breaking news
Ad - Sakshi_Home_Sticky
-
యార్డుకు 78,281 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 78,281 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 75,376 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.8,500 నుంచి రూ.18,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి రూ.20,700 వరకు లభించింది. తాలు రకం మిర్చికి రూ.5,000 నుంచి రూ.11,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 63,168 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఇన్చార్జి కార్యదర్శి కాకుమాను శ్రీనివాసరావు తెలిపారు. వేసవి దృష్ట్యా రైతులు సహకరించాలని కోరారు. -
ఎన్నికలకు పోలీసు ఏర్పాట్లు సంతృప్తికరం
ఎన్నికల కంట్రోల్రూమ్ను పరిశీలించిన అబ్జర్వర్, డీఐజీ అజిత్సింగ్ నరసరావుపేట: పల్నాడు జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికలకు చేపడుతున్న ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని ఎన్నికల పోలీస్ అబ్జర్వర్, డీఐజీ అజిత్సింగ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎలక్షన్ కంట్రోల్ రూమ్ సందర్శించి ఎన్నికల కమిషన్ నిబంధనలను పటిష్టంగా అమలు పర్చేందుకు జిల్లా పోలీసులు తీసుకున్న చర్యలను పరిశీలించారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా జిల్లాలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా వెంటనే ఎస్పీ దృష్టికి తీసుకువచ్చి త్వరితంగా పరిష్కరించేందుకు వీలుగా ఎలక్షన్ కంట్రోల్ రూము ఏర్పాటు చేశారని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా శాంతిభద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఓటర్లు, ప్రజలు ఎలక్షన్ కంట్రోల్ రూమ్కి ఫిర్యాదు చేయవచ్చునని, ఫిర్యాదులపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఐజీ, జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. నరసరావుపేట మండలంలోని జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూములను పరిశీలించారు. అక్కడ పోలీసులు చేపట్టిన భద్రత చర్యల పట్ల డీఐజీ సంతృప్తి వ్యక్తంచేశారు. ఎన్నికల సమయంలో ఈవీఎంల తరలింపు, ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు ముగిసేంతవరకు పై అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ అప్రమత్తంగా ఉంటూ ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని డీఐజీ కోరారు. -
నేడు క్రోసూరుకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, నరసరావుపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు రానున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి (తహసీల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు)లో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే బహిరంగసభలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలనుద్దేశించి జగన్ ప్రసంగించనున్నారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతమైన రీతిలోనే క్రోసూరు సభను సక్సెస్ చేసేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి జిల్లాలో జరపనున్న పర్యటన వైఎస్సార్సీపీ అభిమానుల్లో జోష్ నింపనున్నది. మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు సమాయత్తం కానున్నారు. ఏర్పాట్లు పరిశీలించిన తలశిల రఘురాం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బహిరంగసభ ఏర్పాట్లను గురువారం సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పర్యవేక్షించారు. ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, పార్టీ యువనాయకులు నంబూరు కళ్యాణ్ చక్రవర్తిలు క్రోసూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో సీఎం హెలిప్యాడ్కు అనువైన స్థలంగా గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలపై ఏర్పాట్లు చూస్తున్న సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. తరువాత క్రోసూరు మెయిన్రోడ్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డులో బహిరంగసభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. కట్టుదిట్ట భద్రత సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసులు కట్టుదిట్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ బింధుమాదవ్ సీఎం హెలిప్యాడ్ ఏర్పాటుచేసిన గ్రౌండ్, బహిరంగసభ జరిగే ప్రాంతాలను పరిశీలించారు. బారికేడ్లు ఏర్పాటు తదితర విషయాలపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. హెలిప్యాడ్ నుంచి సభ వరకు సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో పట్టిష్ట బందోబస్తు చేయనున్నారు. మెయిన్ రోడ్డుకు ఇరువైపులా భారీ భవంతులను ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎస్పీ పోలీసు సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీలు రాఘవేంద్ర, లక్ష్మీపతి, రామచంద్రరాజు, డీఎస్పీ, సీఐలు పాల్గొన్నారు. సీఎం సభను జయప్రదం చేయండి ఎమ్మెల్యే నంబూరుశంకరరావు. క్రోసూరు: క్రోసూరులో మెయిన్రోడ్డు (తహసీల్దార్ కార్యాలయంకు వెళ్లే ప్రధాన రోడ్డు ) పై శుక్రవారం మధ్యాహ్నం జరిగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతిఽనిధులు, మహిళలు, పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కోరారు. క్రోసూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సీఎం జగన్ పర్యటన వివరాలు వెల్లడించారు. పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో సహకరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రుణం తీర్చుకునే సమ యం వచ్చిందన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగసభ వైఎస్సార్సీపీ అభిమానుల జోష్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం ప్రోగ్రాం కోఆర్టినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం -
వృద్ధులను ఏడిపింఛెన్
సాక్షి, నరసరావుపేట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే ఇంటి ముంగిటికే వలంటీర్ల ద్వారా పింఛన్ సొమ్ము అందుకున్న అవ్వాతాతలు చంద్రబాబు తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయవద్దని ఈసీకి ఫిర్యాదు చేయడం, కోర్టు మెట్లు ఎక్కడంతో ఇంటింటికి పింఛన్ నగదు పంపిణీ ఆగిపోయింది. గత నెల వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా శాంతించని కూటమి పార్టీలు, వారి అనుకూలురు చేసిన పనితో ఈ నెలలో బ్యాంక్ ఖాతాలలో నగదు జమచేయమని ఎన్నికల సంఘం ఆదేశాల్చిన విషయం తెలిసిందే. దీంతో గడపదాటని పండుటాకులు మండుటెండలో కిలోమీటర్లు ప్రయాణించి బ్యాంక్ మెట్లెక్కె దుస్థితి దాపురించింది. గురువారం ఉదయం 8 గంటల నుంచే బ్యాంకుల ముందు బారులు తీరారు. దూర ప్రాంతాల నుంచి ఆటోల్లో ప్రయాణించడం, జనం ఎక్కువగా ఉన్నందున బ్యాంకుల వద్ద గంటల తరబడి వేచి ఉండటం, ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున అందుకు సరిపడ వసతులు అక్కడ లభించకపోవడంతో వృద్ధుల బాధలు మాటల్లో వర్ణించలేం. బ్యాంక్లో పింఛన్ లబ్ధిదారులతో కిక్కిరిసిపోవడంతో లోపల ఉండలేక బయట మండుటెండలో నిలబడలేక దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోయారు. మాకు ఈ పరిస్థితి కల్పించిన వారికి మా పాపం తగలకపోదా అంటూ శాపనర్ధాలు పెట్టారు. మినిమమ్ బ్యాలెన్స్ లేదని... ఐదేళ్లుగా ఇంటివద్దకే నగదు ఇస్తుండటంతో చాలా మంది వృద్ధుల బ్యాంక్ ఖాతాలు వినియోగించలేదు. చాలా మంది ఖాతాలు లాక్ అయ్యాయని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. నానా అవస్థలు పడి బ్యాంక్కు చేరిన వారికి మీ ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని, ఆధార్ కార్డు, పాన్కార్డులు తీసుకుర మ్మని చెబుతుండటంతో వృద్ధులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరోవైపు కొందరి బ్యాంక్ ఖాతా లలో మినిమమ్ బ్యాలెన్స్ లేదని, రూ.500 కట్ అయ్యిందని, మిగిలిన రూ.2,500 విత్డ్రా చేసుకోవచ్చని బ్యాంక్ సిబ్బంది చెబుతున్నారు. ఐదేళ్లుగా రూ.3 వేల నగదు అందేదని, వీటితోనే తినడానికి, మందులకు, కరెంట్ బిల్లులు వంటివి కట్టుకునేవారమని, ఇప్పుడు రూ.500 తగ్గితే ఈనెల ఎలా గడిచేది అని వాపోతున్నారు. కొందరికి బయోమెట్రిక్కు వేలిముద్రలు పడక మరో ఇబ్బంది. తెల్లవారకముందే తలుపుతట్టి పింఛన్ ఇచ్చే వలంటీర్లపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కక్షకట్టారని, తమకు పింఛన్ పంపిణీ చేయకుండా అడ్డుకున్నారంటూ మండిపడుతున్నారు. వలంటీర్ల సేవలను అవమానించడం సిగ్గుచేటని చెబుతున్నారు. యడ్లపాడు: మండుటెండలో ఆధార్ జిరాక్స్ కోసం వెళ్తున్న వృద్ధురాలు ఈ ఫొటోలోని వృద్ధురాలి పేరు షేక్ సిలార్బీ. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల. ఈమె ప్రతి నెలా వృద్ధాప్య పింఛన్ తీసుకుంటుంది. ఇంటి వద్దకే వలంటీర్ తెచ్చి నగదు ఇచ్చేవారు. ఏ ఇబ్బంది తెలిసేదికాదు. చంద్రబాబు కుట్రతో ఈనెల పింఛన్ నగదు బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. మండుటెండలో ఆటోలో బ్యాంకుకు వెళ్లింది. బ్యాంకు వద్ద పడిగాపులు పడింది. దీనికితోడు ఆటో ఖర్చులు రూ.60అయ్యాయి ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం విలువ ఏంటో మాకు రెండు నెలలుగా తెలుస్తోంది. మరలా మా బిడ్డ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే కావాలయ్యా. లేదంటే మా బతుకులు చిధ్రమవుతాయి. మా బతుకులతో ఆడుకో మాకు చంద్రబాబు పెన్షన్పై ఆధారపడి జీవిస్తున్న మా లాంటి నిరుపేదలపై చంద్రబాబు నాయుడు కుట్రలు ఫలితంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. బ్యాంకుకు వెళితే వందలాది మంది పెన్షన్దారులు నిలబడి వేచి ఉన్నారు. నా వరకు ఎప్పటికీ వస్తుందో తెలియక తిరిగి ఇంటి ముఖం పట్టాను. తెల్లవారుజామునే మా గడపకు వచ్చి పెన్షన్లు తీసుకున్న మాకు ఇలాంటి దుస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. దీనంతటికీ కారణమైన చంద్రబాబుకు మా ఉసురు తగలకపోదు. పేదలపై పెత్తందార్ల పోకడలకు ఇలాంటి ఘటనలే నిదర్శనం. – అడుసుమల్లి పిచ్చయ్య, దుర్గి -
No Headline
మండుటెండలోనూ అభ్యర్థులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గాలలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గురువారం ప్రచారం ఉధృతం చేశారు. అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు ప్రచారం నిర్వహించారు. నరసరావుపేట పట్టణంలోని మైనార్టీలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్లలో ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహరనాయుడు ప్రచారం నిర్వహించారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019