Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
వర్క్స్పేస్కు డిమాండ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ కంపెనీలు తమ ఉద్యోగాలను భారత్కు అవుట్సోర్సింగ్ చేస్తుండటంతో దేశీయంగా ఆఫీస్ స్పేస్కు డిమాండ్ గణనీయంగా పెరిగిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఒక నివేదికలో తెలిపింది. 2023లో మొత్తం వర్క్ స్పేస్ లీజింగ్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), థర్డ్ పార్టీ ఐటీ సేవల సంస్థల వాటా 46 శాతంగా నమోదైందని వివరించింది. ‘ఆసియా పసిఫిక్ హొరైజన్: హార్నెసింగ్ ది పొటెన్షియల్ ఆఫ్ ఆఫ్షోరింగ్‘ రిపోర్టు ప్రకారం భారత్లో ఆఫ్షోరింగ్ పరిశ్రమ గణనీయంగా పెరిగింది. గ్లోబల్ ఆఫ్షోరింగ్ మార్కెట్లో 57 శాతం వాటాను దక్కించుకుంది. వ్యయాలను తగ్గించుకునేందుకు, నిర్వహణ సామరŠాధ్యలను మెరుగుపర్చుకునేందుకు కంపెనీలు తమ వ్యాపార ప్రక్రియలను లేదా సర్వీసులను ఇతర దేశాల్లోని సంస్థలకు అవుట్సోర్స్ చేయడాన్ని ఆఫ్షోరింగ్గా వ్యవహరిస్తారు. దీన్నే బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో)గా కూడా వ్యవహరిస్తారు. ఇందులో జీసీసీలు, గ్లోబల్ బిజినెస్ సర్వీసులు (జీబీఎస్) మొదలైనవి ఉంటాయి. కంపెనీలు వేరే ప్రాంతాల్లో అంతర్గతంగా ఏర్పాటు చేసుకునే యూనిట్లను జీసీసీలుగా వ్యవహరిస్తారు. నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు.. ► 2023లో ఆఫ్షోరింగ్ పరిశ్రమలో మొత్తం లీజింగ్ పరిమాణం 27.3 మిలియన్ చ.అ.గా నమోదైంది. క్రితం సంవత్సరంతో పోలిస్తే 26 శాతం పెరిగింది. జీసీసీలు 20.8 మిలియన్ చ.అ., థర్డ్ పార్టీ ఐటీ సేవల సంస్థలు 6.5 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ను లీజుకి తీసుకున్నాయి. ► భారత ఎకానమీకి ఆఫ్షోరింగ్ పరిశ్రమ గణనీయంగా తోడ్పడుతోంది. 2023లో మొత్తం సేవల ఎగుమతుల్లో దీని వాటా దాదాపు 60 శాతంగా నమోదైంది. సర్వీస్ ఎగుమతులు 2013లో 63 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023లో మూడు రెట్లు వృద్ధి చెంది 185.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆఫ్షోరింగ్ సేవలు అందించే గ్లోబల్ సంస్థల్లో 42 శాతం కంపెనీలకు భారత్లో కార్యకలాపాలు ఉన్నాయి. ► 2023 నాటికి దేశీయంగా జీసీసీల సంఖ్య 1,580 పైచిలుకు ఉంది. దేశీ ఆఫీస్ స్పేస్ లీజింగ్ లావాదేవీల్లో వీటి వాటా 2022లో 25 శాతంగా ఉండగా 2023లో 35 శాతానికి చేరింది. జీసీసీల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల వాటా గణనీయంగానే ఉన్నప్పటికీ తాజాగా ఆఫీస్ స్పేస్ లీజింగ్లో వృద్ధికి సెమీకండక్టర్లు, ఆటోమొబైల్, ఫార్మా తదితర రంగాలు కారణంగా ఉంటున్నాయి. ► రాబోయే దశాబ్ద కాలంలో ఆఫీస్ మార్కెట్కు జీసీసీలే చోదకాలుగానే ఉండనున్నాయి. 2030 నాటికి దేశీయంగా వీటి సంఖ్య 2,400కి చేరనుంది. -
రియల్ ఎస్టేట్ క్వీన్కు మరణశిక్ష.. ఈమె చేసిన నేరం ఏంటంటే..
వియత్నాం రియల్ ఎస్టేట్ క్వీన్కు ఆ దేశ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దేశంలోనే అతిపెద్ద ఆర్థిక మోసం కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త ట్రూంగ్ మై లాన్కు దక్షిణ వియత్నాంలోని హో చి మిన్ న్యాయస్థానం గురువారం మరణశిక్ష విధించిందని ఆ దేశ అధికార మీడియా థాన్ నీన్ తెలిపింది. ఇవీ అభియోగాలు వాన్ థిన్ ఫాట్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ అధినేత్రి అయిన 67 ఏళ్ల ట్రూంగ్ మై లాన్ 12.5 బిలియన్ డాలర్ల మోసానికి పాల్పడ్డారని ఆమెపై అభియోగాలు నమోదయ్యాయి. ఇది ఆ దేశ 2022 జీడీపీలో దాదాపు 3 శాతం. 2012 నుండి 2022 మధ్యకాలంలో ఆమె సైగాన్ జాయింట్ స్టాక్ కమర్షియల్ బ్యాంక్ను అక్రమంగా నియంత్రించి డొల్ల కంపెనీలు, ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వడం ద్వారా ఈ నిధులను కొల్లగొట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. వియత్నాంలో అవినీతి నిరోధక డ్రైవ్లో భాగంగా 2022 అక్టోబరులో లాన్ను అరెస్టు చేశారు. ఇది ఆ దేశంలో అత్యంత హై ప్రొఫైల్ అరెస్ట్లలో ఒకటిగా నిలిచింది. బ్లేజింగ్ ఫర్నేస్ పేరుతో ఎగిసిన ఈ అవినీతి వ్యతిరేక ప్రచార ఉద్యమం వియత్నాం రాజకీయాలలో సంచలనం సృష్టించింది. దీంతో అప్పటి వియత్నాం ప్రెసిడింట్ వో వాన్ థుంగ్ రాజీనామా చేశారు. లాన్ అరెస్ట్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. విలాసవంతమైన నివాస భవనాలు, కార్యాలయాలు, హోటళ్లు, షాపింగ్ సెంటర్లు వంటి ప్రాజెక్ట్లతో వీటీపీ కంపెనీ వియత్నాంలోని అత్యంత ధనిక రియల్ ఎస్టేట్ సంస్థలలో ఒకటి. వియత్నాంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతింది. 2023లో 1,300 ప్రాపర్టీ సంస్థలు మార్కెట్ నుండి ఉపసంహరించుకున్నాయని అంచనా. డెవలపర్లు కొనుగోలుదారులను ఆకర్షించడానికి డిస్కౌంట్లు, బంగారాన్ని బహుమతులుగా అందిస్తున్నారు. స్థానిక మీడియా ప్రకారం.. హో చి మిన్ నగరంలో షాప్హౌస్ల అద్దె మూడవ వంతు తగ్గినప్పటికీ, సిటీ సెంటర్లో చాలా వరకూ ఖాళీగానే ఉన్నాయి. -
గోద్రెజ్ ప్రాపర్టీస్ ధరఖాస్తు రిజెక్ట్ చేసిన రెరా
ప్రముఖ రియల్టీ సంస్థ గోద్రెజ్ ప్రాపర్టీస్కు భారీ షాక్ తగిలింది. గురుగ్రామ్, రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్స్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్ 2016కు అనుగుణంగా లేని కారణంగా గోద్రెజ్ ప్రాపర్టీస్ నిర్మాణ ప్రాజెక్ట్ల పొడిగింపు దరఖాస్తును రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తిరస్కరించింది. గోద్రెజ్ డెవలపర్ ప్రాజెక్ట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ను పొడిగించాలని కోరుతూ ఆ సంస్థ ప్రమోటర్లు రెరాకు దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తులో లైసెన్స్ పునరుద్ధరణ, త్రైమాసిక పురోగతి నివేదిక (క్యూపీఆర్)లో అందించిన బ్యాంక్ బ్యాలెన్స్కు సంబంధించిన వివరాల్లో లోపాలు తలెత్తాయి. ఆ లోపాల్ని సరిదిద్దాలని రెరా అనేక సార్లు గోద్రెజ్కు ఆదేశాలు చేసింది. అయితే, వాటిని సరిదిద్దడంలో సదరు నిర్మాణ సంస్థ ప్రమోటర్లు విఫలమయ్యారు. దీంతో తాజాగా గోద్రెజ్ డెవలపర్ల ప్రాజెక్ట్ పొడింపు ధరఖాస్తును రిజెక్ట్ చేసింది. గోద్రెజ్ ప్రాపర్టీస్ సెక్టార్ 85, గురుగ్రామ్లో గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్ గోద్రెజ్ ఎయిర్ ఫేజ్ 4 నిర్మాణాలు చేపడుతోంది. ఇందుకోసం రెరా నుంచి గోద్రెజ్ 2018 నుంచి 2023 వరకు రిజిస్ట్రేషన్ పొందింది. రిజిస్ట్రేషన్ తేదీ ముగియడంతో ప్రాజెక్ట్ను పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్ను పొడిగించాలని కోరుతూ గోద్రెజ్ ప్రాపర్టీస్ రెరా చట్టంలోని సెక్షన్ 6 కింద దరఖాస్తు చేసింది. దరఖాస్తును పరిశీలించిన రెరా.. ఆ దరఖాస్తులో అనేక లోపాలను గుర్తించింది. వాటిని సరిదిద్దాలని కోరింది. చివరికి తీరు మార్చుకోకపోవడంతో గోద్రెజ్ ప్రాపర్టీస్ దరఖాస్తును తిరస్కరించింది. -
కెనడాలో ప్రముఖ భారత సంతతి బిల్డర్ దారుణ హత్య
కెనడాలో భారత సంతతికి చెందిన ప్రముఖ బిల్డర్ బూటా సింగ్ గిల్ హత్యకు గురయ్యాడు. సోమవారం (ఏప్రిల్ 8) దుండగులు అతడిని కాల్చి చంపారు. ఎడ్మంటన్ లోని గురునానక్ సిక్కు ప్రార్థనామందిరం అధ్యక్షుడు ఉన్నారు.సివిల్ ఇంజనీర్ సరబ్జీత్ సింగ్ అనే మరో వ్యక్తి కూడా కాల్పులు జరిపారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్తితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అల్బెర్టా ప్రావిన్స్లోని మిల్వుడ్ రెక్ సెంటర్ సమీపంలో గిల్ వ్యాపారానికి సంబంధించిన నిర్మాణ స్థలంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. గిల్ హత్య స్థానిక వ్యాపారులను దిగ్భ్రాంతికి గురి చేసింది. పార్లమెంటు సభ్యుడు టిమ్ ఉప్పల్, మేయర్ అమర్జీత్ సింగ్ సోహి, రేడియో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మణిందర్ గిల్, గురుశరణ్ సింగ్ బటర్ లాంటి ప్రముఖులు బాధిత కుటుంబాలకు తమ సంతాపాన్ని , సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ ప్రదేశంలో ముగ్గురువ్యక్తులమధ్య వాగ్వాదం జరిగిందని ఇదే కాల్పులకు దారి తీసి ఉంటుందనేది పోలీసుల అనుమానం. అంతేకాదు తనకుబెదిరింపుకాల్స్ వస్తున్నట్టు గతంలో గిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరుగుతోంది.కాగా ఎడ్మంటన్లోని ఇతర బిల్డర్లకు కూడా ప్రాణహాని ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. త కొన్ని రోజులుగా, కొత్తగా నిర్మించిన ఇళ్లకు నిప్పు పెట్టిన సంఘటనలు జరిగినట్టు సమాచారం. అంతేకాదు భారతదేశంలోని క్రిమినల్ ముఠాతో లింకున్నముఠా వాట్సాప్ కాల్స్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోందని స్థానిక పోలిసు అధికారి డేవ్ పాటన్ వెల్లడించారు. ఆరుగురు యువకులను అరెస్టు చేసి అభియోగాలు మోపినట్లు తెలిపారు. -
ఇళ్ల అమ్మకాలు పెరిగాయ్
ముంబై: బలమైన డిమాండ్ కొనసాగడంతో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఇళ్ల అమ్మకాలు 14% పెరిగినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్ అనరాక్ గణాంకాలు తెలిపాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో జనవరి–మార్చి మధ్య మొత్తం 1,30,170 యూనిట్లు అమ్ముడవగా., గతేడాది ఇదే కాలంలో 1,13,775 యూనిట్ల విక్రయాల జరిగాయి. ఇదే త్రైమాసికానికి సగటున ఇళ్ల ధరలు 10–32 % పెరిగాయి. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం(ఎంఎంఆర్), పూణే, బెంగళూరు, హైదరాబాద్లో అమ్మకాలు పెరిగాయి. ఢిల్లీ–ఎన్సీఆర్, చెన్నై, కోల్కత్తా నగరాల్లో క్షీణించాయి. ► ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇళ్ల అమ్మకాలు 24% పెరిగి 42,920 యూనిట్లు అమ్ముడయ్యాయి. పూణేలో 15% పెరిగి 22,990 యూనిట్లు, హైదరాబాద్లో 38% వృద్ధితో 19,660 యూనిట్లు, బెంగుళూరులో 14% అధికంగా 17,790 ఇళ్లు అమ్ముడయ్యాయి. ► ఢిల్లీ ఎన్సీఆర్లో విక్రయాలు 9% క్షీణించి 15,650 యూనిట్లు, కోల్కత్తాలో అమ్మకాలు 9% తగ్గి 5,650 యూనిట్లు, చెన్నైలో ఆరుశాతం తక్కువగా 5,510 యూనిట్లు అమ్మకాలు జరిగాయి. ‘‘ముఖ్యంగా రూ.1.5 కోట్ల; అంతకు మించి పైగా ధరలు కలిగిన ఇళ్లకు అత్యధిక డిమాండ్ కారణంగా గత పదేళ్లలో రికార్డు విక్రయాలు ఈ జనవరి–మార్చి మధ్య నమోదయ్యాయి. వినియోగదారులు, ఇన్వెస్టర్ల నుంచి బలమైన డిమాండ్తో అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. పెరిగిన ఇళ్ల స్థలాలు ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాల మెరుగుదలను సూచిస్తున్నాయి’’ అని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి తెలిపారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019