Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
‘మాదిగలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ’
హుజూరాబాద్: మాదిగల రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ నమ్మించి ద్రోహం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ అన్నారు. సోమవారం రాత్రి హుజురా బాద్లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. మాట ఇచ్చి మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఆరితేరిందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మూడు,నాలుగు సీట్లు రావాల్సి ఉండగా ఒకటి కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. రెడ్డిలకు ఆరుసీట్లు, 50శాతం పైన ఉన్న బీసీలకు రెండు సీట్లు ఇచ్చారని అన్నారు. కేసీఆర్ నియంతృత్వంతో మాదిగలు నష్టపోయారని, అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఎవరూ ఓటు వేయద్దని సూచించారు. బీజేపీ తమ సమస్యలు పరిష్కరించేందుకు హామీ ఇచ్చిందని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీకే మద్దతు ఇచ్చామని అన్నారు. నాయకులు రుద్రారపు రామచంద్రం, మారెపల్లి శ్రీనివాస్, తునికి వసంత్, వెంకట్ స్వామి, డాక్టర్ తడికమళ్ల శేఖర్, బొరగల సారయ్య, రాజు పాల్గొన్నారు. ఏజీని కలిసిన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్కరీంనగర్క్రైం: రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్ జనరల్ బి.సుదర్శన్ రెడ్డిని కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ.రాజ్ కుమార్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందజేశారు. న్యాయవాదులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.2లక్షల ఇన్సూరెన్స్ను రూ.5లక్షలకు పెంచాలని, కొత్త సభ్యులకు హెల్త్కార్డులు ఇవ్వాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5వేల స్టైఫండ్ ఇవ్వాలని వినతిపత్రం అందించగా.. సానుకూలంగా స్పందించారు. మున్సిపల్ కాంట్రాక్టర్ల సంఘం కన్వీనర్గా మహేందర్కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం కన్వీనర్గా దగ్గు మహేందర్ రాకేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహేందర్ కన్వీనర్గా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. కాంట్రాక్టర్లకు సంబంధించిన సమస్యలను అధికారుల సహకారంతో పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మహేందర్ తెలిపారు. తన నియామకానికి సహకరించిన సహచర కాంట్రాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మేయర్ యాదగిరి సునీల్రావును మహేందర్ రాకేశ్ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు మర్యాదకపూర్వకంగా కలిశారు. మహేందర్కు మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. -
కాంగ్రెస్కు ఓటేసి గోసపడుతున్రు..
కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసినందుకు ఇప్పుడు ప్రజలందరూ గోసపడుతున్నారని, ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఆగమైతరని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మల్యాలలో సోమవా రం రాత్రి రోడ్షో చేపట్టారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అంగడి బజార్లో వినోద్ మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ బడి తేలే.. గుడి తేలేదని, ఐదేళ్లలో కనీసం ఐదు రూపాయలు తేలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు 23 నవోదయ పాఠశాలలు రావాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఓట్ల కోసం బండి సంజయ్ వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్ ఆయనకు పునరావాసమా..? అని ప్రశ్నించారు. తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గారడీ మాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని, నాలుగు నెలల్లోనే రాష్ట్రప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారని తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత హక్కుల కోసం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక కావాలని, ఇందుకు వినోద్కుమార్ను గెలిపించుకోవాలని కోరారు. ఇవి చదవండి: నేను.. పక్కా లోకల్ -
అశ్వవాహనంపై రామయ్య
ఇల్లందకుంట: అపరభద్రాద్రి ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరా మనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధాన అర్చకుడు శేషం రామాచార్యులు, అర్చకుడు శేషం వంశీధరచార్యులు మంత్రోచ్ఛారణ మధ్య స్వామివార్లను ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం తెప్పోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈవో కందుల సుధాకర్, సురేందర్రెడ్డి, కడారి కుమారస్వామి, కొత్త శ్రీనివాస్, పెద్దికుమార్ పాల్గొన్నారు. -
ఎకరాకు రూ.14 వేల బోనస్ ఎందుకివ్వడం లేదు?
కరీంనగర్ టౌన్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్వింటాల్ వడ్లకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఈ లెక్కన ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల వడ్లకు రూ.14 వేల చొప్పున బోనస్ ఎందుకివ్వడం లేదని బీజేపీ జాతీయ ప్రధా న కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీల మేరకు తాలు, తరుగు, తేమతో పనిలేకుండా వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్కు చెందిన తాజా, మాజీ సర్పంచులు పలువురు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సంజయ్ మాట్లాడు తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో సర్పంచుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. మోదీ ప్రభు త్వం పంచాయతీలకు నిధులివ్వడంతోనే సిబ్బందికి జీతాలిస్తున్నారని తెలిపారు. దేశమంతా మోదీ గాలి వీస్తుందని, తొలివిడతలోనే 102 ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నట్లు జోస్యం చెప్పారు. -
కంగ్రాట్స్.. సహన
● సివిల్స్ ర్యాంకర్కు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ‘మారం’ అభినందన కరీంనగర్ అర్బన్: సివిల్స్లో ర్యాంకు సాధించిన కొలనుపాక సహనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని టీఎన్జీవో భవనంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో సివిల్స్లో కరీంనగర్ యువత సత్తా చాటుతోందని హర్షం వ్యక్తం చేశారు. సహన సివిల్స్లో ప్రతిభ చాటడం అభినందనీయమని కొనియాడారు. దారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ సహన మంచి అధికారిగా సేవలందించి కరీంనగర్ పేరును చిరస్థాయిగా నిలపాలని ఆకాంక్షించారు. టీఎన్జీవోల జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, నాగుల నరసింహస్వామి, అసోసియేట్ అధ్యక్షుడు రాగి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్రెడ్డి, మహిళా జేఏసీ చైర్పర్సన్ ఇరుమల్ల శారద, సబిత, సునీత, శైలజ, సుస్మిత, అర్బన్ అధ్యక్షుడు సర్దార్ హర్మిందర్ సింగ్, రూరల్ అధ్యక్షుడు మారుపాక రాజేశ్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంతరావు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019