Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
చిన హనిమిరెడ్డి ఆస్తుల వివరాలు
అద్దంకి: ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దంకిలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ బాపట్ల ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్, అద్దంకి అసెంబ్లీ అభ్యర్థి పానెం చిన హనిమిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ అభ్యర్థి పానెం చిన హనిమిరెడ్డి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి సురేష్ మాట్లాడుతూ అద్దంకికి హనిమిరెడ్డి లాంటి మంచి వ్యక్తి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దొరికాడని తెలిపారు. ఆయన్ను గెలిపించుకుంటే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తారని చెప్పారు. హనిమిరెడ్డి మాట్లాడుతూ నామినేషన్కు స్వచ్ఛందంగా హాజరైన నాయకులు, కార్యకర్తలను చూసి ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయమని పేర్కొన్నారు. ఈ అభిమానాన్ని బట్టి ఈసారి అద్దంకిలో భారీ మెజార్టీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ఐదు మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఉప్పొంగిన అభిమానం తరంగం అభిమాన తరంగం ఎగసిందా అన్నట్లు ప్రజలు స్వచ్ఛందంగా నామినేషన్కు తరలివచ్చారు. భారీ గజమాలతో అభిమాన నేతల్ని సత్కరించారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని నాయకులు, కార్యకర్తలు ఉదయం 10 గంటలకే అద్దంకి భవానీ సెంటర్కు చేరుకున్నారు. మోటార్ బైకులపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఎండను సైతం లెక్కచేయకుండా డ్యాన్స్లు చేశారు. నామినేషన్కి వచ్చిన జనాన్ని చూస్తే ఈసారి వైఎస్సార్ సీపీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అట్టహాసంగా ర్యాలీ శింగరకొండలో తొలుత చిన హనిమిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అట్టహాసంగా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా అంబేడ్కర్ విగ్రహం వరకు తరలి వెళ్లారు. తరువాత తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ను అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు మారం వెంకారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ వై.వి. భద్రారెడ్డి పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాలలో ఉంటూ అతిథిగా నియోజకవర్గానికి వచ్చి ప్రలోభాలకు గురిచేసే వ్యక్తుల్ని నమ్మరాదని సూచించారు. నిజాంపట్నానికి వాన్పిక్ ప్రాజెక్ట్ వస్తే తీరప్రాంతంలోని వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభించేవని తెలిపారు. విషపు రాజకీయాలతో వాన్పిక్ ప్రాజెక్ట్ను అడ్డుకున్నది చంద్రబాబేనని, నేడు అది వస్తే ఉద్యోగాలు వచ్చేవంటూ మొసలి కన్నీరు కార్చుతున్నాడని ధ్వజమెత్తారు. ఆ నాడు కేంద్రంలోని సోనియాగాంధీ కాళ్లుపట్టుకుని వాన్పిక్ ప్రాజెక్ట్ను అడ్డుకోవటంతో పాటు జగన్మోహన్రెడ్డితో పాటు తనపై అక్రమ కేసులు పెట్టిన ప్రధాన కారకరుడు చంద్రబాబేనని ఆరోపించారు. రంగా హత్యలో ప్రధాన కారకుడైన చంద్రబాబు పంచన పవన్ కల్యాణ్ చేరి కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని తెలిపారు. కాపులకు ఆది నుంచి రాజకీయ అవకాశాలు, అండదండలు కల్పించింది ఆ నాడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అయితే, నేడు జగన్మోహన్రెడ్డి సముచిత స్థానం కల్పించారని వివరించారు. గతంలో దివంగత నేత వైఎస్సార్ ముస్లింలకు కల్పించిన మూడు శాతం రిజర్వేషన్ను తమ కూటమి అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రసంగించటాన్ని ముస్లింలు గమనిస్తూనే ఉన్నారన్నారు. అధికారం కోసమే అపవిత్ర కలయికతో ఎన్నికలకు సిద్ధమైన కూటమి నేతల్ని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.800కోట్లకుపైగా నిధులతో నియోజకవర్గ రూపురేఖలతో పాటు పట్టణ రూపురేఖలు మార్చింది తమ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. అద్దంకిలో అట్టహాసంగా హనిమిరెడ్డి నామినేషన్ తరలివచ్చిన అశేష ప్రజలు తొలుత శింగరకొండలో ప్రత్యేక పూజలు పాల్గొన్న ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్, ఏఎంసీ మాజీ చైర్మన్ భద్రారెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు వెంకారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి పానెం చిన హనిమిరెడ్డి సోమవారం ఆస్తులను ప్రకటించారు. అఫిడవిట్లో చూపిన వివరాల ప్రకారం ఆయనది పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనిర్సిటీలో ఎంబీఏ చదివారు. ఆయనకు చరాస్తులు రూ.9,61,49,916, భార్యకు రూ.35,57,436 ఉన్నాయి. స్థిరాస్తులు రూ.9,56,77,000 ఉన్నట్లు చూపించారు. దీంతో పాటు వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, రెసిడెన్షియల్ భవనాల వివరాలు, వాటి విలువ పొందుపరిచారు. -
రేపు కరణం వెంకటేష్ నామినేషన్
చీరాల: వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఈనెల 24న నామినేషన్ దాఖలు చేస్తున్నానని, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని చీరాల వైఎస్సార్ సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ కోరారు. సోమవారం రామకృష్ణాపురంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. రామకృష్ణాపురంలోని తన ఇంటి నుంచి బుధవారం నామినేషన్ కార్యక్రమం ప్రసాద్ థియేటర్, కొట్లబజార్, ముంతావారి సెంటర్, గడియార స్తంభం సెంటర్, అంబేడ్కర్ సర్కిల్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు జరుగుతుందని వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ చిమటా సాంబు, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ జైసన్బాబు, పార్టీ పట్టణ అధ్యక్షుడు కె.బాబ్జి, రూరల్ అధ్యక్షుడు అంకాళరెడ్డి, వేటపాలెం అధ్యక్షుడు బి.సుబ్బారావు, కార్పొరేషన్ల డైరెక్టర్లు జి.శ్రీనివాసరావు, ఎం.వైష్ణవి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.జిల్లాలో నామినేషన్ల జోరు సాక్షి ప్రతినిధి, బాపట్ల: జిల్లా వ్యాప్తంగా సోమవారం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. బాపట్ల పార్లమెంట్ నుంచి నవతరం పార్టీ అభ్యర్థిగా నలమర్ల తరుపతిరావు, జయభీమ్ రావు భారత్ పార్టీ నుంచి పర్రె కోటయ్య నామినేషన్లు దాఖలు చేశారు. చీరాల నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా కరణం వెంకటేష్, కరణం బలరాం కృష్ణమూర్తి నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ అభ్య ర్థిగా ఎంఎం కొండయ్య, బాల కొండమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్, బహుజన సమాజ్ పార్టీ నుంచి కాటి మార్క్, రిఫార్స్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి తన్నీరు విజయ్, స్వతంత్య్ర అభ్యర్థులుగా శ్రీనివాసరావు, లేళ్ల రాంబాబులు నామినేషన్లు దాఖలు చేశారు. ● వేమూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా నక్కా ఆనందబాబు, వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా వరికూటి అశోక్బాబు, వరికూటి గౌతమ్, జయభారత్ నేషనల్ పార్టీ తరపున భాగ్యరాజు నామినేషన్లు వేశారు. ● అద్దంకి నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పానెం చిన హనిమిరెడ్డి, పానెం ఆదిలక్ష్మి, జయ భీమ్ భారత్ పార్టీ పి.హేబేలు, జాతీయ సమ సమాజం పార్టీ నుంచి బాచిన రాంబాబు, నవోదయ పార్టీ తరపున కుంటుపల్లి గోపి, స్వతంత్ర అభ్యర్థిగా శ్రీనివాసరావు, పి. శ్రీనివాసులు నామినేషన్లు దాఖలు చేశారు. ● పర్చూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఏలూరి సాంబశివరావు నామినేషన్లు దాఖలు చేశారు. ● రేపల్లె నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఈవూరి గణేష్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి బెల్లంకొండ సుబ్బారావు, స్వతంత్య్ర అభ్యర్థిగా రాంబాబు నామినేషన్లు దాఖలు చేశారు.25న ఏపీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష చిలకలూరిపేట టౌన్: ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలల్లో 5,6,7,8వ తరగతుల ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష ఈనెల 25న నిర్వహిస్తున్నట్లు రాజాపేట ఏపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్. సుబ్రహ్మణ్య తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ 2024–25 విద్యా సంవత్సరానికి ఏపీఆర్ఎస్ క్యాట్ –2024 పేరిటా నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఉంటుందని పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. హాల్ టికెట్లను విద్యార్థిలకు పంపమని, httr://aprr.apcfrr.in అనే విద్యాలయ ప్రత్యేక వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపారు. ఐడీ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఏపీ గురుకుల విద్యాసంస్థల్లో 98.45 శాతం ఉత్తీర్ణత గుంటూరు ఎడ్యుకేషన్: సోమవారం విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ యాజమాన్యంలోని పాఠశాలల్లో అత్యధికంగా 98.45 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు సంస్థ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు. కొరిటెపాడులోని సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 50 గురుకుల పాఠశాలల నుంచి పరీక్షలు రాసిన 3287 మంది విద్యార్థుల్లో 3236 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. 15 బాలుర పాఠశాలలతో పాటు 14 బాలికల పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు. కలకడలోని గురుకుల పాఠశాల విద్యార్థిని పి.లిఖిత అత్యధికంగా 597 మార్కులు సాధించినట్లు తెలిపారు. -
తీరని రోదన
వేటపాలెం: ఎదురుగా వేగంగా వచ్చిన లారీ స్కూటీని ఢీ కొట్టిన ఘటనలో అమ్మమ్మ, మనవరాలు మృతి చెందారు. ఈ ఘటన చీరాల – వేటపాలెం బైపాస్ రోడ్డులో అక్కాయిపాలెం ఐస్ ఫ్యాక్టరీ దగ్గరలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. చిన్నగంజాం మండలం కొత్త పాలేనికి చెందిన స్నేహలత తన ఏడాది కూతురు అన్విత, తల్లి బొడ్డు సుబ్బరావమ్మ (57)ను స్కూటీ పై ఎక్కించుకొని బాపట్ల అత్తగారింటికి బయలుదేరింది. అక్కాయిపాలెం దగ్గరకు రాగానే ఎదురుగా ఒంగోలు వైపు వెళ్తున్న లారీ వీరిని ఢీ కొట్టింది. స్కూటీ వెనక కూర్చొన్న సుబ్బరావమ్మ, తనఒడిలో ఉన్న ఏడాది పాప లారీ కింద పడ్డారు. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడికే మృతి చెందారు. స్నేహలత మరో వైపునకు పడి పోవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. కళ్లెదుటే తన పాప, తల్లి మృత్యువాత పడటంతో స్నేహలత బోరున విలపించింది. ఘటనా స్థలానికి ఎస్సై జి.సురేష్ చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. స్కూటీని ఢీకొట్టిన లారీ అమ్మమ్మ, ఏడాది మనవరాలు మృతి -
జిల్లాలో పదింతల ఆనందం
బాపట్ల టౌన్: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సత్తా చాట్టారు. కార్పొరేటుకు దీటుగా పోటీపడ్డారు. జిల్లాలో 336 పాఠశాలల ఉండగా ఆయా పాఠశాలల నుంచి 8497 మంది బాలురు, 8221 మంది బాలికలు కలిపి మొత్తం 16718 పరీక్షలు రాశారు. ఇందులో 7335 మంది బాలురు, 7408 మంది బాలికలు కలిసి మొత్తం 14743 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 86.32 శాతం, బాలికలు 90.01 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 88.19 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాపట్ల పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలకు చెందిన షేక్ రెహాన్ హఫీజ్ 595/600 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానంలో, పర్చూరులోని ఆక్స్ఫర్డ్ హైస్కూల్కు చెందిన ఒగ్గిశెట్టి ఆక్షయ 594 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో, అద్దంకి హోలిఫెయిత్ స్కూల్కు చెందిన గాలి యశ్వంత్ 593 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. 590 మార్కులుపైగా 30 మంది జిల్లాలో 590 మార్కులు పైగా 30 మంది విద్యార్థులు సాధించారు. వారిలో తొమ్మిది మంది బాలురు ఉండగా, 21 మంది బాలికలే ఉన్నారు. వారిలో బాపట్లకు చెందిన మువ్వల సాయి విష్ణుశశాంక్ (593, శ్రీచైతన్య, బాపట్ల), కె. నిఖిత (593, శ్రీచైతన్య, చీరాల), ఎం. శ్రీముఖి(593, డ్రీమ్స్ హైస్కూల్, పోసపాడు), ఎం. శైలేశ్వరి (592, ఎంఎంఆర్ హైస్కూల్, ఇంకొల్లు), గుంటూరు వెంకటరామ నాగలక్ష్మి (592,డ్రీమ్స్ హస్కూల్, పోసపాడు), అక్కల భానుతేజరెడ్డి (592, భాష్యం, అద్దంకి), గవిని శివకుమారి (592, శ్రీచైతన్య, బాపట్ల), షేక్ తోహిత్ హుస్సేన్ (592, అక్షర్ విద్యాభవన్, బాపట్ల), బుర్ల నాగభువనేశ్వరి (592, శ్రీచైతన్య చీరాల), షేక్ నాగూర్వలి (591, జడ్పీ హైస్కూల్, వల్లపర్ల), వి. హిమజశ్రీ (591, విజ్ఞాన్ భారతి, చీరాల), ఎన్. నిఖిత (591, ఆక్స్ఫర్డ్ హైస్కూల్, పర్చూరు), కె. వెంకటసాయి విద్యశ్రీ (591, శ్రీచైతన్య, అద్దంకి), షేక్ ఫరీద్నిదా (591, శ్రీచైతన్య, బాపట్ల), చేబ్రోలు విజయ్ (591, రవీంద్రభారతి, బాపట్ల), పులుగు యశ్వంత్ (591, విజ్ఞానభారతి, చీరాల), కారంకి తనూజ (591, శ్రీచైతన్య, చీరాల), బి. నందిని (591, బాలయేసు స్కూల్, నగరం), శ్యామల తనూజ (590, ఎస్ఎఫ్ఎస్, స్కూల్, నాగులపాలెం), కోళ్లపూడి శ్రీహర్షిత (590, ఆక్స్ఫర్, పర్చూరు), పాలశెట్టి అక్షయశ్రీ (590, లిటిల్ ఏంజెల్స్, బాపట్ల), పఠాన్ షాలేహా (590, సందీప్ స్కూల్, చీరాల), పి. సాయి హర్షితారెడ్డి (590, చీరాల), డి. కుందన (590, డ్రీమ్స్ హైస్కూల్, ఇంకొల్లు), తాతా మహేష్బాబు (590, డ్రీమ్స్ హైస్కూల్, ఇంకొల్లు), పి. శ్రీవర్షిణి (590, రాయల్ హైస్కూల్, మార్చూరు), వి. నందిని (590, శ్రీచైతన్య, మార్టూరు) 61 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత జిల్లాలో మొత్తం 336 పాఠశాలలు ఉండగా వాటిల్లో 61 పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. వాటిల్లో జిల్లా పరిషత్ 19, ప్రైవేటు 37, గురుకుల పాఠశాల 1, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ 1, ఎయిడెడ్ 3 పాఠశాలలు ఉన్నాయి. టెన్త్లో 88.19 శాతం ఉత్తీర్ణత 61 పాఠశాలల్లో 100 శాతం 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 30 మంది ఇందులో తొమ్మిది మంది బాలురు, 21 మంది బాలికలు కార్పొరేట్ పాఠశాలకు దీటుగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు -
No Headline
రేపల్లె రూరల్: రేపల్లెలో ఫ్యాన్ గాలి ముందే వీచింది. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు మద్దతుతో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ ఈవూరు గణేష్ సోమవారం నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కేరింతల మధ్య నామినేషన్ వేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వైఎస్సార్ సీపీ జెండాలు రెపరెపలాడాయి. జైజై జగనన్న... జైజై మోపిదేవి.. జైజై గణేష్ల అంటూ అభిమాన గళంతో రేపల్లె పట్టణం హోరెత్తింది. నియోజకవర్గంలోని రేపల్లె, రేపల్లె రూరల్, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల నుంచి వచ్చిన ప్రజలతో రేపల్లె పట్టణం కిక్కిరిసిపోయింది. తొలుత పట్టణంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి నామినేషన్ దాఖలుకు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు, అభ్యర్థి డాక్టర్ గణేష్ బయలుదేరారు. బస్టాండ్ సెంటర్, రాజ్యలక్ష్మి థియేటర్, పద్మావతి థియేటర్ల మీదుగా నెహ్రూ బొమ్మ సెంటర్, అంబేడ్కర్ విగ్రహం సెంటర్ల మీదుగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. అడుగడుగునా ఎంపీ మోపిదేవికి, అభ్యర్థి గణేష్కు ప్రజలు నీరాజనాలు పలికారు. అనంతరం డాక్టర్ గణేష్ ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో హెలా షారోన్కు నామినేషన్ పత్రాల్ని అందజేశారు. తొలుత తాలూకా సెంటరులోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రేపల్లెలో వైఎస్సార్ సీపీ విజయం ఖాయం: గణేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు సహకారంతో రేపల్లె నియోజకవర్గంలో వెఎస్సార్ సీపీ విజయం ఖాయమని డాక్టర్ ఈవూరు గణేష్ ధీమా వ్యక్తం చేశారు. ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేసిన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రేపల్లె గడ్డపై వైఎస్సార్ సీపీ విజయ ఢంకా మోగించడం తథ్యమని తెలిపారు. బాపట్ల పార్లమెంటరీ అభ్యర్థిగా నందిగం సురేష్, రేపల్లె అసెంబ్లీ అభ్యర్థిగా తనను అఖండ మెజార్టీతో గెలిపించి జగనన్నకు రేపల్లె అసెంబ్లీని కానుకగా అందించాలని కోరారు. రానున్నది వైఎస్సార్ సీపీ ప్రజా ప్రభుత్వమే అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రజలు మరోమారు ముఖ్యమంత్రిగా జగనన్న నాయకత్వానికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణారావు అన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అభ్యర్ధి డాక్టర్ ఈవూరు గణేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా సోమవారం విచ్చేసిన అశేష జనవాహినితో తాలూకా సెంటరులో మోపిదేవి మాట్లాడారు. కులరాజకీయాలను వీడి అభివృద్ధి సంక్షేమానికే పట్టం కట్టాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దేవినేని మల్లికార్జునరావు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు అడపా శేషు, గాదె మధుసూదన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కట్టా మంగ, రేపల్లె, రేపల్లె రూరల్, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల వైఎస్సార్ సీపీ కన్వీనర్లు గడ్డం రాధాకృష్ణమూర్తి, గాదె వెంకయ్యబాబు, వీరంకి ముక్తేశ్వరరావు, పయనం ఏడుకొండలు రెడ్డి, ఎంపీపీలు చింతల శ్రీకృష్ణయ్య, మత్తి దివాకర రత్నప్రసాద్, మోపిదేవి విజయ నిర్మల హరనాథ్బాబు పాల్గొన్నారు. రేపల్లెలో అట్టహాసంగా డాక్టర్ గణేష్ నామినేషన్ దాఖలు అశేష జనవాహినితో తిరునాళ్లను తలపించిన కార్యక్రమం జన సంద్రమైన పట్టణ రహదారులు
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019