శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజులను త్వరితగతిన చెల్లించాలని, ఈనెల 24వ తేదీతో గడువు ముగుస్తుందని ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు తెలిపారు. ఇటీవలి వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన వారితో పాటు తమ మార్కులకు పెంచుకునేందుకు (ఇంప్రూవ్మెంట్/బెటర్మెంట్) ఆసక్తి చూపే విద్యార్థులు పరీక్ష ఫీజును ఈనెల 24 తేదీలోగా తమ కళాశాలల్లో చెల్లించాల్సి ఉంటుందన్నా రు. అలాగే ఇంటర్మీడియెట్ ఫలితాలపై సందేహాలున్న విద్యార్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 24వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్ఐఓ చెప్పారు. ఆన్లైన్ ద్వారా మాత్రమే నిర్దేశించిన ఫీజులను చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. ప్రాక్టికల్స్లో ఫెయిలైన విద్యార్థులకు మే ఒకటి నుంచి 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు.
ఏ ఫారం..బీ ఫారం అంటే..?
హిరమండలం: నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. అభ్యర్థులు ‘ఏ’ ఫారం, ‘బీ’ ఫారం ప ట్టుకుని ఆర్ఓ ఆఫీసుకు వస్తారు. అసలు ఈ ఫారాలకు అర్థాలేంటో తెలుసా..? గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో తమ అభ్యర్థులను ప్రతిపాదిస్తూ ఇచ్చే పత్రాన్ని బీ ఫారం అంటారు. నామినేషన్ సమర్పించే సమయంలో అభ్యర్థులు తమ రాజకీయ పార్టీలు ఇచ్చిన బీఫారం దాఖలు చేయాలి. అప్పుడే ఆ అభ్యర్థికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ గుర్తు కేటాయిస్తారు. బీ ఫారంను పార్టీ అధ్యక్షుడు నిర్ణయించిన వ్యక్తి జారీ చేస్తారు. బీ ఫారం జారీచేసేందుకు సంబంధిత వ్యక్తికి పార్టీ అధ్యక్షుడు ఆమోదాన్ని తెలుపుతూ ఏ ఫారం అందజేస్తారు. ఏ ఫారం ఎవరి పేరు తో అధ్యక్షుడు ఇస్తారో ఆ వ్యక్తికి పోటీ చేసే అభ్యర్థులకు బీఫారం ఇచ్చే అధికారం ఉంటుంది. తన పేరు మీద అందజేసిన ఏ ఫారంను ఆయా నియోజకవర్గాల్లోని ఎన్నికల అధికారులకు పోటీ చేసే అభ్యర్థి అందజేయాల్సి ఉంటుంది.
‘అప్రమత్తత అవసరం’
ఇచ్ఛాపురం: నామినేషన్ల సమయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి స్పెష ల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ, జాయింట్ డైరెక్టర్ డి.గంగాధరం పోలీసు సిబ్బందికి సూచించారు. ఆయన గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయం గేట్ కి ఇరువైపులా 100 మీటర్ల వరకు గల కటాఫ్ పాయింట్లు ఉండేలా చూసుకోవాలని పోలీసులతో అన్నారు. నామినేషన్ల ప్రక్రియకు వచ్చిన అభ్యర్థుల వాహనాలను కటాఫ్ పాయింట్ల వద్ద నిలపాలని సూచించారు. అభ్యర్థితో పా టు నలుగురు వ్యక్తులు, మూడు వాహనాలకు మాత్రమే తహసీల్దార్ గేట్ వరకు అనుమతి ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఇ చ్ఛాపురం, సోంపేట సీఐలు ఇమ్మాన్యూయేల్ రాజు, మల్లేశ్వరరావు, ఇచ్ఛాపురం, కవిటి ఎస్ఐలు వి.సత్యన్నారాయణ, ఎన్.లక్ష్మణరావు, రాము పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.