Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మరో 14 రోజులపాటు పొడిగిస్తూ మంగళవారం న్యాయమూర్తి కావేరి బవేజా ఆదేశాలు జారీ చేశా రు. మరోవైపు, బెయిల్ కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై ఈడీ వాదనలు వినిపించింది. కుంభకోణంలో కవిత పాత్రను ధర్మాసనానికి వివ రించింది. కవితను అధికారులు వర్చువల్గా న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలన్న ఈడీ విజ్ఞప్తితో న్యాయమూర్తి ఏకీభవించారు. మే 7న ఉదయం ఆమెను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తి విచారణ బుధవారానికి వాయిదా వేశారు. సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పాం.. ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తూ కీలకపాత్ర పోషించిన కవితకు బెయిలు నిరాకరించాలని కోరారు. కవిత అరెస్టు విషయంలో చట్టవిరుద్ధంగా, కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని స్పష్టంచేశారు. కవితను అరెస్టు చేయబోమని ఎక్కడా అండర్టేకింగ్ ఇవ్వలేదని, సమన్లు ఇవ్వబోమని మాత్రమే చెప్పామన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. ఈడీ పరిధి దేశమంతా ఉంటుందని, అందుకే కవిత అరెస్టు విషయంలో ట్రాన్సిట్ ఆర్డర్ అవసరం రాలేదన్నారు. అరెస్టు ప్రక్రియ చట్టబద్ధంగానే జరిగిందని, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఉపసంహరణే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ కేసులో పలువురి వాంగ్మూలాల ఆధారంగానే కవిత పాత్రపై స్పష్టత వచ్చిదని ఆ తర్వాతే అరెస్టు చేశామన్నారు. అరుణ్ పిళ్లై ద్వారా వాటా కలిగి ఉన్నారు.. ఇండో స్పిరిట్స్లో 33.5 శాతం వాటాను తన ప్రాక్సీ అరుణ్ పిళ్లై ద్వారా కవిత కలిగి ఉన్నారని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. హోల్సేలర్లకు కమీషన్లు పెంచుతూ మద్యం విధానంలో మార్పులు చేసి సౌత్గ్రూప్నకు అనుకూలంగా మారేలా ఒప్పందం జరిగిందని, కుంభకోణంలో రూ.100 కోట్లు లావాదేవాలు జరిగాయన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆమె ఆదేశాల మేరకే రూ.25 కోట్లు ఇచ్చారని, ఈ మేరకు వారిద్దరూ వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఆప్ నేత కేజ్రీవాల్, కవిత మధ్య కుదరిన ఒప్పందం మేరకే రూ.100 కోట్లు ఆమ్ ఆద్మీ పారీ్టకి ఇచ్చారని మరో నిందితుడు దినేష్ ఆరోరా తన వాంగ్మూలంలో చెప్పారన్నారు. నగదు లావాదేవీలకు సంబంధించి కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ చాట్లోనూ సమాచారం లభ్యమైందని పేర్కొన్నారు. ఆర్థిక నేరాల్లో నగదుకు సంబంధించి ఆధారాలు దొరకడం చాలా కష్టమన్నారు. నిందితుల వాంగ్మూలాలు, సాక్ష్యాల ఆధారంగా కోర్టులు తీర్పులిచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఈ కేసులో సూత్రధారి, పాత్రధారి అయిన కవితకు సంబంధించి పలు సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కోర్టుకు తెలిపారు. -
ఈదురుగాలుల ఎఫెక్ట్.. కూలిన వంతెన
టేకుమట్ల/మహాముత్తారం/ముత్తారం(మంథని): జయశంకర్ భూపాలపల్లి–పెద్దపల్లి జిల్లాను అనుసంధానం చేస్తూ ఓడేడ్ – గర్మిళ్లపల్లి మధ్య మానేరుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు కూప్పకులాయి. సోమవారం రాత్రి వీచిన బలమైన గాలుల ధాటికి పియర్లపై అమర్చిన మూడు గడ్డర్లు ఒక్కసారిగా కిందపడ్డాయి. 2016 ఆగస్టు 4న రూ.47.4కోట్ల అంచనా వ్యయంతో 40 మీటర్ల పొడవున 24 పియర్లతో వంతెన నిర్మాణం ప్రారంభించారు. నాటినుంచి ఈ అంతర్ జిల్లా వంతెన నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు సగం గడ్డర్లు కూడా పూర్తి కాలేదు. కాగా, సోమవారం రాత్రి బలమైన గాలులకు రెండు, మూడు పియర్లపై అమర్చిన మూడు గడ్డర్లు విరిగి నేలమట్టమయ్యాయి. సిమెంట్ దిమ్మెలకు బదులు కర్రలు పెట్టి గడ్డర్లు బిగించడంతో వర్షానికి తడిసి నానిపోయి మానేరులో నిర్మించిన తాత్కాలిక రోడ్డుపై అవి కూలిపోయాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ రోడ్డుపై పగలు వందలాదిమంది ప్రయాణాలు సాగిస్తుంటారనీ, వంతెన గడ్డర్లు పగలు కూలి ఉంటే ఊహించని ప్రాణనష్టం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మరో ఐదు గడ్డర్లు కూలేందుకు సిద్ధం నంబర్ 2, 3 పియర్ల మధ్య ఓ వైపు ఉన్న మూడు గడ్డర్లు కూలిపోగా, మరో పక్క రెండు ఒంగడంతో కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే 23, 24 పియర్లపైనున్న మరో మూడు గడ్డర్లు కూడా ఒక వైపునకు ఒంగి కూలే పరిస్థితిలో ఉన్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే: ఎస్ఈ ఆర్ అండ్ బీ జగిత్యాల ఎస్ఈ చందర్సింగ్, ఈఈ రాములు, గోదావరిఖని ఏసీపీ రమేశ్ మంగళవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్ఈ చందర్సింగ్ మాట్లాడుతూ, బలమైన గాలుల ధాటికి వంతెనలు కూలవని, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ఇది కూలిందన్నారు. విచారణ చేపడతాం: మంత్రి శ్రీధర్బాబు గత ప్రభుత్వంలో చేపట్టిన బ్రిడ్జిల నిర్మాణాల నాణ్యత ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, మొన్న కాళేశ్వరం నేడు ఓడేడ్ వంతెన కూలిపోవడమే నిదర్శనమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మహాముత్తారం ప్రచారానికి వచ్చిన ఆయన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు. కలకాలం ఉండాల్సిన బ్రిడ్జి కడుతుండగానే గాలికి కూలిపోవడం దారుణమన్నారు. ఇలాంటి నిర్మాణాలు నిర్మించిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టి, సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకునే విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. -
రుణమాఫీ చేస్తా.. బీఆర్ఎస్ రద్దు చేస్తావా?: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, నాగర్కర్నూల్/కోస్గి/మద్దూరు: ‘జోగుళాంబదేవి సాక్షిగా మాట ఇస్తున్నా.. ఆగస్టు 15లోపు ఆరునూరైనా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా. అదే రోజు నువ్వు, నీ మామ బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? నా రాజీనామా కాదు. నీ పార్టీ రద్దుకు సిద్ధంగా ఉండండి’అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే మాజీమంత్రి హరీశ్రావు తన సవాలును స్వీకరించాలని చెప్పారు. మంగళవారం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారా యణపేట జిల్లా మద్దూరులో నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం, అనంతరం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలకేంద్రంలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర భారీ బహిరంగసభలో సీఎం మాట్లాడారు. ‘ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి తీరుతానని, రేవంత్రెడ్డి మాట ఇస్తే ఎలా ఉంటూందో నీ మామ కేసీఆర్ను అడుగు..ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి రాష్ట్రంలో రూ.3,900 కోట్ల లోటు బడ్జెట్లో ఉందని, పదవి తీసుకున్న నాలుగు నెలల్లో నీ మామ చేసిన లక్షల కోట్ల అప్పులకు రూ. 26వేల కోట్ల కిస్తీలు చెల్లిస్తూ.. ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నాం. కావాలంటే లెక్కలతో సహా నీకు, నీ మామకు చూపడానికి మేము సిద్ధంగా ఉన్నాం’అంటూ తనదైన శైలిలో మాజీ మంత్రి హరీశ్రావుపై మండిపడ్డారు. రుణమాఫీతోపాటు వచ్చే పంటకే వరికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పారు. దొంగలకు సద్ది మోస్తున్నరు.. పాలమూరు నుంచి ఎంపీగా గెలిచిన కేసీఆర్ తెలంగాణ ఏర్పడి అధికారంలోకి వచ్చి పదేళ్లలో ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు. కుర్చీ వేసుకొని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి ఫామ్హౌస్లో పడుకున్నాడని చెప్పారు. పగోడి చేతులో చురకత్తులుగా మారి, ఇక్కడి నాయకులు దొంగలకు సద్ది మోస్తున్నారని మండిపడ్డారు. తమను రేవంత్రెడ్డి తిడుతున్నారని అరుణమ్మ, ఆర్ఎస్.ప్రవీణ్కుమార్ అంటున్నారని.. వారితో తనకేం తగాదా, పంచాయితీ లేదన్నారు. గతంలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సుముఖంగా ఉన్నప్పుటికీ మంత్రిగా ఉన్న డీకే.అరుణ నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరు రాకుండా ప్రాజెక్టులను అడ్డుకున్నది వాస్తవం కాదా.. మరోమారు నరేంద్రమోదీ చేతిలో చురకత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పోడుస్తున్నావంటూ ప్రశ్నించారు. 70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందని, ఈ ఐదేళ్లు రాజకీయాలకతీతంగా జెండాలు, ఎజెండాలు పక్కనబెట్టి ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో దేశంతో పోటీపడేందుకు తనకు సహకరించాలని కోరారు. అభివృద్ధి ఆలోచన చేయకుండా కాళ్లలో కట్టెలు పెట్టడం ధర్మమా? అని ప్రశ్నించారు. కేసీఆర్కు ఓటేస్తే.. మోదీకి అమ్ముకుంటడు.. ‘ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అంటే నాకు గౌరవం ఉంది. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కేసీఆర్ ఇబ్బందులు పెడితే మేం అండగా ఉన్నాం. ప్రజాజీవితంలోకి వచ్చి దొరలకు వ్యతిరేకంగా ప్రవీణ్కుమార్ పోరాటం చేశాడు. ఆరు నెలల్లో ఏం మారింది.. ఎందుకు కేసీఆర్ను నమ్ముతుండో సమాధానం చెప్పాలి. 4 కోట్ల మంది తిరస్కరించి కేసీఆర్కు గొయ్యి తవ్వితే, ఆ సమాధికి పూలదండలు వేసి భుజాలపై మోస్తున్నవు. ఎస్సీ వర్గీకరణ పేరుతో కేసీఆర్ పదేళ్లు మోసం చేశాడు. ఆయనతో చేరిన నువ్వు వర్గీకరణకు వ్యతిరేకమా? ఏనుగు తిరిగి దోమ దగ్గరకు ఎందుకు పోయిందో చెప్పాలి. దోమకు ఎంతపెద్ద తొండం ఉన్నా ఏనుగు అవుతుందా’అని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేసేందుకు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తామని నిర్ణయం తీసుకున్నామని, కానీ ఎందుకు తిరస్కరించారో తెలియదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రవీణ్కుమార్ డీజీపీ అయ్యేవారని, ముఖ్యమంత్రి స్థాయి పదవితో గౌరవించుకునే వారమని చెప్పారు. సన్’స్ట్రోక్ దెబ్బతో ఎంపీ రాములును ఆయన కొడుకు పదవి కోసం ఇంట్లో పెట్టి తాళం వేస్తే.. బీజేపీకి పోయి టికెట్ తెచ్చుకున్నాడని వ్యాఖ్యానించారు. కేసీఆర్కు ఓటేస్తే తిరిగి మోదీకే అమ్ముకుంటాడని, గత పదేళ్లలో ప్రతిసారి ఈ కేడీ మద్దతు పలికింది మోదీకే కదా అని వ్యాఖ్యానించారు. పాలమూరు అభివృద్ధి నా జీవితాశయం.. పాలమూరులో తనకు ఎవరూ శత్రువులు లేరని, తనకెవరూ పోటీ కాదని చెప్పారు. పాలమూరు జిల్లా అభివృద్ధి తన జీవిత ఆశయమన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఎన్ని కోట్లు ఖర్చయినా నాలుగున్నర ఏళ్లలోనే పూర్తిచేసే బాధ్యత తనదని స్పష్టం చేశారు. తమ అభ్యర్థులును ఎంపీలుగా గెలిపిస్తే ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తామన్నారు. ముదిరాజ్లను బీసీ–డీ నుంచి బీసీ–ఏ గ్రూపులోకి, వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే పని కోసం తనకు సహకారం అందించాలని రేవంత్రెడ్డి చెప్పారు. – మహబూబ్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆశీర్వదించి రేవంత్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన పాలమూరు ప్రజలు తనను కూడా ఎంపీగా ఆశీర్వదిస్తే.. ముఖ్యమంత్రికి సోదరుడిగా రేవంత్రెడ్డి గొంతుకనై ఢిల్లీలో పాలమూరు ప్రజల కోసం పోరాడుతానన్నారు. నాగర్కర్నూల్ అభ్యర్థి మల్లురవి మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు. ఆయా సమావేశాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, మనోహర్రెడ్డి, రాంమోహన్రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, రాష్ట్ర పోలీస్ హౌసింస్బోర్డు చైర్మన్ గురున్నాథ్రెడ్డి, మాజీమంత్రి చిత్తరంజన్దాస్ పాల్గొన్నారు. -
నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు అన్ని రకాల మేనేజ్మెంట్ల పరిధిలోని స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో స్కూళ్లకు మంగళవారమే చివరి పనిదినంగా ఉంది. ఈ సందర్భంగా మంగళవారం ఇటీవల ముగిసిన సమ్మెటివ్ అసెస్మెంట్–2 పరీక్షల ఫలితాలను స్కూళ్లలో ప్రకటించారు. -
దేవుళ్లపై ఒట్లు పెట్టుడు..కేసీఆర్ను తిట్టుడు.. ఏపీలో జగన్ మళ్లీ అధికారంలోకి
సాక్షి, హైదరాబాద్: ‘దేవుళ్ల మీద ఒట్లు.. కేసీఆర్ మీద తిట్లు’ అనే రీతిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు విమర్శించారు. కేసీఆర్ను బదనాం చేయడం ద్వారా పబ్బం గడుపుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మంగళవారం ఓ టీవీ చానల్కు సుదీర్ఘంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై కేసీఆర్ మాట్లాడారు. పదేళ్ల పాలనలో విద్యుత్, తాగునీటి రంగాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద కేవలం మేడిగడ్డ బ్యారేజీ మూడు పిల్లర్లలో ఏర్పడిన సమస్యను పరిష్కరించకుండా తనను అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోవడం తెలియని అసమర్థ ప్రభుత్వమని విమర్శించారు. తన కళ్ల ముందే తెలంగాణను నాశనం చేస్తానంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మోదీ పాప కృత్యానికి పాల్పడ్డారు ఢిల్లీ లిక్కర్ కేసు ప్రధాని మోదీ పొలిటికల్ స్కామ్లో భాగమని కేసీఆర్ పేర్కొన్నారు. తన కూతురు కవిత అరెస్టు ద్వారా మోదీ పాప కృత్యానికి పాల్పడ్డారని విమర్శించారు. లిక్కర్ కేసు నుంచి కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నుంచి పిడికెడు మంది నేతలు మాత్రమే బయటకు వెళ్లారని, కడియం శ్రీహరి రాజకీయంగా తనను తానే భూస్థాపితం చేసుకున్నాడని వ్యాఖ్యానించారు. రేవంత్ ఏక్నాథ్ షిండే అవుతాడని బీజేపీ నేతలు అంటున్నా ఆయన ఖండించడం లేదన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారతాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని తిరిగి టీఆర్ఎస్గా మార్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్పై చిల్లర ఆరోపణలు ఫోన్ ట్యాపింగ్ సీఎంకు సంబంధించిన వ్యవహారం కాదని, తనపై చిల్లర ఆరోపణలు చేస్తున్నారంటూ కేసీఆర్ కొట్టి పారేశారు. కేసీఆర్ ఇమేజీని డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం నెరవేరదని, ప్రజలు అన్నీ గమనించి బుద్ధి చెప్తారని అన్నారు. కాంగ్రెస్కు చెందిన కొందరు నాయకులు తమ పార్టీ నేతలతో టచ్లో ఉన్నారని, సందర్భాన్ని బట్టి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటును కొట్టి పారేయలేమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నేనే సీఎం అవుతా.. కేసీఆర్ ప్రజ్వలంగా, ఉజ్వలంగా రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి వస్తాడని, మళ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 98 స్థానాల్లో గెలుస్తుందని, తానే సీఎంను అవుతానని మాజీ ముఖ్యమంత్రి చెప్పారు. సమయం సందర్భాన్ని బట్టే నాయకులు తయారవుతారని, కేటీఆర్, హరీశ్రావు సహా ఎవరినీ తాను ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహించలేదని అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని, బీజేపీకి ఒక సీటుకు మించి వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఆంధ్రాలో ఎవరు గెలిచినా తమకు సంబంధం లేదని, ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు బాధలేదని పేర్కొన్నారు. అయితే వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే సమాచారం తమకు ఉందని కేసీఆర్ తెలిపారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019