పండుటాకులు విలవిల
● బాబూ.. నీ నిర్వాకం చూడు.. పండుటాకులు విలవిలప్రభుత్వం అందిస్తున్న పింఛను నగదు ఇంటికి రాకుండా అడ్డుకున్న టీడీపీ వైఖరిపై పండుటాకులు, వితంతువులు మండిపడ్డారు. ప్రతినెలా ఒకటో తేదీన ఠంచన్గా పింఛన్ ఇచ్చే వలంటీర్ వ్యవస్థ ప్రతిపక్షాల కుట్ర రాజకీయాలకు దూరమవడంతో వారంతాఅసహనానికి గురయ్యారు. నగదు తీసుకునేందుకు మండుటెండలోబ్యాంకులకు వెళ్లిన పింఛనుదారులు రోజంతా పడిగాపులు పడ్డారు.కన్నబిడ్డల మాదిరిగా వలంటీర్లు తమ వద్దకు వచ్చి పింఛను ఇచ్చేవారని..ఇప్పుడు వారిని తొలగించడంతోఈ దుస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన ప్రతిపక్షా ల వైఖరిపై వారంతా ధ్వజమెత్తారు.సాక్షి,పాడేరు: ప్రతినెలా హాయిగా ఇంటివద్ద పింఛను పొందే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. బ్యాంక్ ఖాతాల్లో నగదు జమచేసినట్టు అధికారులు చెప్పడంతో జిల్లా వ్యాప్తంగా పింఛనుదారులు మండుటెండలో సంబంధిత బ్యాంకులకు చేరుకున్నారు. బ్యాంక్ ఖాతాలు నిర్వహణ లోపం కారణంగా చాలా వరకు వినియోగంలో లేవు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలోని 52 బ్యాంకుల పరిధిలో 1,08,626 మంది పింఛనుదారుల ఖాతాల్లో అధికారులు నగదు జమ చేశారు. కదల్లేని స్థితిలో ఉన్న 18,809 మందికి ఇళ్లవద్ద అందించేలా ఏర్పాట్లు చేశారు. బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయినప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా ఇబ్బందులు పడ్డారు. వలంటీర్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని పింఛనుదారులు దుయ్యబెట్టారు.
చింతూరు: మండలంలో 5,169 మంది పింఛనుదారులు ఉండగా వీరిలో 4,419 మంది బ్యాంక్ ఖాతాల్లో నగదు అధికారులు జమచేశారు. మిగతా 750 మందికి ఇళ్లవద్దకు వెళ్లి ఇచ్చేలా గ్రామ సచివాలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. మండలంలో కేవలం చింతూరు, మోతుగూడెంలో మాత్రమే బ్యాంకులు ఉన్నాయి. దీంతో సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని మల్లంపేట, నర్సింగపేట, అల్లిగూడెం, దొంగలజగ్గారం వంటి మారుమూల గ్రామాల నుంచి ఎన్నో వ్యయప్రయాసల కోర్చి వృద్ధులు, వితంతువులు అవస్థలు పడుతూ చింతూరులోని బ్యాంకులకు వచ్చి పింఛనుసొమ్ము తీసుకున్నారు. రానుపోను రూ.200 నుంచి రూ. 300 వరకు ఖర్చయిందని వారు వాపోయారు.
హుకుంపేట: పింఛను పొందేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాకు వచ్చారు. ఎండతీవ్రతకు ఇబ్బందులు పడ్డారు. వలంటీర్లను లేకుండా చేసిన చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెబతామని వారు హెచ్చరించారు.
అనంతగిరి: పింఛను పొందేందుకు కాశీపట్నం ఎస్బీఐ వద్ద పింఛనుదారులు పడిగాపులు పడ్డారు. మండలంలో 6,156 పింఛను ఉండగా వీటిలో 5,311 పింఛన్ల సొమ్మును వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయగా 845 మందికి నేరుగా వెళ్లి అందించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధాప్య పింఛనుదారులంతా కాశీపట్నం ఎస్ఐబీ బ్యాంక్ వద్ద రోజంతా పడిగాపులు పడ్డారు.35 కిలోమీటర్ల నుంచి వచ్చా
పింఛను సొమ్ము బ్యాంకు నుంచి తీసుకునేందుకు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతూరు వచ్చా. పేగ నుంచి ఆటోలో ఏడుగురాళ్లపల్లి చేరుకుని అక్కడినుంచి బస్సులో చింతూరు వచ్చి బ్యాంకులో నగదు తీసుకున్నా. రవాణా, ఇతర ఖర్చులు కలిపి రూ.350 వరకు అయ్యాయి. – సోడె రామయ్య,పేగ, చింతూరు మండలం వలంటీరు సేవలే కావాలి
గతంలో ఒకటో తేదీకల్లా వలంటీర్లు ఉదయమే పింఛను సొమ్ము ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. వలంటీర్లను తొలగించడంతో పింఛను సొమ్ముల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మళ్లీ మాకు వలంటీర్ల సేవలు అందుతాయి.
– మడకం సోమమ్మ,
లచ్చిగూడెం, చింతూరు మండలం రెండు గంటల వరకువేచి ఉన్నా..
పింఛను పొందేందుకు ఎన్నడూలేని విధంగా ఇబ్బందులు పడ్డాం. వలంటీర్లు ఇంటికి వద్దకు తెచ్చి పింఛను ఇచ్చేవారు. ఒకటో తేదీకల్లా అందడంతో ఆర్థిక అవసరాలు తీర్చుకునేవాళ్లం. ఉదయం 10 గంటలకు బ్యాంక్కు వస్తే మధ్యాహ్నం 2 గంటలకు పింఛను తీసుకున్నా. – బి.పరశురాం,
దోనిపుట్టు, జరెల, మంచంగిపుట్టు మండలం ఇబ్బంది పెట్టడం సరికాదు
ఇంటికి వచ్చి ఇచ్చే పింఛన్లను రాజకీయ కక్షతో అడ్డుకుని రాకుండా చేశారు. ఇప్పుడేమో పింఛను సొమ్ముల కోసం ఎన్నో కష్టాలు పడుతున్నాం. పింఛను సొమ్ము కోసం 35 కిలోమీటర్లు దూరంలోని చింతూరు వచ్చా. వృద్ధాప్యంలో ఇన్ని ఇబ్బందులు పెట్టడం సరికాదు.
– కూర తమ్మయ్య,
పేగ, చింతూరు మండలం ఖాతా డెడ్ అయిందన్నారు
పింఛన్ సొమ్ము పొందేందుకు ఉదయాన్నే పాడేరులోని ఎస్బీఐకు వెళ్లాను. బ్యాంకు పుస్తకం చూపిస్తే పరిశీలించిన సిబ్బంది తన ఖాతా డెడ్ అయిందన్నారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు జెరాక్స్ కాపీలు తెమ్మన్నారు.అవన్ని అందజేస్తే మళ్లీ బ్యాంకు ఖాతాను పునరుద్ధరించిన తరువాత పింఛన్ సొమ్ము జమచేస్తామన్నారు. – షేక్ బీబీ,
చింతలవీధి, పాడేరు మండలంనగదు లేక ఇంటికి వెళ్లిపోయా
పింఛను తీసుకునేందుకు ఆటో కట్టించుకుని మండల కేంద్రం ముంచంగిపుట్టులోని బ్యాంక్కు వెళ్లా. డబ్బులు తీసుకురావడానికి బ్యాంక్ అధికారులు పాడేరు వెళ్లారని చెప్పారు. గంటల తరబడి వేచి ఉన్నా.. వారు రాకపోవడంతో పింఛను తీసుకోకుండానే ఇంటికి వెళ్లిపోయా.
– కొర్ర సోమి, సరియాపల్లి,బంగారుమెట్ట
పంచాయతీ, ముంచంగిపుట్టు మండలంవలంటీర్లను అడ్డుకోవడం సరికాదు
వలంటీర్లు ప్రతినెలా ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటికి పింఛను తీసుకువచ్చి ఇచ్చేవారు. దీని వల్ల మాలాంటి వృద్ధులకు ఎంతో మేలు జరిగేది. ఇలా సేవ చేస్తున్న వారిని నిబంధనల పేరుతో అడ్డుకోవడం సరికాదు. పింఛను పొందేందుకు రెండు నెలల నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. పింఛను సొమ్మే జీవనాధారం. మాలాంటి వాళ్లను ఇబ్బందులు పెట్టడం సరికాదు. – ఎం.మహలక్ష్మమ్మ, వృద్ధురాలు, చింతలవీధి, పాడేరు మండలం● పింఛను పొందేందుకు బ్యాంకుల వద్ద పడిగాపులు
మండుటెండలో సమస్యలు ఎదుర్కొన్న వృద్ధులు, వితంతువులు
వలంటీర్లను లేకుండా చేయడం వల్లే
ఈ దుస్థితి
మాపై ఎందుకంత కక్ష చంద్రబాబూ.. అంటూ ఆగ్రహం