Sakshi News home page

కాంగ్రెస్‌కు షాక్‌

Published Tue, May 7 2024 11:45 AM

కాంగ్రెస్‌కు షాక్‌

● బీజేడీలో చేరిన ప్రఫుల్ల భొత్ర

జయపురం: జయపురం కాంగ్రెస్‌లో ప్రముఖ నేత ఫ్రఫుల్ల భొత్ర బుధవారం సాయంత్రం బీజేడీలో చేరారు. వి.కె.పాండ్యన్‌ యపురం పర్యటన సమయంలో ఫ్రఫుల్ల భొత్ర ఆయన సమక్షంలో బీజేడీలో చేరారు. భొత్ర మున్సిపాలటీ మాజీ కౌన్సిలర్‌. భొత్ర కొట్‌పాడ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ టిక్కెటు కోసం ప్రయత్నించారు. అధిస్ఠానం అతడికి టిక్కెట్టు ఇవ్వకపోబంతో పార్టీని వీడి బీజేడీ లో చేరినట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు. భొత్ర బీజేడీలో చేరిక వల్ల ఆ పార్టీకి క్రిష్టియన్‌ ఓట్లు పడే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేడీ జయపురం అభ్యర్థి డాక్టర్‌ ఇందిర నందో, పలువురు నాయకులు ఉన్నారు.

Advertisement

homepage_300x250