Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
అక్రమ మద్యంపై గట్టి నిఘా పెట్టండి
అనకాపల్లి : సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలో అక్రమ మద్యం పంపిణీ నిర్మూలనకు దిగువస్థాయి సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎడిషనల్ ఎస్పీ, జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ బి.విజయభాస్కర్ అన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో సోమవారం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ, జిల్లా స్థాయి అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎక్కడికక్కడ మద్యం పంపిణీని అరికట్టడానికి అధికారులతో పాటు దిగువ స్థాయి సిబ్బంది తనిఖీలను నిర్వహించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులపై దృష్టి సారించాలని, ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే మద్యంపై నిఘా పెట్టాలని సూచించారు. అలాగే మద్యం డిపో నుంచి ప్రభుత్వ బార్లకు సరఫరా అయ్యే మద్యం నిల్వల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అన్నారు. -
మావోయిస్టులకు సహకరించొద్దు
కొయ్యూరు: మండలంలోని బూదరాళ్ల పంచాయతీ అన్నవరం, కన్నవరం, పోకలపాలెం, గోదుమలంక, బాలరేవుల గ్రామాల్లో సీఐ వెంకటరమణ, మంప ఎస్ఐ లోకేష్ కుమార్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు జరగకుండా చేసేందుకు మావోయిస్టులు ఎలాంటి విధ్వంసానికైనా పాల్పడే అవకాశం ఉందన్నారు. మావోయిస్టులకు ఎవరు సహకరించొద్దన్నారు. ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని కోరారు. గంజాయి రవాణా, సాగు, సారా తయారీ, విక్రయాలకు దూరంగా ఉండాలన్నారు. యువత ఉన్నత విద్యపై దృష్టి సారించాలని, వ్యసనాలకు దూరంగా ఉండాలని హితవుపలికారు. యువత ఉపాధి కోసం ప్రభుత్వం స్కిల్ డవలప్మెంట్ ద్వారా ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
దోమల నివారణకు ప్రత్యేక చర్యలు
చింతూరు: మలేరియా జ్వరాల అదుపులో భాగంగా దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చింతూరు ఐటీడీఏ పీవో కావూరి చైతన్య ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో వైద్యశాఖ అధికారులు, సిబ్బందితో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రతి ఇంట్లో తప్పనిసరిగా దోమలమందు పిచికారీ చేయాలని, ఈ కార్యక్రమానికి ఇతర శాఖల అధికారులు సహకారం అందించాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని పీవో ఆదేశించారు. అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీనివాసరాజు మాట్లాడుతూ దోమల మందు పిచికారీకి సంబంధించి వాడే విధానం, మెలకువలపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. చింతూరు డివిజన్లోని 157 గ్రామాల్లో మొదటి విడతలో భాగంగా వచ్చేనెల 15 వరకు, రెండో విడత కింద జూలై నుంచి ఆగస్టు వరకు దోమలమందు పిచికారీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ పుల్లయ్య, నాలుగు మండలాలకు చెందిన వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎంసీసీ మార్గదర్శకాలను పాటించాలి
పాడేరు : ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సూపర్వైజర్లు, సేల్స్మేన్లు తప్పనిసరిగా ఎంసీసీ మార్గదర్శకాలను పాటించాలని ఎస్ఈబీ జిల్లా అధికారి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక డీఎస్ఈవో కార్యాలయంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి ఎంఏ ఖదీర్తో కలిసి ఎకై ్సజ్ ఎన్పోర్స్మెంట్, ఎస్ఈబీ అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. గైడ్లైన్స్లో సూచించిన నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ అమ్మకాలు జరిపితే సూపర్వైజర్లు, సేల్స్మన్లపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. జీఆర్వో సిబ్బందిని తరచుగా కౌన్సెలింగ్ చేయాలని సూచించారు. రెండు శాఖలు సమన్వయం చేసుకొని పని చేయాలని, ప్రతి నెలా సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ఎంసీసీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి
కశింకోట: మండలంలోని విసన్నపేట వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కూలీ దుర్మరణం చెందాడు. సీఐ వినోద్బాబు అందించిన వివరాల ప్రకారం..యలమంచిలిలోని చిన్న గొల్లలపాలెంకు చెందిన మువ్వల సన్యాసినాయుడు (45) బయ్యవరం నుంచి విసన్నపేటకు బైక్పై వెళుతుండగా అదుపు కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సన్యాసినాయుడు ఎక్కడ పని ఉంటే అక్కడకు వెళ్లి కూలి చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఎప్పటిలాగే కూలి పనికి వెళుతుండగా జరిగిన ప్రమాదంలోమృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించినట్టు సీఐ తెలిపారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019