Sakshi News home page

కాంగ్రెస్‌ బైక్‌ ర్యాలీ ప్రచారం ప్రారంభం

Published Tue, May 7 2024 11:45 AM

కాంగ్

జయపురం: ఎన్నికలు సమీపిస్తుండడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. జయపురం శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి తారాప్రసాద్‌ బాహిణీపతి గురువారం నుంచి బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. జయపురం సమితి పంపుణి గ్రామ పంచాయతీ కుములిపుట్‌లో ర్యాలీని ప్రారంభించారు. బైక్‌ ర్యాలీ నియోజవర్గంలోని అన్ని గ్రామాల్లో కొనసాగుతోందని ఎమ్మెలన్య బాహిణీపతి వెల్లడించారు. ఒక పక్క ఇతర పార్టీలకు చెందిన వారిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి మిశ్రణ పర్వ్‌లు నిర్వహిస్తూనే మరోపక్క ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రజలను కలుసుకొని పదేళ్లలో తాను చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ ఓటును అభ్యర్థిస్తున్నారు. పార్టీ శ్రేణులు కూడా ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కాగా గురువారం లక్ష్మీనగర్‌లోని తన నివాసంలోను, హనగుడ కల్యాణ మండపం, కొంగ గ్రామంలో మిశ్రణ పర్వ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన వారు పార్టీలో చేరగా వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. కౌన్సిలర్‌ ప్రణయ కిశోర్‌ నాయక్‌ ఐదో నంబర్‌ వార్డు నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ సాధారణ కార్యదర్శిణి మీణాక్షీ బాహిణిపతి పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ బైక్‌ ర్యాలీ ప్రచారం ప్రారంభం
1/1

కాంగ్రెస్‌ బైక్‌ ర్యాలీ ప్రచారం ప్రారంభం

Advertisement

homepage_300x250