breaking news
-
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
పాకిస్తాన్ మహిళా జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్కు బిస్మా మరూఫ్ రిటైర్మెంట్ ప్రకటించింది. తన నిర్ణయాన్ని మరూఫ్ సోషల్ మీడియా వేదికగా గురువారం వెల్లడించింది. "నేను చాలా ఇష్టపడే ఆట(క్రికెట్) నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.నా 17 ఏళ్ల ప్రయాణం ఎన్నో సవాళ్లు, విజయాలు, మధురమైన జ్ఞాపకాలతో నిండి ఉంది. నా క్రికెట్ ప్రయాణంలో అరంగేట్రం నుంచి ఇప్పటి వరకు నాకు మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.నాపై నమ్మకం ఉంచి, జట్టును నడిపించే బాధ్యతను తనకు అప్పగించినందుకు పీసీబీకి ప్రత్యేక ధన్యవాదాలు. చివరగా నా దేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని" బిస్మా పేర్కొన్నట్లు పీసీబీ ఒక ప్రకటన విడుదల చేసింది.కాగా 2006లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన మరూఫ్ 17 ఏళ్ల పాటు పాకిస్తాన్ క్రికెట్కు తన సేవలు అందించింది. పాకిస్తాన్ మహిళ క్రికెట్ జట్టు తరపున వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికి మరూఫ్ పేరునే ఉంది. ఆమె పాక్ తరపున 136 వన్డేల్లో 3369 పరుగులతో పాటు 44 వికెట్లు, 146 టీ20ల్లో 2893 పరుగులతో పాటు 36 వికెట్లు పడగొట్టింది.96 మ్యాచ్ల్లో పాక్ జట్టుకు కెప్టెన్గా మరూఫ్ వ్యవహరించింది. మరూఫ్ చివరగా స్వదేశంలో వెస్టిండీస్ మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్లో పాక్ జట్టు తరపున ఆడింది. విండీస్తో టీ20 సిరీస్కు ఎంపిక చేసిన జట్టులో కూడా మరూఫ్ భాగమైంది. కానీ ఈ సిరీస్లో ఆడుతారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 15 ఏళ్ల కెరీర్కు గుడ్బై
ఆఫ్గానిస్తాన్ వెటరన్ ఆటగాడు నూర్ అలీ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. నూర్ అలీ తన నిర్ణయాన్ని గురువారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 35 ఏళ్ల జద్రాన్.. 2019లో స్కాట్లాండ్తో జరిగిన వన్డేతో అఫ్గాన్ తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. జద్రాన్ అఫ్గానిస్తాన్ తరపున 51 వన్డేలు, 23 టీ20లు, 2 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించాడు. తన 15 ఏళ్ల కెరీర్లో జద్రాన్ ఓవరాల్గా 1902 పరుగులు అలీ సాధించాడు. అందులో 1216 పరుగులు వన్డే ఫార్మాట్లో సాధించినివే కావడం గమనార్హం. టీ20ల్లో 597 పరుగులు చేశాడు. గతేడాది చైనా వేదికగా జరిగిన ఆసియాక్రీడల్లోనూ జద్రాన్ అఫ్గాన్ జట్టులో భాగమయ్యాడు. ఈ ఈవెంట్లో శ్రీలంక, పాకిస్తాన్లపై హాఫ్ సెంచరీలతో జద్రాన్ చెలరేగాడు. అతడు చివరగా అఫ్గాన్ తరపున ఇటీవల ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో ఆడాడు. అదే విధంగా జద్రాన్ 2010 టీ20 వరల్డ్కప్లో భారత్పై హాఫ్ సెంచరీతో మెరిశాడు. -
నలభయ్యారు రోజుల పండుగ!
నలభై ఆరు రోజులు... 48 మ్యాచ్లు... దేశంలోని 10 వేర్వేరు నగరాలు... 10 అంతర్జాతీయ క్రికెట్ జట్లు. ఒక క్రీడా సంరంభానికి ఇంతకు మించి ఇంకేం కావాలి? అక్టోబర్ 5న ఆరంభమైన ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్–2023 కచ్చితంగా మరో పెద్ద ఆటల పండుగ. ఒక పక్కన చైనాలో ఆసియా క్రీడోత్సవాల హంగామా సాగుతుండగానే మన గడ్డపై మరో సందడి మొదలైపోయింది. నాలుగేళ్ళకు ఓసారి సాగే అంతర్జాతీయ వన్డే ప్రపంచ కప్ షురూ అయింది. నిరుటి ఛాంపియన్ ఇంగ్లండ్ ఈసారీ బలమైన జట్టుగా ముందుకు వస్తుంటే, సొంతగడ్డపై సాగుతున్న పోటీలో కప్పు కొట్టాలనే ఒత్తిడి భారత జట్టుపై ఉంటుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు సైతం బలమైన పోటీదార్లుగా నిలుస్తుంటే, ఆఖరు నిమిషంలో తడబడతారనే పేరున్న దక్షిణాఫ్రికా జట్టు ‘అనూహ్యమైన గెలుపుగుర్రం’ కావచ్చని ఓ అంచనా. గత వరల్డ్ కప్లో లానే పోటీలో పాల్గొనే పది జట్లూ లీగ్ దశలో పరస్పరం తలపడే ఈ ప్రపంచపోటీ రానున్న నెలన్నర కాలంలో విస్తృత చర్చనీయాంశం కానుంది. యాభై ఓవర్ల ఈ వన్డే మ్యాచ్ల వరల్డ్ కప్కు గతంలో 1987, 1996, 2011ల్లో భారత్ ఆతిథ్యమిచ్చింది. అయితే, అప్పుడు ఉపఖండంలోని ఇతర దేశాల సహ ఆతిథ్యంలో అవి సాగాయి. కానీ, ఈసారి పూర్తిగా మనమే ఆతిథ్యమిస్తున్నాం. సరిగ్గా దసరా, దీపావళి పండుగ సీజన్లోనే వరల్డ్ కప్ రావడంతో తమకు కలిసొస్తుందని ప్రకటనకర్తలు భావిస్తున్నారు. తమ ఉత్పత్తుల కొనుగోళ్ళు పెరుగుతాయని బ్రాండ్లన్నీ ఉత్సాహపడుతున్నాయి. దానికి తోడు ఆతిథ్య దేశం భారత్ కావడంతో ఉత్పత్తుల ప్రచారం మరింతగా జనంలోకి చొచ్చుకుపోతుందని భావిస్తున్నాయి. ఈ వాణిజ్య ప్రకటనల ఆదాయంలో సింహభాగం తాజా వరల్డ్ కప్కు అధికారిక మీడియా హక్కులున్న డిస్నీ స్టార్కు చేరుతుంది. పలు బ్రాండ్లు టీవీ, డిజిటల్ వేదికల్లో స్పాన్సర్షిప్ కోసం డిస్నీస్టార్తో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. నాకౌట్ మ్యాచ్ల వేళ టీవీలో 10 సెకన్ల ప్రకటన ఇప్పుడు రూ. 30 లక్షల పైనే అని వార్త. ఈ వరల్డ్ కప్తో ప్రయాణ, పర్యాటక, ఆతిథ్య, ఆహార రంగాలు ప్రధానంగా లబ్ధి పొందుతాయని నిపుణుల విశ్లేషణ. మ్యాచ్ల పుణ్యమా అని ఇప్పటికే విమాన టికెట్ల రేట్లు, హోటల్ బస రేట్లు భారీగా పెరిగాయి. దేశ స్టాక్ మార్కెట్పైనా గణనీయమైన ప్రభావం ఉంటుందని అంచనా. సినిమా, క్రికెట్లంటే ప్రాణాలిచ్చే భారత్లో మామూలుగా అయితే, వన్డే క్రికెట్ వరల్డ్ కప్ అంటే చంద్రమండల యాత్ర అంత సంబరం ఉండాలి. విచిత్రంగా ఈసారి ఎందుకనో ఆ క్రేజు వ్యాపారంలోనే తప్ప వ్యవహారంలో కనిపించట్లేదు. మన దేశమే పూర్తిగా ఆతిథ్యమిస్తున్నప్పటికీ, తాజా కప్కు ముందస్తు హంగామా అంతగా లేదు. దాదాపు లక్షా 30 వేల మంది కూర్చొనే సౌకర్యంతో ప్రపంచంలోనే పెద్ద క్రికెట్ స్టేడియమ్గా పేరొందిన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియమ్లో గురువారం అంతా కలిపి 20 వేల మంది కూడా లేరు. ఆది నుంచీ ఆన్లైన్లో కొనడానికి టికెట్లు దొరకలేదు గానీ, తీరా మ్యాచ్ రోజున మైదానమంతా ఖాళీగా ఉంది. లార్డ్స్లో గత 2019 వరల్డ్ కప్ ఫైనల్లో హోరాహోరీగా తలపడ్డ న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్తో ఈ తాజా ప్రపంచ కప్ను ప్రారంభించారు. కానీ లాభం లేకపోయింది. భారత జట్టుతో తొలి మ్యాచ్ మొదలుపెడితే ఊపు వచ్చేదేమో! నిజానికి, 1999 నుంచి ఐసీసీ వరల్డ్ కప్గా పేరుబడ్డ ఈ పోటీల్లో ఆతిథ్యదేశం ఆరంభమ్యాచ్లో పాల్గొనడం ఆనవాయితీ. అదెందుకు మార్చారో తెలియదు. ఈసారి మ్యాచ్ టికెట్ల కొనుగోలు అసాధ్యమైపోయింది. ఆఖరి నిమిషంలో మ్యాచ్ల తేదీలు, వేదికలు మారిపోయాయి. ఇవి చాలదన్నట్టు 2000లల్లో టీ20 మ్యాచ్లకు అలవాటు పడ్డ కొత్త తరానికి ఐపీఎల్ సరికొత్త నంబర్ వన్ టోర్నమెంట్గా అవతరించింది. వెరసి, 2011లో భారత్ ఆతిథ్యమిచ్చినప్పటితో పోలిస్తే పన్నెండేళ్ళ తర్వాతి ఈ వరల్డ్ కప్ ఆ స్థాయి హడావిడి సృష్టించట్లేదు. అలాగే, గతంలో వరల్డ్ థీమ్సాంగ్ ప్రతి ఛానల్లో మోత మోగేది. ఈసారి రణ్బీర్ సింగ్తో చేసిన ‘దిల్ జష్న్ బోలే...’ పాట విఫలమైంది. ఇక, మైదానం వెలుపల అవలక్షణాలకు కొదవ లేదు. ఐసీసీ వార్షిక ఆదాయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) వాటా 72 శాతానికి పెరిగింది. మిగతా దేశాల క్రికెట్ బోర్డులు బాగా వెనకబడ్డాయి. దాంతో, ఎప్పటిలానే బీసీసీఐ తన హజం చూపిస్తోంది. బీసీసీఐ అక్రమాలకు నెలవంటూ సుప్రీమ్ కోర్ట్ వేసిన ముగ్గురు సభ్యుల సంఘం నివేదిక లోపాలెత్తిచూపినా అది తన పంథా మార్చుకోలేదు. చిత్రంగా అధికారిక అమ్మకాలు మొదలైనా కాక ముందే టికెట్లు ‘అమ్ముడైపోయాయి’ అని బోర్డులు వెలిశాయి. మచ్చుకు, అహ్మదాబాద్లోని అదే భారీ స్టేడియమ్లో జరిగే భారత – పాకిస్తాన్ మ్యాచ్కు 8500 టికెట్లే అమ్మకానికి పెట్టారంటే ఏమనాలి? భారీ క్రికెట్ వేదికలైన ముంబయ్, కోలకతాలను వెనక్కినెట్టి, ఈసారి అహ్మదాబాద్ ముందుకు రావడంలోనూ రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఆటకు సంబంధం లేని ఇతర ప్రయోజనాలను పక్కనపెట్టి, భారత్ తన ప్రతిష్ఠను పెంచుకోవడానికి ఇది మరో అవకాశం. జీ20 సదస్సు నిర్వహణ తర్వాత అంతర్జాతీయ వేదికపై మరోసారి మన పేరు మోగడానికి మంచి సందర్భం. దాన్ని చేజార్చుకోకూడదు. 1975లో మొదలైనప్పటి నుంచి ఆతిథ్య దేశాలేవీ కప్ గెల్చుకోలేదన్న వాదనను 2011 ఏప్రిల్లో మన ధోనీ సేన సమర్థంగా తిప్పికొట్టింది. తర్వాత 2015లో ఆస్ట్రేలియా, 2019లో ఇంగ్లండ్లు అదే బాటలో నడిచాయి. కోహ్లీ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా లాంటి బ్యాట్స్మన్లు, బుమ్రా, షమీ, షిరాజ్ లాంటి పేసర్లు, అశ్విన్, కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్లతో పటిష్ఠమైన రోహిత్ సేన ఆ కథ పునరావృతం చేయాలని ఆశ. రాజకీయాల కన్నా ఆట, వ్యక్తిగత రికార్డుల కన్నా దేశం గొప్పదని గ్రహిస్తే, నిర్వాహకులైనా, ఆటగాళ్ళైనా అద్భుతాలు చేయడం అసాధ్యమేమీ కాదు! -
రిటైర్మెంట్ ప్రకటించిన పాకిస్తాన్ స్టార్ క్రికెటర్..
పాకిస్తాన్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ సోహైల్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. సోహైల్ ఖాన్ తన నిర్ణయాన్ని ఆదివారం ఎక్స్ (ట్విటర్) వేదికగా తెలియజేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ డొమాస్టిక్ వైట్బాల్ క్రికెట్, ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం కొనసాగుతానని సోహైల్ సృష్టం చేశాడు. తన 15 ఏళ్ల ప్రయాణంలో మద్దతుగా నిలిచిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అభిమానలకు, సహచర ఆటగాళ్లకు సోహైల్ ధన్యవాదాలు తెలిపాడు. సోహైల్ ఖాన్ 2008 జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అతడు చివరగా 2016 ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో పాక్ తరపున ఆడాడు. తన కెరీర్లో సోహైల్ 9 టెస్టు, 13 వన్డేలు, 5 టీ20ల్లో పాకిస్తాన్కు ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో సోహైల్కు మంచి రికార్డు ఉంది. 9 మ్యాచ్ల్లో 3.69 ఏకానమీతో 27 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా వన్డేల్లో 19 వికెట్లు, టీ20ల్లో 5 వికెట్లు సాధించాడు. భారత్పై 5 వికెట్లు.. ముఖ్యంగా సోహైల్ ఖాన్ కంటే గుర్తు వచ్చేది 2015 వన్డే ప్రపంచకప్. టీమిండియాతో జరిగిన మ్యాచ్లో అతడు 5 వికెట్లు పడగొట్టి అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అప్పటిలో అతడి పేరు మారుమ్రోగిపోయింది. కానీ ఆతర్వాత ఏడాదికే జట్టులో అతడు చోటు కోల్పోయాడు. చదవండి: Asia Cup 2023: ఇదెక్కడి దరిద్రం రా బాబు.. సిక్స్ కొట్టినా ఔటైపోయాడు! వీడియో చూడాల్సిందే -
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడనున్న తొలి ట్రాన్స్జెండర్
అంతర్జాతీయ క్రికెట్లో ట్రాన్స్జెండర్ రంగప్రవేశానికి ఐసీసీ ఓకే చెప్పింది. ఆస్ట్రేలియాలో జన్మించిన డేనియల్ మెక్గాహె అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడనున్న తొలి ట్రాన్స్జెండర్గా చరిత్ర సృష్టించనుంది. మెక్గాహె అంతర్జాతీయ మహిళల టీ20 మ్యాచ్ ఆడేందుకు ఐసీసీ నిర్ధేశించిన అన్ని అర్హత ప్రమాణాలను క్లియర్ చేసింది. మెక్గాహె 2024 మహిళల టీ20 వరల్డ్కప్ క్వాలిఫయింగ్ పోటీల కోసం ఎంపిక చేసిన కెనడా జట్టులో చోటు దక్కించుకుంది. 2020లో ఆస్ట్రేలియా నుంచి కెనడాకు వలస వెళ్లిన మెక్గాహె.. అదే ఏడాది లింగమార్పిడి చేయించుకని మహిళగా మారి, త్వరలో అదే దేశానికి ప్రాతినిథ్యం వహించనుంది. ఐసీసీ నుంచి క్లియెరెన్స్ లభించాక మెక్గాహె స్పందిస్తూ.. ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించనున్న మొట్టమొదటి వ్యక్తిని అయినందుకు ఆనందంగా, గర్వంగా ఉందని అంది. కాగా, పురుషుడి నుంచి మహిళగా మారి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే, సదరు వ్యక్తి పలు మెడికల్ టెస్ట్లు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలాగే వారు పలు రాతపూర్వక హామీలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019