Just In
Ad - Cinema-Sakshi_Cinema_LeaderBoard_1
Ad - Sakshi_Home_Sticky
-
సన్నాలకు ఫుల్ డిమాండ్
● క్వింటాల్కు రూ.2,500 చెల్లింపు ● జోరుగా ప్రైవేట్ వ్యాపారుల కొనుగోలు ● హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు సన్న ధాన్యానికి బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతోంది. క్వింటాల్కు మద్దతు ధర రూ. 2,500 చొప్పున చెల్లించి వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ధర కంటే క్వింటాల్కు రూ. 297 అధికంగా రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. – మెదక్జోన్జిల్లావ్యాప్తంగా ఈ యాసంగిలో 2.63 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. ఇందుకు గానూ 5.20 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని అంచనా వేసిన అధికారులు 410 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే 2.3 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వరి సాగు కాగా 60 వేల ఎకరాల్లో సన్న రకం సాగైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా దొడ్డు రకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాల్కు మద్దతు ధర రూ. 2,203 చొప్పున చెల్లిస్తోంది. సన్నరకం సాగు చేసిన రైతుల నుంచి ప్రైవేట్ వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. క్వింటాల్ ధాన్యానికి రూ.2,500 చెల్లిస్తున్నారు. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నాలకు క్వింటాల్కు రూ. 2,203 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో క్వింటాల్పై రైతుకు రూ.297 అదనంగా వస్తుండడంతో అన్నదాతలు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. మార్కెట్లో సన్న బియ్యం ధరలు సైతం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. ధర మరింత పెరిగే అవకాశం ప్రస్తుతం వ్యాపారులు సన్నాలను క్వింటాల్ రూ. 2,500 చెల్లించి కొనుగోలు చేస్తుండగా 10 రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. గతేడాది వానాకాలంలో జిల్లావ్యాప్తంగా 80 వేల ఎకరాలకు పైగా సన్నాలను సాగు చేశారు. ధాన్యం చేతికందిన మొదట్లో వ్యాపారులు క్వింటాల్కు రూ. 2,400 చొప్పున చెల్లించి రైతుల వద్ద కొనుగోలు చేశారు. అనంతరం మరో 15 రోజుల తర్వాత క్వింటాల్కు రూ. 2,800 చెల్లించారు. కేవలం రెండు వారాల వ్యవధిలో క్వింటాల్కు రూ.400 ధర పెరిగింది. తగ్గనున్న ధాన్యం దిగుబడి యాసంగి సీజన్లో 1.34 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వారి అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉంది. రైతులు ఎక్కువగా బోరుబావుల ఆధారంగా వరి సాగు చేశారు. భూగర్భజలాలు అడిగంటిపోవడంతో చాలా వరకు బోర్లలో నీటి ఊటలు తగ్గి పంటలు ఎండిపోయాయి. దీంతో దిగుబడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. నాలుగెకరాల్లో సన్నాలు సాగు చేశా నాలుగెకరాల్లో ఆర్ఎన్ఆర్ సన్న రకం వరి పంట సాగు చేశాను. సుమారు 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాల్కు రూ. 2,500 చొప్పున విక్రయించాను. కొనుగోలు కేంద్రాల కంటే క్వింటాల్కు రూ. 297 అదనంగా లాభం వచ్చింది. – బాబు, గవ్వలపల్లి తండా -
బియ్యానికే పరిమితం!
ఎక్కువ ధరకు బయట కొంటున్నాంకంట్రోల్ షాపుల్లో చక్కెర కిలో ధర రూ.13.50 ఉండేది. ప్రస్తుతం బయట రూ. 40 కిలోకు కొంటున్నాం. గతంలో కందిపప్పు, ఫాం ఆయిల్, గోదుమలు, కిరోసిన్, చింతపండు, కారం ఇచ్చే వారు. కాని ఇప్పుడు అవి కనిపించడం లేదు. ధరలు ఎక్కువైనా బయట కొంటున్నాం. ఇప్పటికై నా జొన్నలు, గోదుమలు, నూనెలు సరఫరా చేయాలి. – శ్రీశైలం, ముద్దాపురం పాపన్నపేట(మెదక్): నిరుపేదలకు చౌక ధరలకే నిత్యావసర వస్తువులు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం రాను రాను నీరు గారి పోతుంది. రేషన్ షా పులను సూపర్ మార్కెట్లుగా మారుస్తామన్న వాగ్దానాలు నీటి మూటలవుతున్నాయి. కేవలం ఉచిత బియ్యం పంపిణీకే రేషన్ షాపులు పరిమితం అవుతున్నాయి. చక్కెర గోధుమలు కాన రావడం లేదు. పప్పులు, కిరోసిన్ మాటే మరిచారు. ఒకప్పుడు పంపిణీ చేసిన ఆరురకాల నిత్యావసరాలు మూన్నాళ్ల ముచ్చటగా మారాయి. దీంతో ధరలు మండుతున్నా పేదలు కిరాణ దుకాణాలను ఆశ్రయించక తప్పడం లేదు. జిల్లాలో మొత్తం 520 రేషన్షాపులు 2,13,863 రేషన్కార్డులు, 6,85,901 లబ్ధిదారులు ఉన్నారు. నెలకు 36,264 క్వింటాళ్ల బియ్యం సరఫరా అవుతోంది. గతంలో నిరుపేదలకు తక్కువ ధరకు నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల ద్వారా అందించే వారు. గతంలో చక్కెర, మంచి నూనె, కిరోసిన్, గోధుమలు సరఫరా చేసేవారు. మధ్యలో కంది పప్పు, చింత పండు, కారం,ఉప్పు లాంటి నిత్యావసరాలు కూడా పంపిణీ చేశారు. చక్కెర ధరకు రెక్కలు రేషన్షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర, గోధుమలు పంపిణీ చేయాల్సి ఉంది. చౌకధరల దుకాణంలో కిలో చక్కెర రూ.13.50, అదే బహిరంగ మార్కెట్లో రూ.40 ఉంది. అంటే దాదాపు మూడు రెట్లు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. అలాగే గోధుమలు కిలో రూ.7 ఉండగా, బయట మార్కెట్లో రూ.30 నుంచి 35 వరకు పలుకుతుంది. అంత్యోదయ కార్డు ఉన్నవారికి 35 కిలోల బియ్యంతో పాటు 5 కిలోల గోధుమలు ఇవ్వాలి. కాని కేవలం కొన్ని పట్టణాల్లో మాత్రమే గోధుమలు, చక్కెర సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. పల్లెల్లో మాత్రం బియ్యం తప్ప ఇతర వస్తువులు కనిపించడం లేదు. గతంలో పండగల పూట చక్కెర డబుల్ కోటా ఇచ్చే వారు. కానీ ఇప్పుడు చక్కెర జాడే కనిపించడం లేదు. సమతులిత ఆహారంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో జొన్నలు, రాగులు, ఇతర చిరుధాన్యాలు, పప్పులు, నూనెలు చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తే నిరుపేదలకు మేలు చేకూతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీటి వల్ల ఆరోగ్యంతో పాటు ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. చౌక ధరల దుకాణాలను సూపర్ మార్కెట్లుగా మారుస్తామని గత ప్రభుత్వాలు ప్రకటించాయి. కాని ప్రస్తుతం ఉన్నవే మూత బడే పరిస్థితి నెలకొంది. ఈ విషయమై పాపన్నపేట ఎమ్మార్వో లక్ష్మణ్బాబును వివరణ కోరగా గోదాంల నుంచి చక్కెర రావడం లేదని తెలిపారు. బియ్యం తప్ప ఇతర వస్తువులు సరఫరా కావడం లేదన్నారు. ● రేషన్ దుకాణాల్లో కానరాని చక్కెర, గోధుమలు ● మరిచిన పప్పులు, కిరోసిన్ రేషన్ కార్డులు : 2,13,863 లబ్ధిదారులు : 6,85,901 -
నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట బందోబస్తు
ఎస్పీ బాలస్వామి మెదక్మున్సిపాలిటీ: నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు మూడంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ బాలస్వామి తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ఈనెల 25వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. ఇందుకోసం సెంట్రల్ ఫోర్స్, ఆర్ముడ్, సివిల్ ఫోర్స్తో భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు, అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారి చాంబర్ నుంచి 100 మీటర్ల పరిధిలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వివరించారు. హామీలను అమలు చేస్తాం పెద్దశంకరంపేట(మెదక్): ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. బుధవారం పెద్దశంకరంపేటలోని పార్టీ కార్యాలయం వద్ద ఉత్తులూర్కు చెందిన పలువురు కాంగ్రెస్లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. సురేష్ షెట్కార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మధు, సీనియర్ నాయకులు నారాగౌడ్, సంగమేశ్వర్, రాంచందర్, పెరుమాండ్లుగౌడ్, ఎంపీటీసీ రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షం హవేళిఘణాపూర్(మెదక్)/నిజాంపేట: జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. హవేళిఘణాపూర్ మండలంలోని గాజుల్వయి తండాలో ఈదురుగాలులకు కరెంట్ స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తండావాసులు రాత్రంతా చీకట్లోనే గడిపారు. అలాగే నిజాంపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో మోస్తారు వర్షం కురిసింది. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. సరిహద్దుల్లో పటిష్ట నిఘా కంగ్టి(నారాయణఖేడ్): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ రఫీయొద్దీన్ తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిఽహద్దుల్లో ఉన్న మండల పరిధిలోని దెగుల్వాడి చెక్పోస్టు వద్ద పకడ్బందీగా వాహనాల తనిఖీ చేపడుతున్నారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లాలంటే సరైన ఆధారాలు ఉండాలని తెలిపారు. ఎకై ్సజ్ పోలీసు కానిస్టేబుల్ సాయులు, ఏఈఓ సంతోష్ ఉన్నారు. -
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం
● ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు గజ్వేల్: కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మెదక్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు భారీ మెజారిటీని అందిస్తాయని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం గజ్వేల్లో పార్టీ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా అన్ని రంగాల్లో వైఫల్యాలను మూటగట్టుకుందని చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గానికి మంజూరైన రూ.150 కోట్ల అభివృద్ధి పనులను ఆ పార్టీ నేతలు రద్దు చేశారని మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంక్రటామిరెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్లో బలమైన ప్రజా గొంతుకగా మారతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జెడ్పీటీసీ మల్లేశం, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, జగదేవ్పూర్ సహకార సంఘం చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నాగరాజు, గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్మీరా, నాయకులు కిషన్రెడ్డి, గుంటుకు రాజు, గంగిశెట్టి రవి, కౌన్సిలర్లు బాలమణి, బొగ్గుల చందు, అత్తెల్లి శ్రీనివాస్, అహ్మద్, స్వామిచారి తదితరులు పాల్గొన్నారు. -
ముహూర్త బలం
● నేటి నుంచి 25వ తేదీ వరకు స్వీకరణ ● మెదక్, సంగారెడ్డి కలెక్టరేట్లలో ఏర్పాట్లుసాక్షి, సిద్దిపేట: లోక్సభ ఎన్నికల సమరంలో మొదటి ఘట్టం గురువారం నుంచి ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు మంచి ముహూర్తాలను చూసుకుంటున్నారు. మెదక్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు మెదక్ కలెక్టరేట్లో, జహీరాబాద్ స్థానం నుంచి బరిలో ఉండే అభ్యర్థుల నామినేషన్లు సంగారెడ్డి కలెక్టరేట్లో స్వీకరిస్తారు. నిర్ణీత సమయాల్లో సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు సమాయత్తం.. అభ్యర్థులు వారి పేరు మీద ముహూర్త బలం చూసుకొని నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. పురోహితులు సూచించిన తేదీల్లో సమయానికి ఎన్నికల అధికారి కార్యాలయానికి వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. మంచి రోజు మొదటి సెట్ వేసి తర్వాత భారీ ర్యాలీల ద్వారా వెళ్లి మిగతా సెట్లను వేయనున్నారు. బీజేపీ మెదక్ అభ్యర్థి ఎం. రఘునందన్ గురువారం నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్ పత్రాలను అయోధ్యలోని బాలరాముడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. 20న మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ వేయనున్నారు. 24న బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. అలాగే స్వతంత్రులు కూడా ముహూర్తాలను చూసుకుంటున్నారు. నామినేషన్ల స్వీకరణ : ఏప్రిల్ 18 తేదీ నుంచి.. చివరి గడువు : ఏప్రిల్ 25 పరిశీలన : ఏప్రిల్ 26ప్రక్రియ ఇలా.. ఓట్ల లెక్కింపు : జూన్ 4 పోలింగ్ తేదీ : మే 13 ఉపసంహరణకు గడువు : ఏప్రిల్ 29రానున్న ముఖ్యనేతలు ప్రధాన పార్టీలు నామినేషన్లు వేసే సమయంలో అభ్యర్థుల వెంట ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు పోటీ చేసే అభ్యర్థులు పలువురిని ఆహ్వానించారు. పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి నామినేషన్ల ఘట్టాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రధాన పార్టీలు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఈనెల 18న బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిలు హాజరు కానున్నారు. 20న మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి మధు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇన్చార్జి దీపాదాస్ మున్షీలు, మంత్రులు హాజరుకానున్నారు. 24న బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ర్యాలీ చేపట్టనున్నారు. కార్యక్రమానికి హరీశ్రావుతో పాటు ఎమ్మెల్యేలు రానున్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Chekc 1234 off the field
Test article qid_23456x4
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 17 ఏళ్ల కెరీర్కు గుడ్ బై
ఎవరేశారో తెలుసుకోకుండా దోశలు తినేయడమేనా!!
స్టోయినిష్ అరుదైన రికార్డు.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
విశ్వసనీయత లేని ప్రతిపక్షాన్ని తిరస్కరించాలి!
అభివృద్ధి బటన్ నొక్కిన సీఎం జగన్
దిక్కుతోచని కుటుంబం దిశ మారింది..!
సారా.. నారా అండతో దోపిడీకి C/O సీఎం రమేష్
ఛాంపియన్ దేశం
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019