Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
ప్రజాభిమానం నా అదృష్టం
సాలూరు: ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డితో పాటు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిమానాన్ని చూరగొనడం తన అదృష్టమ ని సాలూరు అసెంబ్లీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు శుక్రవా రం ఆయన సాలూరు ఆర్ఓ కార్యాలయంలో తన తొలిసెట్ నామినేషన్ దాఖలు చేసిన తరువాత విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గడపగడపకు వైఎస్సార్సీపీ, అధికారంలోకి వచ్చిన తరువాత గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అండగా నిలిచామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ, పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అందించారని తెలి పారు. తన పాలనలో మీకు మంచి జరిగితేనే ఓటు వేయండని ధైర్యంగా ప్రజలను కోరుతున్న దేశంలో నే ఏకై క నాయకుడు జగన్మోహన్రెడ్డి అని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునా యుడు అధికారంలోకి ఉండగా రైతులు, మహిళలు, యువత తదితర అన్ని వర్గాల ప్రజలను మోశాం చేశారని విమర్శించారు. నేడు సూపర్సిక్స్ అంటూ మళ్లీ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి చేసింది జగన్మోహన్రెడ్డి అని, ప్రజలను మోసం చేసింది చంద్రబాబు అని స్పష్టం చేశారు. మోసగాళ్ల మాటలు నమ్మవద్దు పొత్తులతో వస్తున్న ఈ మోసగాళ్ల మాటలను నమ్మవద్దని ప్రజలను కోరారు. నియోజకవర్గంలో ప్రజల కు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నానన్నారు. జగన్మోహన్రెడ్డి పాలనలో సాలూరు నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసిన జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపైవేసి వైఎస్సార్సీపీ విజయదుందుభి కొనసాగించడానికి ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన వెంట అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎన్నికల పరిశీలకుడు శ్రీనివాసరావు పార్టీ నాయకులు ఉన్నారు. ప్రజలతో మమేకం కావడమే రాజకీయం సాలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్నదొర -
జయం మనదే
● వైఎస్సార్సీపీ అభ్యర్థుల్లో స్పష్టంగా గెలుపు ధీమా ● పాలకొండ, కురుపాంలో సమరోత్సాహంతో నామినేషన్ల దాఖలు ● సాలూరులో నిరాడంబరంగా రాజన్నదొర.. ●●వెల్లువలా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులుఎర్రటి ఎండను లెక్కచేయని అభిమానం..తమ ప్రతినిధిపై ఉన్న అంతులేని ప్రేమ..విజయంపై సడలని ఆత్మవిశ్వాసం..ఎవరు పోటీలో ఉన్నా గెలుపు ఫిక్స్ అన్న నమ్మకం..పోలింగ్ లాంఛనమే అన్న ధీమా..వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, వారి అనుచరులు, పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, అరకు పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేసిన సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. సమరోత్సాహంతో తమ అభ్యర్థుల వెంట అడుగేస్తూ వారిని ముందుకు నడిపిస్తూ..విజయం పట్ల వారికి నమ్మకం కలిగిస్తూ కదిలాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు..నాయకులు ఎన్నికల కదనరంగంలోకి కాలుపెట్టిన సందర్భంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయా? అన్న రీతిలో నామినేషన్ల ఘట్టం కోలాహలంగా సాగింది. –సాక్షి, పార్వతీపురం మన్యం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తొలిరోజు ఒక నామినేషన్ పడగా.. రెండో రోజు శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి 6 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏకాదశి శుభతిథి కావడంతో నామినేషన్ వేసేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఈ మేరకు ఆలయాల్లో పూజలు నిర్వహించి, పెద్దల ఆశీర్వాదం తీసుకుని బయల్దేరారు. ఉపముఖ్యమంత్రి, సాలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొర నిరాడంబరంగా వెళ్లి రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో విష్ణుచరణ్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ నెల 24న మరోసారి కార్యకర్తలు, అభిమానులు, నాయకుల సమక్షంలో అట్టహాసంగా ఆయన నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరఫున గుమ్మడి సంధ్యారాణి నామినేషన్ దాఖలు చేశారు. కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి నియోజకవర్గవ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి కురుపాం తహసీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి వీవీ రమణకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆమె భర్త, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్రాజు, అరకు పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిని డాక్టర్ గుమ్మ తనూజరాణి ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఉన్నారు. పాలకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిని విశ్వాసరాయి కళావతి తొలుత పలు ఆలయాల్లో పూజలు చేసిన అనంతరం సీతంపేట సంత నుంచి ఐటీడీఏ వరకు అభిమానులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లారు. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన అభిమానులు ఆమె వెంట నడిచారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ ప త్రాలు అందజేశారు. పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బోనెల విజయచంద్ర, స్వతంత్ర అభ్యర్థిగా గర్భాపు ఉదయభాను నామినేషన్ దాఖలు చేశారు. -
పక్కాగా వ్యయ రిజిస్టర్ నిర్వహణ
● అరకు పార్లమెంట్ వ్యయ పరిశీలకుడు గురుకరణ్సింగ్ పార్వతీపురం: షాడో వ్యయ రిజిస్టర్ను పక్కాగా నిర్వహించాలని అరకు పార్లమెంట్ నియోజకవర్గం వ్యయ పరిశీలకుడు గురు కరణ్సింగ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో వ్యయ నమోదుపై సహాయ వ్యయ పరిశీలకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల పోటీల్లో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో భాగంగా నిర్వహించే ర్యాలీ లు, సమావేశాలు, ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించాలని చెప్పారు. కాఫీ, టీ, తాగునీటి వంటి అంశాలతో సహా వాహనాల వినియోగం తదితరాలను పరిశీలించాలని స్పష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి అశ్రద్ధ చేయరాదని ఆదేశించారు. అనుమతులు పొందిన వాహనాల వివరాలు నోడల్ అధికారి వద్ద ఉండాలని వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, అరకు పార్లమెంట్ నియోజకవర్గం సహా య రిటర్నింగ్ అధికారి ఎస్ఎస్ శోభిక, వ్యయవిభా గం నోడల్ అధికారి, జిల్లా సహకార అధికారి పి. శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్ సందర్శన జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కమాండ్ కంట్రోల్ రూమ్ను అరకు పార్లమెంట్ నియోజకవర్గం వ్యయ పరిశీలకులు గురుకరణ్సింగ్ శుక్రవారం సందర్శించారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి విభాగం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిట రింగ్ సెల్, సోషల్ మీడియా విభాగం, వ్యయ విభా గం, ఫిర్యాదుల విభాగం, చెక్పోస్టుల పర్యవేక్షణ, నియంత్రణ తదితర విభాగాలను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరును ఆయనకు జాయింట్ కలెక్టర్ వివరించారు. అనంతరం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్, అరకు పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి నిషాంత్కుమార్ను వ్యయ పరిశీలకుడు గురుకరణ్ సింగ్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ జి.కేశవనాయుడు, ఎన్సీసీ నోడల్ అధికారి ఎం.డి గయాజుద్దీన్, సోషల్ మీడియా నోడల్ అధికారి సాయికుమార్, ఎంసీఎంసీ నోడల్ అధికారి ఎల్.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
No Headline
పార్వతీపురంటౌన్: గతంలో గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ, పారిశుద్ధ్య కార్యక్రమాలు అంతంతమాత్రంగానే ఉండేవి. గిరిజనుల ప్రాణాలంటే గతంలో పాలకులకు లెక్క ఉండేది కాదు. 2012 నుంచి 2018 వరకు జిల్లాలో మలేరియా తీవ్రత అధికంగా ఉంది. మరణాలు కూడా ఎక్కువగా నమోదయ్యేవి. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో జీవించే ప్రతి ఒక్కరికి ఆరోగ్య భరోసా కలిగింది. సీజనల్ వ్యాధుల నివారణే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్యారోగ్య కార్యక్రమాలను విస్తృతం చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 50 కుటుంబాలకు గ్రామ వలంటీర్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రభుత్వ యంత్రాగం పలు చర్యలు చేపట్టింది. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను విస్తృతం చేసింది. మరోవైపు దోమల నివారణకు మలేరియా, వైద్యారోరోగ్యశాఖ బృందాలు నిరంతరం పనిచేశాయి. జిల్లావ్యాప్తంగా 4,42,400 దోమతెరలు2022లో జిల్లావ్యాప్తంగా 4,42,400 దోమతెరలను ప్రభుత్వం పంపిణీ చేసింది. దోమతెరల వినియోగంపై వైద్యబృందాలు, సచివాలయ ఉద్యోగులు గిరిజనులకు అవగాహన కల్పించారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వ్యాధుల సీజన్గా ప్రభుత్వం గుర్తించి వైద్యారోగ్య కార్యక్రమాలను చేపడుతోంది. 2019 నుంచి నుంచి దోమల నివారణతో పాటు మలేరియా తీవ్రతను అరికట్టడంలో మలేరియా, వైద్యారోరోగ్యశాఖలు ఎంతో శ్రమించాయి. ప్రతి ఏడాది రెండు దఫాలుగా దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నాయి. ప్రతి గ్రామంలో ఇంటిలోపల, బయట దోమల మందు పిచికారీని తప్పనిసరిగా చేయించాలనే నిబంధనను సచివాలయ ఉద్యోగులు అమలు చేశారు. గ్రామ వలంటీర్లు తమకు నిర్దేశించిన గిరిజన కుటుంబాల నివాసాల వద్ద దగ్గరుండి దోమల నివారణ మందు పిచికారీ చేయించారు. ఇంటింటా ఫీవర్ సర్వే విజయవంతంగా నిర్వహించారు. చిన్నపాటి జ్వరం వచ్చినా వైద్యసిబ్బంది వెంటనే రక్త పరీక్షలు చేసేవారు. మలేరియా, ఇతర జ్వరాలను నిర్ధారించి సకాలంలో వైద్యసేవలు అందించడంతో జ్వరపీడితులు కోలుకున్నా రు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించడంతో మలేరియా వ్యాధి బారిన పడి ఎవరూ మృతి చెందలేదు. ’మే 15 నుంచి దోమల నివారణ మందు పిచికారీఈఏడాది కూడా దోమల నిర్మూలన కార్యక్రమాలకు మలేరియా, వైద్య ఆరోగ్యశాఖలు చర్యలు చేపట్టాయి. ఎన్నికల కోడ్ రాకముందే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో మలేరియా నివారణకు చేపట్టాల్సిన చర్యలను నిర్దేశించింది. ఈ మేరకు జిల్లాలో 401 మలేరియా పీడిత గ్రామాలను గుర్తించి మే 15 నుంచి మొదట విడత దోమల నివారణ మందు పిచికారీని జిల్లా మలేరియాశాఖ ప్రారంభించనుం ది. -
నదీతీరంలో ఏనుగుల అలజడి
● పరుగు తీసిన గ్రామస్తులు భామిని: మండలంలోని తాలాడ వంశదార నదీ తీరంలో శుక్రవారం ఏనుగుల గుంపు అలజడి రేపింది. వేసవి తీవ్రతతో పెరిగిన ఉష్ణోగ్రతలకు విలవిలలాడిన ఏనుగుల గుంపు దాహా ర్తిని తీర్చుకోడానికి నదీ తీరానికి చేరుకున్న సమయంలో గ్రామస్తులు భయాందోళనతో పరుగులు తీశారు. వేసవి ఉపశమనానికి వంశధార నదిఒడ్డుకు తాలాడ వాసులు చేరుకుంటు న్న సమయంలోనే ఏనుగుల గుంపు తారసపడడంతో గందరగోళం నెలకొంది. స్నానాలకు వెళ్లిన గ్రామస్తులు పరుగుపెట్టారు. అంతా సద్దుమణిగాక ఏనుగులు జలకాలాడి నీరు తాగి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. ముమ్మరంగా వాహనాల తనిఖీసీతానగరం: సాధారణ ఎన్నికలకు నామినేషన్లు దాఖలవుతున్న కారణంగా రాష్ట్ర రహదారిపై వాహనాల తనిఖీ ముమ్మరం చేశామని ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్(ఎఫ్ఎస్టి) అధికారి కె.చిన్నారావు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర రహదారిలో బొబ్బిలి–సీతానగరం సరిహద్దు లచ్చయ్యపేట జంక్షన్ నుంచి సూరంపేట వరకు వాహనాలను తనిఖీ చేశారు. కింతలివానిపేట జంక్షన్ వద్ద ద్విచక్రవాహనంపై తరలిస్తున్న బ్యాగ్లను తనిఖీ చేస్తున్న సమయంలో ఆయన మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధి కారి ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది సహకారంతో వాహనాలు తనిఖీ చేస్తున్నామన్నారు. పోటీల్లో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు తాయిలాలు సమర్పించడానికి వాహనాల్లో నిబంధనలకు మించి నగదు, ఆకర్షణీయమైన వస్తువులు తరలించే అవకాశాలున్నాయని భావించి వాహనాల తనిఖీకి రిటర్నింగ్ అధికారి మార్గదర్శకా లు విడుదల చేశారని తెలియజేశారు. ఈ నేపథ్యంలో మే నెల 13 ఎన్నికల పోలింగ్ జరిగేంత వరకూ నిరంతరం వాహనాల తనిఖీ చేపట్ట నున్నామన్నారు. తనిఖీ అధికారులకు వాహనా లు ఎక్కడైనా అపి తనిఖీచేసే అధికారం ఉంద ని, పోలీసు వారి సహకారంతోనే చేపట్టే తనిఖీ సమయంలో వాహన యజమానులు సహకరించాలని కోరారు. రామతీర్థంలో వైభవంగా సహస్ర దీపాలంకరణ నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన పూజలు నిర్వహించిన తరువాత యాగశాలలో నిత్య హోమాలు, వెండి మండపం వద్ద స్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపించారు. సాయంత్రం 6 గంటలకు సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా దీపారాధన మండపంపైకి తీసుకువచ్చి ప్రత్యేక ఊయలలో ఆశీనులు చేశారు. అనంతరం దీపాలు వెలిగించి ఊంజల్ సేవ జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బొబ్బిలి చీరల పరిశీలన బలిజిపేట: నారాయణపురం గ్రామానికి చెందిన నీలకంఠేశ్వర చేనేత సహకార సంఘం తయారు చేస్తున్న బొబ్బిలి చీరలను రాష్ట్ర ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ పవనమూర్తి శుక్రవారం పరిశీలించారు. ఇటీవల కాలంలో సహకార సంఘం తయారు చేసిన బొబ్బిలి చీరలను రాష్ట్రంలోని అన్ని ఆప్కో షోరూంలకు సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటి నాణ్యతను పరిశీలించేందుకు ఆప్కో ఎండీ పవనమూర్తి అమరావతి నుంచి ఇక్కడకు వచ్చారు. చీరలను పరిశీలించి వాటి నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనలు, సలహాలు సంఘ సభ్యులకు అందించారు. ఆయన వెంట కె.వీర్రాజు, సీహెచ్.నారాయణరావు, సభ్యులు ఉన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019