Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
అడుగడుగునా నీరా‘జనం’
(‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): మరోసారి చరిత్ర సృష్టించేందుకు చారిత్రక విజయనగరం జననేత జగనన్నకు అఖండ స్వాగతం పలికింది. అడుగడుగునా ప్రజలు జననీరాజనాలు పలికారు. ఉత్తరాంధ్ర కళారూపాలైన చెక్క భజనలు, కోలాటాలతో తమ అభిమాన నేతను అక్కున చేర్చుకున్నారు. విశాఖలోని ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద అభిమానుల కోలాహలం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభమైంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో 21వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఎండాడ నుంచి విజయనగరం వరకు సాగింది. దారిలో అడుగడుగునా అభిమానులు వెంటరాగా సీఎం జగన్ బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్ స్టేడియం, పీఎం పాలెం మీదుగా సాగిన యాత్ర జాతీయ రహదారి మొత్తం అభిమానులతో నిండిపోయింది. కొత్తవలస మండలంలోని చీడివలస గ్రామానికి చెందిన చెక్కభజన బృందంలోని అక్కచెల్లెమ్మలు జగన్ కోసం తరలివచ్చారు. ఎండాడ నుంచి కార్షెడ్ జంక్షన్, మధురవాడ, కొమ్మాది, పరదేశీపాలెం, గంభీరం, తాళ్లవలస వరకు వెంటనడిచారు. దారిపొడవునా అక్కచెల్లెమ్మల హారతులు, మహిళల కోలాటాలు, యువకుల తీన్మార్ డ్యాన్సులతో వారంతా సీఎం జగన్ యాత్ర వెంట అడుగులు వేశారు. జగన్ సైన్యంతో జాతీయ రహదారి కిటకిట.. ఇక ఉదయం పీఎంపాలెం వద్దకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్రలో పాల్గొనేందుకు అప్పటికే ఆయన రాకకోసం పెద్దఎత్తున మహిళలు, పిల్లలతో పాటు ఆటోడ్రైవర్లు తరలివచ్చారు. జగన్ బస్సుపై నుంచి అభివాదం చేయగానే ఆ ప్రాంతమంతా జగన్నినాదాలతో మార్మోగింది. వైఎస్సార్ స్టేడియం నుంచి మొదలైన జనప్రవాహం కొమ్మాది, మారికవలస మీదుగా ఆనందపురం జంక్షన్కు చేరుకుంది. అక్కడ వేచి ఉన్న అక్కచెల్లెమ్మలు జగనన్నకు ఘనస్వాగతం పలికారు. జగన్ను దూరం నుంచి చూసిన అపార్ట్మెంట్లలోని మహిళలు, విద్యార్థులు సైతం బాల్కనీల్లో హుషారుగా కేరింతలు కొట్టారు. ‘గత ప్రభుత్వంలో ఏ చిన్న పనికావాలన్నా జన్మభూమి కమిటీల ద్వారా స్థానిక టీడీపీ నేతలను కలవాల్సి వచ్చేది. వారు అడిగింది ముట్టజెప్పినా, ఇష్టం లేకపోతే నెలల తరబడి తిప్పించుకునే వారు’ అని మహిళలు నాటి పీడకలలను గుర్తుచేసుకున్నారు. జగనన్న తీసుకొచ్చిన వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలతో ఇంటికే వచ్చి మీకేం అవసరమో చెప్పాలని అడిగి మరీ చేస్తున్నారని నేటి పరిస్థితులను వివరించారు. ఇది సామాన్యుల ప్రభుత్వమని, తామంతా ఆనందంగా ఉన్నామని జనం ముక్తకంఠంతో చెప్పారు. ఇక యాత్రలో భాగంగా సీఎం జగన్ ఆనందపురం జంక్షన్లోని చెన్నాస్ కన్వెన్షన్లో సోషల్ మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు. అనంతరం.. మోదవలస జంక్షన్ మీదుగా విజయనగరం జిల్లాలో యాత్ర కొనసాగింది. జిల్లా నాయకులు, జగన్ అభిమానులతో మోదవల కూడలి జనసందోహంతో నిండిపోయింది. యువకులు ర్యాలీగా వెంటరాగా, మ.2 గంటలకు జొన్నాడ సమీపంలో ముఖ్యమంత్రి భోజన విరామం తీసుకున్నారు. అనంతరం సా.5 గంటలకు జొన్నాడ నుంచి చెల్లూరు వరకు ర్యాలీగా వచ్చి అక్కడ అశేష జనావాహినితో నిండిపోయిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ఈ బహిరంగ సభకు విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగులు సీఎం జగన్కు మద్దుతుగా మూడు చక్రాల మోటార్ సైకిళ్లపై పెద్దఎత్తున తరలివచ్చారు. జగన్ సీఎం అయ్యాకే తమ భవిష్యత్తు బాగుందని ఎంతో సంతోషంతో చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోకి బస్సుయాత్ర.. సభ అనంతరం సీఎం జగన్ చింతలవలస మీదుగా విజయనగరం జిల్లా సరిహద్దు గ్రామం కొప్పెర్ల చేరుకున్నారు. అప్పటికే చీకటి పడినా జగన్ కోసం పెద్దఎత్తున అభిమానులు అక్కడే ఉండి తమ ప్రియతమ నేతకు భారీ పూలదండలతో శ్రీకాకుళం జిల్లాలోకి ఆహ్వానించారు. కిక్కిరిసిన జన సందోహం మధ్య జగన్ అభివాదం చేస్తూ సవరవిల్లి, భోగాపురం మీదుగా రణస్థలం చేరుకున్నారు. అక్కడ ప్రజలు, నాయMý ులు రహదారిపై బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి జన సంద్రాన్ని తలపించింది. అక్కడి నుంచి అక్కివలస సమీపంలోని రాత్రి బసకు జగన్ చేరుకున్నారు. వైఎస్సార్సీపీలోకి బీజేపీ నేతలు ఎండాడ నైట్ క్యాంపులో ఎస్.కోట, గాజువాక, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, భీమిలి నియోజకవర్గ అభ్యర్థులతో పాటు ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్ను కలిశారు. వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పార్టీ కార్యకలాపాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇందులో బీజేపీ గాజువాక నియోజకవర్గం నుంచి మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాశరావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవిందు, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి,సంపత్కుమార్ ఉన్నారు. వీరితోపాటు విశాఖ ఉత్తరం నుంచి జనసేన నాయకురాలు దివ్యలత, బీజేపీ నుంచి హేమాంబర్, వ్యాపారవేత్త షేక్ సలీమ్, షేక్ హుస్సేన్ బాషా తదితరులున్నారు. -
బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి
గార: వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో బీసీ వర్గాల అభ్యన్నతికి కృషి చేశామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార మండలం శిమ్మపేట జంక్షన్లోని కల్యాణ మండపంలో గురువారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో పేదలకు ఏ హామీలు ఇచ్చామని, వాటినే మేనిఫెస్టోలో రూపొందించి 99 శాతం అమలు చేశామని చెప్పారు. బీసీ వర్గాలకు రాజికీయంగా అనేక నామినేటడ్ పదవులు ఇవ్వడంతో పాటు పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. బీసీల ఓట్లు వేయించుకున్న టీడీపీ వారి అభ్యన్నతికి ఏం చేసిందని ప్రశ్నించారు. బీసీలను వాడుకొని వదిలేసిన మనస్తత్వం చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ప్రజల్లో తారతమ్యాలు ఉండకూడదనే ఉద్దేశంతో విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. పిల్లల బాగు కోసం తల్లి, తండ్రి ఎలా ఆలోచిస్తున్నారో ఈ ప్రభుత్వం కూడా అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. జన్మభూమి కమిటీ అనే బ్రోకర్ల ప్రభుత్వం కావాలా.. పేదల సంక్షేమానికి కృషి చేసే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కావాలో మీరే నిర్ణయించుకోవాలన్నారు. చంద్రబాబు హామీలను నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో శ్రీశయన కార్పొరేషన్ చైర్మన్ డీపీ దేవ్, సర్పంచ్ గొలివి వెంకటరమణమూర్తి, అంబటి చినబాబు, ఎంపీపీ గొండు రఘురామ్, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, పార్టీ కన్వీనర్ పీస గోపి, ముంజేటి కృష్ణమూర్తి, అరవల రామకృష్ణ, బరాటం నాగేశ్వరరావు, శిమ్మ ధర్మరాజు, యాళ్ల నారాయణమూర్తి, కొయ్యాన చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న పాలనలోనే ప్రైవేటు బోధన సిబ్బందికి న్యాయం
ఆమదాలవలస: ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు వైఎస్సార్ సీపీ పాలనలోనే న్యాయం జరిగిందని పలువురు బోధన సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆమదాలవలస పట్టణంలోని స్పీకర్ క్యాంపు కార్యాలయం వద్ద కళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల రామారావు ఆధ్వర్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. ఈపీఎఫ్, ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించేలా చొరవ తీసుకోవాలని విన్నవించారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాం, ఎంపీగా పేరాడ తిలక్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ను కలిసిన వ్యయ పరిశీలకుడు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ను వ్యయ పరిశీలకుడు నవీన్కుమార్ సోని గురువారం గౌరవ పూర్వకంగా కలిశారు. కలెక్టర్ కార్యాలయంలో కలిసి ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి చర్చించారు. అనంతరం వ్యయ పరిశీలకుల బృందంతో సమావేశమయ్యారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు త్వరితగతిన చెల్లించాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజులను త్వరితగతిన చెల్లించాలని, ఈనెల 24వ తేదీతో గడువు ముగుస్తుందని ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు తెలిపారు. ఇటీవలి వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన వారితో పాటు తమ మార్కులకు పెంచుకునేందుకు (ఇంప్రూవ్మెంట్/బెటర్మెంట్) ఆసక్తి చూపే విద్యార్థులు పరీక్ష ఫీజును ఈనెల 24 తేదీలోగా తమ కళాశాలల్లో చెల్లించాల్సి ఉంటుందన్నా రు. అలాగే ఇంటర్మీడియెట్ ఫలితాలపై సందేహాలున్న విద్యార్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 24వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్ఐఓ చెప్పారు. ఆన్లైన్ ద్వారా మాత్రమే నిర్దేశించిన ఫీజులను చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. ప్రాక్టికల్స్లో ఫెయిలైన విద్యార్థులకు మే ఒకటి నుంచి 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఏ ఫారం..బీ ఫారం అంటే..? హిరమండలం: నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. అభ్యర్థులు ‘ఏ’ ఫారం, ‘బీ’ ఫారం ప ట్టుకుని ఆర్ఓ ఆఫీసుకు వస్తారు. అసలు ఈ ఫారాలకు అర్థాలేంటో తెలుసా..? గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో తమ అభ్యర్థులను ప్రతిపాదిస్తూ ఇచ్చే పత్రాన్ని బీ ఫారం అంటారు. నామినేషన్ సమర్పించే సమయంలో అభ్యర్థులు తమ రాజకీయ పార్టీలు ఇచ్చిన బీఫారం దాఖలు చేయాలి. అప్పుడే ఆ అభ్యర్థికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ గుర్తు కేటాయిస్తారు. బీ ఫారంను పార్టీ అధ్యక్షుడు నిర్ణయించిన వ్యక్తి జారీ చేస్తారు. బీ ఫారం జారీచేసేందుకు సంబంధిత వ్యక్తికి పార్టీ అధ్యక్షుడు ఆమోదాన్ని తెలుపుతూ ఏ ఫారం అందజేస్తారు. ఏ ఫారం ఎవరి పేరు తో అధ్యక్షుడు ఇస్తారో ఆ వ్యక్తికి పోటీ చేసే అభ్యర్థులకు బీఫారం ఇచ్చే అధికారం ఉంటుంది. తన పేరు మీద అందజేసిన ఏ ఫారంను ఆయా నియోజకవర్గాల్లోని ఎన్నికల అధికారులకు పోటీ చేసే అభ్యర్థి అందజేయాల్సి ఉంటుంది. ‘అప్రమత్తత అవసరం’ ఇచ్ఛాపురం: నామినేషన్ల సమయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి స్పెష ల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ, జాయింట్ డైరెక్టర్ డి.గంగాధరం పోలీసు సిబ్బందికి సూచించారు. ఆయన గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయం గేట్ కి ఇరువైపులా 100 మీటర్ల వరకు గల కటాఫ్ పాయింట్లు ఉండేలా చూసుకోవాలని పోలీసులతో అన్నారు. నామినేషన్ల ప్రక్రియకు వచ్చిన అభ్యర్థుల వాహనాలను కటాఫ్ పాయింట్ల వద్ద నిలపాలని సూచించారు. అభ్యర్థితో పా టు నలుగురు వ్యక్తులు, మూడు వాహనాలకు మాత్రమే తహసీల్దార్ గేట్ వరకు అనుమతి ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఇ చ్ఛాపురం, సోంపేట సీఐలు ఇమ్మాన్యూయేల్ రాజు, మల్లేశ్వరరావు, ఇచ్ఛాపురం, కవిటి ఎస్ఐలు వి.సత్యన్నారాయణ, ఎన్.లక్ష్మణరావు, రాము పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
‘జోడీ’ పండు
ఎచ్చెర్ల మండలంలోని చినరావుపల్లిలో నంబాడ సూర్యనారాయణకు చెందిన జీడిమామిడి తోటలో మంగళవారం ఒకే జీడిపండుకు రెండు పిక్కలు కనిపించాయి. ఈ విషయమై ఎచ్చెర్ల వ్యవసాయాధికారి సురేష్ మాట్లాడుతూ జన్యులోపాల వల్ల ఇటువంటివి ఏర్పడతాయని చెప్పారు. – ఎచ్చెర్ల క్యాంపస్ వాసుదేవుని సన్నిధిలో మంత్రి సీదిరి కాశీబుగ్గ: రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి, పలాస నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సీదిరి అప్పలరాజు కుటుంబ సమేతంగా గురువారం మందసలోని వాసుదేవ పెరుమాళ్ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. నామినేషన్ వేయనున్న సందర్భంగా సంబంధిత పత్రాలను స్వామివారి పాదాల వద్ద పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అప్పలరాజు, శ్రీదేవి దంపతులు గోపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇరువర్గాల కొట్లాట ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని ఫరీదుపేటలో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య గురువారం కొట్లా ట జరిగినట్లు ఎచ్చెర్ల ఎస్సై చిరంజీవి తెలిపా రు. శుభకార్యం వద్ద ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి దాడి చేసుకున్నారని, ఈ ఘటనలో కూన కిరణ్కుమార్కు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించామ ని చెప్పారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇటీవల సొంత బావపైన జరిగిన దాడి కేసులో కిరణ్కుమార్పై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు. భారతీయ వారసత్వ సంపద అమూల్యం శ్రీకాకుళం కల్చరల్: ఇంటాక్ శ్రీకాకుళం చాప్టర్ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళంలోని డచ్ భవనం వద్ద ప్రపంచ వారసత్వ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ భారతీయ వారసత్వ సంపదను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇంటాక్ కన్వీనర్ నూక సన్యాసిరావు మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం న్యూఢిల్లీ ఇంటాక్ సంస్థ పంపిన శాశ్వత సభ్యత్వాన్ని కన్వీనర్ చేతుల మీదుగా జగన్మోహనరావుకు అందించారు. కార్యక్రమంలో సహాయ ఇంటాక్ సహాయ కన్వీనర్ వి.జగన్నాథంనాయుడు, నటుకుల మోహన్, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019