Sakshi News home page

భద్రత సూత్రాలు పాటించాలి

Published Tue, May 7 2024 1:45 PM

భద్రత సూత్రాలు పాటించాలి

ఆసిఫాబాద్‌అర్బన్‌: విద్యుత్‌ శాఖలో పని చేసే కార్మికులు విధి నిర్వహణలో భద్రత సూత్రాలు పాటించాలని ఆ శాఖ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ వాసుదేవ్‌ అన్నారు. ఈ నెల 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న విద్యుత్‌శాఖ వారో త్సవాల పోస్టర్‌ను గురువారం పట్టణంలోని సబ్‌స్టేషన్‌లో ఆవిష్కరించారు. విద్యుత్‌ ప్ర మాదాల నివారణపై కార్మికులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ భద్రత సూత్రాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చన్నారు. పని స్థలాల్లో ఎర్త్‌రాడ్‌లు వినియోగించాలని సూచించారు. విని యోగదారులు కరెంట్‌ వైర్లు తెగితే సంబంధి త సిబ్బందికి తెలియజేయాలని సూచించా రు. ఇంటి వద్ద వైర్లపై బట్టలు ఆరేస్తున్న సమయంలో విద్యుత్‌ తీగలు తగలకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ సదాశివ్‌, ఏఈ ప్రత్యూష, సబ్‌ ఇంజినీ ర్‌ శేఖర్‌, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

homepage_300x250