర్గానికి చెందిన కంచెర్ల శ్రీకాంత్కు చంద్రబాబు పెద్దపీట వేశారు. నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఎన్నికల వేళ సైతం గ్రామ స్థాయిలోని పార్టీ కార్యకర్తలు, నాయకులపై కూడా అపనమ్మకంతో సొంత మనుషులతో నిఘా ఏర్పాట్లు చేస్తున్నారు. వంద మంది మేనేజర్లు కుప్పంలో ఎన్నికల పర్యవేక్షణకు బయటి ప్రాంతాల నుంచి తన సొంత మనుషులు వందమందిని చంద్రబాబు మోహరిస్తున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ప్రతి 3 పోలింగ్ కేంద్రాలకు ఒకరి చొప్పున ఎలక్షన్ మేనేజర్ల పేరుతో ఇక్కడికి తీసుకువస్తున్నారు. బెంగళూరులోని టీడీపీ ఐటీ ఫోరమ్ ద్వారా బెంగళూరు, హైదరాబాదులో గుర్తించిన దాదాపు వంద మందిని తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం కుప్పానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి దాదాపుగా రోజూ బెంగళూరు–కుప్పం మద్య చక్కర్లు కొడుతున్నారు. ఆయా మేనేజర్లు తమ పోలింగ్ కేంద్రాల పరిధిలోని టీడీపీ నాయకుల బంధువులుగా చెప్పుకుని వారి ఇళ్లలోనే బస చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా వచ్చే వారి బసకు ఇబ్బంది లేకుండా వసతులు ఉన్న నాయకుల ఇళ్లను ఇప్పటికే గుర్తించారు. ఈ నెల 26 నుంచి మే 12వ తేదీ రాత్రి వరకూ బయటి వ్యక్తులు స్థానికంగా మకాం వేసి పార్టీ వ్యవహారాలను నడపనున్నారు. ప్రచారం సాగాల్సిన తీరును పర్యవేక్షిస్తూ కింది స్థాయి నాయకులు, కార్యకర్తలను వారు సమన్వయం చేయనున్నారు. తమపై పరిశీలకుల కన్ను ఉంటే పార్టీ క్యాడర్ రాజీ పడకుండా పనిచేస్తారని ఈ ఏర్పాటుకు చంద్రబాబు ఆలోచన చేసినట్లు తెలిసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు జరిపే పంపకాలు కూడా వీరి ద్వారానే నిర్వహించి, పోలింగ్ ముందు రోజు రాత్రి వారంతా స్వస్థలాలకు వెళ్లి ఓటు వేసేలా వ్యూహరచన చేసుకున్నారు. కానీ ఇంత కాలం పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన తమను ఎన్నికల వేళ నమ్మకుండా అవమానిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు కుమిలిపోతున్నారు. అలవి కాని హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకపోగా కాలకేయుల్లాంటి నాయకులను ప్రోత్సహించిన తమ అధినేత, ఇప్పుడు తమను చేతకాని వాళ్లుగా నిలబెడుతున్నారని ఓ సీనియర్ కార్యకర్త వాపోయారు. చివరకు ఎన్నికలకు ముందే చంద్రబాబు ఓటమి భయం రుచిచూస్తున్నారని వెల్లడించారు. తగ్గిన జనాదరణ కుప్పం నుంచి తొలుత 1989 ఎన్నికల్లో చంద్రబాబు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు 52.65 శాతం ఓట్లు సాధించారు. తర్వాత ప్రత్యర్థి పార్టీల నాయకులను ప్రలోభ పెట్టి తన దారికి తెచుకోవడం ద్వారా నియోజకవర్గంపై క్రమంగా పట్టు బిగించారు. 1994లో గరిష్టంగా 75.49 శాతం ఓట్లు సాధించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రస్థానం ప్రారంభమైన తర్వాత కుప్పంలో కూడా బాబు ప్రభ తగ్గడం మొదలైంది. 2014లో 62.59 శాతం ఓట్లు రాగా, 2019లో 55.18 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. అనంతరం వివక్ష లేని సుపరిపాలనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అశేష ప్రజాదరణ సొంతం చేసుకున్నారు. కుప్పం ప్రజల మనసును గెలుచుకున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం ప్రజలు సైతం వైఎస్సార్సీపీకే జైకొట్టారు. దీంతో అసలు సంగతి చంద్రబాబుకు బోధపడింది. ఇక కల్లబొల్లి కబుర్లును కుప్పం వాసులు నమ్మరని అర్థమైంది. అందుకే తరచూ కుప్పంలో పర్యటనలు ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో సైతం తన సతీమణి నారా భువనేశ్వరి చేతులమీదుగా నామినేషన్ వేయించారు. ఆమె కూడా కుప్పంలోనే మూడు రోజులపాటు తిష్ట వేసి నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. -
తాత నోట.. మళ్లీ పాత పాట!
ఎక్కడ సింగపూరు.. ఎక్కడ కుప్పం.. బెంగళూరు అభివృద్ధి ఎక్కడ.. కుప్పంలో అభివృద్ధి ఎంత..? ఇవి విపక్ష నేత చంద్రబాబుకు తెలియంది కాదు.. ఓట్ల వేటలో నోటికొచ్చిన హామీలు గుప్పించి అమాయక కుప్పం ప్రజలను బురిడీ కొట్టించడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. 35 ఏళ్లుగా వారిని మభ్యపెట్టిన బాబు ఇప్పుడూ అదేపాట అందుకున్నారు. ‘కుప్పాన్ని మరో సింగపూర్ చేస్తా.. బెంగళూరు జనం చదువు, పనుల కోసం కుప్పానికి వచ్చేటట్లు మారుస్తా..’ నంటూ అలవిగాని హామీలు గుప్పించేశారు. రెండు రోజులుగా తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి హామీల వర్షంలో కుప్పం ప్రజలను తడిపి ముద్దచేశారు. వీటి అమలు ఎంత.. బాబు హామీల్లో నిజం ఎంత అని స్థానికులు చర్చించుకుంటున్నారు. సంక్షేమ ప్రభుత్వం నీడన ఉన్న చల్లదనం.. సైకిలు ఎక్కితే వచ్చిందా..? అని చర్చించుకుంటున్నారు. బాబు హామీలు.. వాటి విధివిధానాలపై జనం చర్చించుకుంటున్నారు. కుప్పం/కుప్పంరూరల్: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు రోజుల పాటు అలవిగాని హామీలు గుప్పించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, 14 ఏళ్లు సీఎం హోదా ఉన్నప్పుడు కుప్పాన్ని అభివృద్ధి చేయని తాత మరో అవకాశం ఇస్తే చేస్తానంటూ జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఈసారి అయితే మరో అడుగు ముందుకేసి బెంగళూరు జనం కుప్పం వచ్చేలా చేస్తానంటూ అమలుకు యోగ్యం కాని హామీలు గుప్పించి స్థానికులకు విసుగు తెప్పించారు. ఆయన హామీలపై మీరే ఓ లుక్కేయండి..! రికార్డు అరిగిపోయింది బాబూ! ♦ కుప్పాన్ని దేశానికే ఆదర్శం చేస్తా ♦ పారిశ్రామికవాడ చేసి యువకులకు ఉపాధి కల్పిస్తా ♦ కుప్పం పట్టణాన్ని శాటిలైట్ సిటీ చేసి, ప్రతి పంచాయతీకి కోటి, మేజర్ పంచాయతీకి రెండు కోట్ల నిధులు కేటాయిస్తా. ♦ గ్రామాల్లో అభివృద్ధి పనులు స్థానికులే చేసుకునే విధంగా అవకాశం ♦ ప్రతి గ్రామానికీ రోడ్డు, ప్రతి ఇంటికీ తాగునీటి కొళాయితో పాటు పొలాలకు సిమెంట్ రోడ్లు వేయిస్తా ♦ కుప్పాన్ని బయటి ప్రపంచంతో అనుసంధానం చేసేందుకు బెంగళూరుకు ఫోర్వే రోడ్డుతో పాటు ప్రత్యేక విమానాశ్రయం ఏర్పాటు చేస్తా ♦ కుప్పంలో ప్రతి ఎకరాకు బిందుసేద్యం పరికరాలు ఇచ్చి వ్యవసాయ హబ్గా తయారు చేస్తా ♦ శాశ్వత తాగు, సాగునీటికి హంద్రీ–నీవా జలాలు తీసుకువస్తా ♦ ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలను అనుసంధానం చేస్తా. ♦ ప్రతి మహిళకు నాలుగు ఆవులు ఇచ్చి పాడి పరిశ్రమతో స్వయం ఉపాధి కలి్పస్తా గతంలో ఇచ్చిన హామీలు గుర్తున్నాయా బాబూ? ♦ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చే వరకు కుప్పంలో కనీసం డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేయని బాబు చదువుల హబ్గా ఎలా మారుస్తారని స్థానికులు నిలదీస్తున్నారు. ♦ పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి టెండర్లు పిలిస్తే తమిళనాడు ప్రభుత్వంతో కలిసి కోర్టులకు వెళ్లింది చంద్రబాబు కాదా..? అని కుప్పం ప్రజలు గళమెత్తుతున్నారు. ♦ గతంలో ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని నిరీ్వర్యం చేసి ఇప్పుడు ఇంజినీరింగ్ కళాశాలతో అనుసంధానం చేస్తామంటే ఎలా నమ్మేదని ధ్వజమెత్తుతున్నారు. ♦ 2004లో కుప్పాన్ని మరో సింగపూర్ చేస్తామన్న హామీ ఇచ్చి, ఆపై సీఎం హోదాలో మరిచిపోయిన సంగతి గుర్తులేదా..? అంటున్నారు. ♦ 2001లో పారిశ్రామిక వాడ కోసం అనిమిగానిపల్లి వద్ద శంకుస్థాపన చేసి.. ఇప్పుడు యువతకు ఉద్యోగాలిస్తామనడం తప్పు కాదా అని ప్రశి్నస్తున్నారు. ♦ 2018లో ఎయిర్పోర్ట్ కోసం శంకుస్థాపన చేసి ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయింది నువ్వు కాదా అని మండిపడుతున్నారు. ♦అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు గొప్పలు చెప్పి మరో అవకాశం ఇవ్వాలంటూ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు. మా నమ్మకం నువ్వే జగన్ నమ్మకానికి మారుపేరు సీఎం జగన్మోహన్రెడ్డి అని కుప్పం ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కుప్పం పట్టణాన్ని అప్గ్రేడ్ చేసి మున్సిపాలిటీ హోదా కల్పించాలని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అలాగే కుప్పాన్ని రెవెన్యూ, పోలీసు డివిజన్లుగా తీర్చిదిద్దారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం అభివృద్ధి సీఎం జగనన్నతోనే సాధ్యమని నినదిస్తున్నారు. కలగా మారిన హంద్రీ–నీవాను పూర్తిచేసి కుప్పానికి నీళ్లిచ్చిన ఘనత జగనన్నదని నమ్ముతున్నారు. అదేవిధంగా పాలారు ప్రాజెక్టు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల నిర్మాణానికి అడుగులు వేయడం అభివృద్ధికి సంకేతమని చెబుతున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం, కమ్యూనిటీ భవనాల నిర్మాణం ఎవరి హయాంలో పూర్తయ్యాయో బాబు చెప్పాలని నిలదీస్తున్నారు. మరోమారు జగనన్నను గెలిపించుకుంటే కుప్పం రూపురేఖలు మారడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఈ సారి కుప్పంలో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తామని ముక్తకంఠంతో హోరెత్తిస్తున్నారు. కుప్పంకు బాబు చేసిందేమీ లేదు చంద్రబాబు కుప్పం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయినా ఆయన చేసింది ఏమీ లేదు. కనీసం కుప్పంలో డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేయలేదు. పట్టణంలో రైల్వే అండర్ బ్రిడ్జి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చి డిగ్రీ కళాశాల పెడితే, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టణంలో అండర్ బ్రిడ్జీ్జల నిర్మాణం పూర్తిచేశారు. కుప్పంలో శాశ్వత అభివృద్ధి జరగాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందే. ఆయన వస్తే కుప్పం రూపురేఖలు మారతాయని మా నమ్మకం. – మాధవన్, డీకే పల్లి, కుప్పం మండలం ఇంతకాలం ఎందుకు చెయ్యలేదు? ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు ఇంకో అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానంటున్నారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 3 పర్యాయాలు సీఎంగా ఉండి ఎందుకు చేయలేదు?. కనీసం కుప్పాన్ని మున్సిపాలిటీ కూడా చేయలేకపోయారు. ఆయనను ఇకమీదట ఇక్కడి ప్రజలు నమ్మరు. జగన్మోహన్రెడ్డి కుప్పానికి చేసిన అభివృద్ధి ఏమిటో జనం ప్రత్యక్షంగా చూశారు. ఇచ్చిన మాట ప్రకారం హంద్రీ–నీవా కాలువ నిర్మాణం పూర్తి చేసి కుప్పానికి నీళ్లిచ్చారు. రెవెన్యూ, పోలీస్ డివిజన్లు ఏర్పాటు చేసి కుప్పం రూపురేఖలే మార్చేశారు. మరోమారు జగన్మోహన్రెడ్డికే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. – కుమార్, డీకే పల్లి, కుప్పం మండలం -
చంద్రబాబు వెన్నులో వణుకు.. అందుకే రూట్ మారిందా?
సాక్షి, చిత్తూరు: ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సింహంలా సింగిల్గా వస్తుంటే.. చంద్రబాబు మాత్రం అన్ని పార్టీలతో కలిసి కూటమిగా బయలుదేరారు. మరోవైపు.. చంద్రబాబు తనకు కంచుకోట అని చెప్పుకునే కుప్పంపైనే ఓటమి భయం వెడుతోంది. వెన్నులో వణుకు మొదలైంది. ఈ నేపథ్యంలో కుప్పంపై చంద్రబాబు దృష్టిసారించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పం చేరుకున్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో కుప్పం ఓటర్లను ఆకర్షించేందుకు వరాలను ప్రకటించబోతున్నారు. ఇక, గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు అసలు కుప్పాన్ని పట్టించుకునేవారు. కానీ, ఈసారి మాత్రం ఎన్నికల హాడావుడి మొదలవగానే మొదటగా కుప్పంపైనే ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో తాను ఓడిపోతే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన చంద్రబాబు కుప్పం దారి పట్టారు. ఇదిలా ఉండగా.. 2019 ఎన్నికల నుంచే కుప్పం నియోజకవర్గం ఓటర్లలో మార్పు కనిపించింది. గత ఎన్నికల్లోనే చంద్రబాబుకు మోజార్టీ భారీగా తగ్గింది. దీంతో బాబు సైతం షాకయ్యాడు. ఇక, తాజాగా కుప్పం నియోజకవర్గ పరిధిలో భారీగా దొంగ ఓట్లను తొలగించడంతో అటు చంద్రబాబు, ఇటు టీడీపీలో వణుకు మొదలైంది. మరోవైపు.. ఇటీవలి కాలంలో కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎన్నిక ఎలాంటిదైనా వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో గెలుస్తోంది. కుప్పం మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించింది. ఇక, సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు కుప్పం ప్రజలకు దండిగా చేరుతుండటంతో ఓటర్లు సైతం మార్పును కోరుకుంటున్నట్టు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో, చంద్రబాబుతో భయం మొదలైంది. -
కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది? రగిలిపోతున్న బీసీ నేతలు!
టీడీపీ అధినేత చంద్రబాబుకు తనసామాజికవర్గ నేతలు ఉంటే.. ఇంక ఎవరితోనూ పని ఉండదు. బీసీలను అసలు పట్టించుకోరు. మూడున్నర దశాబ్దాలుగా కుప్పంలో చంద్రబాబును మోస్తున్న బీసీ నేతలు ఆయన తీరుతో మండిపడుతున్నారు. ఇంతకాలం తమతో పార్టీకి ఊడిగం చేయించుకుని ఇప్పుడు బయటి వ్యక్తులకు ప్రాధాన్యం ఇస్తారా అంటూ ఆగ్రహిస్తున్నారు. స్థానికంగా ఉన్నవారిని పక్కన పెట్టి ఇతర జిల్లాల నుంచి ఇంపోర్ట్ చేస్తే సహించేది లేదంటున్నారు. అసలు కుప్పం టీడీపీలో ఏం జరుగుతోంది? తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా చెప్పుకునే నారా చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గంలో ఆయన కుర్చీ కదిలిపోతోంది. ఏడుసార్లుగా ఎమ్మెల్యేగా ఎన్నుకున్న కుప్పం ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెలగబెట్టినా కూడా సొంత నియోజకవర్గానికి కనీసం తాగు, సాగునీరు కూడా తీసుకురాలేకపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే కుప్పం దశ తిరిగింది. అన్నివిధాలుగానూ కుప్పం నియోజకవర్గాన్ని వైఎస్ జగన్ అభివృద్ధి చేస్తున్నారు. హంద్రీనీవా ద్వారా కృష్ణా నది నీటిని కుప్పంకు తీసుకువచ్చి వారి దాహార్తిని తీర్చుతున్నారు. పొలాల్ని సస్యశ్యామలం చేస్తున్నారు. నియోజకవర్గం గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించారు. గండం నుంచి గట్టెక్కడానికి కుప్పం పార్టీని తన సామాజికవర్గానికి చెందిన ప్రకాశం జిల్లా నేత, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్కు అప్పగించారు. దీంతో దశాబ్దాలుగా పార్టీకి ఊడిగం చేసిన తాము పనికిరాకుండా పోయామా అంటూ అక్కడి బీసీ నేతలు చంద్రబాబు మీద మండిపడుతున్నారు. నియోజకవర్గంలోని బీసీ నేతలతో పాటు..కుప్పంలో ఆయనకు పీఏలుగా పనిచేసినవారిని కూడా పక్కన పెట్టేశారు. వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా చేసేశారు. దీంతో వారు లోపల ఉండలేక..బయటకు పోలేక అల్లాడిపోతున్నారు. ఇన్నేళ్ళుగా తమను వాడుకుని..ఇప్పుడు నిర్లక్ష్యం చూపిస్తున్నందుకు తామేంటో ఎన్నికల్లో చూపిస్తామని చంద్రబాబును హెచ్చరిస్తున్నారు కుప్పంలోని బీసీ సామాజికవర్గ నేతలు. తమను నమ్మకుండా బాధ్యతలు లేకుండా చేసినపుడు ఇంకా తాము టీడీపీకి, చంద్రబాబుకు ఎందుకు సేవ చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు ఇంతకాలం భారీ మెజారిటీ రావడానికి, అసలు ఆయన విజయం సాధించడానికి అక్కడ చేర్పించిన దొంగ ఓట్లే కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫిర్యాదుతో కుప్పంలో చంద్రబాబు చేర్పించుకున్న దొంగ ఓట్లలో 33 వేలకు పైగా తొలగించారు. అందుకే ఓటమి తప్పదని చంద్రబాబు భయపడుతున్నారు. ఎన్నికల్లో తమ తడాఖా చూపిస్తామంటున్నారు అక్కడి బీసీ నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కుప్పంలో అధికార పార్టీ బాగా బలం పుంజుకుంది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో నిరాశా నిస్పృహలు ఆవరించాయి. ఒకవైపు కేడర్లో నైరాశ్యం..బీసీ నేతల్లో పార్టీ అధినేత పట్ల ఆగ్రహం..ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత...మొత్తం కలిపి కుప్పంలో చంద్రబాబు కోట కూలడం ఖాయమనే టాక్ నడుస్తోంది. -
కుప్పం నియోజకవర్గంలో కృష్ణమ్మ పరవళ్లు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019