Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగడతాం

Published Thu, Apr 18 2024 10:30 AM

- - Sakshi

● ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు

గజ్వేల్‌: కేసీఆర్‌ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే మెదక్‌ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీని అందిస్తాయని ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం గజ్వేల్‌లో పార్టీ ప్రచార రథాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా అన్ని రంగాల్లో వైఫల్యాలను మూటగట్టుకుందని చెప్పారు. గజ్వేల్‌ నియోజకవర్గానికి మంజూరైన రూ.150 కోట్ల అభివృద్ధి పనులను ఆ పార్టీ నేతలు రద్దు చేశారని మండిపడ్డారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న కాంగ్రెస్‌కు ఎంపీ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ మెదక్‌ ఎంపీ అభ్యర్థి వెంక్రటామిరెడ్డిని గెలిపిస్తే పార్లమెంట్‌లో బలమైన ప్రజా గొంతుకగా మారతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, జెడ్పీటీసీ మల్లేశం, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్‌ ఊడెం కృష్ణారెడ్డి, జగదేవ్‌పూర్‌ సహకార సంఘం చైర్మన్‌ ఇంద్రసేనారెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నాగరాజు, గజ్వేల్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు కిషన్‌రెడ్డి, గుంటుకు రాజు, గంగిశెట్టి రవి, కౌన్సిలర్లు బాలమణి, బొగ్గుల చందు, అత్తెల్లి శ్రీనివాస్‌, అహ్మద్‌, స్వామిచారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250