Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
సూపర్హిట్
జనమే జనం.. పోటెత్తిన అభిమాన ప్రవాహం.. రోడ్లకిరువైపులా జనం బారులు.. మహిళల హారతులు.. పూలవర్షాలతో కనీవినీ ఎరుగని అఖండ స్వాగతం.. ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండు రోజులపాటు సాగిన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో కనిపించిన దృశ్యాలివి.. సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో బస్సుయాత్ర పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. అడుగడుగునా అశేష జనవాహిని నడుమ సాగిన బస్సుయాత్ర ప్రతిపక్ష పార్టీల గుండెల్లో వణుకు పుట్టించింది. సంక్షేమ రథసారధి.. దగ్గరి నుంచి చూడాలని.. వీలైతే మాట్లాడాలని.. ఒక్క ఫొటో తీసుకోవాలని ప్రజలు ఉత్సాహం చూపించగా.. ఆయనే స్వయంగా బస్సు దిగి ఆప్యాయంగా పలకరించడం.. ‘నేను ఉన్నానంటూ’ భరోసా కల్పించడంతో శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి విశాఖలో అడుగుపెట్టింది మొదలు ప్రజలు అదే ప్రేమాభిమానాలు కురిపించారు. జై జగన్ అంటూ నినదించారు. పేదల ప్రతినిధికి జేజేలు పలికారు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పడంతే అని నమ్మిన ప్రజలు స్వచ్ఛందంగా జగనన్న చూసేందుకు తరలివచ్చారు. జగనన్న మాటకు.. బాటకు ప్రజలు విలువ ఇస్తున్నారు. ఆయన ఒక్క అడుగు వేస్తే.. లక్షలాది పాదాలు ఆయనను అనుసరించాయి. అందుకే మేమంతా సిద్ధం బస్సుయాత్ర జనజాతర తలపించింది. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అక్కున చేర్చుకున్న జనం ‘ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. ఇక్కడే ప్రమాణస్వీకారం చేస్తా. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చేస్తూ.. ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తానంటూ ఇటీవల జరిగిన విజన్ విశాఖ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు.. అందుకే అన్నొస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని విశాఖ జనం విశ్వసించారు’.. మేము సిద్ధం యాత్రలో భాగంగా జనంతో మమేకమయ్యేందుకు విశాఖ చేరుకున్న వైఎస్ జగన్కు విశేష ఆదరణ లభించింది. 2019 ప్రజాసంకల్ప యాత్రలో ఎలాగైతే జనం అక్కున చేర్చుకున్నారో అంతకు మించిన అభిమానాన్ని ఉమ్మడి విశాఖ ప్రజలు మేమంతా సిద్ధం అంటూ చూపిస్తున్నారు. సభలో స్పందన భేష్ బస్సుయాత్రలో భాగంగా ఈ నెల 20న అనకాపల్లి జిల్లా చింతలపాలెంలో నిర్వహించిన సిద్ధం సభకు వార్ వన్సైడ్ అనే రీతిలో అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా యువత, మహిళలు సీఎం వైఎస్ జగన్ మాటలకు కేరింతలు కొట్టారు. జగన్ వెంట మేమంటూ నినాదాలు చేశారు. ఈ ఎన్నికల్లో కూటమి కుయుక్తులు, చంద్రబాబు చెబుతున్న అబద్ధాల గురించి జగన్ చెప్పిన మాటలు ప్రజల్లోకి సూటిగా వెళ్లడంతో టీడీపీ, జనసేన పార్టీల వైఖరిపై ప్రజల్లో ఒక క్లారిటీ తీసుకొచ్చారు. జనమంతా జేజేలు అనకాపల్లి, విశాఖ జిల్లాలో బస్సుయాత్రకు వచ్చిన ఆదరణతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం రెట్టింపైంది. ఈసారీ జెండా రెపరెపలాడేలా జనమంతా జేజేలు పలుకుతుండటటంతో.. అటు అభ్యర్థులు, పార్టీ శ్రేణులు దూకుడు పెంచారు. ఇంటింటా ప్రచారాన్ని మరింత ఉత్సాహంగా చేయా లని నిర్ణయించుకున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ విజయ ఢంకా మోగబోతోందన్నది స్పష్టమైంది. ప్రతిపక్షాల్లో వణుకు జనమంతా జగన్వైపే ఉన్నారన్న స్పష్టత రావడంతో ప్రతిపక్షాల్లో వణుకు మొదలైంది. ప్రజలంతా స్వచ్ఛందంగా జగన్ను చూసేందుకు వచ్చిన విషయం తెలుసుకొని టీడీపీ, జనసేన నేతలు కలవరపడుతున్నారు. ఫ్యాన్ గాలికి తట్టుకొని నిలబడటం కష్టమేనన్న సంకేతాలు కనిపించడంతో ఏం చేయాలో పాలుపోక ఆపసోపాలు పడుతున్నారు. గెలుపు అవకాశాలు కనుచూపు మేరలో కూడా కనిపించకపోవడంతో ప్రజలను ఎలా ప్రసన్నం చేసుకోవాలన్నదానిపై పునరాలోచనలో పడేలా బస్సుయాత్ర జైత్రయాత్రలా సాగింది. ఉమ్మడి విశాఖలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర కనీవినీ ఎరుగని రీతిలో సూపర్ హిట్ అవ్వడంతో ఫ్యాన్ స్పీడ్ మరింత పెరిగింది. అధినేత పర్యటనతో అనకాపల్లి, విశాఖ జిల్లాలోని అభ్యర్థులు గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ బస్సుయాత్రతో వైఎస్సార్ సీపీలో జోష్ మేమంతా సిద్ధం అంటూ నినదించిన ప్రజానీకం కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహం కార్యనిర్వాహక రాజధానికి ఓటేస్తామంటూ చాటిచెప్పిన జనం ప్రతి నియోజకవర్గంలోనూ స్వచ్ఛందంగా కదిలివచ్చిన ప్రజలు -
జనసేన నుంచి వైఎస్సార్సీపీలోకి..
ఎమ్మెల్యే గణేష్ సమక్షంలో పార్టీలో చేరిన జనసేన నాయకుడు గుండుబొగుల శ్రీనివాస్ నర్సీపట్నం: జనసేన నియోజకవర్గ మాజీ ఇన్చార్జి గుండుబొగుల శ్రీనివాస్ సోమవారం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇతను గతంలో జనసేన అనకాపల్లి పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేశారు. జనసేనకు పట్టు ఉన్న నాయకుడైన శ్రీనివాస్ వైఎస్సార్సీపీలో చేరడంతో కూటమికి గట్టి ఎదురు దెబ్బతగిలింది. చేరిక కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, రుత్తల ఎర్రాపాత్రు డు, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, గొలుగొండ మండల పార్టీ అధ్యక్షుడు లెక్కల సత్యనారాయణ పాల్గొన్నారు. -
పదిలో బాలికలదే హవా
2023 77.742024 89.04పది ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు దుమ్మురేపాయి. కార్పొరేట్కు దీటుగా ఫలితాలు సాధించి వహ్వా అనిపించాయి. నాణ్యమైన ఉచిత విద్యనందించి మార్కులు కొల్లగొట్టాయి. జిల్లా మొత్తం మీద 89.04 శాతం ఉత్తీర్ణత రాగా, రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. గత విద్యా సంవత్సరంలో 77.74 శాతం సాధించగా, ఈ ఏడాది గణనీయంగా ఉత్తీర్ణత పెరగడం గమనార్హం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యమివ్వడంతో ఈ ఘనత సాధించగలిగాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా శ్రీలేఖకు మిఠాయి తినిపిస్తున్న తల్లిదండ్రులు తాను సివిల్స్ పరీక్షలకు వెళ్తానని గట్టెం శ్రీలేఖ అన్నారు. పాయకరావుపేట మండలం గుంటపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుని పదో తరగతి ఫలితాల్లో 591 మార్కులు సాధించానని ఆనందం వ్యక్తం చేసింది. ట్రిపుల్ ఐటీలో ఇంజినీర్ చదివి అనంతరం సివిల్స్ సాధించడమే ధ్యేయమన్నారు. ఆమె తండ్రి గంగబాబు వృత్తిరీత్యా టైల్స్ వ్యాపారి, తల్లి విజయలక్ష్మి గృహిణి. తమ కుమార్తె ప్రతిభకు వారు ముగ్ధులయ్యారు.స్వాతికి స్వీట్లు తినిపిస్తున్న తల్లిదండ్రులు తాను కష్టపడి చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవుతానని.. పదో తరగతిలో 592 మార్కులు సాధించుకున్న పాయకరావుపేటకు చెందిన కోటిపల్లి సత్యధన స్వాతి చెప్పింది. పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకొని ఆమె ఈ ఘనత సాధించింది. ఆమె తండ్రి వీరబాబు వృత్తిరీత్యా తాపీమేస్త్రి, తల్లి గృహిణి కాగా, తమ కుమార్తె జిల్లా టాపర్గా నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనకాపల్లి: జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా నుంచి రెగ్యులర్ విద్యార్థులు 10,820 మంది బాలురు పరీక్షలు రాయగా, 9,384 మంది బాలికలు 10,349 మంది పరీక్షలు రాయగా 9,464 మంది ఉత్తీర్ణత సాధించినట్లు డీఈవో ఎం. వెంకటలక్ష్మమ్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 21,169 మంది విద్యార్థుల పరీక్షకు హాజరు కాగా, 18,848 మంది ఉత్తీర్ణత సాధించారు. 14,725 మంది ప్రథమ శ్రేణి, 2,867 మంది ద్వితీయ శ్రేణి, 1,256 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. బాలురు ఉత్తీర్ణత శాతం 86.73 శాతం, బాలికలు ఉత్తీర్ణత శాతం 91.45 శాతంగా నమోదైంది. జిల్లా మొత్తం మీద 89.04 శాతం రాగా, రాష్ట్రంలో 12వ స్థానంలో జిల్లా నిలిచిందన్నారు. పాయకరావుపేట జెడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని కోటిపల్లి సత్యధన స్వాతి 600 మార్కులకు గాను 592 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవగా, పాయకరావుపేట మండలంలో గుంటపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని గట్టెం శ్రీలేఖ 590 మార్కులతో ద్వితీయ స్థానంలోను, పాయకరావుపేట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని జాన లలిత భవాని, వాడచీపురుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి దూడ రఘు 588 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. గత విద్యా సంవత్సరంలో 77.74 శాతం సాధించగా, ఈ ఏడాది ఉత్తీర్ణత 89.04 శాతం పెరిగింది. ఫలితాల్లో దుమ్ము రేపిన కేజీబీవీలు నాతవరం: పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీలు) దుమ్మురేపాయి. ఇవి 97 శాతం ఉత్తీర్ణత శాాతం సాధించాయి. జిల్లాలో 20 కేజీబీవీల్లో 743 మంది పరీక్షలకు హాజరు కాగా, 608 మంది ప్రథమ శ్రేణి, 85 మంది ద్వితీయ శ్రేణి, 21 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 500పైగా మార్కులు సాధించిన విద్యార్థినులు 148 మంది ఉన్నారు. నాతవరం రాంబిల్లి, బుచ్చెయ్యపేట, సబ్బవరం, కె.కోటపాడు, కోటవురట్ల, రోలుగుంట కేజీబీవీల్లో శత శాతం పాసయ్యారు. శతశాతం ఉత్తీర్ణత... ●అచ్యుతాపురం మండలం దోసూరు ఉన్నత పాఠశాల శతశాతం ఉత్తీర్ణత సాధించింది. 24 మంది పరీక్షలు రాయగా, అందరూ పాసయ్యారు. ●మునగపాక మండలం తిమ్మరాజుపేట హైస్కూల్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. 24మంది విద్యార్థులకు గాను అందరూ ఉత్తీర్ణులయ్యారు. ●అనకాపల్లి పట్టణంలో మహాత్మాగాంధీ జ్యోతిబాయి పూలే హైస్కూల్, రైల్వే స్టేషన్ రహదారి భీమునిగుమ్మం హైస్కూల్, మండలంలో మర్రిపాలెం జెడ్పీ హైస్కూల్ శత శాతం ఉత్తీర్ణత సాధించాయి. ●రోలుగుంట మండలం కొవ్వూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 14 మందికి మొత్తం ఉత్తీర్ణత అయ్యారు. ●దేవరాపల్లి మండలం కాశీపురం, ఎ. కొత్తపల్లి, కలిగొట్ల, ఎం.అలమండ, ముషిడిపల్లి హైస్కూల్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణులయ్యారు. ●ఎస్.రాయవరం మండలం లింగరాజుపాలెం మహాత్మాగాంధీ జ్యోతిరావుపూలే పాఠశాల శత శాతం ఉత్తీర్ణత సాధించింది. ఎస్.రాయవరం బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. ●నర్సీపట్నం ఎంజేపీ బీసీ బాలుర గురుకుల పాఠశాల శతశాతం ఉత్తీర్ణత సాధించింది. ●రావికమతం మండలం మరుపాక మోడల్ స్కూల్లో 94 మంది విద్యార్థులకు గానూ 94 మంది పాసయ్యారు. ●మాడుగుల మండలం తాటిపర్తి గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాల నుంచి 69 మందికి 69 మంది, ఇదే మండలం జి. అగ్రహారం హైస్కూలు నుంచి 20 మందికి 20 మంది పాసయ్యారు. జిల్లాలో 89.04 శాతం ఉత్తీర్ణత సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు -
అట్టహాసంగా ముత్యాల నాయుడు నామినేషన్
తుమ్మపాల: వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు నామినేషన్ కార్యక్రమం సోమ వారం అట్టహాసంగా జరిగింది. దేవరాపల్లి మండలం తారువ గ్రామం నుంచి ఆయన ఉదయం 11 గంటల సమయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. 45 కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో దారిపొడవునా పార్టీ శ్రేణులు, అభిమాను లు స్వాగతం పలుకుతూ సీఎం జగన్, ఎంపీ బూడి అంటూ నీరాజనాలు పలికారు. అనకాపల్లి పట్టణంలో ఎంపీ బీవీ సత్యవతి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్కుమార్ల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఘన స్వాగ తం పలికారు. అక్కడ నుంచి జాతీయ రహదారి మీదు గా శంకరంలో కలెక్టరేట్కు చేరుకున్నారు. 1.45 నిమిషాలకు మూడు సెట్ల నామినేషన్ పత్రాలను అఫిడవిట్ రూపంలో జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టన్శెట్టికి సమర్పించారు. నామినేషన్ వేసి బయటకు వచ్చిన బూడిని జిల్లాలో పలువురు నాయకులు సత్కరించి ఆల్ ది బెస్ట్ తెలిపారు. అనంతరం మీడియాతో బూడి మాట్లాడుతూ.... మాడుగుల నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకోవడంతోపాటు వైఎస్సార్సీపీ కంచుకోటగా తయారు చేశామన్నారు. ఇప్పుడు మిగిలిన ప్రాంతాలను అదే విధంగా అభివృద్ధి చే యాలని ఆయా నియోజకవర్గాల ప్రజ లు, నాయకులు కోరుతున్నారన్నారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలంటే, ఎంపీగా తనతోపాటు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. సీఎం.రమేష్కు ఢిల్లీ వీధులు బాగా తెలుసట.... టీడీపీ అధినేత చంద్రబాబు కడప నుంచి దిగుమతి చేసిన సీఎం.రమేష్కు ఢిల్లీలో అన్ని వీధులు తెలుసని, తనకు తెలియదని ఇటీవల చంద్రబాబు చెప్ప డం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎంపీగా గెలిచిన వ్యక్తికి తెలియాల్సింది ఢి ల్లీ వీదులు కాదని, పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని వీధులు, గ్రామాలు తెలియాలన్నారు. ఈ ప్రాంత సమస్యలపై కనీస అవగాహన లేని రమేష్కు ఇక్కడ పనేంటన్నారు. సీఎం ఆశీస్సు లు, ప్రజల దీవెనలతో ఎంపీగా గెలిచిన తర్వాత ఢిల్లీలో తనకు కేటాయించిన క్యార్టర్స్ నుంచి పార్లమెంట్కు వెళ్తాను తప్ప ఢిల్లీ వీధుల్లో తిరగాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రాంత సమస్యలదె పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కారం దిశగా పనిచేస్తామన్నారు. మూడు సెట్ల దాఖలు చేసిన బూడి ముత్యాలనాయుడు తారువ నుంచి కలెక్టరేట్కు వరకు 45 కిలోమీటర్ల ర్యాలీ దారి పొడవునా తరలివచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్కుమార్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం -
No Headline
యలమంచిలి రూరల్: వైఎస్సార్సీపీ యలమంచిలి అభ్యర్థి యు.వి.రమణమూర్తి రాజు (కన్నబాబు) శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. వేలాది మంది అభిమానులు వెంటరాగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు. వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు జై జగన్..జై కన్నబాబు..జై బూడి..అన్న నినాదాలతో హోరెత్తించారు. యలమంచిలి పట్టణ వీధులు శుక్రవారం కిక్కిరిసిపోయాయి. కళాకారుల ఆటపాటలు, డప్పుచప్పుళ్లతో పండగ వాతావరణం కనిపించింది. ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు రొంగలి జగన్నాథం, డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమారవర్మ పాల్గొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019