జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేయడంతోనే బీఆర్ఎస్ను ప్రజలు పక్కనపెట్టారన్నారు. మోదీ చేసిందేమి లేకపోవడంతోనే కాంగ్రెస్పై తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి తప్పుడు విమర్శలు చేయడం తగునా అని ప్రశ్నించారు. హిందువుల పార్టీ తమదని చెప్పుకునే మోదీ అగర్బత్తీలను సైతం జీఎస్టీ నుంచి వదల్లేదని ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమాన్ని కాంక్షించేది కాంగ్రెస్ పార్టీ అని.. వారి కోసం ఆహారభద్రత, ఉపాధిహామీ, విద్యాహక్కు వంటి చట్టాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. జీఎస్టీ పేరిట రూ.54లక్షల కోట్లు దండుకున్న ఘనత కేంద్రంలోని మోదీ సర్కారుదని మండిపడ్డారు. ప్రజలకు బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం 3 నెలల్లోనే 38వేల మందికి ఉద్యోగాలు కల్పించిందని గ్యారంటీలకే రేవంత్రెడ్డి గ్యారంటీ అని స్పష్టం చేశారు.
breaking news
Breadcrumb
- HOME
ప్రజల సంక్షేమాన్ని కాంక్షించేది కాంగ్రెస్ : మంత్రి సీతక్క
Published Tue, Apr 23 2024 8:20 AM
Ad - Sakshi_Home_Sticky
adsolute_video_ad
Related news
-
ప్రశాంత ఎన్నికలకు.. పకడ్బందీ ఏర్పాట్లు
● సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ● పండుటాకులకు ఇంటి వద్దే ఓటింగ్ సౌకర్యం ● పోస్టల్ బ్యాలెట్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు ● ‘సాక్షి’తో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో లోక్సభ ఎ న్నికలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలన్నింటిలోనూ వెబ్ కాస్టింగ్తోపాటు పట్టిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ వెంకటేష్ దోత్రే సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే.. సర్వం సిద్ధం.. జిల్లాలో ఎన్నికల నియమావళి పక్కాగా అమలు చే సేలా ప్రత్యేక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నా యి. ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల పరిధి లోని పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గత శాసనసభ ఎ న్నికల కంటే అదనంగా 79 యాగ్జలరీ పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. సహాయ పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, మూత్రశాలలు, నీడ తదితర వసతులు ఉండేలా చర్యలు చే పట్టాం. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు కోసం ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల్లోని పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నాం. పోలింగ్కు నాలుగు రోజులు ముందుగానే ఈ పనులన్నీ పూర్తి చేస్తాం. తద్వారా పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగదు. సమస్యాత్మక కేంద్రాలపై దృష్టి...జిల్లాలో మొత్తం 676 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 64 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. వీటితోపాటు మావోయిస్టు ప్రభావిత(ఎల్డబ్ల్యూఈ) ప్రాంతాల్లో 22, మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి నెట్వర్క్ సౌకర్యం లేనివి 63 పో లింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర రక్షణ బలగాల ద్వారా నిఘా ఉంటుంది. మైక్రో అబ్జర్వర్లు పర్యవేక్షిస్తారు. అన్ని సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఎల్డబ్ల్యూఈ, షాడో పోలింగ్ కేంద్రాలు, అర్బన్ ప్రాంతాల్లోని కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ సౌకర్యం ఉంటుంది. మొత్తం పోలింగ్ కేంద్రాల్లో 80 శాతం వాటిల్లో వెబ్కాస్టింగ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలుతీవ్రమైన ఎండలు ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. తాగునీటి వసతి, విద్యుత్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, బల్లలు, దివ్యాంగులు, వృద్ధుల కోసం ర్యాంపులు కచ్చితంగా ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్కు ఇబ్బంది ఉండదు..గత అసెంబ్లీ ఎన్నికల్లో విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ పొందడంలో ఇబ్బంది పడ్డారు. ఈసారి అలా ఉండదు. ఎన్నికల సంఘం ఎన్ఐసీ నుంచి ఒక యాప్ ఇచ్చారు. దాని ద్వారా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఎపిక్ నంబర్తో సహా వివరాలు పొందుపరిస్తే వారి ఓటు ఎక్కడ ఉందో అక్కడ డేటాతో సహా క్యాప్చర్ అవుతుంది. గతంలో మాన్యువల్గా ఉండటంతో కొద్దిగా గందరగోళానికి గురయ్యారు. ఈసారి ఆన్లైన్ కావడంతో ఎవరు ఎక్కడ ఓటేసేందుకు ఎంపిక చేసుకున్నారో స్పష్టంగా తెలుస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో వివరాలు నమోదు చేసుకునేందుకు ఉద్యోగులకు మే 3 నుంచి 8 వరకు సమయం ఇచ్చాం. పోలింగ్ శాతం పెంచే దిశగా..ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఓటుహక్కు అత్యంత కీలకం. ఓటు వజ్రాయుధమని ‘స్వీప్’ ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నాం. యువత అధికంగా ఉన్న కళాశాలలు, పది మంది గుమిగూడే ప్రదేశాల్లో ఓటు వినియోగంపై ప్రచారం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రచార సాధానల ద్వారా కూడళ్లలోని సిగ్నళ్ల వద్ద ప్రచారం చేస్తున్నాం.గర్భిణులు, వృద్ధులకు ప్రత్యేకం..గర్భిణులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యే క క్యూలైన్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో మాదిరిగా ఆదర్శ పోలింగ్ కేంద్రాలు, మహిళా, దివ్యాంగ పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. ఈసారి 85 ఏళ్లు దాటిన వృద్ధులే ఇంటి వద్ద ఓటేసేందుకు అర్హులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 80 దాటిన వారికి కూడా అనుమతి ఉండేది. ఇప్పటివరకు 85 ఏళ్లు దాటిన వృద్ధులు 80 మంది దరఖాస్తులు చేసుకున్నారు. -
బీజేపీది అసత్య ప్రచారం : మంత్రి శ్రీధర్బాబు
రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ.. మతతత్వ పార్టీ బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో లేని అంశాల ను ప్రస్తావిస్తూ అసత్య ప్రచారం చేస్తుందన్నారు. గడిచిన పదేళ్ల పాలనలో బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలోని ఏ ఒక్క అంశాన్నైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు. దేశ ప్రజలంతా దేవుళ్లను కొలుస్తారని, తాము అనేక గుడులను నిర్మించామన్నారు. కానీ దేవుడు మా వాడేనని మార్కెటింగ్ చేసుకునేలా బీజేపీ వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. అలాగే పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఆరోపించారు. -
సకాలంలో పనులు పూర్తి చేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ● అధికారులతో కలిసి పలు పాఠశాలలు సందర్శన ఆసిఫాబాద్/వాంకిడి: ప్రభుత్వ పా ఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సంబంధిత అధికా రులను ఆదేశించారు. సోమవారం ‘సాక్షి’ లో ప్రచురితమైన బిల్లులు/పనులు పెండింగ్ కథనానికి స్పందించి ఆసిఫాబాద్ మండలం రాజురా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలతోపాటు వాంకిడి మండలంలోని బోర్డా ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో అభివృద్ధి పనులు మే 20లోగా పూర్తి చేయాలన్నారు. పాఠశాలల్లో పెండింగ్ పనులను సైతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి ఇబ్బందులు లేకుండా తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యాశాఖ అధికారులు రోజువారీగా పనులు పర్యవేక్షించాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఈవో అశోక్, సెక్టోరల్ అధికారి భరత్కుమార్, జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రామకృష్ణ, ఇంజినీరింగ్ అధికారులు శ్రీనివాస్, గిరీశ్, సీసీలు రాధ, రమేశ్, కార్యదర్శి రాందాస్, జిమ్నాజీ తదితరులు ఉన్నారు. ఎఫెక్ట్ -
‘ఆత్రం సక్కు గెలుపు కోసం కృషి చేయాలి’
పెంచికల్పేట్(సిర్పూర్): ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపు కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్సీ దండె విఠల్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం మాట్లాడారు. అధికారంలోకి రాగానే రైతు రుణాలు మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన కాంగ్రెస్. ఇప్పుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరెంటు లేక.. పండించిన ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు ఇ బ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సూచించారు. అంతకు ముందు బీఎస్పీ, బీజేపీ నుంచి పలువురు బీఆర్ఎస్లోకి చేరగా.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. నాయకులు బిట్టి శ్రీనివాస్, అలిశెట్టి రాజన్న, గంగన్న, నగేశ్, వెంకటేశ్, రాజన్న తదితరులు ఉన్నారు. -
● ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ● ఆదిలాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ● జనజాతర సభ సక్సెస్.. ‘హస్తం’ శ్రేణుల్లో జోష్
సభకు హాజరైన జనంసభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, పక్కన ఎమ్మెల్యే బొజ్జు, ఎంపీ అభ్యర్థి సుగుణ కైలాస్నగర్: సీఎం రేవంత్రెడ్డి హామీల జల్లు కురి పించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ జన జాతర బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ ప్రాంగణాని కి చేరుకున్న ఆయన ప్రజలకు అభివాదం చేసిన అనంతరం ప్రసంగించారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సంబంధించి అనేక హామీలు ప్రకటించారు. బోథ్ నియోజకవర్గ పరిధిలోని దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుప్టి ప్రాజెక్ట్ను నిర్మించి రైతులకు సా గునీటిని అందిస్తామన్నారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిన తూర్పు ప్రాంతంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ను నిర్మించడంతో పాటు దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట నామకరణం చేస్తామన్నారు. ముంపు నిర్వాసితుల అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. అలాగే కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన కడెం ప్రాజెక్ట్కు మరమ్మతులు చేసి దానిపై ఆధారపడ్డ ప్రజలకు సాగు, తాగునీటిని అందిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మూతపడ్డ సీసీఐ ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యాపారులతో మాట్లా డి తెరిపిస్తామని తద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని భరోసానివ్వడం ఈ ప్రాంత వాసుల్లో ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది. సభ సక్సెస్తో పార్టీ నేతల్లో హుషారు కనిపించింది. రెండు గంటలు ఆలస్యంగా ... ప్రత్యేక హెలిక్యాప్టర్లో జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి చేరుకున్న సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గాన సభ వేదిక వద్దకు చేరుకున్నా రు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11గంటలకు హాజ రుకావాల్సి ఉండగా మధ్యాహ్నం 12.57 గంటలకు వచ్చారు. రెండు గంటలు ఆలస్యంగా హాజరైనప్పటికీ పార్టీశ్రేణులు, ప్రజలు సీఎం రాక కోసం ఓపిగ్గా నిరీక్షించారు. సభ వేదిక వద్దకు చేరుకుని ప్రజలకు అభివాదం చేశారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులు కేరింతలు కొడుతూ ఉత్సాహాన్ని చాటారు. సాంస్కృతిక కళాకారుల బృందం ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపూరావు, రామారావు పటేల్, కోనేరు కోనప్ప, జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, టీపీసీసీ కార్యదర్శి సత్తు మల్లేశ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పోలీస్ బందోబస్తు సీఎం రాక నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా హెలిప్యాడ్ నుంచి సభ ప్రాంగణం వరకు దారి పొడవునా పోలీసులను మోహరించారు. సభా ప్రాంగణం వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు జిల్లా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీఎం రాకకు ముందు నుంచే బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న ఎస్పీ గౌస్ ఆలం సీఎం వెనుదిరిగే వరకు అక్కడే ఉండి భద్రతను స్వయంగా పర్యవేక్షించారు. పలువురి చేరిక బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి పలువురు సీఎం స మక్షంలో కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్కు చెందిన మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజా నీ, కౌన్సిలర్లు ఆవుల వెంకన్న, కలాల శ్రీని వాస్, మడావి మంగళ, మాజీ ఎంపీపీ ఆడే శీల, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి తదితరులు కాంగ్రెస్లో చేరారు. వారికి సీఎం కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ లాంటి దొరలే.. సక్కు, నగేశ్పై సీఎం సైటెర్లు బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులపై సీఎం రేవంత్రెడ్డి తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. ‘ఆత్రం సక్కును చూశారు.. గోడం నగేశ్ను చూశారు.. వారు మీకు కొత్తేమి కాదు.. వాళ్ల పనితీనమేంటో కూడా మీకు తెలుసు.. మంచోడు మంచోడని మంచమెక్కిస్తే మంచమంతా పాడు చేశాడట వెనుకటికి ఆత్రం సక్కులాంటోడని’ అన్నారు. అలాగే గోడం నగేశ్ గురించి మా ట్లాడుతూ ‘బుద్ధిమంతుడని సద్దికట్టిస్తే బొడ్రా యి వద్ద భోంచేసి తిరిగి ఇంటికొచ్చి బోర్లాపడుకున్నడట.. అంటూ సామెతలను వివరిస్తూ వారిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నగేశ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అన్ని పదవులు చేసిన విషయం మీకందరికీ తెలుసన్నారు. వారిద్దరు తక్కువేమి కాదని కేసీఆర్ దొర ఎంతనో ఈ గిరిజన నాయకులు అంతటి దొరలేనన్నారు. ఉదయం 11గంటలైతే తప్ప కిందకి దిగడని, సామాన్యులు చేయి కలిపితే వెంటనే జేబులో పెట్టి తుడ్చుకునే నగేశ్ లాంటి దొరలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఫాంహౌస్లో ఉండే దొరలైనా ఆదిలాబాద్లో ఉండే ఈ దొరలతో మనకేం పని అని అన్నారు. సామాన్యురాలిగా, ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆత్రం సుగుణను పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిందని ఆమెను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కు పంపించాలని కోరారు.
Related News by category
-
అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
ఆసిఫాబాద్అర్బన్: ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేశ్కుమార్ వ్యాస్ అన్నారు. గురువారం న్యూఢిల్లీ నుంచి సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేశ్కుమార్ వ్యాస్, హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్తో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో పోలింగ్ నిర్వహణ, సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అదనపు బ్యాలెట్ యూనిట్ల కేటాయింపు పూర్తయిందని, ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎఫ్ఎస్సీ, ర్యాండమైజేషన్ పూర్తి చేయాలన్నారు. అలాగే పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటూ డబ్బు, మద్యం పంపిణీ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ సురేశ్కుమార్ వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. జిల్లాలో ఓటరు స్లిప్పుల పంపిణీ కొనసాగుతుందని కలెక్టర్ వివరించారు. కంట్రోల్ రూం, సీ విజిల్ ద్వారా అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నామని పేర్కొన్నారు. -
మెరుగుపరుస్తాం
వ్యవసాయం, రవాణా ● ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ● ఆసిఫాబాద్లో మీడియాతో చిట్చాట్ఆసిఫాబాద్: జిల్లాలో వ్యవసాయం, రోడ్డు రవాణా అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన చిట్చాట్లో విలేకరులు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాల తొలగింపుపై ‘సాక్షి’ అడిగిన ప్రశ్నకు స్పందించిన మంత్రి.. అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. అవినీతి అక్రమాలతో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని, కొంతమంది నాయకులు అక్రమ ఆస్తులు కాపాడుకునేందుకే కాంగ్రెస్లో చేరినట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ‘భూ కబ్జాలపై ప్రధాన పత్రికల్లో కథనాలు వచ్చినా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని, భూకబ్జాదారులకు అండగా నిలుస్తారా’ అని అడిగిన ప్రశ్నకు స్పందించారు. భూ కబ్జాల విషయంలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం కబ్జాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించామని, డీపీఆర్ అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. కలెక్టర్తో కలిసి ప్రెస్మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ భూములు భవిష్యత్తులో హెల్త్, ఎడ్యుకేషన్ హబ్స్ ఏర్పాటుకు, పరిశ్రమల ఏర్పాటుకు ఉపయోగపడతాయన్నారు. రిజర్వేషన్లు ఎత్తివేసేందుకే బీజేపీ 400 సీట్లు కావా లంటుందని, మనువాద సిద్ధాంతం కోసం రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. జిల్లాలో వైద్యుల కొరత తీరుస్తామని హామీ ఇచ్చారు. చారిత్రక ప్రాంతాలైన జోడేఘాట్, శంకర్లొద్ది, గంగాపూర్, పాట్నాపూర్ పూలాజీబాబా, మార్లవాయితోపాటు పలు ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఇన్చార్జి జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్, మల్లికార్జున్, బాలేశ్వర్గౌడ్, అనిల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నీటి నిల్వకు కుంటలు
● ఉపాధిహామీ పథకం కింద పంట పొలాల్లో తవ్వకం ● వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు చర్యలు ● భూగర్భ జలాల రక్షణే ధ్యేయం ● ఇప్పటివరకు 5,490 ఫామ్ పాండ్స్, 905 పీటీలు, ఎంపీటీలు పూర్తిపెంచికల్పేట్(సిర్పూర్): మారిన వాతావరణ పరిస్థితులతో భూగర్భ జలాలు ఏటా మరింత లోతుకు ఇంకిపోతున్నాయి. సాధారణ వర్షపాతమే నమోదవుతున్నా.. భూమిలో ఇంకే నీటిశాతం తక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో భూగర్భ జలాల పెంపుతోపాటు రైతులకు అందుబాటులో నీటి వనరులు ఉంచేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింద నీటి కుంటల తవ్వకం చేపడుతోంది. పంట పొలాల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి ఫామ్ పాండ్స్, పీటీ, ఎంపీటీల తవ్వుతున్నారు. బహుళ ప్రయోజనాలు ఉండటంతో రైతులు సైతం స్వచ్ఛందంగా నీటి కుంటల తవ్వకానికి ముందుకొస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 5,490 ఫామ్ పాండ్స్, 905 పీటీలు, ఎంపీటీల తవ్వకాలు పూర్తయ్యాయి. మరో 531 ఫామ్ పాండ్స్, 865 పీటీలు, ఎంపీటీల పనులు కొనసాగుతున్నాయి. సంబంధిత అధికారులు నీటి నిల్వతో కలిగే ప్రయోజనాలను అన్నదాతలకు వివరిస్తున్నారు. పెద్దఎత్తున కుంటల తవ్వకాల వైపు వారు మొగ్గు చూపేలా అవగాహన కల్పిస్తున్నారు. అధికంగా వర్షాలు కురిసే జిల్లాలో కుంటలు నిర్మించి జలాన్ని ఒడిసిపట్టడంలో సత్ఫలితాలు సాధిస్తున్నారు. పుష్కలంగా నీరు..జిలాల్లో రైతులు బావులు, బోరుబావుల కింద వరి, పత్తి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. భూగర్భ జ లాలను పెంచేందుకు ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ లో ఒక్కపైసా ఖర్చు లేకుండా ఉపాధికూలీలు ద్వా రా పంట పొలాలు, చేలలో కుంటల తవ్వకాలు చేపడుతోంది. పొలాల్లో నిర్మించిన కుంటలు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీటిని ఒడిసిపట్టి నిల్వ చేస్తున్నాయి. వరదలకు భూమి కోతకు గురి కాకుండా.. పంట పొలాల్లోని సారవంతమైన నేలలు కొట్టుకుపోకుండా కూడా ఈ కుంటలు రక్షిస్తున్నాయి. మరోవైపు చెరువులు, కుంటల్లో తవ్వుతు న్న ఫామ్ పాండ్స్తో పుష్కలంగా నీరు నిల్వ ఉంటుంది. అధికారుల సూచనలతో రైతాంగం పెద్ద ఎ త్తున కుంటల తవ్వకాలకు మొగ్గు చూపుతున్నారు. భూగర్బ జలాలు పెరిగి భవిష్యత్తు తరాలకు అందించడానికి నీటి కుంటలు బాటలు వేస్తున్నాయి. అవగాహన కల్పిస్తున్నాం ఉపాధిహామీ పథకంలో పెద్దఎత్తున కుంటలు, పీటీల తవ్వకాలు చేపడుతున్నాం. పంట పొలాల్లో నిర్మించే కుంటలతో రైతులకు కలిగే లాభాలను క్షేత్రస్థాయిలో నిర్వహించే గ్రామసభల్లో వివరిస్తున్నాం. పంట చేలలో తవ్వే కుంటలతో భూగర్బ జలాలు పెరిగి రైతుల బోర్లు ఎక్కువ కాలం పనిచేస్తాయి. కుంటల తవ్వకాలను ఏటా పెద్దఎత్తున చేపడుతున్నాం. – సురేందర్, డీఆర్డీవోజిల్లా వివరాలుమండలం ఫామ్ పీటీలు/ పాండ్స్ ఎంపీటీలు ఆసిఫాబాద్ 377 54 బెజ్జూర్ 595 04 చింతలమానెపల్లి 109 01 దహెగాం 307 04 జైనూర్ 300 20 కాగజ్నగర్ 540 27 కెరమెరి 329 257 కౌటాల 354 02 లింగాపూర్ 77 07 పెంచికల్పేట్ 195 03 రెబ్బెన 298 00 సిర్పూర్(టి) 1040 16 సిర్పూర్(యూ) 108 00 తిర్యాణి 568 24 వాంకిడి 293 486 -
జిల్లాకు అదనపు ఓటింగ్ యంత్రాలు
ఆసిఫాబాద్అర్బన్: లోక్సభ ఎన్నికలకు సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సిగ్మెంట్లకు అదనపు ఓటింగ్ యంత్రాలు వచ్చాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎంల గోదాంలో గురువారం అదనపు కలెక్టర్ దాసరి వేణు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అదనపు బ్యాలెట్ యూనిట్లు, ఓటింగ్ యంత్రాల ప్రథమస్థాయి పరిశీ లన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ర్యాండమైజేషన్ పూర్తయిన తర్వాత ఆయా నియోజకవర్గాలకు కేటాయించిన ప్రకారం బందోబస్తు మధ్య తరలిస్తామన్నారు. స్ట్రాంగ్ రూంల్లో భద్రపర్చి 24 గంటలపాటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, నాయబ్ తహసీల్దార్ జితేందర్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. -
భద్రత సూత్రాలు పాటించాలి
ఆసిఫాబాద్అర్బన్: విద్యుత్ శాఖలో పని చేసే కార్మికులు విధి నిర్వహణలో భద్రత సూత్రాలు పాటించాలని ఆ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ వాసుదేవ్ అన్నారు. ఈ నెల 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న విద్యుత్శాఖ వారో త్సవాల పోస్టర్ను గురువారం పట్టణంలోని సబ్స్టేషన్లో ఆవిష్కరించారు. విద్యుత్ ప్ర మాదాల నివారణపై కార్మికులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ భద్రత సూత్రాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చన్నారు. పని స్థలాల్లో ఎర్త్రాడ్లు వినియోగించాలని సూచించారు. విని యోగదారులు కరెంట్ వైర్లు తెగితే సంబంధి త సిబ్బందికి తెలియజేయాలని సూచించా రు. ఇంటి వద్ద వైర్లపై బట్టలు ఆరేస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగలకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాస్, అసిస్టెంట్ ఇంజినీర్ సదాశివ్, ఏఈ ప్రత్యూష, సబ్ ఇంజినీ ర్ శేఖర్, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.
Photos
View allVideo
View allBullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019