యలమంచిలి రూరల్: వైఎస్సార్సీపీ యలమంచిలి అభ్యర్థి యు.వి.రమణమూర్తి రాజు (కన్నబాబు) శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. వేలాది మంది అభిమానులు వెంటరాగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు. వేలాదిగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు జై జగన్..జై కన్నబాబు..జై బూడి..అన్న నినాదాలతో హోరెత్తించారు. యలమంచిలి పట్టణ వీధులు శుక్రవారం కిక్కిరిసిపోయాయి. కళాకారుల ఆటపాటలు, డప్పుచప్పుళ్లతో పండగ వాతావరణం కనిపించింది. ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు, ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు రొంగలి జగన్నాథం, డీసీసీబీ మాజీ చైర్మన్ సుకుమారవర్మ పాల్గొన్నారు.
breaking news
Breadcrumb
- HOME
Ad - Sakshi_Home_Sticky
adsolute_video_ad
Related news
-
పదిలో బాలికలదే హవా
2023 77.742024 89.04పది ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు దుమ్మురేపాయి. కార్పొరేట్కు దీటుగా ఫలితాలు సాధించి వహ్వా అనిపించాయి. నాణ్యమైన ఉచిత విద్యనందించి మార్కులు కొల్లగొట్టాయి. జిల్లా మొత్తం మీద 89.04 శాతం ఉత్తీర్ణత రాగా, రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. గత విద్యా సంవత్సరంలో 77.74 శాతం సాధించగా, ఈ ఏడాది గణనీయంగా ఉత్తీర్ణత పెరగడం గమనార్హం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యమివ్వడంతో ఈ ఘనత సాధించగలిగాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా శ్రీలేఖకు మిఠాయి తినిపిస్తున్న తల్లిదండ్రులు తాను సివిల్స్ పరీక్షలకు వెళ్తానని గట్టెం శ్రీలేఖ అన్నారు. పాయకరావుపేట మండలం గుంటపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుని పదో తరగతి ఫలితాల్లో 591 మార్కులు సాధించానని ఆనందం వ్యక్తం చేసింది. ట్రిపుల్ ఐటీలో ఇంజినీర్ చదివి అనంతరం సివిల్స్ సాధించడమే ధ్యేయమన్నారు. ఆమె తండ్రి గంగబాబు వృత్తిరీత్యా టైల్స్ వ్యాపారి, తల్లి విజయలక్ష్మి గృహిణి. తమ కుమార్తె ప్రతిభకు వారు ముగ్ధులయ్యారు.స్వాతికి స్వీట్లు తినిపిస్తున్న తల్లిదండ్రులు తాను కష్టపడి చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవుతానని.. పదో తరగతిలో 592 మార్కులు సాధించుకున్న పాయకరావుపేటకు చెందిన కోటిపల్లి సత్యధన స్వాతి చెప్పింది. పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకొని ఆమె ఈ ఘనత సాధించింది. ఆమె తండ్రి వీరబాబు వృత్తిరీత్యా తాపీమేస్త్రి, తల్లి గృహిణి కాగా, తమ కుమార్తె జిల్లా టాపర్గా నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనకాపల్లి: జిల్లాలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా నుంచి రెగ్యులర్ విద్యార్థులు 10,820 మంది బాలురు పరీక్షలు రాయగా, 9,384 మంది బాలికలు 10,349 మంది పరీక్షలు రాయగా 9,464 మంది ఉత్తీర్ణత సాధించినట్లు డీఈవో ఎం. వెంకటలక్ష్మమ్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 21,169 మంది విద్యార్థుల పరీక్షకు హాజరు కాగా, 18,848 మంది ఉత్తీర్ణత సాధించారు. 14,725 మంది ప్రథమ శ్రేణి, 2,867 మంది ద్వితీయ శ్రేణి, 1,256 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. బాలురు ఉత్తీర్ణత శాతం 86.73 శాతం, బాలికలు ఉత్తీర్ణత శాతం 91.45 శాతంగా నమోదైంది. జిల్లా మొత్తం మీద 89.04 శాతం రాగా, రాష్ట్రంలో 12వ స్థానంలో జిల్లా నిలిచిందన్నారు. పాయకరావుపేట జెడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని కోటిపల్లి సత్యధన స్వాతి 600 మార్కులకు గాను 592 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవగా, పాయకరావుపేట మండలంలో గుంటపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని గట్టెం శ్రీలేఖ 590 మార్కులతో ద్వితీయ స్థానంలోను, పాయకరావుపేట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని జాన లలిత భవాని, వాడచీపురుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి దూడ రఘు 588 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. గత విద్యా సంవత్సరంలో 77.74 శాతం సాధించగా, ఈ ఏడాది ఉత్తీర్ణత 89.04 శాతం పెరిగింది. ఫలితాల్లో దుమ్ము రేపిన కేజీబీవీలు నాతవరం: పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీలు) దుమ్మురేపాయి. ఇవి 97 శాతం ఉత్తీర్ణత శాాతం సాధించాయి. జిల్లాలో 20 కేజీబీవీల్లో 743 మంది పరీక్షలకు హాజరు కాగా, 608 మంది ప్రథమ శ్రేణి, 85 మంది ద్వితీయ శ్రేణి, 21 మంది తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 500పైగా మార్కులు సాధించిన విద్యార్థినులు 148 మంది ఉన్నారు. నాతవరం రాంబిల్లి, బుచ్చెయ్యపేట, సబ్బవరం, కె.కోటపాడు, కోటవురట్ల, రోలుగుంట కేజీబీవీల్లో శత శాతం పాసయ్యారు. శతశాతం ఉత్తీర్ణత... ●అచ్యుతాపురం మండలం దోసూరు ఉన్నత పాఠశాల శతశాతం ఉత్తీర్ణత సాధించింది. 24 మంది పరీక్షలు రాయగా, అందరూ పాసయ్యారు. ●మునగపాక మండలం తిమ్మరాజుపేట హైస్కూల్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. 24మంది విద్యార్థులకు గాను అందరూ ఉత్తీర్ణులయ్యారు. ●అనకాపల్లి పట్టణంలో మహాత్మాగాంధీ జ్యోతిబాయి పూలే హైస్కూల్, రైల్వే స్టేషన్ రహదారి భీమునిగుమ్మం హైస్కూల్, మండలంలో మర్రిపాలెం జెడ్పీ హైస్కూల్ శత శాతం ఉత్తీర్ణత సాధించాయి. ●రోలుగుంట మండలం కొవ్వూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 14 మందికి మొత్తం ఉత్తీర్ణత అయ్యారు. ●దేవరాపల్లి మండలం కాశీపురం, ఎ. కొత్తపల్లి, కలిగొట్ల, ఎం.అలమండ, ముషిడిపల్లి హైస్కూల్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణులయ్యారు. ●ఎస్.రాయవరం మండలం లింగరాజుపాలెం మహాత్మాగాంధీ జ్యోతిరావుపూలే పాఠశాల శత శాతం ఉత్తీర్ణత సాధించింది. ఎస్.రాయవరం బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. ●నర్సీపట్నం ఎంజేపీ బీసీ బాలుర గురుకుల పాఠశాల శతశాతం ఉత్తీర్ణత సాధించింది. ●రావికమతం మండలం మరుపాక మోడల్ స్కూల్లో 94 మంది విద్యార్థులకు గానూ 94 మంది పాసయ్యారు. ●మాడుగుల మండలం తాటిపర్తి గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత పాఠశాల నుంచి 69 మందికి 69 మంది, ఇదే మండలం జి. అగ్రహారం హైస్కూలు నుంచి 20 మందికి 20 మంది పాసయ్యారు. జిల్లాలో 89.04 శాతం ఉత్తీర్ణత సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు -
సూపర్హిట్
జనమే జనం.. పోటెత్తిన అభిమాన ప్రవాహం.. రోడ్లకిరువైపులా జనం బారులు.. మహిళల హారతులు.. పూలవర్షాలతో కనీవినీ ఎరుగని అఖండ స్వాగతం.. ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండు రోజులపాటు సాగిన సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో కనిపించిన దృశ్యాలివి.. సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో బస్సుయాత్ర పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. అడుగడుగునా అశేష జనవాహిని నడుమ సాగిన బస్సుయాత్ర ప్రతిపక్ష పార్టీల గుండెల్లో వణుకు పుట్టించింది. సంక్షేమ రథసారధి.. దగ్గరి నుంచి చూడాలని.. వీలైతే మాట్లాడాలని.. ఒక్క ఫొటో తీసుకోవాలని ప్రజలు ఉత్సాహం చూపించగా.. ఆయనే స్వయంగా బస్సు దిగి ఆప్యాయంగా పలకరించడం.. ‘నేను ఉన్నానంటూ’ భరోసా కల్పించడంతో శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి విశాఖలో అడుగుపెట్టింది మొదలు ప్రజలు అదే ప్రేమాభిమానాలు కురిపించారు. జై జగన్ అంటూ నినదించారు. పేదల ప్రతినిధికి జేజేలు పలికారు. ఆయన మాట ఇచ్చాడంటే తప్పడంతే అని నమ్మిన ప్రజలు స్వచ్ఛందంగా జగనన్న చూసేందుకు తరలివచ్చారు. జగనన్న మాటకు.. బాటకు ప్రజలు విలువ ఇస్తున్నారు. ఆయన ఒక్క అడుగు వేస్తే.. లక్షలాది పాదాలు ఆయనను అనుసరించాయి. అందుకే మేమంతా సిద్ధం బస్సుయాత్ర జనజాతర తలపించింది. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అక్కున చేర్చుకున్న జనం ‘ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. ఇక్కడే ప్రమాణస్వీకారం చేస్తా. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చేస్తూ.. ఇక్కడి నుంచే పరిపాలన సాగిస్తానంటూ ఇటీవల జరిగిన విజన్ విశాఖ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు.. అందుకే అన్నొస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి సాధ్యమని విశాఖ జనం విశ్వసించారు’.. మేము సిద్ధం యాత్రలో భాగంగా జనంతో మమేకమయ్యేందుకు విశాఖ చేరుకున్న వైఎస్ జగన్కు విశేష ఆదరణ లభించింది. 2019 ప్రజాసంకల్ప యాత్రలో ఎలాగైతే జనం అక్కున చేర్చుకున్నారో అంతకు మించిన అభిమానాన్ని ఉమ్మడి విశాఖ ప్రజలు మేమంతా సిద్ధం అంటూ చూపిస్తున్నారు. సభలో స్పందన భేష్ బస్సుయాత్రలో భాగంగా ఈ నెల 20న అనకాపల్లి జిల్లా చింతలపాలెంలో నిర్వహించిన సిద్ధం సభకు వార్ వన్సైడ్ అనే రీతిలో అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా యువత, మహిళలు సీఎం వైఎస్ జగన్ మాటలకు కేరింతలు కొట్టారు. జగన్ వెంట మేమంటూ నినాదాలు చేశారు. ఈ ఎన్నికల్లో కూటమి కుయుక్తులు, చంద్రబాబు చెబుతున్న అబద్ధాల గురించి జగన్ చెప్పిన మాటలు ప్రజల్లోకి సూటిగా వెళ్లడంతో టీడీపీ, జనసేన పార్టీల వైఖరిపై ప్రజల్లో ఒక క్లారిటీ తీసుకొచ్చారు. జనమంతా జేజేలు అనకాపల్లి, విశాఖ జిల్లాలో బస్సుయాత్రకు వచ్చిన ఆదరణతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం రెట్టింపైంది. ఈసారీ జెండా రెపరెపలాడేలా జనమంతా జేజేలు పలుకుతుండటటంతో.. అటు అభ్యర్థులు, పార్టీ శ్రేణులు దూకుడు పెంచారు. ఇంటింటా ప్రచారాన్ని మరింత ఉత్సాహంగా చేయా లని నిర్ణయించుకున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ విజయ ఢంకా మోగబోతోందన్నది స్పష్టమైంది. ప్రతిపక్షాల్లో వణుకు జనమంతా జగన్వైపే ఉన్నారన్న స్పష్టత రావడంతో ప్రతిపక్షాల్లో వణుకు మొదలైంది. ప్రజలంతా స్వచ్ఛందంగా జగన్ను చూసేందుకు వచ్చిన విషయం తెలుసుకొని టీడీపీ, జనసేన నేతలు కలవరపడుతున్నారు. ఫ్యాన్ గాలికి తట్టుకొని నిలబడటం కష్టమేనన్న సంకేతాలు కనిపించడంతో ఏం చేయాలో పాలుపోక ఆపసోపాలు పడుతున్నారు. గెలుపు అవకాశాలు కనుచూపు మేరలో కూడా కనిపించకపోవడంతో ప్రజలను ఎలా ప్రసన్నం చేసుకోవాలన్నదానిపై పునరాలోచనలో పడేలా బస్సుయాత్ర జైత్రయాత్రలా సాగింది. ఉమ్మడి విశాఖలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర కనీవినీ ఎరుగని రీతిలో సూపర్ హిట్ అవ్వడంతో ఫ్యాన్ స్పీడ్ మరింత పెరిగింది. అధినేత పర్యటనతో అనకాపల్లి, విశాఖ జిల్లాలోని అభ్యర్థులు గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ బస్సుయాత్రతో వైఎస్సార్ సీపీలో జోష్ మేమంతా సిద్ధం అంటూ నినదించిన ప్రజానీకం కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహం కార్యనిర్వాహక రాజధానికి ఓటేస్తామంటూ చాటిచెప్పిన జనం ప్రతి నియోజకవర్గంలోనూ స్వచ్ఛందంగా కదిలివచ్చిన ప్రజలు -
అట్టహాసంగా ముత్యాల నాయుడు నామినేషన్
తుమ్మపాల: వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు నామినేషన్ కార్యక్రమం సోమ వారం అట్టహాసంగా జరిగింది. దేవరాపల్లి మండలం తారువ గ్రామం నుంచి ఆయన ఉదయం 11 గంటల సమయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. 45 కిలోమీటర్ల మేర సాగిన ఈ ర్యాలీలో దారిపొడవునా పార్టీ శ్రేణులు, అభిమాను లు స్వాగతం పలుకుతూ సీఎం జగన్, ఎంపీ బూడి అంటూ నీరాజనాలు పలికారు. అనకాపల్లి పట్టణంలో ఎంపీ బీవీ సత్యవతి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్కుమార్ల ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఘన స్వాగ తం పలికారు. అక్కడ నుంచి జాతీయ రహదారి మీదు గా శంకరంలో కలెక్టరేట్కు చేరుకున్నారు. 1.45 నిమిషాలకు మూడు సెట్ల నామినేషన్ పత్రాలను అఫిడవిట్ రూపంలో జిల్లా ఎన్నికల అధికారి రవి పట్టన్శెట్టికి సమర్పించారు. నామినేషన్ వేసి బయటకు వచ్చిన బూడిని జిల్లాలో పలువురు నాయకులు సత్కరించి ఆల్ ది బెస్ట్ తెలిపారు. అనంతరం మీడియాతో బూడి మాట్లాడుతూ.... మాడుగుల నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసుకోవడంతోపాటు వైఎస్సార్సీపీ కంచుకోటగా తయారు చేశామన్నారు. ఇప్పుడు మిగిలిన ప్రాంతాలను అదే విధంగా అభివృద్ధి చే యాలని ఆయా నియోజకవర్గాల ప్రజ లు, నాయకులు కోరుతున్నారన్నారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలంటే, ఎంపీగా తనతోపాటు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. సీఎం.రమేష్కు ఢిల్లీ వీధులు బాగా తెలుసట.... టీడీపీ అధినేత చంద్రబాబు కడప నుంచి దిగుమతి చేసిన సీఎం.రమేష్కు ఢిల్లీలో అన్ని వీధులు తెలుసని, తనకు తెలియదని ఇటీవల చంద్రబాబు చెప్ప డం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎంపీగా గెలిచిన వ్యక్తికి తెలియాల్సింది ఢి ల్లీ వీదులు కాదని, పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని వీధులు, గ్రామాలు తెలియాలన్నారు. ఈ ప్రాంత సమస్యలపై కనీస అవగాహన లేని రమేష్కు ఇక్కడ పనేంటన్నారు. సీఎం ఆశీస్సు లు, ప్రజల దీవెనలతో ఎంపీగా గెలిచిన తర్వాత ఢిల్లీలో తనకు కేటాయించిన క్యార్టర్స్ నుంచి పార్లమెంట్కు వెళ్తాను తప్ప ఢిల్లీ వీధుల్లో తిరగాల్సిన అవసరం లేదన్నారు. ఈ ప్రాంత సమస్యలదె పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కారం దిశగా పనిచేస్తామన్నారు. మూడు సెట్ల దాఖలు చేసిన బూడి ముత్యాలనాయుడు తారువ నుంచి కలెక్టరేట్కు వరకు 45 కిలోమీటర్ల ర్యాలీ దారి పొడవునా తరలివచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్కుమార్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం -
జనసేన నుంచి వైఎస్సార్సీపీలోకి..
ఎమ్మెల్యే గణేష్ సమక్షంలో పార్టీలో చేరిన జనసేన నాయకుడు గుండుబొగుల శ్రీనివాస్ నర్సీపట్నం: జనసేన నియోజకవర్గ మాజీ ఇన్చార్జి గుండుబొగుల శ్రీనివాస్ సోమవారం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇతను గతంలో జనసేన అనకాపల్లి పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేశారు. జనసేనకు పట్టు ఉన్న నాయకుడైన శ్రీనివాస్ వైఎస్సార్సీపీలో చేరడంతో కూటమికి గట్టి ఎదురు దెబ్బతగిలింది. చేరిక కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, రుత్తల ఎర్రాపాత్రు డు, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, గొలుగొండ మండల పార్టీ అధ్యక్షుడు లెక్కల సత్యనారాయణ పాల్గొన్నారు. -
రె‘బెల్స్’
● టీడీపీలో కొనసాగుతున్న సీట్ల ఫైట్ ● మాడుగుల అభ్యర్థిగా పైలా నామినేషన్ ● పాడేరు నుంచి నామినేషన్ వేసిన కిల్లో రమేష్ నాయుడు ● టికెట్ మార్చి గిడ్డి ఈశ్వరికి ఇస్తారంటూ జోరందుకున్న ప్రచారం ● మాడుగుల అభ్యర్థిగా 22న నామినేషన్ వేస్తానని బండారు ప్రకటన ● అరకులో చంద్రబాబుపై యుద్ధం ప్రకటించిన సివేరి అబ్రహం ● అదే బాటలో దొన్నుదొర.. నామినేషన్ వేసేందుకు సిద్ధం సాక్షి, విశాఖపట్నం: వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా మారిన టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ల కేటాయింపు విషయంలోనూ అదే పద్ధతి పాటిస్తున్నారు. తొలుత ప్రకటించిన అభ్యర్థులను మార్చుతారన్న సంకేతాలు రావడంతో ఆ పార్టీ నేతలు అధినేత తీరుపై మండిపడుతున్నారు. మరో వైపు నామినేషన్లు వేసిన తర్వాత కూడా అభ్యర్థులను మార్చుతారన్న సంకేతాలు రావడంతో భంగపడ్డ నాయకులు టీడీపీ రెబల్స్గా బరిలోకి దిగడానికి సిద్ధమయ్యారు. మాడుగుల, పాడేరు, అరకు.. ఇలా ప్రతిచోటా రెబెల్స్ మోగుతున్నాయి. దీంతో తిరుగుబావుటా ఎగరేసిన వారికి తాయిళాలు.. నామినేటెడ్ పదవులు ఇస్తామని జపిస్తున్నా.. చంద్రబాబు మాటలు నమ్మడం లేదు. అసలు ఎన్ని పదవులు ఉంటాయి.. ఒకే పదవి ఎంత మందికి ఇస్తారు.. అని భావించిన టికెట్ రాని టీడీపీ నేతలు రెబల్స్గా బరిలో దిగుతామని స్పష్టం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల టికెట్ ఆశించి భంగపడిన వారంతా లోలోపల రగిలిపోతున్నారు. బండారు ఇన్.. పైలా అవుట్ ! మాడుగుల టికెట్ పైలా ప్రసాద్కు కేటాయించారు. దీంతో ఆయన శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే భీ పారం ఇవ్వకముందే.. బండారు సత్యనారాయణమూర్తి తనకే టికెట్ ఇస్తారని నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో పైలాకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే ప్రచారం సాగుతోంది. ఒకే వేళ తన సీటు మార్చితే లోకల్గా ఉన్న గవిరెడ్డి లేదా కుమార్కు ఇచ్చినా తాను సహకరిస్తాను తప్పా ఎక్కడి నుంచో వచ్చిన బండారుకు సహకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నామినేషన్ వేసి అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు. తనను కాదని బండారుకి టికెట్ ఇస్తే.. ఆయన బండారం బయటపెట్టి.. ఎలా నెగ్గుతారో చూస్తానంటూ సవాల్ విసిరారు. అరకులో డబుల్ ధమాకా.. అరకు నియోజకవర్గంలో టీడీపీకి రెబల్ పోటు తప్పేలా లేదు. రాష్ట్రంలోనే మొట్టమొదటగా చంద్రబాబు ప్రకటించిన టికెట్ అరకులోయే. ఈ స్థానంలో టీడీపీ తరఫున దొన్నుదొర నిలబడుతున్నారంటూ ప్రజలందరి ముందు ప్రకటించారు. చివరికి ఆ టికెట్ను బీజేపీకి కేటాయించారు. దీంతో దొన్నుదొర చంద్రబాబుపై యుద్ధం ప్రకటించారు. ఇదే స్థానం కోసం ఆశలు పెట్టుకున్న అబ్రహంను కూడా చంద్రబాబు నడిరోడ్డుపై వదిలేశారు. దీంతో అబ్రహం, దొన్నుదొర ఇద్దరూ చంద్రబాబు తీరుపై రగిలిపోతున్నారు. కూటమి తరఫున బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయగా.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా అబ్రహం కూడా నామినేషన్ వేశారు. దొన్నుదొర కూడా 24న నామినేషన్ వేస్తానని ప్రకటించారు. అక్కడా తిరుగుబావుటా...! పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లోనూ అసమ్మతి రగులుతోంది. పాడేరు టికెట్ ఆశించి భంగపడిన గిడ్డి ఈశ్వరి రెబల్గా బరిలోకి దిగుతానంటూ హెచ్చరించారు. అయితే.. కిల్లు రమేష్ నాయుడుకు హ్యాండ్ ఇచ్చి.. గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బీ–ఫారం ఈశ్వరికి ఇస్తే.. తాను రెబల్గా పోటీ చేస్తానని కిల్లు హెచ్చరించారు. రంపచోడవరంలోనూ వంతల రాజేశ్వరి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచి.. గెలిచి.. చంద్రబాబు, లోకేష్కు తన సత్తా చూపిస్తానని సవాల్ విసురుతున్నారు. ఇలా.. ప్రతి చోటా టీడీపీకి రెబల్స్ ఉచ్చు బిగుసుకుంటోంది. తిరుగుబాటు చేస్తామన్న నాయకులందర్ని పిలిపించి అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానంటూ చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. బాబు హామీలను గమనించిన అసంతృప్త నేతలు అధికారంలోకి రాక ముందు హ్యాండి ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోరని మండిపడుతున్నారు. ఎన్నికల్లోనే తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
Related News by category
-
సంస్కృత భాష కంప్యూటరీకరణతో మేలు
విశాఖ: సంస్కృత భాష వ్యాప్తికి కంప్యూటరీకరణ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆచార్య కోలవెన్ను మలయవాసిని అన్నారు. జిల్లెళ్లమూడి సంస్కృతి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గురువారం అక్కయ్యపాలెం లలితానగర్ లలితా పీఠంలో ‘సంస్కృత భాష–కంప్యూటరీకరణ’ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య వక్తగా ప్రసంగించారు. అగర్తల ట్రిపుల్ ఐటీ పూర్వ డైరెక్టర్ పి.ఎస్.అవధాని మాట్లాడుతూ సంస్కృత భాష కంప్యూటరీకరణ పూర్వాపరాలను విపులంగా విశదీకరించారు. బి.గోపి మాట్లాడుతూ సంస్కృత భాష కోసం తాము రూపొందించిన కంప్యూటర్ గురించి విషయాలు సభికులకు వివరించారు. డాక్టర్ డి.వి.సూర్యారావు, కె.విఎస్.రాజేశ్వరరావు, జి.జానకీరామ్లు సంస్కృత బాష కంప్యూటరీకరణలోని పలు అంశాలపై చర్చించి సూచనలిచ్చారు. కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ చిలకలూరి శాంతమ్మ, మల్లాది భాస్కరం, గాదిరాజు జానకీరామ్, ఘండికోట విశ్వనాధం పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన టీడీపీ నాయకులు
వైఎస్సార్సీపీలో చేరిన వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానిస్తున్న వైవీ సుబ్బారెడ్డి బుచ్చెయ్యపేట: మండలంలోని బంగారుమెట్టకు చెందిన టీడీపీ నాయకులు ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. గ్రామానికి చెందిన మాజీ వార్డు మెంబర్ మేరుగు రాము, గ్రామ దళిత సంఘ నాయకుడు బండి గంగరాజు, వీర్ల నారాయణమూర్తి తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి గురువారం విశాఖ నగరంలోని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగనన్న, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ విజయానికి పాటుపడతామని పార్టీలో చేరిన నాయకులు తెలిపారు. మాజీ సర్పంచ్ శిరిగిరిశెట్టి నానాజీ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి చందనోత్సవ టికెట్ల విక్రయాలు
ఆన్లైన్లో రూ. 1500 టికెట్లు సింహాచలం: ఈ నెల 10న జరిగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి సంబంధించి దర్శన టికెట్ల విక్రయాలు శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభించనున్నట్ట దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి వెల్లడించారు. ఈ నెల 7వతేదీ వరకు సాయంత్రం 5గంటల వరకు విక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు. సింహాచలం, మహారాణిపేట, అక్కయ్యపాలెంలోని యూనియన్ బ్యాంకు బ్రాంచ్లు, సింహాచలం, సాలిగ్రామపురం(అక్కయ్యపాలెం బ్రాంచ్), బిర్లా జంక్షన్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లతో పాటు సింహాచలం కొండపైన ఉన్న పీఆర్వో కార్యాలయంలో కూడా రూ.300, రూ.1000 టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆన్లైన్లో కూడా విక్రయాలు ఈనెల 3వతేదీ సాయంత్రం 4 గంటల నుంచి 7వతేదీ సాయంత్రం 6గంటల వరకు రూ.300, రూ.1000 టికెట్లతో పాటు రూ.1500 టికెట్లు కూడా ఆన్లైన్లో లభ్యమవుతాయని ఈవో పేర్కొన్నారు. www.ap temples.ap.gov.in వైబ్సైట్ ద్వారా టికెట్లు పొందవచ్చని తెలిపారు. 10వ తేదీన చందనోత్సవం రోజు ఎలాంటి దర్శనం టికెట్లు విక్రయాలు జరగవని స్పష్టం చేశారు. టికెట్లు లేని భక్తులు ఉచిత దర్శనం క్యూలో మాత్రమే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుందని సూచించారు. -
రేపటి నుంచి తొలివిడత చందనం అరగదీత
సింహాచలం: సింహగిరిపై శనివారం నుంచి తొలి విడత చందనం అరగదీత కార్యక్రమం నిర్వహించేందుకు దేవస్థానం వైదికులు, అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 10న చందనోత్సవం సందర్భంగా స్వామి వారి నిజరూప దర్శనం అనంతరం తొలివిడతగా సమర్పించే మూడు మణుగుల చందనాన్ని (సుమారు 125 కిలోల పచ్చిచందనం) సమకూర్చేందుకు అరగదీత కార్యక్రమం చేపట్టనున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 4న ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం తొలిచందనం చెక్కకు శాస్త్రోక్తంగా పూజలు చేసిన అనంతరం, నాల్గో తరగతి సిబ్బంది చందనాన్ని అరగదీస్తారు. ఈ మేరకు గురువారం ఆలయ బేడామండపంలో చందనం చెక్కలను ముక్కలుగా కోసి అరగదీతకు అనుగుణంగా సిద్ధం చేశారు. దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఏఈవో పాలూరి నరసింగరావు, సూపరింటెండెంట్ వెంకటరమణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. -
భువనేశ్వర్–ఎల్టీటీ మధ్య సమ్మర్ స్పెషల్స్
తాటిచెట్లపాలెం: వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైందని వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమ్మర్ స్పెషల్ రైళ్ల వివరాలిలా.. ● భువనేశ్వర్–లోకమాన్య తిలక్ టెర్మినస్(ఎల్టీటీ)(08420) రైలు ప్రతి బుధవారం రాత్రి 11 గంటలకు భువనేశ్వర్లో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు 6.45కు దువ్వాడ చేరుకుని, తిరిగి 6.50కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు లోకమాన్య తిలక్ టెర్మినస్కు చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 26 వరకు నడుస్తుంది. ● తిరుగు ప్రయాణంలో లోకమాన్య తిలక్ టెర్మినస్–భువనేశ్వర్ (08419) రైలు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు లోకమాన్య తిలక్ టెర్మినస్లో బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 5.45లకు దువ్వాడ చేరుకుని, తిరిగి 5.50కు బయలుదేరి అదే రోజు మధ్యరాత్రి(ఆదివారం తెల్లవారు) 1.45 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 28 వరకు నడుస్తుంది. విశాఖ–హతియా స్పెషల్ రైళ్ల రద్దు విశాఖపట్నం–హతియా– విశాఖపట్నం(08559/08560) మధ్య నడుస్తున్న వీక్లీ సమ్మర్ స్పెషల్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు సీనియర్ డీసీఎం కె.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లను ఇటీవలే వేశారు. జూన్ నెలాఖరు వరకు రాకపోకలు సాగించాలి. ఈ రైలుకు సరైన ఆక్యుపెన్సీ, డిమాండ్ లేనందున రద్దు చేస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఈ రైలుకు సరైన సమయంలో వేస్తే డిమాండ్ ఉంటుంది. అనువు కాని వేళల్లో ఈ ట్రైన్ నడుస్తున్నందున ఖాళీగా రాకపోకలు సాగించింది. బొకారో, టాటా ఎక్స్ప్రెస్ల వేళలకు కొంచెం అటూ ఇటుగా ఈ రైలు విశాఖ నుంచి బయలుదేరేలా చేస్తే డిమాండ్ ఉంటుందని పలువరు రైల్ యూజర్లు కోరుతున్నారు.
Photos
View allVideo
View allBullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019