సాలూరు: ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డితో పాటు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిమానాన్ని చూరగొనడం తన అదృష్టమ ని సాలూరు అసెంబ్లీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్నదొర అన్నారు. ఈ మేరకు శుక్రవా రం ఆయన సాలూరు ఆర్ఓ కార్యాలయంలో తన తొలిసెట్ నామినేషన్ దాఖలు చేసిన తరువాత విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గడపగడపకు వైఎస్సార్సీపీ, అధికారంలోకి వచ్చిన తరువాత గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు అండగా నిలిచామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ, పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అందించారని తెలి పారు. తన పాలనలో మీకు మంచి జరిగితేనే ఓటు వేయండని ధైర్యంగా ప్రజలను కోరుతున్న దేశంలో నే ఏకై క నాయకుడు జగన్మోహన్రెడ్డి అని స్పష్టం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునా యుడు అధికారంలోకి ఉండగా రైతులు, మహిళలు, యువత తదితర అన్ని వర్గాల ప్రజలను మోశాం చేశారని విమర్శించారు. నేడు సూపర్సిక్స్ అంటూ మళ్లీ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకు మంచి చేసింది జగన్మోహన్రెడ్డి అని, ప్రజలను మోసం చేసింది చంద్రబాబు అని స్పష్టం చేశారు.
మోసగాళ్ల మాటలు నమ్మవద్దు
పొత్తులతో వస్తున్న ఈ మోసగాళ్ల మాటలను నమ్మవద్దని ప్రజలను కోరారు. నియోజకవర్గంలో ప్రజల కు ఎల్లప్పుడూ అండగా ఉంటూ వస్తున్నానన్నారు. జగన్మోహన్రెడ్డి పాలనలో సాలూరు నియోజకవర్గంలో వేల కోట్ల రూపాయల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసిన జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపైవేసి వైఎస్సార్సీపీ విజయదుందుభి కొనసాగించడానికి ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆయన వెంట అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎన్నికల పరిశీలకుడు శ్రీనివాసరావు పార్టీ నాయకులు ఉన్నారు.
ప్రజలతో మమేకం కావడమే రాజకీయం
సాలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీడిక రాజన్నదొర