breaking news
Ad - Sakshi_Home_Sticky
-
జిల్లాకు అదనపు ఓటింగ్ యంత్రాలు
ఆసిఫాబాద్అర్బన్: లోక్సభ ఎన్నికలకు సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సిగ్మెంట్లకు అదనపు ఓటింగ్ యంత్రాలు వచ్చాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎంల గోదాంలో గురువారం అదనపు కలెక్టర్ దాసరి వేణు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అదనపు బ్యాలెట్ యూనిట్లు, ఓటింగ్ యంత్రాల ప్రథమస్థాయి పరిశీ లన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ర్యాండమైజేషన్ పూర్తయిన తర్వాత ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన ప్రకారం బందోబస్తు మధ్య తరలిస్తామన్నారు. స్ట్రాంగ్ రూంల్లో భద్రపర్చి 24 గంటలపాటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, నాయబ్ తహసీల్దార్ జితేందర్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. -
5న కాగజ్నగర్కు అమిత్ షా
కౌటాల/కాగజ్నగర్రూరల్: కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఈ నెల 5న కాగజ్నగర్కు రానున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియెజకవర్గ పరిధిలోని కాగజ్నగర్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. ఎస్పీఎం గ్రౌండ్లో నిర్వహించే వికాస సంకల్ప సభలో ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ తరుఫున ప్రసంగిస్తారని పేర్కొన్నారు. జిల్లాలోని బీజేపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. -
అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
ఆసిఫాబాద్అర్బన్: ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేశ్కుమార్ వ్యాస్ అన్నారు. గురువారం న్యూఢిల్లీ నుంచి సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేశ్కుమార్ వ్యాస్, హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్తో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో పోలింగ్ నిర్వహణ, సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అదనపు బ్యాలెట్ యూనిట్ల కేటాయింపు పూర్తయిందని, ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎఫ్ఎస్సీ, ర్యాండమైజేషన్ పూర్తి చేయాలన్నారు. అలాగే పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటూ డబ్బు, మద్యం పంపిణీ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ సురేశ్కుమార్ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. జిల్లాలో ఓటరు స్లిప్పుల పంపిణీ కొనసాగుతుందని కలెక్టర్ వివరించారు. కంట్రోల్ రూం, సీ విజిల్ ద్వారా అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నామని పేర్కొన్నారు. -
భద్రత సూత్రాలు పాటించాలి
ఆసిఫాబాద్అర్బన్: విద్యుత్ శాఖలో పని చేసే కార్మికులు విధి నిర్వహణలో భద్రత సూత్రాలు పాటించాలని ఆ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ వాసుదేవ్ అన్నారు. ఈ నెల 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న విద్యుత్శాఖ వారో త్సవాల పోస్టర్ను గురువారం పట్టణంలోని సబ్స్టేషన్లో ఆవిష్కరించారు. విద్యుత్ ప్ర మాదాల నివారణపై కార్మికులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ భద్రత సూత్రాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చన్నారు. పని స్థలాల్లో ఎర్త్రాడ్లు వినియోగించాలని సూచించారు. విని యోగదారులు కరెంట్ వైర్లు తెగితే సంబంధి త సిబ్బందికి తెలియజేయాలని సూచించా రు. ఇంటి వద్ద వైర్లపై బట్టలు ఆరేస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగలకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజినీర్ సదాశివ్, ఏఈ ప్రత్యూష, సబ్ ఇంజినీ ర్ శేఖర్, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. -
నీటి నిల్వకు కుంటలు
● ఉపాధిహామీ పథకం కింద పంట పొలాల్లో తవ్వకం ● వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు చర్యలు ● భూగర్భ జలాల రక్షణే ధ్యేయం ● ఇప్పటివరకు 5,490 ఫామ్ పాండ్స్, 905 పీటీలు, ఎంపీటీలు పూర్తిపెంచికల్పేట్(సిర్పూర్): మారిన వాతావరణ పరిస్థితులతో భూగర్భ జలాలు ఏటా మరింత లోతుకు ఇంకిపోతున్నాయి. సాధారణ వర్షపాతమే నమోదవుతున్నా.. భూమిలో ఇంకే నీటిశాతం తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో భూగర్భ జలాల పెంపుతోపాటు రైతులకు అందుబాటులో నీటి వనరులు ఉంచేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద నీటి కుంటల తవ్వకం చేపడుతోంది. పంట పొలాల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి ఫామ్ పాండ్స్, పీటీ, ఎంపీటీల తవ్వుతున్నారు. బహుళ ప్రయోజనాలు ఉండటంతో రైతులు సైతం స్వచ్ఛందంగా నీటి కుంటల తవ్వకానికి ముందుకొస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 5,490 ఫామ్ పాండ్స్, 905 పీటీలు, ఎంపీటీల తవ్వకాలు పూర్తయ్యాయి. మరో 531 ఫామ్ పాండ్స్, 865 పీటీలు, ఎంపీటీల పనులు కొనసాగుతున్నాయి. సంబంధిత అధికారులు నీటి నిల్వతో కలిగే ప్రయోజనాలను అన్నదాతలకు వివరిస్తున్నారు. పెద్దఎత్తున కుంటల తవ్వకాల వైపు వారు మొగ్గు చూపేలా అవగాహన కల్పిస్తున్నారు. అధికంగా వర్షాలు కురిసే జిల్లాలో కుంటలు నిర్మించి జలాన్ని ఒడిసిపట్టడంలో సత్ఫలితాలు సాధిస్తున్నారు. పుష్కలంగా నీరు..జిలాల్లో రైతులు బావులు, బోరుబావుల కింద వరి, పత్తి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. భూగర్భ జ లాలను పెంచేందుకు ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ లో ఒక్కపైసా ఖర్చు లేకుండా ఉపాధికూలీలు ద్వా రా పంట పొలాలు, చేలలో కుంటల తవ్వకాలు చేపడుతోంది. పొలాల్లో నిర్మించిన కుంటలు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీటిని ఒడిసిపట్టి నిల్వ చేస్తున్నాయి. వరదలకు భూమి కోతకు గురి కాకుండా.. పంట పొలాల్లోని సారవంతమైన నేలలు కొట్టుకుపోకుండా కూడా ఈ కుంటలు రక్షిస్తున్నాయి. మరోవైపు చెరువులు, కుంటల్లో తవ్వుతు న్న ఫామ్ పాండ్స్తో పుష్కలంగా నీరు నిల్వ ఉంటుంది. అధికారుల సూచనలతో రైతాంగం పెద్ద ఎ త్తున కుంటల తవ్వకాలకు మొగ్గు చూపుతున్నారు. భూగర్బ జలాలు పెరిగి భవిష్యత్తు తరాలకు అందించడానికి నీటి కుంటలు బాటలు వేస్తున్నాయి. అవగాహన కల్పిస్తున్నాం ఉపాధిహామీ పథకంలో పెద్దఎత్తున కుంటలు, పీటీల తవ్వకాలు చేపడుతున్నాం. పంట పొలాల్లో నిర్మించే కుంటలతో రైతులకు కలిగే లాభాలను క్షేత్రస్థాయిలో నిర్వహించే గ్రామసభల్లో వివరిస్తున్నాం. పంట చేలలో తవ్వే కుంటలతో భూగర్బ జలాలు పెరిగి రైతుల బోర్లు ఎక్కువ కాలం పనిచేస్తాయి. కుంటల తవ్వకాలను ఏటా పెద్దఎత్తున చేపడుతున్నాం. – సురేందర్, డీఆర్డీవోజిల్లా వివరాలుమండలం ఫామ్ పీటీలు/ పాండ్స్ ఎంపీటీలు ఆసిఫాబాద్ 377 54 బెజ్జూర్ 595 04 చింతలమానెపల్లి 109 01 దహెగాం 307 04 జైనూర్ 300 20 కాగజ్నగర్ 540 27 కెరమెరి 329 257 కౌటాల 354 02 లింగాపూర్ 77 07 పెంచికల్పేట్ 195 03 రెబ్బెన 298 00 సిర్పూర్(టి) 1040 16 సిర్పూర్(యూ) 108 00 తిర్యాణి 568 24 వాంకిడి 293 486
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019