Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
మహబూబాబాద్: మానుకోట పార్లమెంట్ నియోజ కవర్గానికి రెండో రోజు నాలుగు నామినేషన్లు దాఖ లు అయినట్లు అధికారులు వెల్లడించారు. ములు గు నియోజకవర్గం మదనపల్లి గ్రామానికి చెందిన పోరిక బలరాంనాయక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయ న వెంట ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు భూక్య మురళీనాయక్, కోరం కనక య్య, పాయం వెంకటేశ్వర్లు, నాయకులు వెన్నం శ్రీకాంత్రెడ్డి, ఘనపురపు అంజయ్య, నూనావత్ రాధ, ఎడ్ల రమేష్ ఉన్నారు. బలరాంనాయక్ నాయక్ రెండు సెట్లు దాఖలు చేశారు. పినపాక నియోజకవర్గం మణుగూరుకు చెందిన పాల్వంచ దుర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేశారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ముదిగొండ గ్రామానికి చెందిన జాటోత్ రఘునాయక్ ఆధార్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నర్సంపేట ని యోజకవర్గం ఇటుకాలపల్లి గ్రామం ఏనుగుల తండాకు చెందిన బోడ అనిల్ నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రెండు రోజుల్లో ఐదు నా మినేషన్లు, ఆరు సెట్లు పత్రాలు అందినట్లు అధికా రులు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియలో కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు, సహాయ రిటర్నింగ్ అధికారులు లెనిన్ వత్సల్ టొప్పో, డేవిడ్, ఆర్డీఓలు అలివేలు, నర్సింహరావు, తహసీల్దార్లు భగవాన్రెడ్డి, దామోదర్, శ్వేత, సునీల్రెడ్డి, పర్యవేక్షణ అధికారి పవన్కుమార్ పాల్గొన్నారు. వరంగల్లో ముగ్గురి నామినేషన్ కాళోజీ సెంటర్ : వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి శుక్రవారం రెండో రోజు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఎస్పీ అభ్యర్థిగా పంజా కల్పన, స్వతంత్ర అభ్యర్థిగా పేరంబుదూరి కృష్ణసాగర్, మన తెలంగాణ రాష్ట్ర సమైక్య పార్టీ అభ్యర్థిగా ఏఆర్ సేనా ప్రేమ్రెడ్డి రిపిక, స్వతంత్ర అభ్యర్థిగా (1) సెట్ మొత్తం 2 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్యకు అందజేశారు. ఇప్పటి వరకు మొత్తం ఆరుగురు అభ్యర్థులు ఏడు నామినేషన్లు పత్రాలు సమర్పించారు. ఇందులో ఏఆర్ సేనా ప్రేమ్రెడ్డి రిపిక రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.● నామినేషన్ దాఖలు చేసిన మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ -
ముగిసిన సుధాకర్ దంపతుల ప్రస్థానం
చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు ప్రస్థానం శుక్రవారం నాటికి ముగిసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేడ్ జిల్లా మాడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు, అతని భార్య సుమన అలియాస్ రజిత మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు శుక్రవారం తెల్లవారుజామున చల్లగరిగెకు మృతదేహాలను తీసుకొచ్చారు. గ్రామస్తులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. అనంతరం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర నాలుగు గంటల పాటు సాగింది. అనంతరం ముచినిపర్తి గ్రామ శివారులో మావోయిస్టు దంపతుల మృతదేహాలను పక్కపక్కనే ఖననం చేశారు. ఇదిలా ఉండగా.. అంత్యక్రియల నేపథ్యంలో పోలీస్ బలగాలు గ్రామాన్ని చుట్టుముట్టినట్లు తెలిసింది.కాగా, 25 ఏళ్ల క్రితం అడవిబాట పట్టిన సుధాకర్ మధ్యలో ఏనాడూ ఊరిలోకి రాలేదని, శవమై తిరిగొచ్చాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బూటకపు ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అదివాసులకు అండగా నిలిచిన మావోయిస్టులను అన్యాయంగా కాల్చి చంపుతున్నారని ఇది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్ అని పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి అన్నారు. ప్రజా బిడ్డలకు చావు లేదు ఉద్యమంలో చనిపోయిన సుధాకర్– సుమన దంపతులు ప్రజా బిడ్డలేనని వారికి ఎప్పటికీ చావు లేదని.. అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ అన్నారు. కేంద్ర ప్రభుత్వం హత్యకాండను పోత్సహిస్తుందని ఆరోపించారు. నివాళులర్పించిన వారిలో శాంతక్క, శోభ, శ్రీపతి రాజగోపాల్, గుమ్మడి కొమురయ్య, అంజన్న, మార్వాది సుదర్శన్, హుస్సేన్, విరసం నేతలు, బంధుమిత్రులు ఉన్నారు. ప్రజా బిడ్డలకు చావులేదు: ప్రజాసంఘాల నాయకులు చల్లగరిగెలో అంత్యక్రియలు పూర్తి -
జనజీవన స్రవంతిలో కలవండి
ములుగు: మావోయిస్టు జీవితాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని ములుగు ఎస్పీ శబరీష్ సూచించారు. ములుగు జిల్లా వాజేడు మండలం ప్రగళ్లపల్లి గ్రామానికి చెందిన పుల్లూరు నాగరాజు అలియాస్ జగత్, సీపీఐ మావోయిస్టు పార్టీ రెండో సీఆర్సీ ఏ సెక్షన్ కమాండర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బూర్గంపాడు గ్రామానికి చెందిన నూప భీమా అలియాస్ సంజు, రెండో సీఆర్సీ పీపీసీఎం/ఏసీఎం భీమా భార్య సోని పోలీసుల ముందు లొంగిపోయారు. కాగా, వారిపై ఉన్న నగదు రివార్డు మొత్తాన్ని ఎస్పీ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం కల్పిస్తున్న భరోసాతో చాలామంది లొంగిపోతున్నట్లుగా వాగ్మూలం ఇచ్చారన్నారు. -
మానుకోట.. కాంగ్రెస్ కంచుకోట
జన జాతర సభలో జోష్ నింపిన సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో చూస్తా.. గెలిచే స్థానాల్లో మొదటి రెండు స్థానాలు ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ ఉంటాయి. ఇరు పార్లమెంట్ ఇన్చార్జ్లు పొంగులేటి, తుమ్మల ఇక్కడే ఉన్నారు. ఈ రెండు పార్లమెంట్ స్థానాల్లో ఎవరు ఎక్కువ మెజార్టీ తెస్తారో చూస్తాం. ప్రజలను ఇబ్బందులు పెట్టి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే నరేంద్ర మోదీ, ఆయనకు మద్దతుగా ఉన్న కేసీఆర్కు బుద్ధి చెప్పాల్సిందే. ఈ రెండు పార్టీలను ఓడించేందుకు మీరు (ప్రజలు) సిద్ధమేనా.. – సీఎం రేవంత్రెడ్డి సాక్షి, మహబూబాబాద్: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపును కాంక్షిస్తూ శుక్రవారం మానుకోటలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ ప్రసంగం ఆద్యంతం పార్టీ శ్రేణులు, ప్రజల్లో జోష్ నింపుతూ సాగింది. సీఎం రేవంత్రెడ్డి మధ్యాహ్నం 3.15 గంటలకు మహబూబాబాద్ చేరుకున్నారు. అప్పటికే ఆయన అలసిపోవడంతో బస్సులో విశ్రాంతి తీసుకొని సాయంత్రం 5:16 గంటలలకు సభా వేదికపైకి వచ్చారు. 6:17 గంటల వరకు ప్రసంగం సాగింది. సీఎం వచ్చిన తర్వాత తొర్రూరు, డోర్నకల్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. అప్పటివరకు కాసేపు పొంగులేటి, తర్వాత తుమ్మలతో సీఎం ముచ్చటించారు. సీఎం వేదికపైకి వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంప్ పైకి వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. తర్వాత మానుకోట.. ఎప్పటికి కాంగ్రెస్ కంచుకోట.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగం ప్రారంభించి మొదటి మాటతోనే కార్యకర్తలు, ప్రజల్లో ఉత్తేజాన్ని నింపారు. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను విమర్శించడమే లక్ష్యంగా సీఎం ప్రసంగం సాగింది. ముందుగా ప్రధాని మోదీ నుంచి మొదలు పెట్టి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి వరకు విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన పని ఏమీలేదని, బయ్యారం ఉక్క ఫ్యాక్టరీ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గిరిజన యూనివర్సిటీ ఆలస్యం చేయడంతో గిరిజనులు నష్టపోయిన తీరును వివరించారు. పార్లమెంట్లో తెలంగాణను తక్కువ చేసి మాట్లాడిన ప్రధాని మోదీని ఎలా సమర్థిస్తారని కిషన్రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఏ మొఖంతో ఓట్లు అడుగుతుందని చెప్పి అవునా.. కాదా.. అని ప్రజలతోనే చెప్పించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడం, బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు, కేసీఆర్ బిడ్డ కోసం రాష్ట్రాన్ని బీజేపీ కాళ్లముందు వేశారని విమర్శలు చేశారు. ‘ప్రభుత్వం కూలిపోతుంది.. పార్టీలు మారుతారు అన్న విషయంపై ఆషామాషీగా రాలేదని ఎన్నో ఎత్తుగడలతో వచ్చాం.. బీఆర్ఎస్ను తొక్కి వచ్చాం’ అని చెప్పడంతో.. ప్రజలనుంచి ప్రతిస్పందన వచ్చింది. జోష్ నింపుతూ ప్రసంగం ముఖ్యమంత్రి ప్రసంగం కార్యకర్తలు, ప్రజల్లో జోష్ను నింపుతూ సాగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించామని, ఇప్పుడు మోదీని ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ చేసిన త్యాగం చెబుతూ.. అప్పటి ఎంపీలు సోనియాగాంధీకి బలిదానాల విషయం చెప్పిన తీరు.. ఆమె స్పందన, తల్లిగా అర్థం చేసుకుందని చెబుతూ.. ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ను కదిలించారు. పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ ఏమీ చేయలేదని చెప్పి.. రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు రుణమాఫీ, ఉద్యోగాల నియామకం మొదలైన అంశాలను ప్రస్తావించారు. అదే తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేశామని చెప్పి ప్రజలతో చెప్పించారు. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటన చేయడంతో సభ ముందున్న వారందరూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే ముందుగా కుల సంఘాల నాయకులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల ప్రసంగాలు మొదలుకొని సీఎం ప్రసంగం వరకు అభ్యర్థి బలరాంనాయక్ స్టేజీకి అటు చివర నుంచి ఇటు చివరి వరకు నడుస్తూ.. ప్రజలకు అభివాదం చేయడం... తనను గెలిపించాలని చెప్పకనే చెప్పినట్లు సంకేతంగా మారింది. మంత్రులు ఏమన్నారంటే.. బీజేపీ, బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు కేసీఆర్ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన మంత్రులు చేతులు ఊపుతూ.. దండం పెట్టే పనిలో అభ్యర్థి బలరాంనాయక్ కొనసాగుతున్న నామినేషన్ల పర్వం మానుకోటలో రెండో రోజు నాలుగు, వరంగల్లో మూడు నామినేషన్లుసీఎం పర్యటన ఇలా.. 3.12 గంటలకు హెలికాప్టర్ ల్యాండింగ్ 3.15 నుంచి 5.14వరకు సీఎం రేవంత్రెడ్డి విశ్రాంతి 5.16 గంటలకు సభాస్థలికి చేరుకున్న సీఎం 5.51 గంటలకు సీఎం ప్రసంగం ప్రారంభం 6.17 గంటలకు ప్రసంగం ముగిసింది 6.18 గంటలకు మానుకోట ప్రజలకు అభివాదం చేశారు 6.25 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్లారు8లోu -
సెల్ఫీ పాయింట్
ఓటుహక్కు ప్రాధాన్యం చైతన్యం కల్పించడంలో భాగంగా వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య, అధికారులతో కలిసి సెల్ఫీ దిగి ప్రారంభించారు. పబ్లిక్గార్డెన్, వరంగల్ రైల్వేస్టేషన్, బస్స్టేషన్ల వద్ద సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి యువకులను ఆకర్షించి ఓటు నమోదు శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ శ్రీనివాస్, జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీసీఓ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.– కాళోజీ సెంటర్
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019