breaking news
Ad - Sakshi_Home_Sticky
-
సంస్కృత భాష కంప్యూటరీకరణతో మేలు
విశాఖ: సంస్కృత భాష వ్యాప్తికి కంప్యూటరీకరణ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆచార్య కోలవెన్ను మలయవాసిని అన్నారు. జిల్లెళ్లమూడి సంస్కృతి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గురువారం అక్కయ్యపాలెం లలితానగర్ లలితా పీఠంలో ‘సంస్కృత భాష–కంప్యూటరీకరణ’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య వక్తగా ప్రసంగించారు. అగర్తల ట్రిపుల్ ఐటీ పూర్వ డైరెక్టర్ పి.ఎస్.అవధాని మాట్లాడుతూ సంస్కృత భాష కంప్యూటరీకరణ పూర్వాపరాలను విపులంగా విశదీకరించారు. బి.గోపి మాట్లాడుతూ సంస్కృత భాష కోసం తాము రూపొందించిన కంప్యూటర్ గురించి విషయాలు సభికులకు వివరించారు. డాక్టర్ డి.వి.సూర్యారావు, కె.విఎస్.రాజేశ్వరరావు, జి.జానకీరామ్లు సంస్కృత బాష కంప్యూటరీకరణలోని పలు అంశాలపై చర్చించి సూచనలిచ్చారు. కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ చిలకలూరి శాంతమ్మ, మల్లాది భాస్కరం, గాదిరాజు జానకీరామ్, ఘండికోట విశ్వనాధం పాల్గొన్నారు. -
నేటి నుంచి చందనోత్సవ టికెట్ల విక్రయాలు
ఆన్లైన్లో రూ. 1500 టికెట్లు సింహాచలం: ఈ నెల 10న జరిగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి సంబంధించి దర్శన టికెట్ల విక్రయాలు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభించనున్నట్ట దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి వెల్లడించారు. ఈ నెల 7వతేదీ వరకు సాయంత్రం 5గంటల వరకు విక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు. సింహాచలం, మహారాణిపేట, అక్కయ్యపాలెంలోని యూనియన్ బ్యాంకు బ్రాంచ్లు, సింహాచలం, సాలిగ్రామపురం(అక్కయ్యపాలెం బ్రాంచ్), బిర్లా జంక్షన్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లతో పాటు సింహాచలం కొండపైన ఉన్న పీఆర్వో కార్యాలయంలో కూడా రూ.300, రూ.1000 టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆన్లైన్లో కూడా విక్రయాలు ఈనెల 3వతేదీ సాయంత్రం 4 గంటల నుంచి 7వతేదీ సాయంత్రం 6గంటల వరకు రూ.300, రూ.1000 టికెట్లతో పాటు రూ.1500 టికెట్లు కూడా ఆన్లైన్లో లభ్యమవుతాయని ఈవో పేర్కొన్నారు. www.ap temples.ap.gov.in వైబ్సైట్ ద్వారా టికెట్లు పొందవచ్చని తెలిపారు. 10వ తేదీన చందనోత్సవం రోజు ఎలాంటి దర్శనం టికెట్లు విక్రయాలు జరగవని స్పష్టం చేశారు. టికెట్లు లేని భక్తులు ఉచిత దర్శనం క్యూలో మాత్రమే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుందని సూచించారు. -
వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నాయకులు
వైఎస్సార్సీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానిస్తున్న వైవీ సుబ్బారెడ్డి బుచ్చెయ్యపేట: మండలంలోని బంగారుమెట్టకు చెందిన టీడీపీ నాయకులు ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. గ్రామానికి చెందిన మాజీ వార్డు మెంబర్ మేరుగు రాము, గ్రామ దళిత సంఘ నాయకుడు బండి గంగరాజు, వీర్ల నారాయణమూర్తి తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి గురువారం విశాఖ నగరంలోని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగనన్న, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ విజయానికి పాటుపడతామని పార్టీలో చేరిన నాయకులు తెలిపారు. మాజీ సర్పంచ్ శిరిగిరిశెట్టి నానాజీ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి తొలివిడత చందనం అరగదీత
సింహాచలం: సింహగిరిపై శనివారం నుంచి తొలి విడత చందనం అరగదీత కార్యక్రమం నిర్వహించేందుకు దేవస్థానం వైదికులు, అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 10న చందనోత్సవం సందర్భంగా స్వామి వారి నిజరూప దర్శనం అనంతరం తొలివిడతగా సమర్పించే మూడు మణుగుల చందనాన్ని (సుమారు 125 కిలోల పచ్చిచందనం) సమకూర్చేందుకు అరగదీత కార్యక్రమం చేపట్టనున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 4న ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం తొలిచందనం చెక్కకు శాస్త్రోక్తంగా పూజలు చేసిన అనంతరం, నాల్గో తరగతి సిబ్బంది చందనాన్ని అరగదీస్తారు. ఈ మేరకు గురువారం ఆలయ బేడామండపంలో చందనం చెక్కలను ముక్కలుగా కోసి అరగదీతకు అనుగుణంగా సిద్ధం చేశారు. దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఏఈవో పాలూరి నరసింగరావు, సూపరింటెండెంట్ వెంకటరమణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. -
భువనేశ్వర్–ఎల్టీటీ మధ్య సమ్మర్ స్పెషల్స్
తాటిచెట్లపాలెం: వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైందని వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమ్మర్ స్పెషల్ రైళ్ల వివరాలిలా.. ● భువనేశ్వర్–లోకమాన్య తిలక్ టెర్మినస్(ఎల్టీటీ)(08420) రైలు ప్రతి బుధవారం రాత్రి 11 గంటలకు భువనేశ్వర్లో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు 6.45కు దువ్వాడ చేరుకుని, తిరిగి 6.50కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు లోకమాన్య తిలక్ టెర్మినస్కు చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 26 వరకు నడుస్తుంది. ● తిరుగు ప్రయాణంలో లోకమాన్య తిలక్ టెర్మినస్–భువనేశ్వర్ (08419) రైలు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు లోకమాన్య తిలక్ టెర్మినస్లో బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 5.45లకు దువ్వాడ చేరుకుని, తిరిగి 5.50కు బయలుదేరి అదే రోజు మధ్యరాత్రి(ఆదివారం తెల్లవారు) 1.45 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 28 వరకు నడుస్తుంది. విశాఖ–హతియా స్పెషల్ రైళ్ల రద్దు విశాఖపట్నం–హతియా– విశాఖపట్నం(08559/08560) మధ్య నడుస్తున్న వీక్లీ సమ్మర్ స్పెషల్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సీనియర్ డీసీఎం కె.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లను ఇటీవలే వేశారు. జూన్ నెలాఖరు వరకు రాకపోకలు సాగించాలి. ఈ రైలుకు సరైన ఆక్యుపెన్సీ, డిమాండ్ లేనందున రద్దు చేస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఈ రైలుకు సరైన సమయంలో వేస్తే డిమాండ్ ఉంటుంది. అనువు కాని వేళల్లో ఈ ట్రైన్ నడుస్తున్నందున ఖాళీగా రాకపోకలు సాగించింది. బొకారో, టాటా ఎక్స్ప్రెస్ల వేళలకు కొంచెం అటూ ఇటుగా ఈ రైలు విశాఖ నుంచి బయలుదేరేలా చేస్తే డిమాండ్ ఉంటుందని పలువరు రైల్ యూజర్లు కోరుతున్నారు.
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019