breaking news
-
జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. ఉక్కిరి బిక్కిరవుతున్న ఉద్యోగులు
ప్రపంచ జాబ్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ధోరణులు పుట్టుకు రావడం సర్వసాధారణంగా మారింది. కోవిడ్-19 సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆ తర్వాత మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ పేరుతో జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండే నడిచింది. అవేవి చాలవన్నట్లు తాజాగా ‘డ్రై ప్రమోషన్’ అనే కొత్త పదం తెరపైకి వచ్చింది. కోవిడ్-19 తర్వాత జాబ్ మార్కెట్లు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి బడా బడా టెక్ కంపెనీల వరకు ప్రాజెక్ట్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఖర్చు విషయంలో కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. లేఆఫ్స్, రిమోట్ వర్క్, కృత్తిమ మేధ వినియోగం పేరుతో పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. డ్రై ప్రమోషన్ పేరుతో ఇప్పుడు ఉద్యోగుల జీతాల విషయంలో డ్రై ప్రమోషన్ విధానాన్ని అవలంభిస్తున్నాయి. కంపెనీలు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తాయి. అందుకు తగ్గట్లుగా జీతాల్ని పెంచవు. బరువు, బాధ్యతల్ని పెంచుతాయి. ఇప్పుడు దీన్ని డ్రై ప్రమోషన్ అని పిలుస్తున్నారు. 900 కంపెనీల్లో జరిపిన సర్వేలో ప్రముఖ కాంపన్సేషన్ కన్సల్టెన్సీ సంస్థ పర్ల్ మేయర్ డ్రై ప్రమోషన్పై ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. దాదాపు 13 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు వేతన పెంపులేని ప్రమోషన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. 2018లో ఈ సంఖ్య 8శాతం మాత్రమే అని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. మరో కన్సల్టెన్సీ సంస్థ మెర్సెర్ అనే సంస్థ 900 కంపెనీలపై జరిపిన సర్వేలో 2023తో పోలిస్తే 2024లో ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగులకు జీతం పెంచకుండా ప్రమోషన్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. లేఆఫ్స్ ఆపై ప్రమోషన్లు అంతకుముందు, ఉద్యోగుల కొరతను ఎదుర్కొన్న కంపెనీలు వారిని నిలుపుకునేందుకు భారీగా వేతనాలు పెంచింది. అదే సమయంలో ఉద్యోగాల్ని తొలగించింది. వారి స్థానంలో కొత్త ఉద్యోగుల్ని తీసుకోకుండా.. ఉన్న వారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రమోషన్ పేరుతో కొత్త ట్రెండ్కు తెరతీశాయి ఆయా సంస్థలు కంపెనీలకు వరమేనా? ఈ విధానంపై ఉద్యోగులు డైలామాలో ఉన్నారు. ఓ వర్గం ఉద్యోగులు ప్రమోషన్ తీసుకుని మరో సంస్థలో చేరితే అధిక వేతనం, ప్రమోషన్లో మరో అడుగు ముందుకు పడుతుందని భావిస్తుండగా.. రేయింబవుళ్లు ఆఫీస్కే పరిమితమై కష్టపడ్డ తమకు తగిన ప్రతిఫలం లేకపోవడం ఏంటని మరో వర్గం ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. మొత్తానికి డ్రై ప్రమోషన్ విధానం కంపెనీలకు ఓ వరంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నవారు లేకపోలేదు. -
చైనాకు యాపిల్ షాక్.. 5 లక్షల జాబ్స్ మనకే..!
ప్రీమియం ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారు చేసే ప్రముఖ కంపెనీ యాపిల్ చైనాకు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తమ చైనా ఆధారిత సప్లయి చైన్లో సగభాగాన్ని భారత్కు తరలించి వచ్చే మూడు సంవత్సరాలలో తమ భారతీయ ఉద్యోగుల సంఖ్యను 5 లక్షలకు పెంచాలని యోచిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. స్థానిక విలువ జోడింపుపై దృష్టి సారించిన యాపిల్.. దేశీయ విలువ జోడింపును 11-12 శాతం నుంచి 15-18 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్గా, ఆర్అండ్డీ హబ్గా ఎదుగుతున్న భారత్ ప్రాముఖ్యతకు అనుగుణంగా యాపిల్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, దేశంలో స్థానిక విలువ జోడింపు 14 శాతంగా ఉంది. ఇది చైనాకు చెందిన 41 శాతం కంటే చాలా తక్కువ. యాపిల్ గత రెండు సంవత్సరాలుగా భారతదేశంలో తన ఉనికిని గణనీయంగా పెంచుకుంది. తయారీ, రిటైల్ రెండింటిపైనా దృష్టి సారించింది. దేశంలో మొదట్లో పాత ఐఫోన్ మోడల్లు అసెంబుల్ చేయగా, ఇప్పుడు ఐఫోన్ 15 మోడళ్లను కూడా తయారు చేస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ భారతదేశంలో 14 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసిందని నివేదికలు సూచిస్తున్నాయి. యాపిల్ కంపెనీ ఫాక్స్కాన్, పెగాట్రాన్ అనే రెండు ప్రధాన తయారీ భాగస్వాములను కలిగి ఉంది. వీటి ద్వారా వరుసగా 67 శాతం, 17 శాతం ఐఫోన్లు అసెంబుల్ అవుతున్నాయి. అదనంగా కర్ణాటకలోని విస్ట్రాన్ ప్లాంట్ను నిర్వహిస్తున్న టాట్ గ్రూప్ 6 శాతం ఐఫోన్లను అసెంబుల్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అసెంబుల్ చేస్తున్న ఏడు ఐఫోన్లలో ఒకటి ఇప్పుడు భారతదేశంలోనే అసెంబుల్ అవుతోంది. -
‘మూన్లైటింగ్’తో కోట్లు సంపాదిస్తున్న ఐటీ ఉద్యోగి.. మీరూ చేస్తారా?
కొంత కాలం క్రితం ఐటీ రంగంలో మూన్లైటింగ్ తీవ్ర చర్చంనీయంశమైంది. ఒకే సమయంలో లేదా విధులు ముగిసిన తరువాత వేరే ఉద్యోగం చేయడం దీని ఉద్దేశం. ఐటీ సంస్థలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగులు మాత్రం అదనపు నైపుణ్యాల కోసమో లేదా ఖర్చులు భరించలేక రెండో కొలువు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఈ తరుణంలో తాను ఒకే సారి రెండు ఉద్యోగాలు చేసి ఏడాదికి రూ.1.4 కోట్లు సంపాదించినట్లు ఓ ఐటీ ఉద్యోగి తెలిపాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అనుభవాల్ని షేర్ చేసుకున్నాడు. ఐటీ ఉద్యోగి ఆడమ్ ఎడ్యుకేషన్ లోన్ కింద రూ.98లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం అతను ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. కానీ ఫలితం శూన్యం.పేరుకే రెండు ఉద్యోగాలు చేస్తున్నాడనే మాటగాని కొండలా పేరుకుపోయినా అప్పుల్ని తీర్చేందుకు ఇది సరిపోదని ఓ నిర్ణయానికి వచ్చాడు. ఏడాదికి కోటి సంపాదన అంతే 2022లో రిమోట్ జాబ్ కోసం అన్వేషించాడు. చివరికి తాను కోరుకున్నట్లుగా భారీ వేతనంతో రెండు ఉద్యోగాలు చేయడం ప్రారంభించాడు. అలా 2023 జనవరి నుంచి రెండు ఉద్యోగాలు చేయగా వచ్చిన మొత్తం ఏడాదికి రూ.70లక్షలుగా కాగా..అదే ఏడాది చివరి నాటికి ఆడమ్ సంపాదించిన మొత్తం రూ.కోటికి పెరిగింది. సంపాదన పెరగడంతో ఎడ్యుకేషన్ లోన్ చెల్లించాడు. డబ్బులు బాగా సంపాదించాలనే ఈ సందర్భంగా రెండు ఉద్యోగాలు చేరేందుకు తాను నిర్ధేశించుకున్న లక్ష్యాలేంటో చెప్పాడు. అందులో ఒకటి సంపాదన రెట్టింపు చేసుకోవడం, రెండోది రెండేళ్లలో తాను ఎడ్యుకేషన్ లోన్ క్లియర్ చేయడం. ఇందుకోసం తన లింక్డిన్ ప్రొఫైల్లో ఉద్యోగాల కోసం అన్వేషించగా.. రెండు వారాల్లో రెండు ఉద్యోగాలు పొందాడు. స్వల్ప కాలంలో తన ఎడ్యుకేషన్లోన్ మెల్లమెల్లగా తిరిగి చెల్లించడంతో పాటు నాలుగు నెలల అత్యవసర సేవింగ్స్ను కూడబెట్టుకున్నాడు. అదే సమయంలో కొంతమంది స్నేహితులకు ఆర్థిక సహాయం చేసినట్లు చెప్పిన టెక్కీ వారానికి 30 నుంచి 60 గంటల మధ్య పని చేయడం వల్లే ఇది సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈ టిప్స్ మీకోసమే అదే సమయంలో మూన్లైటింగ్ చేయాలని ఉద్యోగులకు పలు టిప్స్ చెప్పాడు. వాటిల్లో ప్రధానంగా .. ఒకే సమయంలో రెండు ఆఫీసుల్లో మీటింగ్స్ లేకుండా చూసుకోవడం, రెండవది.. ఆఫీస్ వర్క్ మొత్తం ఒకేసారి మీదేసుకుని చేసుకోకుండా భాగాలు, భాగాలుగా విభజించి పని సులభం అవుతుందని అన్నాడు. దీంతో పాటు ఆఫీస్లో ఇచ్చే పబ్లిక్ హాలిడేస్, వీకాఫ్స్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ఓ అంతర్జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ఒకే కంపెనీలో ఏళ్ల తరబడి ఉద్యోగం.. ఎందుకో తెలుసా?
ఉద్యోగం చేసేవారిలో చాలామంది ఒకే సంస్థలో ఏళ్లతరబడి జాబ్ చేస్తుంటారు. మరికొందరు సంవత్సరానికి ఓ కంపెనీలో జాబ్ చేస్తూ ముందుకు వెళ్లిపోతుంటారు. ఇంతకీ ఒకే కంపెనీలో సంవత్సరాలు తరబడి జాబ్ చేయడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. ప్రస్తుత జాబ్ మార్కెట్ ట్రెండ్స్పై Apna.co ఒక ఆన్లైన్ సర్వే చేపట్టి.. వివిధ రంగాల్లో పనిచేస్తున్న పదివేల మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ అభిప్రాయాలను సేకరించింది. వేతనం అనేది ఒక ముఖ్యమైన అంశం అయినప్పటికీ, 54 శాతం మంది ఉద్యోగులు తమ ప్రస్తుత ఉద్యోగాల్లో కొనసాగడం కంటే కెరీర్లో పురోగతి సాధించడానికి ఇష్టపడుతున్నట్లు తెలిసింది. అంటే ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీలలోనే వృత్తిపరమైన వృద్ధిని కోరుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది. 37 శాతం మంది ఉద్యోగులు వర్క్ విషయంలో స్వేచ్ఛను కోరుకుంటున్నారు. 44 శాతం మంది ఉద్యోగులు తాము చేస్తున్న కంపెనీలోని వర్క్ కల్చర్కు అలవాటు పడినట్లు సమాచారం. కొందరు లీడర్షిప్ రోల్స్ కోసం లేదా కీలక బాధ్యతలు చేపట్టడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేటగిరిలో సుమారు 54 శాతం మంది ఉన్నారు. 40 శాతం ఉద్యోగులు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ యాక్టివిటీస్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు, 36 శాతం మంది సీనియర్ లీడర్షిప్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. చేస్తున్న పనిలోనే స్కిల్ పెంచుకోవడానికి చూస్తున్న వారు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. అది మాత్రమే కాకుండా కంపెనీలు తమ ఉద్యోగులను సంతృప్తి పరిస్తే (జీతాలు పెంచడం, ప్రోత్సాహాలు అందించడం) ఎక్కువ కాలం ఒకే సంస్థలో పనిచేయడానికి ఉద్యోగులు ఇష్టపడతారని సర్వేలు తేలింది. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న చాలామందిలో ఉన్న కంపెనీలలోనే జాబ్ చేస్తూ.. ఉన్నత స్థాననానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పని విషయంలో స్వేచ్ఛ మాత్రమే కాకుండా.. వర్క్ కల్చర్, కమ్యూనికేషన్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వేలో తెలిసినట్లు Apna.co సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'నిర్మిత్ పారిఖ్' వెల్లడించారు. -
ఎక్కడ చదివామన్నది కాదు..! జాబ్ వచ్చిందా? రాలేదా?
అహర్నిశలు కష్టపడి, పోటీ పరీక్షల్లో నెగ్గి ఐఐటీ, ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఎలాగోలా సీటు సంపాదిస్తున్నారు. ఇకేముంది ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు వచ్చింది కదా.. కొలువు గ్యారెంటీ అనుకుంటున్నారేమో. కాలం మారింది. కంపెనీల తీరు మారింది. ప్రముఖ సంస్థలు ఉద్యోగార్థుల్లో చూసే క్వాలిటీ మారింది. దాంతో ఎంతపెద్ద విద్యాసంస్థలో టాప్ ర్యాంకుతో డిగ్రీ పూర్తి చేసినా కొన్నిసార్లు కొలువు దొరకని పరిస్థితులు నెలకొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఐఐటీ సంస్థల్లో ఐఐటీ-ముంబయికి ఉన్న ప్రాధాన్యం తెలిసిందే కదా. అయితే ఆ సంస్థలోని 36 శాతం గ్రాడ్యుయేట్లు క్యాంపస్ ప్లేస్మెంట్ల్లో కొలువు సాధించలేకపోయారు. గతంలోనూ ఐఐఎం సంస్థల్లోని విద్యార్థులు కూడా కొలువులు రాక ఇతర మార్గాలను ఎంచుకున్నట్లు నివేదికలు వెల్లడయ్యాయి. దాంతో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ చదివామని కాకుండా.. ఏం చదివామనే దానిపై దృష్టిసారించాలని నిపుణులు చెబుతున్నారు. పదేళ్ల క్రితం కంపెనీలు ప్రధానంగా మూలధన పెట్టుబడివైపు ఆసక్తి కనబరిచేవి. నిజానికి ఆ సమయంలో సంస్థలు ఆశించిన మేరకు అభివృద్ధి చెందాయి. ఇటీవల నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితులు, బౌగోళిక అనిశ్చితులు, ఖర్చులు తగ్గించుకోవడం, ఉన్నంతలో ఏయే విభాగాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించవచ్చో తెలుసుకుని చర్యలు తీసుకుంటున్నారు. ఉత్పత్తి ఆధారిత కంపెనీలు ప్రధానంగా మిషనరీ, మార్కెటింగ్ కోసం ఖర్చు చేస్తాయి. అయితే ఐటీ కంపెనీలకు మాత్రం వేతనాల రూపంలో తమ ఉద్యోగులపైనే భారీగా పెట్టుబడి పెడుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కాస్ట్కటింగ్ పేరిట ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. దాంతో చాలా మంది టెకీలు ఆందోళన చెందుతున్నారు. కంపెనీలు అత్యవసరమైతే తప్పా కొత్త నియామకాలు చేపట్టడం లేదు. ఒకవేళ రిక్రూట్మెంట్ చేసినా టాప్ ఇన్స్టిట్యూట్ల నుంచే కొలువులు భర్తీ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఐఐటీ, ఐఐఎంల్లో చదివినా కంపెనీ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేవని సంస్థలు గ్రహిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వారిని పక్కనపెట్టేస్తున్నాయి. పైగా ఐఐటీ, ఐఐఎంలో చదివిన వారు అధిక వేతనాలు ఆశిస్తున్నారు. ఇదికూడా ఒకింత ఉద్యోగాలు రాకపోవడానికి కారణం అవుతోంది. దాంతో ప్రముఖ సంస్థల్లో చదివినా ఉద్యోగాలు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఐఐటీ ముంబయిలో తాజాగా 2000 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరైతే 712 మందికి ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. డిసెంబర్ 2023లో 85 మంది ఐఐటీ బాంబే విద్యార్థులకు రూ.కోటికి పైగా జీతాలతో ఉద్యోగాలు వచ్చినట్లు ముందుగా ప్రకటించారు. కానీ దాన్ని సవరించి కేవలం 22 మందికే ఈ వేతనం వరిస్తుందని కంపెనీలు చెప్పడం గమనార్హం. ఐఐఎంల్లోనూ అదే తీరు.. ఐఐఎం విద్యార్థులను కంపెనీలు ప్రధానంగా మేనేజ్మెంట్ స్థాయిలో ట్రెయినీలుగా నియమించుకుంటాయి. ప్రస్తుత అనిశ్చితుల గరిష్ఠ వేతనాలు కలిగిన టాప్ మేనేజ్మెంట్ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దాంతో కొత్త వారికి అవకాశం కల్పించే దిశగా కంపెనీలు ఆలోచించడం లేదనే వాదనలున్నాయి. ఒకవేళ కొన్ని కంపెనీలు తమ అవసరాల కొద్దీ ఉద్యోగాలు కల్పించినా దాదాపు 10-15 శాతం వేతనాలు తగ్గించి ఆఫర్ లేటర్లు విడుదల చేస్తున్నట్లు తెలిసింది. ఐఐఎంలో చదివి కొన్నేళ్లు ఉద్యోగం చేసి కొత్తగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారిపై వెంచర్ క్యాపిటలిస్ట్లు ఆసక్తి చూపుతారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆ ఊసే లేకుండాపోయిందని నిపుణులు చెబుతున్నారు. కనీసం రిటైల్ కంపెనీలు, స్టార్టప్ కంపెనీల్లో సైతం ఉద్యోగాలు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదీ చదవండి: క్రియేటివిటీ పేరుతో అరాచకం..! భారత్లో నిరక్షరాస్యత, అరకొర పారిశ్రామికోత్పత్తి, నాసిరకం నైపుణ్యాలు తదితరాలు నిరుద్యోగానికి కారణాలుగా నిలుస్తున్నాయి. భారత్, చైనా వంటి దేశాలు తమ యువతకు సరైన ఉపాధి కల్పిస్తే ప్రపంచ జీడీపీ ఒక్కపెట్టున విజృంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కాలంతో పాటు సాంకేతికతలూ మారుతున్నాయి. వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాలిటీలతో వృత్తి శిక్షణ ఇస్తే కొత్త తరం ఉద్యోగాలకు కావాల్సిన సిబ్బంది తయారవుతారు. అధునాతన సాంకేతికతల వినియోగం, ఇంక్యుబేషన్ విధానాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Test article qid_001
RSS article test 1
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019