breaking news
Advertisement
Ad - Sakshi_Home_Sticky
-
మార్పు తీసుకురండి
మోసపోకండి..రాయగడ: రాష్ట్ర ప్రజలు సీఎం నవీన్ పట్నాయక్ పాలనను ఇంకా నమ్ముతున్నారని, ఆయనపై అభిమానంతో ఓటు వేసి గెలిపిస్తే మరొకరు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, ఇంకా మోసపోకండి మార్పు తీసుకురండని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చిన ఆయన గురువారం స్థానిక తేజస్వి హోటల్లో విలేకర్లతో మాట్లాడారు. బీజేడీకి ప్రజలు గుడ్బై చెప్పాలన్నారు. దాదాపు 25 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. బాకై ్సట్ నిక్షేపాలు గుత్తేదారులకు తాకట్టు.. ఖనిజ, ప్రకృతి సంపదలకు నిలయమైన రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి ఏమాత్రం కనిపించడం లేదన్నారు. ముఖ్యంగా రాయగడ వంటి జిల్లాలోని బాకై ్సట్ గనులను అదాని, వేదంత్ వంటి కంపెనీలకు తాకట్టుపెట్టి చొద్యం చూస్తున్న ఈ ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు. బాకై ్సట్ వంటి నిక్షేపాలు ఉన్న ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉన్నప్పటికీ ఆయా అనావాళ్లు అసలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందన్నారు. పారిశ్రామిక ప్రగతితోనే నిరుద్యోగ సమస్యను నిర్మూలించగలమన్నారు. హామీలను నెరవేర్చే పార్టీ కాంగ్రెస్.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ కేవలం కాంగ్రెస్ మాత్రమేనని, ఈసారి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లొనే అభివృద్ధి అంటే ఏమిటొ చూపిస్తుందన్నారు. మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేసిందన్నారు. మహిళల కోసం ఉచితంగా ఆర్టీసీ బస్సు సేవలు అందిస్తున్నామన్నారు. రూ.500 లకే వంట గ్యాస్ను అందిస్తున్నామని వివరించారు. రెండు వందల యూనిట్ల లోపల ఉచిత విద్యుత్ను ఇస్తూ ప్రజల మెప్పు పొందుతున్నామన్నారు. అలాగే రైతులను ఆదుకుంటున్నామని వివరించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. మజ్జిగౌరి అమ్మ దర్శనం.. ఎన్నికల ప్రచారానికి వచ్చిన భట్టీ మజ్జి గౌరమ్మ మందిరానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలను చేయించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాహుల్ గాంధీ సభను విజయవంతం చేయండి.. ఎన్నికల ప్రచారానికి శుక్రవారం రాయగడకు వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని భట్టీ ప్రజలను కొరారు. రాష్ట్రంలో కాంగ్రేస్ పాలన వస్తే చేపట్టనున్న పథకాలు, హామీలను రాహుల్ గాంధీ ప్రకటిస్తారన్నారు. ఏఐసీసీ సాధారణ కార్యదర్శి షాన్వాష్ చౌదరి, విశ్వరంజన్ మహంతి, రాయగడ ఎమ్మెల్యే అభ్యర్థి అప్పల స్వామి కడ్రక, కొరాపుట్ ఎంపీ అభ్యర్థి సప్తగిరి ఉలక, పీసీసీ సాధారణ కార్యదర్శి దుర్గా ప్రసాద్ పండా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క -
కాంగ్రెస్కు షాక్
● బీజేడీలో చేరిన ప్రఫుల్ల భొత్ర జయపురం: జయపురం కాంగ్రెస్లో ప్రముఖ నేత ఫ్రఫుల్ల భొత్ర బుధవారం సాయంత్రం బీజేడీలో చేరారు. వి.కె.పాండ్యన్ యపురం పర్యటన సమయంలో ఫ్రఫుల్ల భొత్ర ఆయన సమక్షంలో బీజేడీలో చేరారు. భొత్ర మున్సిపాలటీ మాజీ కౌన్సిలర్. భొత్ర కొట్పాడ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టిక్కెటు కోసం ప్రయత్నించారు. అధిస్ఠానం అతడికి టిక్కెట్టు ఇవ్వకపోబంతో పార్టీని వీడి బీజేడీ లో చేరినట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు. భొత్ర బీజేడీలో చేరిక వల్ల ఆ పార్టీకి క్రిష్టియన్ ఓట్లు పడే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేడీ జయపురం అభ్యర్థి డాక్టర్ ఇందిర నందో, పలువురు నాయకులు ఉన్నారు. -
ఇసుక తరలిస్తున్న వాహనాలు సీజ్
బరంపురం: యథేచ్ఛగా ఇసుక, కంకర అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాలపై పోలీసులు దాడులు జరిపి 10 వాహనాలను సీజ్ చేయడంతో పాటు 11 మందిని అరెస్టు చేసినట్లు టౌన్ ఎస్డీపీవో జయంత్ కుమార్ మహాపాత్రో గురువారం తెలిపారు. సదర్ పోలీసుస్టేషన్ పరిధి కుకుడాఖండి బ్లాక్లోని శంకర్ ఐ ఆస్పత్రి జంక్షన్ దగ్గర వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా అక్రమంగా రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మజ్జిగ పంపిణీ రాయగడ: అంతర్జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ రాయగడ శాఖ ఆధ్వర్యంలో స్థానిక రింగ్రోడ్డు వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆ కౌన్సిల్కు చెందిన లీనా సేనాపతి ఆధ్వర్యంలో జరిగిన పంపిణీ కార్యక్రమంలో బాటసారులు మజ్జిగ సేవించి కాస్తంత ఉపశమనం పొందారు. ఇటువంటి తరహా కార్యక్రమాలను ఇకపై తరచూ నిర్వహిస్తామని సేనాపతి పేర్కొన్నారు. చోరీ కేసు నిందితుడు అరెస్టు రాయగడ: చోరీ కేసు నిందితుడిని జిల్లాలోని అంబొదల పోలీసులు గురువారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అరైస్టెన వ్యక్తి బిసంకటక్ పోలీస్స్టేషన్ పరిధి బారిగుడ గ్రామానికి చెందిన రితిక్ టకిరిగా గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బారిగుడ గ్రామంలో నివాసముంటున్న భీమా బాగ్ అనే వ్యక్తి ఇంట్లో ఏప్రిల్ 28వ తేదీన చోరీ జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి రూ.30,500 నగదును తన బంధువు అయిన, రితిక్ టకిరి అనే వ్యక్తి దొంగిలించుకుపోయాడని బాధితుడు అంబొదల పోలీస్స్టేషన్లో 30వ తేదీన ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేసి, నిందితుడిని పట్టుకున్నారు. భారీగా గంజాయి సీజ్ బరంపురం: నగరానికి అక్రమంగా రవాణా చేస్తున్న రూ.85 లక్షలు విలువ చేసే గంజాయిని బరంపురం ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్న ఘటన జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎకై ్సజ్ అధికారి తపన్ కుమార్ నాయక్ తెలిపిన వివరాల మేరకు.. కొందమాల్ జిల్లా దరింగబడి నుంచి బరంపురం నగరానికి కారు, ట్రక్కు, రెండు ద్విచక్ర వాహనాల్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా రూ.85 లక్షలు స్వాధీనం చేసుకొని, ముగ్గురిని అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేశారు. బీజేడీ అభ్యర్థుల తుది జాబితా విడుదల భువనేశ్వర్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను బిజూ జనతా దళ్ (బీజేడీ) గురువారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ మూడు ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వీటిలో ఖండపడ, నీలగిరి, కొరేయ్ శాసన సభ స్థానాలు ఉన్నాయి. ఈ సందర్భంగా దేవ్గడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రకటించిన అభ్యర్థిని మార్చినట్లు పేర్కొన్నారు. ఖండపడ అసెంబ్లీ స్థానానికి సాబిత్రి ప్రధాన్ ఖరారు చేయగా నీలగిరి స్థానంలో సుకాంత నాయక్, కొరెయిలో బీజేడీ అభ్యర్థిగా సంధ్యారాణి దాస్ పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారు. సంధ్యారాణి దాస్ బీజేడీ సంస్థాగత కార్యదర్శి, సంబల్పూర్ లోక్సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రణబ్ ప్రకాష్ దాస్ తల్లి కావడం విశేషం. దేవ్గడ్ అసెంబ్లీ నియోజకవర్గానికి బీజేడీ అభ్యర్థిగా అరుంధతీ దేవి స్థానంలో రోమాంచ్ రంజన్ బిస్వాల్ను బరిలోకి దింపుతున్నట్లు తుది జాబితాలో స్పష్టం చేశారు. -
సత్తా చాటాలని..!
● కంటాబంజీ స్థానానికి సీఎం నవీన్ నామినేషన్ ● కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న స్థానంలో పోటీ ● పశ్చిమ ఒడిశాలో బల నిరూపణకు అవకాశం భువనేశ్వర్: పశ్చిమ ఒడిశాలో భీకర రాజకీయ పోరుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి, బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ గురువారం టిట్లాగడ్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంటాబంజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. తమ ప్రియతమ నేతకు స్వాగతం పలికేందుకు దారి పొడవునా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కంటాబంజీ నామినేషన్తో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సవాలుతో కూడిన రాజకీయ యాత్రకు శంఖారావం చేశారు. కాంగ్రెస్ కంచుకోట పడగొట్టాలని బిజూ జనతా దళ్ కంచుకోటగా గంజాం జిల్లా హింజిలి నిరూపితం. యథాతథంగా నవీన్ పట్నాయక్ ఈ నియోజకవర్గం నుంచి మొదటి నామినేషన్ దాఖలు చేశారు. రెండో నామినేషను పశ్చిమ ఒడిశా కంటాబంజీ నుంచి పోటీకి నామినేషన్ దాఖలు చేసి భీకర పోరుకు రంగ ప్రవేశం చేశారు. నవీన్ ప్రవేశంతో ఈ నియోజకవర్గంలో పోరు తారాస్థాయిలో ఉంటుందని అంచనా. గత 2019 ఎన్నికల్లో బిజూ జనతా దళ్ కంటాబంజీ అసెంబ్లీ స్థానంలో మూడో స్థానంలో నిలిచింది. ఈ పరిస్థితిని అధిగమించి యావత్తు పశ్చిమ ఒడిశాలో తమ పార్టీ ఉనికిని బలోపేతం చేయడమే ధ్యేయంగా బీజేడీ అధినేత ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. కంటాబంజి నియోజకవర్గం కాంగ్రెసు కంచుకోటగా చలామణి అవుతుంది. మరోవైపు ఈ నియోజకవర్గంతో కూడిన బొలంగీరు లోక్సభ స్థానం భారతీయ జనతా పార్టీ అధీనంలో ఉంది. ఈ పోరులో గెలుపు సాధించి బొలంగీరు లోక్సభ ఎన్నికని ప్రభావితం చేసి యావత్తు పశ్చిమ ఒడిశాలో నవీన్ గ్లామర్ని తళుక్కుమనిపించే ఉత్సాహంతో నామినేషన్ దాఖలు చేశారు. నవీన్ పట్నాయక్ పోటీ పశ్చిమ ఒడిశాలో సమగ్ర రాజకీయ ముఖ చిత్రానికి కొత్త కవలికలు దిద్దుతుందనడంలో సందేహం లేదు. బొలంగీర్లో బీజేపీ భారతీయ జనతా పార్టీకి చెందిన సంగీతా కుమారి సింగ్ దేవ్ బలంగీర్ లోక్సభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఈ స్థానం పరిధిలో కంటాబంజీ అసెంబ్లీ సెగ్మెంటు ఒకటి. బొలంగీర్ లోక్సభ స్థానంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో సంగీతా కుమారి సింగ్ దేవ్కు కంటాబంజీ అసెంబ్లీ సెగ్మెంటులో అత్యధిక ఆధరణ లభించింది. 2019లో బీజేపీ అభ్యర్థిగా సంగీతా సింగ్దేవ్కు కంటాబంజీ సెగ్మెంట్ నుంచి అత్యధికంగా 33,765 ఓట్లు లభించాయి. ఈ పార్లమెంటరీ స్థానంలో మరో కీలక అసెంబ్లీ సెగ్మెంటు పట్నగొడొ. ఈ నియోజకవర్గానికి ఆమె భర్త కనక వర్ధన్ సింగ్దేవ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సంగీతా సింగ్దేవ్కు ఈ పట్నగొడొ నుంచి 7,983 ఓట్లు పోలయ్యాయి. 2019లో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన సొంత ఇలాఖా గంజాం జిల్లా హింజిలితో పశ్చిమ ఒడిశా బర్గడ్ జిల్లా బీజేపూర్ నుంచి పోటీ చేశారు. దీంతో అప్పటివరకు కాంగ్రెసు అధీనంలో ఉన్న బీజేపూర్ శాసనసభ స్థానం బీజేడీ ఖాతాలో పదిలమైంది. ఈసారి ఆయన హింజిలితో పాటు బొలంగీర్ జిల్లా కంటాబంజీ నుంచి పోటీ చేయడం మరో విప్లవాత్మక మార్పుని ఆవిష్కరిస్తుందని భావిస్తున్నారు. -
కాంగ్రెస్ బైక్ ర్యాలీ ప్రచారం ప్రారంభం
జయపురం: ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. జయపురం శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి తారాప్రసాద్ బాహిణీపతి గురువారం నుంచి బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జయపురం సమితి పంపుణి గ్రామ పంచాయతీ కుములిపుట్లో ర్యాలీని ప్రారంభించారు. బైక్ ర్యాలీ నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో కొనసాగుతోందని ఎమ్మెలన్య బాహిణీపతి వెల్లడించారు. ఒక పక్క ఇతర పార్టీలకు చెందిన వారిని కాంగ్రెస్లో చేర్చుకోవడానికి మిశ్రణ పర్వ్లు నిర్వహిస్తూనే మరోపక్క ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రజలను కలుసుకొని పదేళ్లలో తాను చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓటును అభ్యర్థిస్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కాగా గురువారం లక్ష్మీనగర్లోని తన నివాసంలోను, హనగుడ కల్యాణ మండపం, కొంగ గ్రామంలో మిశ్రణ పర్వ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన వారు పార్టీలో చేరగా వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. కౌన్సిలర్ ప్రణయ కిశోర్ నాయక్ ఐదో నంబర్ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ సాధారణ కార్యదర్శిణి మీణాక్షీ బాహిణిపతి పాల్గొన్నారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019