breaking news
Ad - Sakshi_Home_Sticky
-
జిల్లావ్యాప్తంగా ఫెసిలిటేషన్ కేంద్రాల ఏర్పాటు
బాపట్ల: ఎన్నికల్లో విధులు నిర్వహిస్తూ పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్న వారంతా సొంత నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల ద్వారా ఓటుహక్కుని వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి పి. రంజిత్ బాషా గురువారం ఒక ప్రకటనలో సూచించారు. 85 సంవత్సరాలు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దనే ఓటు వేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మే 5,6 తేదీల్లో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు, ఓపీఓలు కింద పేర్కొన్న ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఫెసిలిటేషన్ కేంద్రాలు వేమూరు నియోజకవర్గానికి చెందిన వారు వేమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, రేపల్లె నియోజకవర్గానికి చెందిన వారు రేపల్లెలోని క్రిస్టియన్ కళాశాలలో, బాపట్ల నియోజకవర్గానికి చెందిన వారు పట్టణంలోని సత్యనారాయణపురం యాదవపాలెం మున్సిపల్ హైస్కూలులో, పర్చూరుకు చెందిన వారు ఎస్ఎఫ్ఎస్ హైస్కూలు నాగులపాలెం పాఠశాలలో, అద్దంకికి చెందిన వారు ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్ పక్కన ఉన్న ప్రకాశం గవర్నమెంట్ జూనియర్ కళాశాల్లో, చీరాలకు చెందిన వారు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న యార్లగడ్డ అక్కమాంబ మహిళా కళాశాల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. ● పోలీసులు, అత్యవసర సేవల విభాగాల వారు, డ్రైవర్లు, క్లీనర్లు, వీడియోగ్రాఫర్లు, ఇతర ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారంతా నియోజకవర్గంలోని రిటర్నింగ్’ అధికారి కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ● బాపట్ల జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఇతర జిల్లాలో ఓటుహక్కు కలిగి ఉన్న వారందరూ మే 7, 8 తేదీల్లో బాపట్ల ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. -
ఎన్నికల విధుల్లో అశ్రద్ధ వద్దు
ఎస్పీ వకుల్ జిందాల్ బాపట్ల టౌన్: ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా, నిబద్ధతతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లాకు కేటాయించిన మూడు టీఎస్ఎస్పీ, రెండు బీఎస్ఎఫ్ బెటాలియన్ల సాయుధ బలగాల అధికారులతో గురువారం తన కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎస్పీ మాట్లాడుతూ స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించి ప్రజలకు పోలీస్ శాఖ అండగా ఉందనే భరోసాను కల్పించాలని తెలిపారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచే స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట బందోబస్తుతో 24 గంటల పాటు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్లు ఆర్.కె.భారతి, జి.డి.సంజయ్, తెలంగాణ స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ కమాండెంట్లు టి.కాశీదాస్, సీతారాం, ఎం.శ్రీనివాసరావు, బాపట్ల ఏఆర్ డీఎస్పీ ఎస్.చంద్రమోహన్ పాల్గొన్నారు. వైఎస్సార్ పింఛన్ కానుక 95.74 శాతం పంపిణీ నరసరావుపేట: జిల్లాలో వైఎస్సార్ పింఛన్ కానుక గురువారం రాత్రి 8గంటలకు 95.74 శాతం పంపిణీ చేశారు. మొత్తం 2,81,240మందికి రూ.84.01కోట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,69,252మందికి రూ.80.48 కోట్లు పంపిణీ చేశారు. డీఆర్డీఎ పీడీ బాలూనాయక్ నరసరావుపేట మండలం యల్లమంద, శావల్యాపురం, వినుకొండ, బొల్లాపల్లి ప్రాంతాల్లోని పలు బ్యాంకుల్లో లబ్ధిదారుల ఖాతాలకు పింఛన్ల జమ అయిన విధానం పరిశీలించారు. బ్యాంకు ఖాతాల నుంచి పింఛన్దారులు నగదు విత్డ్రా చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. మద్యం అక్రమాలపై దృష్టి సారించండి నరసరావుపేట టౌన్: మద్యం ప్రభావం ఎన్నికల మీద చూపకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఎన్ఫోర్స్బ్యూరో డిప్యూటీ కమిషనర్ కె.హేమంత్నాగరాజు ఆదేశించారు. గురువారం ఎస్ఈబీ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన అధికారులనుఉద్దేశించి మాట్లాడారు. అనుమానిత ప్రదేశాల్లో దాడులు నిర్వహించాలన్నారు. అనధికార మద్యం విక్రయాలు, అక్రమ మద్యంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పూర్తి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. మద్యం కేసుల్లో నిందితులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ఈ.ఎస్.ఖాజామోహిద్దిన్, సీఐ నయనతార, సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ అథ్లెటిక్స్లో రేష్మీకి బంగారు పతకంగుంటూరు వెస్ట్ (క్రీడలు): ఇటీవల బెంగళూరులో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్–1 జాతీయ అథ్లెటిక్ పోటీల్లో భాగంగా జావెలిన్ త్రో విభాగంలో గుంటూరు అథ్లెట్ రేష్మి బంగారు పతకం సాధించిందని అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 53.77 మీటర్లు దూరం జావెలిన్ విసిరి తనకు ఎదురులేరని నిరూపించిందన్నారు. గతంలో కూడా రేష్మి పలు జాతీయ పోటీల్లో పాల్గొందన్నారు. ప్రస్తుతం ఆమె సౌత్ సెంట్రల్ రైల్వే టికెట్ కలెక్టర్గా పని చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా రేష్మిని అసోసియేషన్ చైర్మన్ జి.శేషయ్య, రేమండ్స్ అధినేత టి.అరుణ్ కుమార్, డాక్టర్ ఎం.శివకుమార్, అంకాల సుబ్బారావు అభినందించారని పేర్కొన్నారు. నిమ్మకాయల ధరలు తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4500, గరిష్ట ధర రూ.6800, మోడల్ ధర రూ.5400 వరకు పలికింది. -
వృద్ధులకు శాపం
చంద్రబాబు నిర్వాకం కష్టాలు తెచ్చి పెట్టాడు వలంటీర్ ఒకటో తేదీ తెల్లవారు జామునే నిద్రలేపి పింఛన్ సొమ్ము ఇచ్చేవాడు. చంద్రబాబు పుణ్యామా అంటూ రెండు నెలలుగా సొమ్ము సకాలంలో అందడం లేదు. పనులు మానుకుని పడిగాపులు కాస్తున్నాం. ఈ కష్టాలు మరో నెల భరించాలి. అయ్యా బాబు మేమేం పాపం చేశాం. నీ రాజకీయాలకు మేం బలయ్యాం. – వల్లెపు నాంచారమ్మ, కొప్పరపాడు, బల్లికురవ మండలం చంద్రబాబు నిర్వాకం వల్ల పండుటాకులకు ఈనెలా పింఛన్ కష్టాలు తప్పలేదు. బ్యాంకుల వద్ద పడిగాపులు పడ్డారు. మండుటెండలో మలమల మాడిపోయారు. జగనన్న పాలనలో తెలతెలవారగనే తలుపు తట్టి వలంటీర్లు నగదు చేతిలో పెట్టేవారు. ఒకటి కాదు రెండు నెలలు కాదు.. గత ఐదేళ్లుగా పువ్వుల్లా నగదు చేతిలో పెట్టడంతో వృద్ధులు సంబర పడిపోయారు. జగనన్న పాలనకు జేజేలు పలికారు. ఇది చంద్రబాబుకు కన్ను కుట్టింది. ఎన్నికల్లో ఓడిపోతానని భయం పట్టుకుంది. బృహన్నలలా నిమ్మగడ్డను అడ్డం పెట్టుకుని వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీకి అడ్డుకట్ట వేశాడు. జీవిత చరమాకంలో ఉన్న వృద్ధులు బాబు ఉక్రోషంతో గత నెల పింఛన్ తీసుకోవడానికి నరకయాతన అనుభవించారు. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే, ఈనెల కూడా వారికి యాతన తప్పలేదు. అధికారులు పింఛన్ సొమ్మును ఖాతాల్లో జమ చేయడంతో వృద్ధులు బ్యాంకుల వద్ద మండుటెండలో పడిగాపులు పడుతున్నారు. బాబు నిర్వాకం వల్లే తామంతా రోడ్డున పడ్డామని శాపనార్థాలు పెడుతున్నారు. ఎన్నికల్లో జగనన్నకు ఓటేసి రుణాన్ని తీర్చుకుంటామని చెబుతున్నారు. – సాక్షి నెట్వర్క్●పింఛన్ టెన్షన్ -
ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే విజయం మనదే..
చీరాల టౌన్: ‘మరో పది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రణాళికాబద్ధంగా పనిచేసి, అధిక శాతం పోలింగ్ చేయించేలా కృషి చేయండి.. ఎలాంటి ఒత్తిడికి లోను కావద్దు.. విజయం మనదే’నంటూ రాజ్యసభ సభ్యుడు, పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సూచించారు. మండలంలోని రామకృష్ణాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, అసెంబ్లీ అభ్యర్థి కరణం వెంకటేష్లను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. చీరాల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, ఎన్నికల్లో తీసుకుంటున్న ప్రణాళికలు, పలు అంశాలపై ఎంపీ అయోధ్య రామిరెడ్డి చర్చించారు. నియోజకవర్గంలోని చీరాల, వేటపాలెం మండలాలతో పాటు చీరాల మున్సిపాలిటీలో గత ఐదేళ్లుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పలు అభివృద్ధి పనులు చేసిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అందించినట్లు చెప్పారు. ప్రతి ఓటర్ను కలిసి, మంచి చేసిన జగనన్నకు అండగా నిలవాలని ఓట్లు అభ్యర్థించాలని సూచించారు. ఓటర్లంతా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసేలా ప్రచారం చేయాలని చెప్పారు. పార్టీ కార్యకర్తలంతా సమర్థంగా పని చేసి, చీరాల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగరేయాలని ఆయన పిలుపునిచ్చారు. కరణం వెంకటేష్ ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటుగా సీఎంగా మళ్లీ జగన్ మోహన్రెడ్డి అధికారం చేపట్టనున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, అద్దంకి అసెంబ్లీ అభ్యర్థి పానెం చినహనిమిరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి కరణంతో రీజినల్ కోఆర్డినేటర్, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి -
నేడు క్రోసూరుకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, నరసరావుపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరు రానున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి (తహసీల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డు)లో మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించే బహిరంగసభలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతమైన రీతిలోనే క్రోసూరు సభను సక్సెస్ చేసేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి జిల్లాలో జరపనున్న పర్యటన వైఎస్సార్సీపీ అభిమానుల్లో జోష్ నింపనున్నది. మరింత ఉత్సాహంతో పనిచేసేందుకు సమాయత్తం కానున్నారు. ఏర్పాట్లు పరిశీలించిన తలశిల రఘురాం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బహిరంగసభ ఏర్పాట్లను గురువారం సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పర్యవేక్షించారు. ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, యువ నాయకులు నంబూరు కళ్యాణ్ చక్రవర్తి క్రోసూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో సీఎం హెలీప్యాడ్కు అనువైన స్థలంగా గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం క్రోసూరు మెయిన్ రోడ్డు నుంచి తహసీల్దార్ కార్యాలయం వెళ్లే రోడ్డులో బహిరంగసభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. కట్టుదిట్ట భద్రత సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసులు కట్టుదిట్టభద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ సీఎం హెలీప్యాడ్ ఏర్పాటుచేసిన గ్రౌండ్, బహిరంగసభ జరిగే ప్రాంతాలను పరిశీలించారు. బారికేడ్లు ఏర్పాటు తదితర విషయాలపై సిబ్బందికి సూచనలు చేశారు. హెలీప్యాడ్ నుంచి సభ వరకు సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గంలో పట్టిష్ట బందోబస్తు చేయనున్నారు. మెయిన్ రోడ్డుకు ఇరువైపులా భారీ భవంతులను ఇప్పటికే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎస్పీ పోలీసు సిబ్బందికి సూచనలు చేశారు. జిల్లా అడిషనల్ ఎస్పీలు రాఘవేంద్ర, లక్ష్మీపతి, రామచంద్రరాజు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బహిరంగ సభ వైఎస్సార్సీపీ అభిమానుల జోష్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం ప్రోగ్రాం కోఆర్టినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019