ములుగు: మావోయిస్టు జీవితాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని ములుగు ఎస్పీ శబరీష్ సూచించారు. ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన పుల్లూరు నాగరాజు అలియాస్ జగత్, సీపీఐ మావోయిస్టు పార్టీ రెండో సీఆర్సీ ఏ సెక్షన్ కమాండర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బూర్గంపాడు గ్రామానికి చెందిన నూప భీమా అలియాస్ సంజు, రెండో సీఆర్సీ పీపీసీఎం/ఏసీఎం భీమా భార్య సోని పోలీసుల ముందు లొంగిపోయారు. కాగా, వారిపై ఉన్న నగదు రివార్డు మొత్తాన్ని ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం కల్పిస్తున్న భరోసాతో చాలామంది లొంగిపోతున్నట్లుగా వాగ్మూలం ఇచ్చారన్నారు.
breaking news
Breadcrumb
- HOME
Ad - Sakshi_Home_Sticky
adsolute_video_ad
Related news
-
ముగిసిన సుధాకర్ దంపతుల ప్రస్థానం
చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు ప్రస్థానం శుక్రవారం నాటికి ముగిసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేడ్ జిల్లా మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు, అతని భార్య సుమన అలియాస్ రజిత మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు శుక్రవారం తెల్లవారుజామున చల్లగరిగెకు మృతదేహాలను తీసుకొచ్చారు. గ్రామస్తులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. అనంతరం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర నాలుగు గంటల పాటు సాగింది. అనంతరం ముచినిపర్తి గ్రామ శివారులో మావోయిస్టు దంపతుల మృతదేహాలను పక్కపక్కనే ఖననం చేశారు. ఇదిలా ఉండగా.. అంత్యక్రియల నేపథ్యంలో పోలీస్ బలగాలు గ్రామాన్ని చుట్టుముట్టినట్లు తెలిసింది.కాగా, 25 ఏళ్ల క్రితం అడవిబాట పట్టిన సుధాకర్ మధ్యలో ఏనాడూ ఊరిలోకి రాలేదని, శవమై తిరిగొచ్చాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బూటకపు ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అదివాసులకు అండగా నిలిచిన మావోయిస్టులను అన్యాయంగా కాల్చి చంపుతున్నారని ఇది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్ అని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి అన్నారు. ప్రజా బిడ్డలకు చావు లేదు ఉద్యమంలో చనిపోయిన సుధాకర్– సుమన దంపతులు ప్రజా బిడ్డలేనని వారికి ఎప్పటికీ చావు లేదని.. అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ అన్నారు. కేంద్ర ప్రభుత్వం హత్యకాండను పోత్సహిస్తుందని ఆరోపించారు. నివాళులర్పించిన వారిలో శాంతక్క, శోభ, శ్రీపతి రాజగోపాల్, గుమ్మడి కొమురయ్య, అంజన్న, మార్వాది సుదర్శన్, హుస్సేన్, విరసం నేతలు, బంధుమిత్రులు ఉన్నారు. ప్రజా బిడ్డలకు చావులేదు: ప్రజాసంఘాల నాయకులు చల్లగరిగెలో అంత్యక్రియలు పూర్తి -
సెల్ఫీ పాయింట్
ఓటుహక్కు ప్రాధాన్యం చైతన్యం కల్పించడంలో భాగంగా వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య, అధికారులతో కలిసి సెల్ఫీ దిగి ప్రారంభించారు. పబ్లిక్గార్డెన్, వరంగల్ రైల్వేస్టేషన్, బస్స్టేషన్ల వద్ద సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి యువకులను ఆకర్షించి ఓటు నమోదు శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ శ్రీనివాస్, జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీసీఓ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.– కాళోజీ సెంటర్ -
మంత్రులు ఏమన్నారంటే..
మహబూబాబాద్: కాంగ్రెస్పార్టీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ నామినేషన్ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అధ్యక్షతన నిర్వహించిన జన జాతర బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు నోరు దగ్గర పెట్టుకోవాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలి. దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు. రెండుసార్లు పీఎంగా రాహుల్గాంధీకి అవకాశం వచ్చినా తీసుకోలేదు. మాజీ సీఎం కేసీఆర్.. సీఎం రేవంత్రెడ్డిని లిల్లిపుట్టు అని సంభోదించారు.. వరంగల్ మిరపకాయ కారం కేసీఆర్కు తెలియదు.. రేవంత్రెడ్డికి తెలుసు.. సమయం వచ్చినప్పుడు ఎక్కడపెట్టాలో అక్కడ పెడుతారన్నారు. కేసీఆర్కు చిప్పకూడు తినే రోజులు దగ్గర పడ్డాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రజల స్వేచ్ఛను హరించింది. దానిలో భాగస్వామ్యం ఉన్న వారందరికీ భవిష్యత్లో శిక్షణ తప్పదు. వంద రోజుల్లోనే రేవంత్ మార్క్ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం రేవంత్రెడ్డి అద్భుత పాలన అందిస్తున్నారు. వంద రోజులలోనే తనదైన మార్కు వేసుకున్నారు. సీఎం పట్టుదల దూర దృష్టి ఉన్న నాయకుడు. గత ప్రభుత్వ చేసిన అప్పులు తీర్చలేరు. లోప భూయిష్టమైన పాలన ఉంది.. సాధ్యం కాదని బీఆర్ఎస్ అనుకున్నారు.. దానిని సీఎం గాడిలో పెట్టారు. 15స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యం. బలరాంనాయక్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. బలరాంనాయక్ భోళా శంకరుడు : మంత్రి ధనసరి సీతక్క గ్యారంటీలకే గ్యారంటీ సీఎం రేవంత్రెడ్డి. అభ్యర్థి బలరాంనాయక్ మోసాలు తెలియని భోళా శంకరుడు. మోదీ ప్రభుత్వం జీఎస్టీల పేరుతో పేదలపై భారం మోపింది. భగవంతుని భక్తుని అనుసంధానమైన అగర్ బత్తిపై కూడా జీ ఎస్టీ విధించింది. దేశం కోసం స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి చెందిన రాహుల్గాంధీని పీఎం చేయాలి. ఉపాధిహామీ, విద్యాహక్కు, ఆహార భద్రత చట్టాలని కాంగ్రెస్ తీసుకొస్తే బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. జన జాతర సభలో ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్, డోర్నకల్, మహబూబాబాద్, భద్రాచలం, పినపాక, ఇల్లెందు, పాలకుర్తి ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, భూక్య మురళీనాయక్, తెల్లం వెంకట్రాం, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, యశస్వినిరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్రెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, బెల్లయ్య నాయక్, రియాజ్, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్చందర్రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, నాయకులు వెన్నం శ్రీకాంత్రెడ్డి, మోహన్లాల్, ఘనపురపు అంజయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథిరెడ్డి, అజయ్సారథిరెడ్డి, డాక్టర్ భూక్య ఉమ, చుక్కల ఉదయ్చందర్ పాల్గొన్నారు. -
మానుకోట.. కాంగ్రెస్ కంచుకోట
జన జాతర సభలో జోష్ నింపిన సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో చూస్తా.. గెలిచే స్థానాల్లో మొదటి రెండు స్థానాలు ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ ఉంటాయి. ఇరు పార్లమెంట్ ఇన్చార్జ్లు పొంగులేటి, తుమ్మల ఇక్కడే ఉన్నారు. ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో ఎవరు ఎక్కువ మెజార్టీ తెస్తారో చూస్తాం. ప్రజలను ఇబ్బందులు పెట్టి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే నరేంద్ర మోదీ, ఆయనకు మద్దతుగా ఉన్న కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిందే. ఈ రెండు పార్టీలను ఓడించేందుకు మీరు (ప్రజలు) సిద్ధమేనా.. – సీఎం రేవంత్రెడ్డి సాక్షి, మహబూబాబాద్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపును కాంక్షిస్తూ శుక్రవారం మానుకోటలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ ప్రసంగం ఆద్యంతం పార్టీ శ్రేణులు, ప్రజల్లో జోష్ నింపుతూ సాగింది. సీఎం రేవంత్రెడ్డి మధ్యాహ్నం 3.15 గంటలకు మహబూబాబాద్ చేరుకున్నారు. అప్పటికే ఆయన అలసిపోవడంతో బస్సులో విశ్రాంతి తీసుకొని సాయంత్రం 5:16 గంటలలకు సభా వేదికపైకి వచ్చారు. 6:17 గంటల వరకు ప్రసంగం సాగింది. సీఎం వచ్చిన తర్వాత తొర్రూరు, డోర్నకల్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. అప్పటివరకు కాసేపు పొంగులేటి, తర్వాత తుమ్మలతో సీఎం ముచ్చటించారు. సీఎం వేదికపైకి వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ పైకి వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. తర్వాత మానుకోట.. ఎప్పటికి కాంగ్రెస్ కంచుకోట.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగం ప్రారంభించి మొదటి మాటతోనే కార్యకర్తలు, ప్రజల్లో ఉత్తేజాన్ని నింపారు. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను విమర్శించడమే లక్ష్యంగా సీఎం ప్రసంగం సాగింది. ముందుగా ప్రధాని మోదీ నుంచి మొదలు పెట్టి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వరకు విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన పని ఏమీలేదని, బయ్యారం ఉక్క ఫ్యాక్టరీ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ఆలస్యం చేయడంతో గిరిజనులు నష్టపోయిన తీరును వివరించారు. పార్లమెంట్లో తెలంగాణను తక్కువ చేసి మాట్లాడిన ప్రధాని మోదీని ఎలా సమర్థిస్తారని కిషన్రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఏ మొఖంతో ఓట్లు అడుగుతుందని చెప్పి అవునా.. కాదా.. అని ప్రజలతోనే చెప్పించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడం, బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు, కేసీఆర్ బిడ్డ కోసం రాష్ట్రాన్ని బీజేపీ కాళ్లముందు వేశారని విమర్శలు చేశారు. ‘ప్రభుత్వం కూలిపోతుంది.. పార్టీలు మారుతారు అన్న విషయంపై ఆషామాషీగా రాలేదని ఎన్నో ఎత్తుగడలతో వచ్చాం.. బీఆర్ఎస్ను తొక్కి వచ్చాం’ అని చెప్పడంతో.. ప్రజలనుంచి ప్రతిస్పందన వచ్చింది. జోష్ నింపుతూ ప్రసంగం ముఖ్యమంత్రి ప్రసంగం కార్యకర్తలు, ప్రజల్లో జోష్ను నింపుతూ సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించామని, ఇప్పుడు మోదీని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ చేసిన త్యాగం చెబుతూ.. అప్పటి ఎంపీలు సోనియాగాంధీకి బలిదానాల విషయం చెప్పిన తీరు.. ఆమె స్పందన, తల్లిగా అర్థం చేసుకుందని చెబుతూ.. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ను కదిలించారు. పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ ఏమీ చేయలేదని చెప్పి.. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు రుణమాఫీ, ఉద్యోగాల నియామకం మొదలైన అంశాలను ప్రస్తావించారు. అదే తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని చెప్పి ప్రజలతో చెప్పించారు. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయడంతో సభ ముందున్న వారందరూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే ముందుగా కుల సంఘాల నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల ప్రసంగాలు మొదలుకొని సీఎం ప్రసంగం వరకు అభ్యర్థి బలరాంనాయక్ స్టేజీకి అటు చివర నుంచి ఇటు చివరి వరకు నడుస్తూ.. ప్రజలకు అభివాదం చేయడం... తనను గెలిపించాలని చెప్పకనే చెప్పినట్లు సంకేతంగా మారింది. మంత్రులు ఏమన్నారంటే.. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన మంత్రులు చేతులు ఊపుతూ.. దండం పెట్టే పనిలో అభ్యర్థి బలరాంనాయక్ కొనసాగుతున్న నామినేషన్ల పర్వం మానుకోటలో రెండో రోజు నాలుగు, వరంగల్లో మూడు నామినేషన్లుసీఎం పర్యటన ఇలా.. 3.12 గంటలకు హెలికాప్టర్ ల్యాండింగ్ 3.15 నుంచి 5.14వరకు సీఎం రేవంత్రెడ్డి విశ్రాంతి 5.16 గంటలకు సభాస్థలికి చేరుకున్న సీఎం 5.51 గంటలకు సీఎం ప్రసంగం ప్రారంభం 6.17 గంటలకు ప్రసంగం ముగిసింది 6.18 గంటలకు మానుకోట ప్రజలకు అభివాదం చేశారు 6.25 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్లారు8లోu -
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
మహబూబాబాద్: మానుకోట పార్లమెంట్ నియోజ కవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖ లు అయినట్లు అధికారులు వెల్లడించారు. ములు గు నియోజకవర్గం మదనపల్లి గ్రామానికి చెందిన పోరిక బలరాంనాయక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయ న వెంట ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, కోరం కనక య్య, పాయం వెంకటేశ్వర్లు, నాయకులు వెన్నం శ్రీకాంత్రెడ్డి, ఘనపురపు అంజయ్య, నూనావత్ రాధ, ఎడ్ల రమేష్ ఉన్నారు. బలరాంనాయక్ నాయక్ రెండు సెట్లు దాఖలు చేశారు. పినపాక నియోజకవర్గం మణుగూరుకు చెందిన పాల్వంచ దుర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేశారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన జాటోత్ రఘునాయక్ ఆధార్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నర్సంపేట ని యోజకవర్గం ఇటుకాలపల్లి గ్రామం ఏనుగుల తండాకు చెందిన బోడ అనిల్ నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రెండు రోజుల్లో ఐదు నా మినేషన్లు, ఆరు సెట్లు పత్రాలు అందినట్లు అధికా రులు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియలో కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు, సహాయ రిటర్నింగ్ అధికారులు లెనిన్ వత్సల్ టొప్పో, డేవిడ్, ఆర్డీఓలు అలివేలు, నర్సింహరావు, తహసీల్దార్లు భగవాన్రెడ్డి, దామోదర్, శ్వేత, సునీల్రెడ్డి, పర్యవేక్షణ అధికారి పవన్కుమార్ పాల్గొన్నారు. వరంగల్లో ముగ్గురి నామినేషన్ కాళోజీ సెంటర్ : వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి శుక్రవారం రెండో రోజు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఎస్పీ అభ్యర్థిగా పంజా కల్పన, స్వతంత్ర అభ్యర్థిగా పేరంబుదూరి కృష్ణసాగర్, మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ అభ్యర్థిగా ఏఆర్ సేనా ప్రేమ్రెడ్డి రిపిక, స్వతంత్ర అభ్యర్థిగా (1) సెట్ మొత్తం 2 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్యకు అందజేశారు. ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు అభ్యర్థులు ఏడు నామినేషన్లు పత్రాలు సమర్పించారు. ఇందులో ఏఆర్ సేనా ప్రేమ్రెడ్డి రిపిక రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.● నామినేషన్ దాఖలు చేసిన మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్
Related News by category
-
నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి
మహబూబాబాద్: నిష్పక్షపాతంగా లోక్సభ ఎన్ని కల విధులు నిర్వర్తించాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్వ్యాస్ అధికారులకు సూచించారు. గురువారం న్యూఢిల్లీ నుంచి ఆయన ఎన్నికల పోలింగ్ నిర్వహణ, విధులు, ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా నితేష్వ్యాష్ మాట్లాడుతూ.. అధికారులు చిన్న పొరపాటు కూడా జరగకుండా అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అదనపు బ్యాలెట్ యూనిట్లు, ఎఫ్ఎల్సీ, ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వందశాతం ఓటర్ స్లిప్లు పంపిణీ చేయాలన్నారు. డబ్బు, మద్యం, గిఫ్ట్ల పంపిణీ జరుగకుండా పక్కా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సీ విజిల్ యాప్ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. వీసీలో ఆర్వో, కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, ప్రధాన పరిశీలకులు రచిత్రాజ్, వ్యయ పరిశీలకులు రమాకాంత్ ద్రుపాటి, ఎస్పీ సుధీర్రాంనాథ్ కేకన్ పాల్గొన్నారు. -
కేసీఆర్ రోడ్ షో విజయవంతం
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షో విజయవంతమైందని, తన గెలుపు ఖాయమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మానుకోట ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత ధీమా వ్యక్తం చేశారు. మానుకోటలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలు మార్పుకోరుకుంటున్నారని, కేసీఆర్ను కావాలనుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని అన్నారు. ఈసీ ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ క్రేజ్ తగ్గదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మకై బీఆర్ఎస్ను దెబ్బతీసే కుట్రలు చేస్తున్నాయని, ప్రజలు ఆ పార్టీలకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో మానుకోటపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. మానుకోటలో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోకు అశించిన దాని కంటే ఎక్కువ మంది జనాలు వచ్చారన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ వెంకన్న, నాయకులు పర్కాల శ్రీనివాస్రెడ్డి, భరత్కుమార్ రెడ్డి, కెఎస్ఎన్ రెడ్డి, ముత్యం వెంకన్న, మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత -
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలి
తొర్రూరు రూరల్: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గురువారం మండలంలోని మడూరు, వెలికట్ట, చింతలపల్లి, గుర్తూ రు, కంఠాయపాలెం, ఫత్తేపురం, మాటేడు, చెర్లపాలెం, చీకటాయపాలెం, అరిపిరాల, వెంకటాపురం గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తప్పుడు హామీలు, విష ప్రచారాన్ని ప్రజలు నమ్మి తీవ్రంగా మోసపోయారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా... ఒక్క హమీ అమలు చేయలేదన్నా రు. ఇలాంటి ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అంజయ్య, జెడ్పీటీసీ శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షులు సీతారాములు, మండల అభివృద్ధి కమిటీ చైర్మ న్ సోమేశ్వర్రావు, నాయకులు ప్రమోద్గౌడ్, కుర్ర శ్రీనివాస్, అనుమాండ్ల ప్రదీప్రెడ్డి, ఆయా గ్రామా ల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. -
అభ్యర్థుల ఖర్చుల రిజిస్టర్ల పరిశీలన
మహబూబాబాద్: మానుకోట లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఖర్చుల రిజిస్టర్లను పరిశీలనకు తీసుకురావాలని ఆర్వో, కలెక్టర్ అద్వైత్మార్సింగ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల వ్యయ వివరాలను ఈ నెల 3న మొదటిసారి వ్యయపరిశీలకులు ఉమాకాంత్ ద్రుపాటి పరిశీలిస్తారని తెలిపారు. అలాగే 7న, 11వ తేదీన సైతం పరిశీలించనున్నట్లు చెప్పారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకు వ్యయ పరిశీలకులు అందుబాటులో ఉంటారన్నారు. అభ్యర్థులు లేదా వారి తరఫున ఏజెంట్లు వ్యయ రిజిస్టర్లతో హాజరుకావాలన్నారు. హాజరుకాని పక్షంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్చార్జ్ డీపీఆర్వోగా ప్రేమలతమహబూబాబాద్: జిల్లా ఇన్చార్జ్ డీపీఆర్వోగా బి.ప్రేమలత గురువారం బాధ్యతలు స్వీకరించారు. డీపీఆర్వో రాజేంద్ర ప్రసాద్ ఆరోగ్య కారణాలతో సెలవులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రేమలతకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. నేడు జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశంమహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో శుక్రవారం 10గంటలకు జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జ్ జెడ్పీ సీఈఓ నర్మద గురువారం తెలిపారు. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, జెడ్పీ సభ్యులు సకాలంలో సమావేశాలకు హాజరుకావాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సహకరించాలి గార్ల: పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు వివిధ పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని మహబూబా బాద్ డీఎస్పీ తిరుపతిరావు సూచించారు. మండలంలోని సమస్యాత్మక ప్రాంతమైన మద్దివంచ గ్రామంలో ఆయన ఎన్నికలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఎన్నికలు జరిగే సమయంలో పార్టీల నాయకులు ఎలాంటి గొడవలకు పోవద్దన్నారు. సదస్సులో గార్ల బయ్యారం సీఐ రవికుమార్, ఎస్సై జీనత్కుమార్, వైస్ ఎంపీపీ కట్టెబోయిన శ్రీనివాసరావు, నాయకులు గౌని భద్రయ్య, రాగం రమేష్, గౌని మల్లేశం, బిక్షమయ్య, జనార్దన్, లోకేష్, మాజీ సర్పంచ్ బాబూరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఎదుట రెండు వర్గాల ఘర్షణచిన్నగూడూరు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని విస్సంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో రెండు వర్గాల మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం విస్సంపల్లి గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈక్రమంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నాయకులకు ఎమ్మె ల్యే కార్యక్రమాలకు సంబంధించిన సమాచా రం ఇవ్వట్లేదని వివాదం నెలకొంది. ఈక్రమంలో ఎమ్మెల్యే ఎదుటే ఇరువర్గాల నాయకులు ఘర్షణ పడ్డారు. చివరికి ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో ఘర్షణ సద్దుమణిగింది. -
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పెంపు
మహబూబాబాద్ అర్బన్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు ఈ నెల 4వ తేదీ వరకు పెంచినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి సమ్మెట సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష ఫీజు వివరాల కోసం కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లను సంప్రదించాలన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఫీజు చెల్లించి పరీక్షకు సన్నద్ధం కావాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లను ఓడించాలిమహబూబాబాద్ అర్బన్: విభజన చట్టంలోని బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఇతర హామీలను నెరవేర్చడంలో విఫలమైన బీజెపీ, బీఆర్ఎస్లకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అంబటి శ్రీనివాస్, ధర్మార్జున్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీజేఎస్ పార్లమెంటరీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించగా వారు హాజరై మాట్లాడారు. మతం పేరుతో ప్రజలను విభజించే నైతికత ఎవరికి లేదని, పదేళ్ల తర్వాత మాజీ సీఎం కేసీఆర్కు ప్రజలు గుర్తు వచ్చారా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ పాలనలో ప్రాజాస్వామిక వ్యవస్థలు కుప్పకూలిపోయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్కు టీజేఎస్ మద్దతు తెలుపుతుందని, మానుకోట అభ్యర్థి పోరి క బలరాంనాయక్ను గెలిపించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు బైరి రమేశ్, గోపాగాని శంకర్రావు, పల్లె వినయ్, మహబూబాబాద్ పార్లమెంటరీ నాయకులు మల్లెల రామనాథం, పిల్లి సుధాకర్, ఆరుద్ర పరమాత్మ చారి, ఇరుగు మనోజ్, ఖాజాపాషా, రాజు, శంకర్, యాకూబ్ ఉన్నారు.
Photos
View allVideo
View allBullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019