breaking news
-
షాకింగ్! ఏకంగా 10 అనకొండలతో వచ్చాడు.. చివరికి..!
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్ ఉదంతం ఒకటి చోటు చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఎల్లో అనకొండలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబట్టాడు.నిందితుడిని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు తదుపరి దర్యాప్తు మొదలు పెట్టారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణీకుడు చెక్-ఇన్ బ్యాగ్లో దాచిన 10 పసుపు రంగు అనకొడలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. ఒక సూట్ కేసులో ఒక తెల్లని కవర్లో వీటిని జాగ్రత్తగా ప్యాక్ చేశాడు. కానీ తనిఖీల్లో దొరికిపోయాడు. ప్యాసింజర్ బ్యాగ్లో ఏకంగా 10 పసుపు రంగు అనకొండల్ని చూసిన అధికారులూ షాకయ్యారు. బెంగళూరు కస్టమ్స్ ‘ఎక్స్’లో దీనికి సంబంధించిన ఫోటోలను అధికారులు పోస్ట్ చేశారు. వన్యప్రాణుల రవాణా చట్టవిరుద్ధమని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. (సమ్మర్లో పిల్లలకు ఇలా చేసి పెడితే, ఇష్టంగా తింటారు, బలం కూడా!) #Indiancustomsatwork Bengaluru Air #Customs intercepted attempt to smuggle 10 yellow Anacondas concealed in checked-in bag of a pax arriving from Bangkok. Pax arrested and investigation is underway. Wildlife trafficking will not be tolerated. #CITES #WildlifeProtection 🐍✈️ pic.twitter.com/2634Bxk1Hw — Bengaluru Customs (@blrcustoms) April 22, 2024 -
అయోధ్య ఎయిర్పోర్టుకు మహర్షి వాల్మికి పేరు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని అయోధ్య విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు–అయోధ్యధామ్’ అని పేరుపెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించాలని కూడా నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది. రైల్వేలో ‘సున్నా కర్బన ఉద్గారాల’ లక్ష్యాన్ని సాధించడానికి అమెరికాతో ఒప్పందానికి అనుమతించింది. మారిషస్ భాగస్వామ్యంతో ఉమ్మడిగా బుల్లి ఉపగ్రహం అభివృద్ధికి అవగాహనా ఒప్పందానికి కూడా అంగీకరించింది. ‘పృథ్వీ విజ్ఞాన్’కు ఆమోదం ఎర్త్ సైన్సెస్ రంగంలో ఐదు వేర్వేరు పథకాల కింద పరిశోధనలకు, కేటాయించిన నిధుల వినియోగానికి ఉద్దేశించిన ‘పృథ్వీ విజ్ఞాన్’కు కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని అమలుకు రూ.4,797 కోట్లు కేటాయించింది. ఇది ఐదేళ్లపాటు అమల్లో ఉంటుంది. వాతావరణం, సముద్రం, క్రయోస్పియర్, పోలార్ సైన్స్, సీస్మాలజీ, జియోసైన్సెస్ వంటి అంశాలపై పరిశోధనలు చేయనున్నారు. పృథ్వీ విజ్ఞాన్ కింద రీసెర్చ్ ప్రాజెక్టులను విదేశీ సంస్థలకు అప్పగించడానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. గయానా నుంచి ముడి చమురు కొనుగోలుతో పాటు హైడ్రో కార్బన్ రంగంలో పరస్పర సహకారానికి ఒప్పందం కుదుర్చుకునేందుకూ అంగీకరించింది. గయానాలో ముడి చమురు అన్వేషణ, ఉత్పత్తిలో భారతీయ కంపెనీలకు సైతం భాగస్వామ్యం కలి్పస్తారు. ప్రపంచ దేశాలతో అయోధ్య అనుసంధానం: మోదీ అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలపడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దీన్ని వాల్మికి మహర్షికి దేశ ప్రజల తరపున ఘనమైన నివాళిగా అభివరి్ణంచారు. అయోధ్యను ప్రపంచ దేశాలతో అనుసంధానించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఎక్స్లో పోస్టు చేశారు. -
పైలట్ నోట జై శ్రీరాం
న్యూఢిల్లీ: అయోధ్యలో శనివారం మొదలైన ఎయిర్పోర్ట్కు ఢిల్లీ నుంచి తొలి విమానం బయల్దేరి వెళ్లింది. ఇండిగో విమానయాన సంస్థ తమ తొలి ఢిల్లీ–అయోధ్య విమానాన్ని శనివారం మధ్యాహ్నం ప్రారంభించింది. ఈ విమానంలోకి అడుగుపెడుతున్న ప్రయాణికులకు పైలట్ అశుతోష్ శేఖర్ .. ‘జై శ్రీరామ్’ అంటూ స్వాగతం పలికారు. ‘అయోధ్యకు బయల్దేరుతున్న తొలి విమానానికి సారథ్యం వహించే బాధ్యతలు నాకు అప్పగించడం నిజంగా నా అదృష్టం. మీ ప్రయాణం సాఫీగా, ఆనందంగా సాగాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్’ అని ఆయన విమానంలో అనౌన్స్ చేశారు. తమ తమ సీట్లలో కూర్చున్న ప్రయాణికులు ప్రయాణ సమయంలో హనుమాన్ చాలీసాను పఠించారు. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. -
జనవరి 22న... ఇంటింటా రామజ్యోతి
అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్టను దీపావళి పర్వదినంగా ప్రధాని మోదీ అభివరి్ణంచారు. ఆ సందర్భంగా జనవరి 22న ఇంటింటా శ్రీరామజ్యోతి వెలిగించాలని దేశ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆ రోజు కోసం ప్రపంచమంతా ఏళ్ల తరబడి ఎదురుచూసిందన్నారు. ఏళ్ల తరబడి గుడారంలో గడిపిన రామునికి ఎట్టకేలకు ‘పక్కా ఇల్లు’ సాకారమైందన్నారు. అయోధ్యలో ఆయన శనివారం పర్యటించారు. నూతన విమానాశ్రయంతోపాటు ఆధునీకరించిన రైల్వే జంక్షన్ను ప్రారంభించారు. రూ.15,700 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అభివృద్ధి, వారసత్వం రెండు పట్టాలుగా దేశం ప్రగతి పథంలో పరుగులు తీయాలని ఆకాంక్షించారు. జనవరి 22న అయోధ్యకు పోటెత్తొద్దని, ఎక్కడివారక్కడే రామాలయ ప్రారంభ వేడుకలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో ఉజ్వల్ పథక 10 కోట్లవ లబి్ధదారు ఇంట్లో మోదీ చాయ్ ఆస్వాదించారు. అయోధ్య: అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం దేశ ప్రజలందరికీ దీపావళి వంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జనవరి 22న దేశమంతటా ఇంటింటా శ్రీరామజ్యోతి వెలిగించాలని పిలుపునిచ్చారు. నిత్యం రామనామ స్మరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్న అయోధ్యలో ఆయన శనివారం పర్యటించారు. పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో రోజంతా బిజీబిజీగా గడిపారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించాక అక్కడ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. జనవరి 22న భవ్య రామాలయ ప్రారంభాన్ని, శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమమంటే అందరికీ దీపావళి పండుగే. దీనికి గుర్తుగా ఆ రాత్రి ఇంటింటా శ్రీరామ జ్యోతిని వెలిగించండి. అయోధ్యలో రామ్లల్లా (బాల రాముడు) ఇంతకాలం తాత్కాలిక టెంట్ కింద గడపాల్సి వచ్చింది. ఇప్పుడు దేశంలోని నాలుగు కోట్ల మంది పేదలతో పాటు రామ్లల్లాకు కూడా పక్కా ఇల్లు వచ్చేసింది’’ అని అన్నారు. రామమందిర ప్రారంభోత్సవాన్ని చరిత్రాత్మక ఘట్టంగా మోదీ అభివరి్ణంచారు. ‘‘ఈ రోజు కోసం యావత్ ప్రపంచం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసింది. కనుక అయోధ్య వాసుల్లో ఇంతటి ఉత్సాహం సహజం. భరత గడ్డపై అణువణువునూ ప్రాణంగా ప్రేమిస్తా. ప్రతి భారతీయుడూ పుట్టిన నేలను ఆరాధిస్తాడు. నేనూ మీలో ఒకడినే’’ అన్నారు. వికాస్.. విరాసత్ అత్యంత స్వచ్ఛమైన నగరంగా అయోధ్యను తీర్చిదిద్దుదామంటూ ప్రతిజ్ఞ చేద్దామని మోదీ పిలుపునిచ్చారు. ‘‘ఇది అయోధ్యవాసుల బాధ్యత. జనవరి 14 నుంచి 22వ తేదీ దాక దేశంలోని అన్ని ఆలయాలు, ఆధ్యాత్మిక స్థలాల్లో స్వచ్ఛత కార్యాక్రమాలు చేపడదాం. దేశం కోసం కొత్త తీర్మానాలు, మనం కోసం కొత్త బాధ్యతలను తలకెతత్తుకుందాం. ఏ దేశమైనా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే వారసత్వాన్ని పరిరక్షించుకోవాల్సిందే. వికాస్ (అభివృద్ధి)తో పాటు విరాసత్ (వారసత్వం) కూడా ముఖ్యమే. అవి రెండూ పట్టాలుగా 21వ శతాబ్దంలో దేశాభివృద్ధిని పరుగులు పెట్టిద్దాం’’ అని పిలుపునిచ్చారు. ఆ రెండింటి ఉమ్మడి అభివృద్ధి బలమే భారత్ను ముందుకు నడుపుతుందన్నారు. సభలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. ఆకట్టుకున్న మెగా రోడ్ షో శనివారం ఉదయం 11 గంటలకు అయోధ్య ఎయిర్పోర్టుకు చేరుకున్నాక మోదీ అక్కడి నుంచి రోడ్ షోలో పాల్గొన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ దాకా దాదాపు 15 కిలోమీటర్ల పొడవునా రోడ్షో సాగింది. దారి పొడవునా ప్రధానికి అయోధ్యవాసులు, పలు రాష్ట్రాల నుంచి వచి్చన కళాకారులు ఘన స్వాగతం పలికారు. ఆయనపై పూలవర్షం కురిపించారు. రోడ్షో మధ్య మధ్యలో ఏర్పాటుచేసిన 40 కళావేదికల వద్ద పలు రాష్ట్రాల కళాకారులు నృత్య, కళా ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రయాగ్రాజ్ నుంచి వచి్చన కళాకారులు రాముని జీవితంతో ముడిపడి ఉన్న ‘దేధియా’ నృత్యంతో ఆకట్టుకున్నారు. అనంతరం మోదీ మార్గమధ్యంలో అతిపెద్ద వీణతో అలంకృతమైన లతా మంగేష్కర్ చౌక్ వద్ద కాసేపు గడిపారు. ఆ రోజు రాకండి ఆహా్వనితులు మినహా మిగతా వారు 22న అయోధ్యకు రావద్దని మోదీ విజ్ఞప్తి చేశారు. ‘‘రామాలయ ప్రాణప్రతిష్ఠ క్రతువును ప్రత్యక్షంగా తిలకించేందుకు జనవరి 22వ తేదీనే అయోధ్యకు పోటెత్తాలని అసంఖ్యాకులు భావిస్తున్నట్టు తెలిసింది. దయచేసి ఆ రోజున మాత్రం అయోధ్యకు రాకండి. చేతులు జోడించి వేడుకుంటున్నా. ఎందుకంటే అందరికీ అదే రోజున దర్శనభాగ్యం సాధ్యపడదు. ఆ రోజు చాలామంది విశిష్ట అతిథులు విచ్చేస్తున్నారు. కనుక యావత్ ప్రజానీకం జనవరి 23 నుంచి జీవితాంతం అయోధ్య రామున్ని దర్శించుకోవచ్చు’’ అని సూచించారు. వాలీ్మకి మహర్షి ఎయిర్పోర్ట్ ప్రారంభం అయోధ్యలో ఆధునిక హంగులతో సిద్దమైన విమానాశ్రయాన్ని మోదీ ప్రారంభించారు. రామాయణ కర్త పేరిట దీనికి మహర్షి వాలీ్మకి అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. అయోధ్యకు 15 కిలోమీటర్ల దూరంలో అత్యాధునిక సౌకర్యాలతో రూ.1,450 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయాన్ని శనివారం ఉదయం మోదీ లాంఛనంగా ప్రారంభించారు. వాలీ్మకి విరచిత రామాయణం మనకు గొప్ప జ్ఞానపథమని ఈ సందర్భంగా అన్నారు. ‘‘అది మనల్ని శ్రీరామ ప్రభువు చెంతకు చేరుస్తుంది. ఆధునిక భారత దేశంలో అయోధ్య ధామంలోని వాలీ్మకి విమానాశ్రయం మనల్ని దివ్య (మహోన్నత), భవ్య (అద్భుత), నవ్య (ఆధునిక) రామ మందిరానికి చేరుస్తుంది. అప్పట్లో ఇదే రోజున అండమాన్ దీవికి బ్రిటిష్ చెర నుంచి సుభాష్ చంద్రబోస్ విముక్తి కలి్పంచారు. అక్కడ జాతీయ జెండా ఎగరేశారు. మనలి్నది ఆజాదీ కీ అమృత్ కాల్లోకి తీసుకెళ్తుంది’’ అన్నారు. విమానాశ్రయ విశేషాలు.. ► అయోధ్య నగర చరిత్ర, విశిష్టత, ఆధ్యాతి్మక వాతావరణం ప్రతిబింబించేలా విమానాశ్రయ నిర్మాణం సాగింది. టెర్మినల్ భవనానికి శ్రీరామ మందిరాన్ని తలపించేలా తుదిరూపునిచ్చారు. ప్రధాన ద్వారంపై ఆలయ తోరణాల డిజైన్ వేశారు. రాముడి జీవితాన్ని కళ్లకు కట్టే కళాఖండాలు, చిత్రాలు, కుడ్యచిత్రాలకు విమానాశ్రయంలో చోటు కలి్పంచారు. ► బస్సు పార్కింగ్తోపాటు దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు కల్పించారు. ► ఎల్ఈడీ లైటింగ్, వాననీటి నిర్వహణ, సౌర విద్యుత్ ప్లాంట్, మురుగు శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. ► చుట్టూతా పరుచుకున్న పచ్చదనం నిర్వహణకు వాడిన నీటిని రీ సైకిల్ చేసి ఉపయోగించనున్నారు. ► విమానాశ్రయ నిర్మాణం కేవలం 20 నెలల్లో పూర్తయిందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్ కుమార్ చెప్పారు. ► ఈ ఎయిర్్రస్టిప్ గతంలో కేవలం 178 ఎకరాల్లో ఉండేది. దీన్ని రూ.350 కోట్లతో అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దారు. ఇందుకు యూపీ ప్రభుత్వం 821 ఎకరాలు కేటాయించింది. ► ఏటా 10,000 మంది ప్రయాణికుల రాకపోకలను వీలుగా విమానాశ్రయాన్ని విశాలంగా నిర్మించారు. టెరి్మనల్ భవనాన్ని 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కట్టారు. ► 2.2 కిలోమీటర్ల పొడవైన రన్వే ఉండటంతో ఎయిర్బస్–321 రకం విమానాల ల్యాండింగ్, టేకాఫ్ చాలా సులువు. రెండు లింక్ ‘టాక్సీ వే’లు ఉండటంతో ఒకేసారి ఎనిమిది విమానాలను పార్క్ చేసుకోవచ్చు. ► భవిష్యత్తులో విమానాశ్రయ రెండో దశ విస్తరణ మొదలవనుంది. టెర్మినల్ను 50 వేల చదరపు మీటర్లకు విస్తరిస్తారు. ► ఏటా ఏకంగా 60 లక్షల మంది రాకపోకలకు వీలుగా విస్తరణ ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ► రన్వేను 3.7 కిలోమీటర్లకు విస్తరించి అదనంగా 18 విమానాల పార్కింగ్కు చోటు కలి్పంచాలని భావిస్తున్నారు. అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వేస్టేషన్కు పచ్చజెండా అయోధ్య పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దాదాపు రూ.241 కోట్లతో పునరుద్ధరించిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అయోధ్య రైల్వేస్టేషన్ నుంచి రెండు అమృత్ భారత్ రైళ్లను, ఆరు వందే భారత్ రైలు సేవలను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘ మూడు కొత్త సేవలైన వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ల ‘త్రిశక్తి’తో భారత రైల్వే నూతన అభివృద్ధి శకంలోకి దూసుకెళ్లగలదు’’ అని మోదీ వ్యాఖ్యానించారు. మూడంతస్తుల నూతన అయోధ్య రైల్వేస్టేషన్లో సరికొత్త సౌకర్యాలను కలి్పంచారు. లిఫ్ట్లు, కదిలే మెట్లు, ఫుడ్ ప్లాజాలు, వాణిజ్య, వ్యాపార సముదాయలు, పూజా సామగ్రి దుకాణాలు, చైల్డ్ కేర్, వెయిటింగ్ హాళ్లతో స్టేషన్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారి సరి్టఫికెట్నూ ఈ రైల్వేస్టేషన్ సాధించింది. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే అమృత్ భారత్ రైలుకు తొలి రోజు విశేష స్పందన లభించింది. బుకింగ్ ప్రారంభించిన నిమిషాల వ్యవధిలోనే టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి. -
అయోధ్య వాసుల కష్టానికి దక్కిన ఫలితమిది
PM Narendra Modi In Ayodhya Updates ప్రపంచం యావత్తూ జనవరి 22 కోసం ఎదురుచూస్తోంది : ప్రధాని మోదీ శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం నేను కూడా మీలాగే ఎదురుచూస్తున్నాం ఒకప్పుడు అయోధ్యలో రాముడు టెంట్లో కొలువుదీరాడు ఇప్పుడు రాముడికి గొప్ప మందిరం వచ్చింది ఇది అయోధ్య వాసుల కష్టానికి దక్కిన ఫలితం అయోధ్యను దేశ చిత్రపటంలో సగర్వంగా నిలబెడతాం వారసత్వం మనకు సరైన మార్గం చూపిస్తుంది అభివృద్ధి చెందాలంటే వారసత్వాన్ని కాపాడుకోవాలి కొన్ని రోజుల్లో అయోధ్యలో వారసత్వం వెల్లివిరుస్తుంది ఇకపై అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య ఐదురెట్లు పెరుగుతుంది అయోధ్య ఎయిర్ పోర్ట్ చూసి ప్రతి ఒక్కరూ పులకించిపోతారు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్ ప్రాంగణంలో జరిగిన జన్ సభలో భావోద్వేగంగా ప్రధాని మోదీ #WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi says, "Today the whole world is eagerly waiting for the 22nd January..." The consecration ceremony of the Ram temple will be held on January 22 in Ayodhya pic.twitter.com/MXTdAczYqn — ANI (@ANI) December 30, 2023 #WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi says, "I have a request to all. Everyone has a wish to come to Ayodhya to be a part of the event on 22 January. But you know it is not possible for everyone to come. Therefore, I request all Ram devotees that once the formal… pic.twitter.com/pbL81WrsbZ — ANI (@ANI) December 30, 2023 అయోధ్య బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ యూపీకి సంబంధించి రూ.15,700 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి.. జాతికి అంకితం చేయనున్న ప్రధాని #WATCH | Prime Minister Narendra Modi participates in a public programme in Ayodhya, Uttar Pradesh. The PM will inaugurate, dedicate to the nation and lay the foundation stone of multiple development projects worth more than Rs 15,700 crore in the state. pic.twitter.com/BxnVrZGNv3 — ANI (@ANI) December 30, 2023 అయోధ్యకు ఎగిరిన తొలి విమానం టేకాఫ్ అనౌన్స్ చేసిన ఇండిగో పైలట్ కెప్టెన్ అశుతోష్ శేఖర్ కాసేపట్లో అయోధ్యకు చేరుకోనున్న తొలి విమానం #WATCH | IndiGo pilot captain Ashutosh Shekhar welcomes passengers as the first flight takes off from Delhi for the newly constructed Maharishi Valmiki International Airport, Ayodhya Dham, in Ayodhya, UP. pic.twitter.com/rWkLSUcPVF — ANI (@ANI) December 30, 2023 అయోధ్య ఎయిర్పోర్ట్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ #WATCH | PM Narendra Modi inaugurated Maharishi Valmiki International Airport Ayodhya Dham, in Ayodhya, Uttar Pradesh pic.twitter.com/6phB4mRMY5 — ANI (@ANI) December 30, 2023 అయోధ్య విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. కాసేపట్లో ప్రారంభం జై శ్రీరామ్తో మారుమోగిపోతున్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఎయిర్పోర్టులో జై రామ్.. శ్రీరామ్ నినాదాలు అయోధ్య ఎయిర్పోర్ట్ను మరికాసేపట్లో ప్రారంభించనున్న ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి ప్రయాణికులతో అయోధ్య చేరుకోనున్న తొలి విమానం రామాయణం రచించిన మహర్షి వాల్మీకి పేరును అంతర్జాతీయ విమానాశ్రయానికి పెట్టిన కేంద్రం #WATCH | Delhi: People raise slogans of 'Jai Ram, Shri Ram'as they board the first flight for the newly built Maharishi Valmiki International Airport Ayodhya Dham, in Ayodhya, Uttar Pradesh PM Modi will inaugurate Maharishi Valmiki International Airport Ayodhya Dham shortly. pic.twitter.com/4xrYPZeKK2 — ANI (@ANI) December 30, 2023 ఆ ఇద్దరికి సెల్ఫీలు.. ఆటోగ్రాఫ్లు యూపీ అయోధ్య పర్యటనలో ప్రధాని మోదీని కలిసిన ఇద్దరు చిన్నారులు చిన్నారులకు సెల్ఫీ ఫోజులు ఇచ్చిన ప్రధాని మోదీ ఆటోగ్రాఫ్లిచ్చి కాసేపు వాళ్లతో ముచ్చటించిన ప్రధాని Uttar Pradesh | Prime Minister Narendra Modi met two children in Ayodhya and took selfies with them and also gave them autographs. pic.twitter.com/N7PHVTRwr7 — ANI (@ANI) December 30, 2023 #WATCH | Ayodhya, Uttar Pradesh: Two children who met Prime Minister Narendra Modi and took selfies with him, express their happiness. PM Modi also gave them autographs. https://t.co/RCMlsNOxpp pic.twitter.com/mGryxiRhLP — ANI (@ANI) December 30, 2023 కాసేపట్లో అయోధ్య ఎయిర్పోర్ట్ ప్రారంభం అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అయోధ్య ధామ్గా నామకరణం కాసేపట్లో ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 6వ తేదీ నుంచి విమానాల రాకపోకలు షురూ దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి వాల్మీకి ఎయిర్పోర్ట్కి విమానాలు అయోధ్య లతా మంగేష్కర్ చౌక్లో సందడి చేసిన ప్రధాని మోదీ #WATCH | PM Narendra Modi at the Lata Mangeshkar Chowk in Ayodhya, Uttar Pradesh pic.twitter.com/ZSkQVt41a3 — ANI (@ANI) December 30, 2023 ఆమె ఇంట్లో ఛాయ్ తాగిన ప్రధాని మోదీ అయోధ్య పర్యటనలో మోదీ తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు ఉజ్వల యోజన లబ్ధిదారురాలి ఇంటికి వెళ్లారు ఆమె ఇంట్లో టీ తాగి.. కుటుంబ సభ్యులతో ముచ్చటించారు పీఎం ఉజ్వల యోజన కింద 10 కోట్ల మంది లబ్ధిదారులున్న సంగతి తెలిసిందే కాసేపట్లో అయోధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రారంభించనున్న ప్రధాని మోదీ అమృత్ భారత్ను ప్రారంభించిన ప్రధాని రెండు అమృత్ భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ అంతకు ముందు.. రైలులోని విద్యార్థులతో ప్రధాని మోదీ మాటామంతీ అయోధ్య పర్యటనలో రెండు అమృత్ భారత్ రైళ్లు, ఆరు వందేభారత్ రైళ్లను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ #WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi flags off two new Amrit Bharat trains and six new Vande Bharat Trains. pic.twitter.com/Q1aDQc8wG7 — ANI (@ANI) December 30, 2023 అయోధ్య ధామ్ జంక్షన్ ప్రారంభం అయోధ్య రైల్వే స్టేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ అయోధ్య ధామ్ జంక్షన్గా అయోధ్య రైల్వే స్టేషన్కు నామకరణం రూ.240 కోట్లతో పునరుద్ధరణ పనులు అయోధ్య మందిర చిత్రాలతో.. హైటెక్ హంగులతో స్టేషన్ మూడు అంతస్థులతో అయోధ్య జంక్షన్ పునర్నిర్మాణం #WATCH | Prime Minister Narendra Modi inaugurates the Ayodhya Dham Junction railway station, in Ayodhya, Uttar Pradesh Developed at a cost of more than Rs 240 crore, the three-storey modern railway station building is equipped with all modern features like lifts, escalators,… pic.twitter.com/oJMFLsjBnp — ANI (@ANI) December 30, 2023 #WATCH | Prime Minister Narendra Modi inaugurates the Ayodhya Dham Junction railway station, in Ayodhya. Uttar Pradesh Governor Anandiben Patel, CM Yogi Adityanath, Railways Minister Ashwini Vaishnaw are also present. pic.twitter.com/ls97j4eKkE — ANI (@ANI) December 30, 2023 भगवान रामलला की नगरी में #PMModi, उनके रोड शो में उमड़ा जनसैलाब, जय श्री राम की गुंज के बीच 'अयोध्या धाम जंक्शन' का किया उद्घाटन। #Ayodhya @BJP4India @narendramodi #RamMandir pic.twitter.com/gv8Ewzed39 — Aviral Singh (@aviralsingh15) December 30, 2023 దారిపొడవునా.. ప్రధానికి సాదర స్వాగతం ఆధ్యాత్మిక నగరి అయోధ్యలో కొనసాగుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన రైల్వే స్టేషన్ వరకు 15 కిలోమీటర్ల దూరం మెగా రోడ్ షో దారి పొడవునా ప్రధానికి ప్రజలు సాదర స్వాగతం మధ్య మధ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,400 మంది కళాకారుల ప్రదర్శన ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వేస్టేషన్ను కాసేపట్లో ప్రారంభించనున్న ప్రధాని మోదీ #WATCH | People shower flower petals on Prime Minister Narendra Modi as he holds a roadshow in Ayodhya, Uttar Pradesh PM Modi will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat… pic.twitter.com/b53mxsHFml — ANI (@ANI) December 30, 2023 అయోధ్య ప్రజలకు ప్రధాని మోదీ అభివాదం #WATCH | PM Narendra Modi greets people as he arrives in Ayodhya, Uttar Pradesh PM Modi will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat trains and Vande Bharat trains. pic.twitter.com/zqpaqjzzW4 — ANI (@ANI) December 30, 2023 అయోధ్యలో ప్రధాని మోదీ మెగా రోడ్ షో అయోధ్య పర్యటనలో మెగా రోడ్షోలో పాల్గొంటున్న ప్రధాని నరేంద్ర మోదీ దారికి ఇరువైపులా బారులు తీరిన జనం అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రధాని మోదీ మోదీకి ఘనంగా స్వాగతం ప్రత్యేక ఆకర్షణగా.. సాంస్కృతిక కళల ప్రదర్శన #WATCH | Prime Minister Narendra Modi arrives in Ayodhya, Uttar Pradesh PM Modi will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat trains and Vande Bharat trains. pic.twitter.com/c60Tzh4Xkb — ANI (@ANI) December 30, 2023 రాముడు అందరివాడు: ఫరూక్ అబ్దుల్లా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంపై జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా స్పందన అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది అందుకు కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ అభినందనలు రాముడు కేవలం హిందువులకే దైవం కాదు.. ప్రపంచంలో ప్రతీ ఒక్కరికీ దేవుడే.. అది పుస్తకాల్లోనూ రాసి ఉంది ప్రజలంతా మత, భాష బేధాలు లేకుండా సోదరభావంతో, ప్రేమతో, ఐక్యంగా ఉండాలని శ్రీరాముడు విశ్వ సందేశం ఇచ్చారు కాబట్టి ఆలయం ప్రారంభం అయ్యే సమయంలో అంతా సోదరభావంతో మెలగాలి #WATCH | Poonch, J&K: Former CM of Jammu and Kashmir and National Conference leader Farooq Abdullah says, "Ayodhya Ram Temple is about to be inaugurated. I would like to congratulate everyone who made the effort for the temple. It's ready now. I would like to tell everyone that… pic.twitter.com/V7Pb5Q8uN1 — ANI (@ANI) December 30, 2023 ►అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీ ప్రధానికి రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం ఎయిర్పోర్టు నుంచి 15 కిలోమీటర్లు సాగే రోడ్ షోలో పాల్గొననున్న మోదీ Prime Minister Narendra Modi arrives in Ayodhya; received by Uttar Pradesh Governor Anandiben Patel and CM Yogi Adityanath PM Modi will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat… pic.twitter.com/yWqDDowRcm — ANI (@ANI) December 30, 2023 ►కాసేపట్లో అయోధ్యకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కాసేపట్లో ప్రధాని అయోధ్య విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఘనస్వాగతంతో ముందుకు సాగుతారు. ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన అయోధ్య రైల్వేస్టేషన్ను, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాల అనంతరం విమానాశ్రయం పక్కనున్న మైదానంలో ఏర్పాటుచేసే ‘జన్ సభ’లో మాట్లాడతారు. ఈ సభకు లక్షన్నర మంది హాజరయ్యే అవకాశముంది. సభానంతరం ప్రధాని తిరుగు పయనమవుతారు ►అయోధ్యలో నాలుగు గంటలపాటు ఉండనున్న ప్రధాని #WATCH | Ayodhya: BJP MP Lallu Singh says, "Entire Ayodhya has been decorated. The people of Ayodhya are waiting eagerly for the most popular world leader, PM Modi...Devotees of Lord Ram in Ayodhya will welcome PM Modi with warmth." pic.twitter.com/h8Njr7Qinr — ANI (@ANI) December 30, 2023 ►అయోధ్యలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.11,100 కోట్ల ప్రాజెక్టులను, యూపీలోని ఇతర ప్రాంతాల అభివృద్ధికి రూ.4,600 కోట్ల పనులను ప్రారంభిస్తారు. అలాగే రామ మందిరానికి చేరుకునేలా కొత్తగా పునరుద్ధరించిన నాలుగు రహదారుల ప్రారంభం కూడా ప్రధాని షెడ్యూలులో ఉన్నట్లు పీఎంవో తెలిపింది. ►ఉత్తర ప్రదేశ్ ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో నేడు అత్యాధునిక ఎయిర్పోర్ట్, ఆధునిక హంగులు సంతరించుకున్న రైల్వే స్టేషన్ ప్రారంభం ►రామమందిర శంకుస్థాపనకు ముందే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్ ప్రారంభం కావడం గమనార్హం ► ప్రధాని మోదీ చేతుల మీదుగా.. మొత్తం రూ. 15 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన ►మోదీ పర్యటన నేపథ్యంలో నగరంలో భద్రత పటిష్టం ►డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్తో అణువణువూ తనిఖీలు.. డ్రోన్లతో నిఘా ►పూలతో అందంగా ముస్తాబైన అయోధ్య ►అయోధ్యలో రూ.1,450 కోట్లతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణం Ayodhya Airport completed in record time of 20 months: Airport Authority Chairman Read @ANI Story | https://t.co/RSOVcfxEAc#AyodhyaAirport #Ayodhya #UttarPradesh #AAI pic.twitter.com/1v3OZwnS0Z — ANI Digital (@ani_digital) December 30, 2023 ►6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం ►ఇక్కడి నుంచి ఒకేసారి 600 మంది ప్రయాణికులు రాకపోకలు ►‘మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయోధ్యధామం’గా పేరు ఆధునీకరించిన అయోధ్య రైల్వే స్టేషన్కు ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా నామకరణం శ్రీరాముడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పలు సుందర నిర్మాణాలు శిఖరం, విల్లు బాణం వంటి గుర్తులు నాలుగు ఎత్తయిన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రైల్వే స్టేషన్ విస్తరణ రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్, ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్(రైట్స్) ఆధ్వర్యంలో అభివృద్ధి ►మరోవైపు.. అయోధ్యలో ఊపందుకున్న భవ్య రామమందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు ►అయోధ్య నగరానికి 15 కి.మీ.ల దూరాన ఉన్న ఎయిర్పోర్టు నుంచి రైల్వేస్టేషనుకు వెళ్లే మార్గం పొడవునా ప్రధాని రోడ్షో ఉంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి. ఈ మార్గంలో ఏర్పాటుచేసే 40 వేదికలపై దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,400 మంది కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019