Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
సాక్షి, నెట్వర్క్: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన 200 కుటుంబాలు టీడీపీని వీడి మంగళవారం గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాయి. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి నుంచి టీడీపీకి చెందిన పలువురు యువత తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీపార్వతి, మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. విస్సన్నపేట మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు మీసాల సత్యనారాయణ తిరువూరు ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లగట్ల స్వామిదాసు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. విజయవాడ అజిత్సింగ్నగర్కి చెందిన టీడీపీ మైనార్టీ నేతలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి సమక్షంలో పార్టీలో చేరారు. విజయవాడ టీడీపీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ బాజీ ఆధ్వర్యంలో 50 మంది ముస్లీం మైనార్టీ నేతలు, మహిళలు పార్టీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు బిళ్లు కృష్ణమూర్తి కుమారులైన బిళ్లు బ్రదర్స్గా పిలువబడే బిళ్లు నర్సింహరావు, బిళ్లు అన్నవరం, యర్రంశెట్టివారిపాలెం గ్రామం పూతినీడివారిపాలెంలో జనసేన, టీడీపీల నుంచి పలువురు ఎమ్మెల్యే ప్రసాదరాజు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పాలకొల్లులోని 18వ వార్డు బెత్లహాంపేటలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాలు, యలమంచిలి మండలంలోని అడవిపాలెం పంచాయతీ గగ్గిపర్రుకు చెందిన టీడీపీ, జనసేన నేతలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి సమక్షంలో పార్టీలో చేరారు. భీమవరానికి చెందిన జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు, 100 మందికిపైగా నాయి బ్రాహ్మణులు, చిన ఆమిరం, భీమవరంలోని అప్పారావు తోట, నరసయ్య అగ్రహారం ప్రాంతాలకు చెందిన 50 మంది క్షత్రియులు, భీమవరం 18వ వార్డుకు చెందిన ముస్లిం సోదరులు వార్డు మాజీ కౌన్సిలర్ కోడె యుగంధర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైఎస్సార్పీలో చేరారు. ఏలూరు జిల్లా సీతంపేటలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఎంపీ కోటగిరి శ్రీధర్ సమక్షంలో సీతంపేట జనసేన నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సమక్షంలో గణపవరం మండలం పిప్పర గ్రామానికి చెందిన పలువురు టీడీపీ, జనసేన నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. నంద్యాలలోని 36వ వార్డు సంజీవనగర్ ఏరియా నుంచి 200 కుటుంబాలు మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరాయి. -
No Headline
పిన్నెల్లి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన జనసందోహంమాచర్ల రూరల్: మాచర్ల మహాసంద్రంగా మారింది. మండుటెండను లెక్కచేయక నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. పట్టణంలోని వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాచర్ల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్, నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎ.శ్యాం ప్రసాద్కు నామినేషన్ పత్రాలను అందజేశారు. పిన్నెల్లి వెంట సోదరి జవ్వాజి నాగమణి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధానకార్యదర్శి మరుమాముల శ్రీనివాసశర్మ, సీనియర్ న్యాయవాది చిలంకూరి నాగిరెడ్డి, మారం వెంకటేశ్వరరావు (లడ్డూ)లు ఉన్నారు. ఆలయాల్లో పూజలు మాచర్ల: ఉదయం రింగురోడ్డులోని ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్కే ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు మూడు గంటల సేపు దేవాలయం వద్ద వేచి ఉండి వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి పోలుబోయిన అనిల్కుమార్ యాదవ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, సీనియర్ నాయకులు కొమ్మారెడ్డి చలమారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యెనుముల మురళీధర్రెడ్డిలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత దేవాలయం నుంచి వేలాది మంది పీఆర్కే వెంట సాగారు. రింగురోడ్డు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు రోడ్డుకు ఇరువైపులా మహిళలు, రైతులు, యువకులు, వైఎస్సార్సీపీ నాయకులు కేరింతలు కొడుతూ బారులు తీరారు. పార్కు సెంటర్కు చేరుకునే ముందు అతిథులందరికీ భారీ క్రేన్లతో గజమాలలు వేసి సత్కరించారు. వేలాది మందితో పట్టణమంతా కిక్కిరిసిపోయింది. ఎటుచూసిన వైఎస్సార్సీపీ ప్రభంజనం కనబడింది. కార్యక్రమంలో అన్నీ మండలాల ప్రజా ప్రతినిధులు, మార్కెట్ యార్డు చైర్మన్లు, మాజీ చైర్మన్లు, రాష్ట్ర డైరెక్టర్లు, జెడ్పిటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు భారీ స్థాయిలో పాల్గొన్నారు.పీఆర్కే నామినేషన్ దాఖలు -
No Headline
చిలకలూరిపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్నాయుడు నామినేషన్ దాఖలు సందర్భంగా సోమవారం నిర్వహించిన ర్యాలీ చిలకలూరిపేటలో నూతన అధ్యాయనానికి నాంది పలికింది. చిలకలూరిపేట చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నియోజవర్గం నుంచి తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కిలోమీటర్ల మేర జనసంద్రంగా మారింది. వైఎస్సార్ సీపీ శ్రేణులు పార్టీ పతాకాలు చేతపట్టి కదం తొక్కారు. పట్టణంలోని బ్యాంకుకాలనీలో ఉన్న పార్టీ కార్యాలయం నుంచి ఉదయం 9.45 గంటలకు ర్యాలీ ప్రారంభమైంది. ప్రచార రథం పైనుంచి ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్నాయుడు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, పార్టీ నాయకులు విడదల గోపీనాథ్, జ్ఞానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ షేక్ జాన్సైదా తదితరులు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. నరసరావుపేట సెంటర్, భాస్కర్ సెంటర్, చౌత్రా సెంటర్, రూరల్ పోలీస్స్టేషన్ రోడ్డు, కళామందిర్సెంటర్, గడియార స్తంభం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు చేరుకుంది. తీన్మార్ వాయిద్యాల నడుమ కార్యకర్తలు సందడి చేశారు. అడుగడునా భవనాలౖపై నుంచి మహిళలు, అభిమానులు పూల వర్షం కురిపించారు. మహిళలు ప్రచారరథంపై ఉన్న నాయకులకు గుమ్మడికాయలతో దిష్టితీసి, హారతులు పట్టి జయం కలగాలని ఆకాంక్షించారు. సుగా లి మహిళలు సంప్రదాయ వస్త్రాలంకరణతో వచ్చి పాటలు పాడి నృత్యం చేశారు. నామినేషన్ ర్యాలీ జైత్రయాత్రలా కొనసాగింది. ముందుగా పట్టణంలోని బ్యాంకు కాలనీలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజల్లో కావటి మనోహర్నాయుడు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్నాయుడుకు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ లాలూపురం రాము, గుంటూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తదితరులు కలసి అభినందనలు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న కావటి మనోహర్ నాయుడు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.నారదమునికి అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గొంటు శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు బీపీ నాయుడు, బైరా వెంకటకృష్ణ, బొంతు నాగిరెడ్డి, తాళ్ల అంజిరెడ్డి, పఠాన్ తలహాఖాన్, గుత్తా యాములయ్య, ఘంటా శంకర్, మద్దూరి కోటిరెడ్డి, ఏవీఎం సుభాని, ముస్లిం కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ దరియావలి, మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గాదె సుజాత, పార్టీ వివిధ విభాగాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కావటి నామినేషన్ దాఖలు -
వినుకొండలో జన ప్రవాహం
వినుకొండ(నూజెండ్ల): వినుకొండకు జన ప్రవాహం తరలివచ్చింది. వినుకొండ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నామినేషన్ సందర్భంగా 50 వేల మందికి పైగా అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో పట్టణంలోని ప్రధాన కూడళ్లు కిక్కిరిసిపోయాయి. బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ యర్రం వెంకటేశ్వరరెడ్డి, యువ నాయకుడు గిరిబాబులతో కలసి సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వరదా సుబ్బారావుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. తొలుత గుంటి ఆంజనేయస్వామి దేవాలయం, పెద్దమసీదు, ఇమ్మానుయేలు తెలుగు బాప్టిస్ట్ చర్చిలో సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం కారంపూడి రోడ్డులోని బొల్లా కన్వెన్షన్ హాల్ వద్ద నుంచి కుటుంబసభ్యులు బొల్లా ఆదిలక్ష్మి, గిరిబాబులతో కలిసి ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీ బొల్లా కన్వెన్షన్ హాల్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది. కర్ణాటక కళాకారుల ప్రత్యేక నృత్యాలు, డీజే సౌండ్ల హోరు మధ్య ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. ఈపూరు, బొల్లాపల్లి, శావల్యాపురం, నూజెండ్ల, వినుకొండ రూరల్, వినుకొండ టౌన్ నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం విశేషం. రహదారి పొడవున బిల్డింగ్లపై నుంచి ప్రజలు అభివాదం చేస్తూ ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. ప్రధాన సెంటర్లలో మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీసి శుభాకాంక్షలు తెలియజేశారు. ర్యాలీ శివయ్య స్థూపం సెంటర్ వద్దకు రాగానే నాలుగువైపులా రహదారులు ఇసుకేస్తే రాలనంతగా జనం ఎండను సైతం లెక్క చేయకుండా మధ్యాహ్న సమయంలో కూడా కిక్కిరిసిపోయారు. శివయ్య స్థూపం సెంటర్లో 10 భారీ క్రేన్లతో భారీ గజమాలలు ఎమ్మెల్యేకు వేసి అభిమానులు ప్రత్యేక అభిమానం చాటుకున్నారు. కార్యకర్తల త్యాగాలను మరువలేను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ కార్యకర్తలు చూపిన అభిమానం, ఆదరణ, వారి త్యాగాలను మరువలేనిదన్నారు. మండుటెండలో సైతం తనపై ప్రేమ, అభిమానాలు చూపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటానని, టీడీపీ నాయకులు బెదిరింపులకు భయపడమని అన్నారు. కార్యకర్తల కష్టం ఊరికే పోదని, మరలా మనమే అధికారంలోకి వస్తామని అన్నారు. వినుకొండ అభివృద్ధికి టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారని అన్నారు. లక్ష మంది ప్రజలకు తాగునీరు ఇవ్వాలని నేను సంకల్పిస్తే, సింగరచెరువుకు నీరు రాకుండా అడ్డుకోవడం టీడీపీ వారికే చెల్లిందని అన్నారు. వరికపూడిశెల ప్రాజెక్టు తమ హయాంలోనే పూర్తిచేస్తామన్నారు. టీడీపీ నాయకులు గ్రామాల్లో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని, ఎవరూ భయపడవద్దని తమ ప్రాణాలైనా అడ్డువేసి కాపాడతానని అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహాయసహకారాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి బొల్లా నామినేషన్ -
వైఎస్సార్ సీపీ అభ్యర్థి నంబూరు నామినేషన్
పెదకూరపాడు: వైఎస్సార్ సీపీ పెదకూరపాడు అసెంబ్లీ అభ్యర్థి నంబూరు శంకరరావు నామినేషన్ జన జాతరను తలపించింది. మండుటెండనూ లెక్క చేయకుండా వృద్ధులు, మహిళలు, చిన్నారులు, యువకులు తరలివచ్చారు. కాలచక్ర రోడ్డు జన సంద్రమైంది. తొలుత తన ఇంటి నుంచి ఉదయం 8 గంటలకు శంకరరావు బయలుదేరారు. శంకరరావుకు భార్య వసతంకుమారి, కుటుంబ సభ్యులు గుమ్మడి కాయలతో హారతి పట్టి విజయతిలకం దిద్దారు. ఆయన కుటుంబ సభ్యులతో కలసి తుళ్లూరు మండలం పెద్ద పరిమిలోని తమ ఇష్టదైవమైన సాయిబాబా, ఆంజనేయస్వామిలకు పూజలు నిర్వహించారు. చర్చికి వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం అభిమానులతో కలసి అమరావతి మండలం 14వ మైలు వద్దకు చేరుకుని అక్కడ నుంచి ర్యాలీగా అమరావతి, 75త్యాళ్లూరు మీదగా పెదకూరపాడులోని ఆర్వో కార్యాలయానికి చేరుకోని ఆర్వో కందుల శ్రీరాములుకు నామినేషన్ పత్రాలు అందించారు. అంతకు ముందు శంకరరావు సతీమణి వసంతకుమారి, కుమారుడు కళ్యాణ్ చక్రవర్తిలు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాలచక్ర రోడ్డు జనమయం అమరావతి–పెదకూరపాడు కాల చక్ర రోడ్డు జనంతో నిండిపోయింది. అమరావతి, లింగాపురం, బలుసుపాడు, పరస, 75త్యాళ్లూరు, అబ్బరాజుపాలెం, పెదకూరపాడు గ్రామాల గుండా ర్యాలీ సాగింది. 75త్యాళ్లూరు వద్ద అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. అమరావతిలోని అంబేడ్కర్ విగ్రహానికి శంకరరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అభివృద్ధి చేసి చూపించా.. గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి చేసి చూపించానని.. అందుకే ధైర్యంగా ఓటు అడుగుతున్నానని వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి నంబూరు శంకరరావు అన్నారు. టీడీపీ ఎన్ని కూటములు కట్టినా పెదకూరపాడులో పార్టీ విజయం ఖాయమని పేర్కొన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే వారికి మద్దతు ఉంటుందనేందు కు నామినేషన్కు హాజరైన ప్రజలే సాక్ష్య మని అన్నారు. కృతజ్ఞతలు తెలిపారు. అత్యధిక మోజార్టీతో గెలుపు తథ్యం పెదకూరపాడులో ముందే శంకరరావు గెలుపు కనిపిస్తోందని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం అన్నారు. క్రోసూరు, సత్తెనపల్లి మార్కెట్ యార్డు చైర్మన్లు ఈదా సాంబిరెడ్డి, పెండెం బాబురావు పాల్గొన్నారు.ఇది విజయోత్సవ ర్యాలీ శంకరరావు నామినేషన్కు వచ్చిన జనవాహిని చూస్తే ఇది నామినేషన్ పర్వం కాదు, శంకరరావు విజయోత్సవంగా కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ నాయకులు వంగవీటి నరేంద్ర అన్నారు. ఇంత జనాన్ని చూస్తే టీడీపీకి డిపాజిట్లు కూడా వచ్చేలా కనిపించడం లేదన్నారు. అభివృద్ధికి మారుపేరుగా జగనన్న, శంకరన్న నిలిచారన్నారు.పెదకూరపాడులో ఫ్యాన్ ప్రభజనం ఇప్పుడే కనిపిస్తోందన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019