Sakshi News home page

sakshiNew_skin_Left

sakshiNew_skin_right

దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

Published Tue, Apr 23 2024 8:40 AM

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో చైతన్య  - Sakshi

చింతూరు: మలేరియా జ్వరాల అదుపులో భాగంగా దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని చింతూరు ఐటీడీఏ పీవో కావూరి చైతన్య ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో వైద్యశాఖ అధికారులు, సిబ్బందితో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రతి ఇంట్లో తప్పనిసరిగా దోమలమందు పిచికారీ చేయాలని, ఈ కార్యక్రమానికి ఇతర శాఖల అధికారులు సహకారం అందించాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని పీవో ఆదేశించారు. అసిస్టెంట్‌ మలేరియా అధికారి శ్రీనివాసరాజు మాట్లాడుతూ దోమల మందు పిచికారీకి సంబంధించి వాడే విధానం, మెలకువలపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. చింతూరు డివిజన్లోని 157 గ్రామాల్లో మొదటి విడతలో భాగంగా వచ్చేనెల 15 వరకు, రెండో విడత కింద జూలై నుంచి ఆగస్టు వరకు దోమలమందు పిచికారీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ పుల్లయ్య, నాలుగు మండలాలకు చెందిన వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Ad - Sakshi_Home_Sticky

adsolute_video_ad

What’s your opinion

homepage_300x250