Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
బీజేపీది అసత్య ప్రచారం : మంత్రి శ్రీధర్బాబు
రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ.. మతతత్వ పార్టీ బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో లేని అంశాల ను ప్రస్తావిస్తూ అసత్య ప్రచారం చేస్తుందన్నారు. గడిచిన పదేళ్ల పాలనలో బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలోని ఏ ఒక్క అంశాన్నైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు. దేశ ప్రజలంతా దేవుళ్లను కొలుస్తారని, తాము అనేక గుడులను నిర్మించామన్నారు. కానీ దేవుడు మా వాడేనని మార్కెటింగ్ చేసుకునేలా బీజేపీ వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. అలాగే పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఆరోపించారు. -
ప్రశాంత ఎన్నికలకు.. పకడ్బందీ ఏర్పాట్లు
● సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ● పండుటాకులకు ఇంటి వద్దే ఓటింగ్ సౌకర్యం ● పోస్టల్ బ్యాలెట్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు ● ‘సాక్షి’తో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో లోక్సభ ఎ న్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలన్నింటిలోనూ వెబ్ కాస్టింగ్తోపాటు పట్టిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ వెంకటేష్ దోత్రే సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. సర్వం సిద్ధం.. జిల్లాలో ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చే సేలా ప్రత్యేక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నా యి. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల పరిధి లోని పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గత శాసనసభ ఎ న్నికల కంటే అదనంగా 79 యాగ్జలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. సహాయ పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, మూత్రశాలలు, నీడ తదితర వసతులు ఉండేలా చర్యలు చే పట్టాం. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు కోసం ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నాం. పోలింగ్కు నాలుగు రోజులు ముందుగానే ఈ పనులన్నీ పూర్తి చేస్తాం. తద్వారా పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగదు. సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి...జిల్లాలో మొత్తం 676 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 64 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. వీటితోపాటు మావోయిస్టు ప్రభావిత(ఎల్డబ్ల్యూఈ) ప్రాంతాల్లో 22, మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి నెట్వర్క్ సౌకర్యం లేనివి 63 పో లింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర రక్షణ బలగాల ద్వారా నిఘా ఉంటుంది. మైక్రో అబ్జర్వర్లు పర్యవేక్షిస్తారు. అన్ని సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఎల్డబ్ల్యూఈ, షాడో పోలింగ్ కేంద్రాలు, అర్బన్ ప్రాంతాల్లోని కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ సౌకర్యం ఉంటుంది. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 80 శాతం వాటిల్లో వెబ్కాస్టింగ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలుతీవ్రమైన ఎండలు ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. తాగునీటి వసతి, విద్యుత్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, బల్లలు, దివ్యాంగులు, వృద్ధుల కోసం ర్యాంపులు కచ్చితంగా ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్కు ఇబ్బంది ఉండదు..గత అసెంబ్లీ ఎన్నికల్లో విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ పొందడంలో ఇబ్బంది పడ్డారు. ఈసారి అలా ఉండదు. ఎన్నికల సంఘం ఎన్ఐసీ నుంచి ఒక యాప్ ఇచ్చారు. దాని ద్వారా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఎపిక్ నంబర్తో సహా వివరాలు పొందుపరిస్తే వారి ఓటు ఎక్కడ ఉందో అక్కడ డేటాతో సహా క్యాప్చర్ అవుతుంది. గతంలో మాన్యువల్గా ఉండటంతో కొద్దిగా గందరగోళానికి గురయ్యారు. ఈసారి ఆన్లైన్ కావడంతో ఎవరు ఎక్కడ ఓటేసేందుకు ఎంపిక చేసుకున్నారో స్పష్టంగా తెలుస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో వివరాలు నమోదు చేసుకునేందుకు ఉద్యోగులకు మే 3 నుంచి 8 వరకు సమయం ఇచ్చాం. పోలింగ్ శాతం పెంచే దిశగా..ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఓటుహక్కు అత్యంత కీలకం. ఓటు వజ్రాయుధమని ‘స్వీప్’ ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నాం. యువత అధికంగా ఉన్న కళాశాలలు, పది మంది గుమిగూడే ప్రదేశాల్లో ఓటు వినియోగంపై ప్రచారం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రచార సాధానల ద్వారా కూడళ్లలోని సిగ్నళ్ల వద్ద ప్రచారం చేస్తున్నాం.గర్భిణులు, వృద్ధులకు ప్రత్యేకం..గర్భిణులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యే క క్యూలైన్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో మాదిరిగా ఆదర్శ పోలింగ్ కేంద్రాలు, మహిళా, దివ్యాంగ పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. ఈసారి 85 ఏళ్లు దాటిన వృద్ధులే ఇంటి వద్ద ఓటేసేందుకు అర్హులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 80 దాటిన వారికి కూడా అనుమతి ఉండేది. ఇప్పటివరకు 85 ఏళ్లు దాటిన వృద్ధులు 80 మంది దరఖాస్తులు చేసుకున్నారు. -
● ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ● ఆదిలాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ● జనజాతర సభ సక్సెస్.. ‘హస్తం’ శ్రేణుల్లో జోష్
సభకు హాజరైన జనంసభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, పక్కన ఎమ్మెల్యే బొజ్జు, ఎంపీ అభ్యర్థి సుగుణ కైలాస్నగర్: సీఎం రేవంత్రెడ్డి హామీల జల్లు కురి పించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ జన జాతర బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ ప్రాంగణాని కి చేరుకున్న ఆయన ప్రజలకు అభివాదం చేసిన అనంతరం ప్రసంగించారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సంబంధించి అనేక హామీలు ప్రకటించారు. బోథ్ నియోజకవర్గ పరిధిలోని దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుప్టి ప్రాజెక్ట్ను నిర్మించి రైతులకు సా గునీటిని అందిస్తామన్నారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిన తూర్పు ప్రాంతంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ను నిర్మించడంతో పాటు దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట నామకరణం చేస్తామన్నారు. ముంపు నిర్వాసితుల అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. అలాగే కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన కడెం ప్రాజెక్ట్కు మరమ్మతులు చేసి దానిపై ఆధారపడ్డ ప్రజలకు సాగు, తాగునీటిని అందిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మూతపడ్డ సీసీఐ ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యాపారులతో మాట్లా డి తెరిపిస్తామని తద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని భరోసానివ్వడం ఈ ప్రాంత వాసుల్లో ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది. సభ సక్సెస్తో పార్టీ నేతల్లో హుషారు కనిపించింది. రెండు గంటలు ఆలస్యంగా ... ప్రత్యేక హెలిక్యాప్టర్లో జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి చేరుకున్న సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గాన సభ వేదిక వద్దకు చేరుకున్నా రు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11గంటలకు హాజ రుకావాల్సి ఉండగా మధ్యాహ్నం 12.57 గంటలకు వచ్చారు. రెండు గంటలు ఆలస్యంగా హాజరైనప్పటికీ పార్టీశ్రేణులు, ప్రజలు సీఎం రాక కోసం ఓపిగ్గా నిరీక్షించారు. సభ వేదిక వద్దకు చేరుకుని ప్రజలకు అభివాదం చేశారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులు కేరింతలు కొడుతూ ఉత్సాహాన్ని చాటారు. సాంస్కృతిక కళాకారుల బృందం ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపూరావు, రామారావు పటేల్, కోనేరు కోనప్ప, జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, టీపీసీసీ కార్యదర్శి సత్తు మల్లేశ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పోలీస్ బందోబస్తు సీఎం రాక నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా హెలిప్యాడ్ నుంచి సభ ప్రాంగణం వరకు దారి పొడవునా పోలీసులను మోహరించారు. సభా ప్రాంగణం వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు జిల్లా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీఎం రాకకు ముందు నుంచే బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న ఎస్పీ గౌస్ ఆలం సీఎం వెనుదిరిగే వరకు అక్కడే ఉండి భద్రతను స్వయంగా పర్యవేక్షించారు. పలువురి చేరిక బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి పలువురు సీఎం స మక్షంలో కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్కు చెందిన మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజా నీ, కౌన్సిలర్లు ఆవుల వెంకన్న, కలాల శ్రీని వాస్, మడావి మంగళ, మాజీ ఎంపీపీ ఆడే శీల, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి తదితరులు కాంగ్రెస్లో చేరారు. వారికి సీఎం కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ లాంటి దొరలే.. సక్కు, నగేశ్పై సీఎం సైటెర్లు బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులపై సీఎం రేవంత్రెడ్డి తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. ‘ఆత్రం సక్కును చూశారు.. గోడం నగేశ్ను చూశారు.. వారు మీకు కొత్తేమి కాదు.. వాళ్ల పనితీనమేంటో కూడా మీకు తెలుసు.. మంచోడు మంచోడని మంచమెక్కిస్తే మంచమంతా పాడు చేశాడట వెనుకటికి ఆత్రం సక్కులాంటోడని’ అన్నారు. అలాగే గోడం నగేశ్ గురించి మా ట్లాడుతూ ‘బుద్ధిమంతుడని సద్దికట్టిస్తే బొడ్రా యి వద్ద భోంచేసి తిరిగి ఇంటికొచ్చి బోర్లాపడుకున్నడట.. అంటూ సామెతలను వివరిస్తూ వారిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నగేశ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అన్ని పదవులు చేసిన విషయం మీకందరికీ తెలుసన్నారు. వారిద్దరు తక్కువేమి కాదని కేసీఆర్ దొర ఎంతనో ఈ గిరిజన నాయకులు అంతటి దొరలేనన్నారు. ఉదయం 11గంటలైతే తప్ప కిందకి దిగడని, సామాన్యులు చేయి కలిపితే వెంటనే జేబులో పెట్టి తుడ్చుకునే నగేశ్ లాంటి దొరలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఫాంహౌస్లో ఉండే దొరలైనా ఆదిలాబాద్లో ఉండే ఈ దొరలతో మనకేం పని అని అన్నారు. సామాన్యురాలిగా, ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆత్రం సుగుణను పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిందని ఆమెను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కు పంపించాలని కోరారు. -
ప్రజల సంక్షేమాన్ని కాంక్షించేది కాంగ్రెస్ : మంత్రి సీతక్క
జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేయడంతోనే బీఆర్ఎస్ను ప్రజలు పక్కనపెట్టారన్నారు. మోదీ చేసిందేమి లేకపోవడంతోనే కాంగ్రెస్పై తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి తప్పుడు విమర్శలు చేయడం తగునా అని ప్రశ్నించారు. హిందువుల పార్టీ తమదని చెప్పుకునే మోదీ అగర్బత్తీలను సైతం జీఎస్టీ నుంచి వదల్లేదని ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమాన్ని కాంక్షించేది కాంగ్రెస్ పార్టీ అని.. వారి కోసం ఆహారభద్రత, ఉపాధిహామీ, విద్యాహక్కు వంటి చట్టాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. జీఎస్టీ పేరిట రూ.54లక్షల కోట్లు దండుకున్న ఘనత కేంద్రంలోని మోదీ సర్కారుదని మండిపడ్డారు. ప్రజలకు బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం 3 నెలల్లోనే 38వేల మందికి ఉద్యోగాలు కల్పించిందని గ్యారంటీలకే రేవంత్రెడ్డి గ్యారంటీ అని స్పష్టం చేశారు. -
మెరుగైన వైద్య సేవలందించాలి
ఆసిఫాబాద్: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం సూపరింటెండెంట్ చెన్నకేశవులుతో కలిసి పరిశీలించారు. రికార్డులు పరిశీలించి రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వైద్యులు సమయపాలన పాటిస్తూ, రోగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆస్పత్రి పరిసరాలు, టాయిలెట్లను ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలన్నారు. ఎండలతో ప్రజలు వడదెబ్బ బారినపడే అవకాశం ఉన్నందున ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు అవగాహన కల్పించాలన్నారు. ఎండవేడితో అస్వస్థతకు గురైతే తీసుకోవాల్సిన జా గ్రత్తలను వివరించాలని సూచించారు. ము ఖ్యంగా ఉపాధిహామీ కూలీలను అప్రమత్తం చేయాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. రోగులతో మ ర్యాదగా వ్యవహరించాలని, రికార్డులు సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. ఆ స్పత్రిలో అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. డీఎంహెచ్వో తుకారాంభట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నాగార్జునా చారి, ఇంజినీర్లు, వైద్యులు ఉన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019