Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
సరదాగా కాసేపు..
● స్విమ్మింగ్పై పెరుగుతున్న ఆసక్తి ● ఉత్సాహం చూపుతున్న విద్యార్థులుమెదక్జోన్: స్విమ్మింగ్ నేర్చుకోవడంపై యువతతోపాటు బాల, బాలికలు ఆసక్తి చూపుతున్నారు. ఈత శరీరానికి మంచి ఎక్సర్ సైజ్తోపాటు ప్రమాదవశాత్తు నీటిలో మునిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయట పడటానికి ఉపయోగ పడుతుంది. ప్రస్తుతం ఎండలు ఎక్కు వగా కొడుతుండటంతో చిన్నా, పెద్దా తేడాలేకుండా ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. పట్టణంలోని గాంధీనగర్లో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ ఫూల్లో బాల, బాలికలు ఈత నేర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఒక్కో వ్యక్తికి నెలకు రూ.3 వేల ఫీజు చెల్లిస్తే తమ కోచ్ ఈత నేర్పిస్తాడని నిర్వాహకుడు చెబుతున్నాడు. అందరూ నేర్చుకోవాలి బాల, బాలికలందరికీ తల్లిదండ్రులు ఈత నేర్పించాలి. నాకు ఇద్దరు పిల్లలు వారికి ఈత నేర్పించేందుకు స్విమ్మింగ్ ఫూల్కు తీసుకొస్తున్నాను. ఈత వచ్చిందంటే నీటి ప్రమాదం నుంచి సునాయాసనంగా తప్పించుకోవచ్చు. – మహీందర్,డిప్యూటీ తహసీల్దార్, చిన్నశంకరంపేట స్విమ్మింగ్ ఎంతో ఇష్టం.. నాకు స్విమ్మింగ్ అంటే ఎంతో ఇష్టం. ఈత నేర్చుకుంటే భవిష్యత్లో ఎంతో ఉపయోగ పడుతుందని మమ్మీ, డాడీలు తరుచూ చెబుతుంటారు. దీని వల్ల శరీరానికి మంచి ఎక్సర్ సైజ్ సైతం లభిస్తోంది. – నిఖిల్, విద్యార్థి -
తప్పులుంటే తిప్పలే
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అఫిడవిట్ తప్పసరి● అన్ని కాలమ్స్ పూరించాల్సిందే ● నేర సమాచారం ఇవ్వాలి ● ఆస్తులు, అప్పులు పక్కాగా సమర్పించాలి ● ఫారమ్ 26 అసంపూర్తిగా ఉంటే తిరస్కరణనారాయణఖేడ్: లోక్సభ ఎన్నికల పోరు ప్రారంభమయ్యింది. ఎన్నికల క్రతువులో అభ్యర్థులు సమ ర్పించే అఫిడవిట్ కీలకంగా మారుతోంది. అభ్యర్థులు తమ వివరాలతో పాటు ఆస్తులు, అప్పుల గురించి ప్రమాణ పత్రం రూపంలో ముందే స్పష్టం చేయాలి. గతంలో ఏమైనా కేసులు ఉన్నా, శిక్ష పడినా వాటినీ పొందుపరచాలి. వీటన్నింటినీ కలిపి దాఖలుచేసే పత్రమే అఫిడవిట్. అందులో తప్పుడు సమాచారమిస్తే మాత్రం అదే ప్రత్యర్థులకు ఆయుధమై కోర్టు కేసుల వరకు వెళ్లటమే కాకుండా అనర్హత వేటుకు దారితీయొచ్చు. ఆస్తులు, అప్పులను ప్రస్తావించాల్సిందే! స్థిర, చరాస్తుల వివరాలతోపాటు చేతిలో, బ్యాంకు అకౌంట్లోని నగదు, డిపాజిట్లు, ఇతర సేవింగ్స్, బీమా పాలసీలు, అప్పులు తదితరాలు పొందుపర్చాలి. ఆభరణాలు, వాహనాలు, వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాలు, నివాస స్థలాల వంటి వాటిని అఫిడవిట్లో ప్రస్తావించాలి. అవి వారసత్వంగా వచ్చాయా, కొనుగోలు చేశారా అన్నది తెలపాలి. స్థిరాస్తులకు సంబంధించిన ప్రస్తుత మార్కెట్ విలువను పొందుపర్చాలి. అభ్యర్థితోపాటు కుటుంబ సభ్యుల పేరిట రుణాలు ఉంటే వాటి వివరాలనూ ప్రస్తావించాలి. కుటుంబ సభ్యుల ఆదాయ మార్గాలు, ప్రభుత్వం లేదా ప్రైవేటు కంపెనీల కాంట్రాక్టులు ఉంటే వాటి వివరాలు తెలియజేయాలి. సమాచారం లేకపోతే నోటీసు అఫిడవిట్లోని ఏఒక్క కాలమ్ ఖాళీగా వదలరాదని ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులకు సంబంధం లేకపోతే కాలమ్ నిల్ లేదా వర్తించదు అని రాయాలని తెలిపింది. అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్ ను గమనించి ఏదైనా సమాచా రం లేకపోతే ఆర్వో నోటీసు ఇస్తారు. అప్పుడు సవరించిన అఫిడవిట్ను అభ్యర్థి అందించాలి. అయినప్పటికీ పూర్తిస్థాయి వివరాలతో అఫిడ విట్ లేకపోతే స్కృటినీ సమయంలో నామినేషన్ తిరస్కరణకు గురవు తుంది. అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను ఆర్ఓలు నోటీసు బోర్డు, వెబ్సైట్లో పొందుపరుస్తారు.కేసులు పొందుపర్చాలి క్రిమినల్ కేసులు నమోదై ఉంటే వాటి వివరాలను అఫిడవిట్లో పొందుపర్చాలి. ఏదైనా కేసులో న్యాయస్థానాలు గతంలో శిక్ష విధించి నా, అప్పీల్కు వెళ్లినా వాటి సమాచారాన్ని ప్రస్తావించాలి. అన్ని వివరాలతో కూడిన అఫిడవిట్ కు నోటరీ తప్పనిసరి. నామినేషన్ దాఖలు సమయంలో రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) ముందు అభ్యర్థి ప్రమాణం చేస్తారు. వేరే ఎవరైనా నామినేషన్ సమర్పిస్తే సదరు అభ్యర్థి తాను ఉన్న ప్రాంతంలోని మెజిస్ట్రేట్ ముందు ప్రమాణం చేయాలి. కేసుల వివరాలను ప్రముఖ దినపత్రికల్లో స్పష్టంగా కనిపించేలా ప్రకటనలివ్వాలి.ఓటర్లు తెలుసుకోవాలి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబోయే అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవడం ఓటర్ల హక్కు. అప్పుడే అభ్యర్థులపై ఓ స్పష్టత వస్తుంది. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అందులో భాగంగానే అభ్యర్థులు తమ నామినేషన్తోపాటు అఫిడవి ట్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల నిబంధనలకు లోబడి ఫామ్ 26 రూపంలో అభ్యర్థులు అఫిడవిట్ సమర్పించాలి. ఇందులో అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, కేసుల సమాచారంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు తెలపాలి. -
యువతి అదృశ్యం
శివ్వంపేట(నర్సాపూర్): యువతి అదృశ్యమైన ఘటన మండల పరిధి సికింద్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గజ్వేల్ మండలం మక్తమాసన్పల్లి గ్రామానికి చెందిన అక్షయతో శివ్వంపేట మండలం సికింద్లాపూర్ గ్రామానికి చెందిన నవీన్గౌడ్కు గత నెల 30న వివాహమైంది. ఈ నెల 14వ తేదీన అర్థరాత్రి అత్తగారింటి నుంచి అక్షయ వెళ్లిపోయింది. ఓ యువకుడి బైక్ పై వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. నవీన్గౌడ్ తండ్రి వెంకట్గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహిపాల్రెడ్డి తెలిపారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం సిద్దిపేటకమాన్: ఆర్టీసీ బస్టాండ్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సిద్దిపేట పట్టణంలో చోటు చేసుకుంది. సిద్దిపేట వన్ టౌన్ పోలీసుల కథనం మేరకు.. వడదెబ్బకు గురై పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్లు ఉంటుందని, 5.2 ఎత్తు, చామన చాయ రంగుతో, తెలుపు రంగు షర్ట్, నలుపు రంగు పాయింట్ ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తు పడితే డయల్ 100 లేదా సిద్దిపేట వన్ టౌన్ పోలీసు స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. నకిలీ పత్రాలు సృష్టించి భూమి విక్రయంనిందితుడి రిమాండ్ రామచంద్రాపురం(పటాన్చెరు): ఒక వ్యక్తికి సంబంధించిన భూమికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇతరులకు విక్రయించిన వ్యక్తిని బుధవారం రిమాండ్కు తరలించారు. కొల్లూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరా బాద్లో నివాసం ఉండే మనోజ్కుమార్జైన్ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 177లోని 2.27గుంటల భూమిని గతంలో ఆ భూమికి సంబంధించిన భూ యజమానులు ఇతరులకు విక్రయించారు. అయితే భూమిని విక్రయించారని తెలిసి కూడా మనోజ్కుమార్ జైన్ వారి కుటుంబ సభ్యులతో కుమ్ముకై నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ఆ భూమిని మనోజ్కుమార్ జైన్ 2006లో తన పేరు పైన సేల్ డిడ్ చేసుకున్నాడు. ఆ డాక్యుమెంట్ను చూపించి 2023లో కమిడి రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు విక్రయించగా చుట్టూ ప్రహరీ నిర్మించారు. విషయం తెలుసుకున్న అసలు భూమి యాజమాని సుభాష్గౌడ్ కొల్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు మనోజ్ కుమార్ జైన్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. గృహోపకరణాలు దగ్ధం సదాశివపేట రూరల్(సంగారెడ్డి): విద్యుత్ హై ఓల్టేజీతో మండల పరిధిలోని ఆరూర్ గ్రామంలోని పలు వార్డుల్లో గృహోపకరణాలు బుధవారం దగ్ధమయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఒక్కసారిగా హైఓల్టేజీ కరెంటు సరఫరా అయ్యింది. దీంతో పలు గృహాల్లో విద్యుత్ బల్బులు పేలిపోయాయి. ఫ్రిజ్లు, టీవీలు, ఫ్యాన్లు, ఎలక్ట్రానిక్ సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు 40 ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్ధమైనట్లు బాధితులు వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. -
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
నిజాంపేట(మెదక్): చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు చెక్డ్యామ్లో మునిగి వ్యక్తి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామానికి చెందిన నీరటి వెంకటేశం(46) మంగళవారం మధ్యాహ్నం నస్కల్ శివారులోని కాల్వలో చేపలు పట్టడానికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుమారుడు, భార్య చెరువులో, కాల్వలో, గ్రామ శివారులో గాలించినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు వెతుకుతున్నారు. కాల్వ పక్కనే ఉన్న చెక్ డ్యామ్లో మునిగిపోయి ఉండొచ్చని అనుమానంతో వెతకగా కాళ్లుపైకి తేలి కనిపించాయి. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు వల కాళ్లకు చిక్కుకొని చనిపోయి ఉంటాడని తెలిపారు. మృతుడికి భార్య నీరటి కళావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. -
నాటి చరిత్రకు నేటి సాక్ష్యాలు..
● భూగర్భంలో ఆదిమానవుని అవశేషాలు లభ్యం ● సిద్దిపేట జిల్లా నర్మేట, పాలమాకుల, మగ్దూంపూర్, పుల్లూర్లో బహిర్గతం ● నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవంనంగునూరు(సిద్దిపేట): కాల గర్భంలో కలిసిపోయిన చరిత్ర, కళ్ల ముందున్న కట్టడాలు, భూగర్భంలో నిక్షిప్తమైన చారిత్రాత్మక ఆధారాలు, వారసత్వ ప్రదేశాల ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 18న వరల్డ్ హెరిటేజ్డేను జరుపుకుంటున్నారు. దేశ చరిత్రను భావితరాలకు అందించేందుకు పురావస్తుశాఖ తోపాటు తెలంగాణ కొత్త చరిత్ర బృందం నిర్విరామంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా పుల్లూర్, నంగునూరు మండలం నర్మేట, పాలమాకుల, మగ్ధుంపూర్లో 2017 ఏప్రిల్ పురావస్తుశాఖ తవ్వకాలు చేపట్టింది. అక్కడ ఆదిమానవుని అవశేషాలు, రాతి యుగపు పాత్రలు, మృణ్మన పాత్రలు, మెన్మీర్లు, ఆహార అలవాట్లను గుర్తించి హైదరాబాద్లోని పురావస్తుశాఖ కార్యాలయంలో భద్ర పరిచారు. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో బహిర్గతమైన అవశేషాలపై ప్రత్యేక కథనం.. ఎంత పెద్ద బండరాయో.. నర్మేటలో పురావస్తు శాఖ అధికారుల తవ్వకాల్లో సుమారుగా 3 వేల సంవత్సరాల కిందటిదిగా భావిస్తున్న సమాధి బహిర్గతమైంది. బండరాయి (క్యాప్ స్టోన్) 6.70 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు, 65 సెంటీమీటర్ల మందంతో 43 టన్నుల బరువు ఉండగా క్రేన్ సహాయంతో 2 గంటలపాటు కష్టపడి బండను పక్కకు తొలగించారు. మానవుని సమాధి పాలమాకులలో పురావస్తుశాఖ అధికారులు తవ్వకాలు చేపట్టగా అందంగా పేర్చినట్లు కనబడుతున్న బండ రాళ్లు తవ్వకాల్లో బయటపడ్డాయి. సుమారుగా 3 వేల సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో ఆది మానవులు జీవించినట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిని సమాధి చేసి నాలుగు వైపుల బండలను (సిస్ట్) స్వస్తిక్ ఆకారంలో చుట్టూ రెండు వరుసలుగా వృత్తాకారంలో బండరాళ్లను పేర్చారు. కఫ్మాక్స్ నక్షత్ర సమూహాలు గుర్తించేందుకు ప్రాచీన మానవుడు బండరాళ్లపై కఫ్మాక్స్లను చెక్కేవారు. ప్రస్తుతం నడుస్తున్న కాలం, తర్వాత వచ్చే సీజన్, ఋతువులను తెలుసుకునేందుకు ఇలాంటి గుర్తులను వారు నివసిస్తున్న ప్రాంతంలో రాతి బండలపై చెక్కేవారు. ఎముక ఆభరణాలు మేన్హీర్ వద్ద జరిపిన తవ్వకాల్లో ఆదిమానవులు ఎముకలతో తయారు చేసిన అభరణాలు వాడినట్లు తెలుస్తోంది. సుమారుగా 20 వరకు డైమండ్ ఆకారంలో ఉన్న ఎముకతో తయారు చేసిన పూసలు బయపడ్డాయి. ఇలాంటి ఆకృతి మొదటిసారిగా ఈప్రాంతంలోనే బయట పడ్డట్లు అధికారులు తెలిపారు. చెక్కు చెదరని దంతాలు, ఎముక మేన్హీర్ వద్ద ఉన్న పెద్ద సమాధిలో తెగ పెద్దగా భావిస్తున్న మహిళ 60 సెంటీమీటర్ల కాలు ఎముక లభించింది. అలాగే 20 సెంటీమీటర్ల దంతంతో కూడిన దవడ భాగం బయటపడింది. దంతా లు ఇప్పటికి చెక్కు చెదరకపోవడం విశేషం. శంఖాలు (కౌంచ్) చూడగానే రెండు సుద్దరాళ్లుగా కనిపిస్తున్న ఈ వస్తువులు తవ్వకాల్లో బయటపడ్డ శంఖాలు. ప్రాచీన మానవుడు పూజ చేసేందుకు, వ్యక్తి చనిపోయిన తర్వాత అంత్యక్రియల సమయంలో గౌరవ సూచకంగా ఊదేందుకు దీన్ని వాడేవారు. నాటి నుంచి నేటి వరకు కొన్ని తెగల్లో ఈ ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆనాటి కాలంలో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. భావితరాల వారికి అందించాలి పురాతన కాలం నాటి చరిత్ర, సాంస్కృతిని భావి తరాలవారికి అందించాలి. గ్రామాల్లో తిరిగి ఎన్నో అధ్యయనాలు జరిపి చారిత్రక ఆధారాలను సేకరిస్తున్నాం. ప్రభుత్వం చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రాలుగా మార్చాలి. – కొలిపాక శ్రీనివాస్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, నంగునూరు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019