breaking news
-
భక్తజన సంద్రంగా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి (ఫొటోలు)
-
భక్తజన సంద్రంగా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి (ఫొటోలు)
-
కొండగట్టు అంజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధి కాషాయమయమైంది. లక్షలాదిగా తరలివచ్చిన మాలధారులు, సాధారణ భక్తులతో పుణ్యక్షేత్రం రద్దీగా మారింది. ‘జై శ్రీరామ్.. జై హనుమాన్’ అంటూ భక్తుల నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. బుధవారం ఉదయం ఐదు గంటల నుంచే మనరాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరావడం ప్రారంభమైంది. వీరంతా బుధవారం అర్ధరాత్రి 12గంటల తర్వాత క్యూలైన్ల ద్వారా శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత కల్యాణ కట్టకు చేరుకుని మాల విరమణ, దీక్ష విరమణ చేశారు. గురువారం హనుమాన్ చిన్నజయంతి నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. పోలీసుల డేగకళ్లతో పహారా కాస్తున్నారు. -
హైదరాబాద్లో ఘనంగా హనుమాన్ విజయయాత్ర
► హనుమాన్ జయంతి సందర్బంగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి బంజారహిల్స్ డివిజన్ శ్రీరాంనగర్, ఉదయ్ నగర్, యూసుఫ్గూడ డివిజన్ కృష్ణానగర్లో హనుమాన్ శోభాయాత్రలను సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ నినాదాలు చేశారు హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ జంట నగరాల్లో విజయ యాత్రలు ప్రారంభం అయ్యాయి. గౌలిగూడ రామ మందిరం వద్ద ప్రారంభమైన యాత్ర.. సికింద్రాబాద్ తాడ్బన్ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లించారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా విజయ యాత్ర కొనసాగే ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. ►సికింద్రాబాద్లో భారీ వర్షం ప్రారంభమైంది హనుమాన్ జయంతి యాత్ర పాల్గొన్న భక్తులు వర్షంలో సైతం ముందుకు సాగుతున్నారు. సికింద్రాబాద్తో పాటు కంటోన్మెంట్ పరిసర ప్రాంతాల్లో భారీ రాళ్ల వర్షం కురిసింది దారి పొడవున మంచు రాళ్లతో కూడిన వర్షం పడడంతో.. ఫోటోలు తీసుకుంటూ కంటోన్మెంట్ ప్రజలు ఎంజాయ్ చేశారు. హిమాయత్నగర్/సుల్తాన్బజార్: హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం తలపెట్టిన వీర హనుమాన్ విజయ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు గౌలిగూడ రామమందిర్లో యజ్ఞంతో ప్రారంభమయ్యే ఈ యాత్రకు మొదటి పూజకు హరియాణా గవర్నర్ బండ్డారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు పటిష్ట బందోబస్తుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తాలో వేలాదిమంది హనుమాన్ భక్తులతో సామూహిక హనుమాన్ చాలీసా నిర్వహించనున్నారు. వీర హనుమాన్ విజయయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని భజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు తెలిపారు. రూట్మ్యాప్ను వివరిస్తున్న సుధీర్బాబు గౌలిగూడ టు తాడ్బండ్ ‘శ్రీ హనుమాన్ జయంతి విజయ యాత్ర’కు గౌలిగూడ టూ తాడ్బండ్ వరకు ప్రత్యేకమైన బందోబస్తుతో ఎవరికీ ఏవిధమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ అడిషినల్ సీపీ జి.సుధీర్బాబు తెలిపారు. ట్రాఫిక్ సిబ్బందితో పాటు శాంతిభద్రతల సిబ్బంది సైతం ట్రాఫిక్ డ్యూటీలో ఉంటున్నట్లు తెలిపారు. యాత్ర సాగే రూట్లో ట్రాఫిక్ డైవర్షన్లు చేస్తూనే ప్రత్యామ్నాయ మార్గాలను సైతం సూచిస్తున్నామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల సమయంలో సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, ఉప్పల్ వెళ్లేవారి కోసం రూట్ని కూడా సూచిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులకు, వాహనదారులకు ఏమైనా అర్థం కాకపోయినా, సమస్యలున్నా నేరుగా 040–27852482, 9010203626 నంబర్లకు ఫోన్ చేయొచ్చన్నారు. ట్రాఫిక్ ఏర్పాట్లపై అడిషినల్ సీపీ సుధీర్బాబు బుధవారం మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. గౌలిగూడ యత్ర ప్రారంభం నుంచి తాడ్బండ్ వరకు 12 కి.మీ.మేర యాత్ర కొనసాగనుంది. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. అక్కడి నుంచి కోఠి, సుల్తాన్బజార్, కాచిగూడ ఎక్స్రోడ్డు, నారాయణగూడ, కవాడిగూడ, బన్సీలాల్పేట్, మహంకాళి టెంపుల్, ప్యారడైజ్ ఎక్స్రోడ్డు మీదుగా తాడ్బన్ హనుమాన్ టెంపుల్ వరకు సాగుతుంది. -
జహంగీర్పురి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జహంగీర్పురిలో మత ఘర్షణలు జరిగిన ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎన్డీఎంసీ) అధికారులు బుధవారం ఉదయం భారీ బందోబస్తు కూల్చివేతకు దిగారు. కొన్ని తాత్కాలిక, శాశ్వత కట్టడాలను నేలమట్టం చేశారు. నోటీసులివ్వకుండానే కూల్చివేయడం ఏమిటని స్థానికులు ఆగ్రçహించారు. బుల్డోజర్లను అడ్డుకున్నారు. కూల్చివేతలను తక్షణం అడ్డుకోవాలంటూ జమైత్ ఉలెమా–ఇ–హింద్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అవి తమకందలేదంటూ అధికారులు గంటన్నర పాటు కూల్చివేతలు కొనసాగించారు. దాంతో పిటిషనర్ మళ్లీ సుప్రీం తలుపు తట్టడంతో కూల్చివేతలు ఆగాయి. విచారణ గురువారానికి వాయిదా పడింది. అన్ని పిటిషన్లపై నేడు విచారణ కూల్చివేతలు రాజ్యాంగవిరుద్ధంగా, అనధికారికంగా జరుగుతున్నాయని పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కోర్టును ఆశ్రయించబోతున్నామని తెలిసి మధ్యాహ్నాం ప్రారంభించాల్సిన కూల్చివేతలను ఉదయం 9 గంటలకే అధికారులు మొదలుపెట్టారని ఆరోపించారు. నివాసాలు, వాణిజ్య ఆస్తులను కూల్చకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కూడా ధర్మాసనాన్ని కోరారు. దీనిపై అన్ని పిటిషన్లను గురువారం విచారించాలని కోరగా జస్టిస్ రమణ అంగీకరించారు. సుప్రీం ఉత్తర్వులను తీసుకొని సీపీఎం సీనియర్ నేత బృందా కారత్ ఘటనా స్థలికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. విలువల విధ్వంసం: రాహుల్ ఢిల్లీ, మధ్యప్రదేశ్లో హింస జరిగిన ప్రాంతాల్లో ప్రభుత్వాలు బల్డోజర్లు వాడటంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విలువల విధ్వంసమేనని మండిపడ్డారు. పేదలు, మైనార్టీలకు లక్ష్యంగా చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘‘విద్వేష బుల్డోజర్లను తక్షణమే ఆపండి. వాటికి బదులు ప్రధాని మోదీ విద్యుదుత్పత్తి ప్లాంట్లను ప్రారంభించాలి. బీజేపీ అధినేత నేతలు వారి హృదయాల్లోని ద్వేషాన్ని కూల్చేసుకోవాలి’’ అంటూ ట్వీట్ చేశారు. జేసీబీ.. జిహాద్ కంట్రోల్ బోర్డ్: బీజేపీ జేసీబీ అంటే జిహాద్ కంట్రోల్ బోర్డ్ అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కొత్త భాష్యం చెప్పారు. బీజేపీ తీరుపై ఆప్ తీవ్రంగా స్పందించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటిని, బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని, హింసకు కారకులైన బీజేపీ నేతల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయాలి. అప్పుడే మత హింస, అల్లర్ల నుంచి దేశానికి విముక్తి’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చదవండి: (కొట్టి.. పాదాలు నాకించి.. దళిత విద్యార్థికి తీవ్ర అవమానం)
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019