గార: వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో బీసీ వర్గాల అభ్యన్నతికి కృషి చేశామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార మండలం శిమ్మపేట జంక్షన్లోని కల్యాణ మండపంలో గురువారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో పేదలకు ఏ హామీలు ఇచ్చామని, వాటినే మేనిఫెస్టోలో రూపొందించి 99 శాతం అమలు చేశామని చెప్పారు. బీసీ వర్గాలకు రాజికీయంగా అనేక నామినేటడ్ పదవులు ఇవ్వడంతో పాటు పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. బీసీల ఓట్లు వేయించుకున్న టీడీపీ వారి అభ్యన్నతికి ఏం చేసిందని ప్రశ్నించారు. బీసీలను వాడుకొని వదిలేసిన మనస్తత్వం చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ప్రజల్లో తారతమ్యాలు ఉండకూడదనే ఉద్దేశంతో విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. పిల్లల బాగు కోసం తల్లి, తండ్రి ఎలా ఆలోచిస్తున్నారో ఈ ప్రభుత్వం కూడా అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. జన్మభూమి కమిటీ అనే బ్రోకర్ల ప్రభుత్వం కావాలా.. పేదల సంక్షేమానికి కృషి చేసే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కావాలో మీరే నిర్ణయించుకోవాలన్నారు. చంద్రబాబు హామీలను నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో శ్రీశయన కార్పొరేషన్ చైర్మన్ డీపీ దేవ్, సర్పంచ్ గొలివి వెంకటరమణమూర్తి, అంబటి చినబాబు, ఎంపీపీ గొండు రఘురామ్, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, పార్టీ కన్వీనర్ పీస గోపి, ముంజేటి కృష్ణమూర్తి, అరవల రామకృష్ణ, బరాటం నాగేశ్వరరావు, శిమ్మ ధర్మరాజు, యాళ్ల నారాయణమూర్తి, కొయ్యాన చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.
breaking news
Breadcrumb
- HOME
బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి
Published Fri, Apr 19 2024 1:30 AM
Ad - Sakshi_Home_Sticky
adsolute_video_ad
Related news
-
‘జోడీ’ పండు
ఎచ్చెర్ల మండలంలోని చినరావుపల్లిలో నంబాడ సూర్యనారాయణకు చెందిన జీడిమామిడి తోటలో మంగళవారం ఒకే జీడిపండుకు రెండు పిక్కలు కనిపించాయి. ఈ విషయమై ఎచ్చెర్ల వ్యవసాయాధికారి సురేష్ మాట్లాడుతూ జన్యులోపాల వల్ల ఇటువంటివి ఏర్పడతాయని చెప్పారు. – ఎచ్చెర్ల క్యాంపస్ వాసుదేవుని సన్నిధిలో మంత్రి సీదిరి కాశీబుగ్గ: రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి, పలాస నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సీదిరి అప్పలరాజు కుటుంబ సమేతంగా గురువారం మందసలోని వాసుదేవ పెరుమాళ్ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. నామినేషన్ వేయనున్న సందర్భంగా సంబంధిత పత్రాలను స్వామివారి పాదాల వద్ద పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అప్పలరాజు, శ్రీదేవి దంపతులు గోపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యనాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇరువర్గాల కొట్లాట ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని ఫరీదుపేటలో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య గురువారం కొట్లా ట జరిగినట్లు ఎచ్చెర్ల ఎస్సై చిరంజీవి తెలిపా రు. శుభకార్యం వద్ద ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి దాడి చేసుకున్నారని, ఈ ఘటనలో కూన కిరణ్కుమార్కు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించామ ని చెప్పారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇటీవల సొంత బావపైన జరిగిన దాడి కేసులో కిరణ్కుమార్పై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు. భారతీయ వారసత్వ సంపద అమూల్యం శ్రీకాకుళం కల్చరల్: ఇంటాక్ శ్రీకాకుళం చాప్టర్ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళంలోని డచ్ భవనం వద్ద ప్రపంచ వారసత్వ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ భారతీయ వారసత్వ సంపదను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇంటాక్ కన్వీనర్ నూక సన్యాసిరావు మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం న్యూఢిల్లీ ఇంటాక్ సంస్థ పంపిన శాశ్వత సభ్యత్వాన్ని కన్వీనర్ చేతుల మీదుగా జగన్మోహనరావుకు అందించారు. కార్యక్రమంలో సహాయ ఇంటాక్ సహాయ కన్వీనర్ వి.జగన్నాథంనాయుడు, నటుకుల మోహన్, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న పాలనలోనే ప్రైవేటు బోధన సిబ్బందికి న్యాయం
ఆమదాలవలస: ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులకు వైఎస్సార్ సీపీ పాలనలోనే న్యాయం జరిగిందని పలువురు బోధన సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఆమదాలవలస పట్టణంలోని స్పీకర్ క్యాంపు కార్యాలయం వద్ద కళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల రామారావు ఆధ్వర్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిశారు. ఈపీఎఫ్, ఈహెచ్ఎస్ సౌకర్యం కల్పించేలా చొరవ తీసుకోవాలని విన్నవించారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఎమ్మెల్యేగా తమ్మినేని సీతారాం, ఎంపీగా పేరాడ తిలక్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ను కలిసిన వ్యయ పరిశీలకుడు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ను వ్యయ పరిశీలకుడు నవీన్కుమార్ సోని గురువారం గౌరవ పూర్వకంగా కలిశారు. కలెక్టర్ కార్యాలయంలో కలిసి ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి చర్చించారు. అనంతరం వ్యయ పరిశీలకుల బృందంతో సమావేశమయ్యారు. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు త్వరితగతిన చెల్లించాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజులను త్వరితగతిన చెల్లించాలని, ఈనెల 24వ తేదీతో గడువు ముగుస్తుందని ఇంటర్మీడియెట్ బోర్డు జిల్లా ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు తెలిపారు. ఇటీవలి వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన వారితో పాటు తమ మార్కులకు పెంచుకునేందుకు (ఇంప్రూవ్మెంట్/బెటర్మెంట్) ఆసక్తి చూపే విద్యార్థులు పరీక్ష ఫీజును ఈనెల 24 తేదీలోగా తమ కళాశాలల్లో చెల్లించాల్సి ఉంటుందన్నా రు. అలాగే ఇంటర్మీడియెట్ ఫలితాలపై సందేహాలున్న విద్యార్థులు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 24వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఆర్ఐఓ చెప్పారు. ఆన్లైన్ ద్వారా మాత్రమే నిర్దేశించిన ఫీజులను చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. ప్రాక్టికల్స్లో ఫెయిలైన విద్యార్థులకు మే ఒకటి నుంచి 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఏ ఫారం..బీ ఫారం అంటే..? హిరమండలం: నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. అభ్యర్థులు ‘ఏ’ ఫారం, ‘బీ’ ఫారం ప ట్టుకుని ఆర్ఓ ఆఫీసుకు వస్తారు. అసలు ఈ ఫారాలకు అర్థాలేంటో తెలుసా..? గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో తమ అభ్యర్థులను ప్రతిపాదిస్తూ ఇచ్చే పత్రాన్ని బీ ఫారం అంటారు. నామినేషన్ సమర్పించే సమయంలో అభ్యర్థులు తమ రాజకీయ పార్టీలు ఇచ్చిన బీఫారం దాఖలు చేయాలి. అప్పుడే ఆ అభ్యర్థికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ గుర్తు కేటాయిస్తారు. బీ ఫారంను పార్టీ అధ్యక్షుడు నిర్ణయించిన వ్యక్తి జారీ చేస్తారు. బీ ఫారం జారీచేసేందుకు సంబంధిత వ్యక్తికి పార్టీ అధ్యక్షుడు ఆమోదాన్ని తెలుపుతూ ఏ ఫారం అందజేస్తారు. ఏ ఫారం ఎవరి పేరు తో అధ్యక్షుడు ఇస్తారో ఆ వ్యక్తికి పోటీ చేసే అభ్యర్థులకు బీఫారం ఇచ్చే అధికారం ఉంటుంది. తన పేరు మీద అందజేసిన ఏ ఫారంను ఆయా నియోజకవర్గాల్లోని ఎన్నికల అధికారులకు పోటీ చేసే అభ్యర్థి అందజేయాల్సి ఉంటుంది. ‘అప్రమత్తత అవసరం’ ఇచ్ఛాపురం: నామినేషన్ల సమయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి స్పెష ల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ, జాయింట్ డైరెక్టర్ డి.గంగాధరం పోలీసు సిబ్బందికి సూచించారు. ఆయన గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయం గేట్ కి ఇరువైపులా 100 మీటర్ల వరకు గల కటాఫ్ పాయింట్లు ఉండేలా చూసుకోవాలని పోలీసులతో అన్నారు. నామినేషన్ల ప్రక్రియకు వచ్చిన అభ్యర్థుల వాహనాలను కటాఫ్ పాయింట్ల వద్ద నిలపాలని సూచించారు. అభ్యర్థితో పా టు నలుగురు వ్యక్తులు, మూడు వాహనాలకు మాత్రమే తహసీల్దార్ గేట్ వరకు అనుమతి ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో ఇ చ్ఛాపురం, సోంపేట సీఐలు ఇమ్మాన్యూయేల్ రాజు, మల్లేశ్వరరావు, ఇచ్ఛాపురం, కవిటి ఎస్ఐలు వి.సత్యన్నారాయణ, ఎన్.లక్ష్మణరావు, రాము పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణదానం
ఈమె పేరు వైశ్యరాజు శాంత లక్ష్మి. నరసన్నపేటలోని కలివరపుపేట. భర్త లేరు. ఇద్దరు పిల్లలను తన రెక్కల కష్టం మీదనే పెంచుతున్నారు. అమ్మా యికి వివాహమైంది. కుమారుడు చేతికి అందివచ్చాడు. ఇప్పటికైనా కాసింత విశ్రాంతి తీసుకుందామనుకున్నారు. కానీ అప్పుడే ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ సోకింది. క్యాన్సర్ చికిత్స అంటే సాధారణ విషయం కాదు. దీంతో ఆమె ప్రాణాల మీద ఆశ వదిలేశారు. ఇంత లో ఆ వీధి వలంటీర్ ఆమె విషయాన్ని తెలుసుకుని ఆరోగ్యశ్రీ ద్వారా విశాఖ మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడకు వెళ్తే అన్ని పరీక్షలు చేశారు. కీమో థెరపీ కూడా చేశారు. ఆపరేషన్ నిర్వహించి 8 నెలలవుతోంది. ఇప్పుడు తాను ప్రాణాలతో ఉన్నానంటే అది ఆరోగ్య శ్రీ పథకం పుణ్యమేనని ఆమె చెబుతున్నారు. -
No Headline
అంకెల్లో అభివృద్ధిసచివాలయ సముదాయానికి ఖర్చుసుమారు రూ.కోటి డ్వాక్రా భవనం, డిజిటల్ లైబ్రరీరూ. 30 లక్షలు రూ.35 లక్షలు పాఠశాలలో నాడు–నేడు పనులురూ.12 లక్షలు ఇంటింటి కుళాయిలురూ.1.5లక్షలు అమ్మవారి గుడి కల్వర్టుపొడుగుపాడులో సీసీ రోడ్డురూ.5లక్షలు రూ.5 లక్షలు ఎస్సీవీధిలో సీసీ రోడ్డుసీసీ కాలువలురామచంద్రపురంలో సీసీ రోడ్డురూ.10లక్షలు రూ.20లక్షలు కుజ్జిపేటలో బీటీ రోడ్డురామచంద్రపురం గ్రావెల్ రోడ్డురూ.4లక్షలు రూ.8లక్షలు ఎర్రచెరువు, కుజ్జిపేట చెరువుల మదుముల నిర్మాణంరూ.50 వేలు పొడుగుపాడు– శ్రీజగన్నాధపురం వీధిలైట్లు
Related News by category
-
‘శంకరిగిరి మాన్యాల్లో ఉంటారు జాగ్రత్త.. ఎవడక్కడ.. మీ స్థాయి ఎంత.. మీరు ఎంత..’ అని నరసన్నపేట సీఐ, ఎస్లను ఉద్దేశించి కూన నోరు పారేసుకున్నారు. కోవిడ్ నిబంధనల మేరకు ముగ్గురే లోపలికి రావాలి అన్నందుకు పోలీసు అధికారులపై పై విధంగా విరుచుకుపడ్డారు.
టీడీపీ ఆందోళనలకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యను దృష్టిలో ఉంచుకుని కూన రవికుమార్ను నిలువరించేందుకు ఇంటికెళ్లిన పోలీసు అధికారులను నెట్టేసి నోటికొచ్చినట్టు దూషించారు. ‘నా ఇంటికి పోలీసులను పంపిస్తే నీ కాళ్లు ఇరగకొట్టక(బూతు)పోతే చూద్దువుగాని.. నిన్ను ఉద్యోగం, యూనిఫాం లేకుండా చేస్తా...నీ అంతు చూస్తాను ఏమనుకుంటున్నావో..’ అంటూ భౌతికంగా శ్రీకాకుళం టూటౌన్ సీఐ ఆర్ఈసీహెచ్ ప్రసాద్ను కూన నెట్టేశారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇదీ టీడీపీ నాయకుడు కూన రవికుమార్ ట్రాక్ రికార్డు. అధికారులంటే తన ఇంటిలో పని మనుషులే అన్నంత అలుసు ఆయనకు. అధికారంలో ఉన్నంతసేపూ ఆయన దౌర్జన్యాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. ఆయన్ని చూస్తేనే ఉద్యోగులు, అధికారులు హడలెత్తిపోయిన పరిస్థితి. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయాక కూడా ఆయన నోటి దురుసు, దౌర్జన్యం తగ్గలేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ఈ ఐదేళ్లలో ఎంతో మంది ఉద్యోగులను, అధికారులను దూషించారు. నోటికొచ్చినట్టు తిడుతూ బెదిరించారు. ఈయన నిర్వాకంపై పోలీసు స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. బెయిల్పై విడుదలైన పరిస్థితులు ఉన్నాయి. చివరికి రవికుమార్తో ప్రాణహాని ఉందని ఉద్యోగులు ఆందోళనకు దిగేంత వరకు వెళ్లారు. రౌడీషీట్ ఓపెన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్ఓ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ అక్కడకు చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీన్ని జీర్ణించుకోలేని కూన రవికుమార్ ఏకంగా పొందూరు తహసీల్దార్ రామకృష్ణను బెదిరించారు. పింఛన్ల విషయంలో తన మాట విన లేదని మండల కార్యాలయంలోనే సరుబుజ్జిలి ఎంపీడీఓ, ఈఓపీఆర్డీకి వార్నింగ్ ఇచ్చా రు. పనుల విషయంలో తాను చెప్పినట్టు వినకపోతే కుర్చీలో కూర్చున్నా లాక్కుని వచ్చి తంతాను నా కొడకల్లారా అని.. పంచాయతీ కార్యదర్శులను కూన రవికుమార్ భయపెట్టారు. ఒక బిల్లు విషయంలో సరుబుజ్జిలి ఇన్చార్జి ఈఓపీఆర్డీపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కరోనా నిబంధనల దృష్ట్యా గేటు వేస్తే వీరంగం సృష్టించారు. ఆగ్రహంతో ఉద్యోగులు కూన రవికుమార్తో పాటు ఆయన సోదరుడు అనుసరించిన తీరుపై ప్రభుత్వ ఉద్యోగులంతా గుర్రుగానే ఉన్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చా లా సందర్బాల్లో ఉద్యోగులు భయాందోళన వ్యక్తం చేశారు. అధికారంలో లేనప్పుడే ఇలా ఉంటే పొరపాటున అధికారమిస్తే బతకనిస్తారా? అని ఆవేదనతో ఉన్నారు. ఏ పదవీ లేకుండానే అధికారులను బెదిరించడం, తంతాను అనడం.. బట్ట లూడదీసి కొడతానని బెదిరించడం వంటివి పరిణామాలను అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారులే ఇబ్బంది పడుతుంటే.. చిన్నపాటి ఉద్యోగుల పరిస్థితి మరింత భయంకరమని ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పలు సందర్భాల్లో ఆందోళనకు దిగడమే కాకుండా రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేసే వరకు వెళ్లారు. తమపై దౌర్జన్యం చేస్తున్న కూన రవి అండ్కోకు తగిన సమయంలో బుద్ధి చెబుతామని ఉద్యోగులంతా ఒక నిర్ణయానికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కూన రవి సోదరుడిదీ అదే దౌర్జన్యం శ్రీకాకుళంలోని పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజనీర్ కార్యాలయంలో కూన రవికుమార్ సోదరుడు, కాంట్రాక్టర్ వెంకట సత్యనారాయణ బరితెగించి వ్యవహరించాడు. తాను వేస్తున్న రోడ్డు పనుల విషయంలో నిబంధనలు పాటించడం లేదని, నాణ్యతా లోపాలున్నాయని, వాటిని సరిచేసుకోవాలని చెప్పినందుకు అసిస్టెంట్ ఇంజినీర్ మహంతిని కొట్టేంత పనిచేశారు. కార్యాలయంలో అందరు ఉద్యోగుల ముందే అసిస్టెంట్ ఇంజనీర్ మీదకొచ్చి దౌర్జన్యం చేయడమే కాకుండ చెయ్యి ఎత్తి తన రౌడీయిజాన్ని చూపించారు. ‘ఎంత ధైర్యం రా... నాకే నోటీసు ఇస్తావా...నువ్వు ఏమనుకుంటున్నావ్...నేను కూన రవికుమార్ బ్రదర్ని.. జాగ్రత్త...ఇక్కడే పాతేస్తా...’ అంటూ ఇంజినీర్ మహంతిపై కూన వెంకట సత్యనారాయణ రెచ్చిపోయాడు. అంతటితో ఆగలేదు.. ఏకంగా కొట్టేసేంతలా చెయ్యి చాచి బెదిరించాడు. నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. రాయలేని భాషలో పరుష పదజాలంతో వీరంగం సృష్టించారు. -
No Headline
‘వాహనాలు విడిచిపెట్టు. లేకపోతే లంచం డిమాండ్ చేశావని నీ మీద కంప్లైంట్ చేస్తాను. వెధవా...నువ్వు సీజ్ చేశావ్. ..చెప్పు ఎంత కావాలి... పది వేలు కావాలా, లక్ష కావాలా ఎంత కావాలి... ప్రాసెస్ గురించి నాకు చెబుతున్నావా?’ అంటూ రాయలేని భాషలో ఒక మండల మెజిస్ట్రేట్గా ఉన్న పొందూరులో పనిచేసిన తహసీల్దార్ను కూన రవికుమార్ బెదిరించారు. ‘నీకెంత ఒల్లు బలిసిందిరా నా.. ‘డకా’...నిన్ను గొయ్యి తీసి పాతకపోతే నా పేరు కూన రవికుమారే కాదు. నీ బతుకెంతరా నా.. డకా...’ సరుబుజ్జిలి ఈన్చార్జి ఈఓపీఆర్డీగా పనిచేస్తున్న వ్యక్తిని ఫోన్లో కూన రవికుమార్ బెదిరింపు ఇది. శ్రీకాకుళంశుక్రవారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2024న్యూస్రీల్ -
కిడ్నీ ఆస్పత్రిలో ఉచితంగా ఆపరేషన్
కాశీబుగ్గ: పలాసలో ప్రభుత్వం నిర్మించిన కిడ్నీ పరిశోధన కేంద్రంలో ఓ వ్యక్తికి ఉచితంగా అపెండిక్స్ ఆపరేషన్ చేశారు. నందిగాం మండలం కణితిఊరు గ్రామానికి చెందిన పాలవలస లక్ష్మణరావు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండగా అపెండిక్స్గా గుర్తించి సకల సౌకర్యాల నడుమ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ తర్వాత చక్కగా చూసుకుంటున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రిలో రూ.20వేలు ఖర్చవుతుందని, ఇక్కడ ఉచితంగా చేస్తున్నారని, పేదలు వినియోగించుకోవాలని కోరారు. తాను మరణించి.. మరో ఐదుగురికి బతుకునిచ్చి పొందూరు: మరణించినా సంపూర్ణ అవయవదానంతో చిరంజీవిగా నిలిచారు పొందూరుకు చెందిన వెంకుమహంతి శ్రీనివాసరావు(54). ఆయన విజయనగరం జిల్లాలో ఆరోగ్యశాఖలో ఉద్యోగం చేస్తున్నారు. గత నెల అధిక రక్తపోటు కారణంగా కోమాలోకి వెళ్లారు. మెదడులో రక్తం గడ్డకట్టింది. దీంతో విశాఖపట్నంలోకి విమ్స్కు తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ గురువారం మరణించారు. ఇంతటి బాధను దిగమింగుకుని తన భార్య సునీత, కుమారుడు సంపూర్ణ అవయవదానానికి అంగీకరించారు. కళ్లు, కిడ్నీలు, కాలేయం, గుండె తదితర అవయవాలను ఐదుగురు వ్యక్తుల కోసం ఆస్పత్రులకు తరలించారు. దీనికి అధికారులు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశా రు. శ్రీనివాసరావు మృతిపై పొందూరు శిష్టకరణ సంఘం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 36 రోజులకు రూ.31.85 లక్షలు అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి హుండీల కానుకల ద్వారా రూ.31,85,917 మేరకు ఆదాయం లభించిందని ఆలయ ఈఓ/డిప్యూటీ కమిషనర్ ఎస్.చంద్రశేఖర్ తెలియజేశారు. ఈమేరకు గురువారం హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమం అనివెట్టి మండపంలో నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 28 నుంచి గురువారం వరకు మొత్తం 36 రోజులకు హుండీల్లో లభించిన ఆదాయాన్ని లెక్కించగా.. నగదు రూపంలో రూ.30,74,034, చిల్లర రూపంలో రూ.1,11,883 వరకు లభించింది. అలాగే 24 గ్రాముల బంగారం, వెండి 1 కేజి 470 గ్రాముల వస్తువులతో పాటు పలు దేశాల కరెన్సీ కూడా కానుకల రూపంలో లభించాయి. జిల్లా దేవదాయ శాఖాధికారి ప్రసాద్ పట్నాయక్ పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపు ప్రక్రియలో ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, పాలకమండలి సభ్యులు ద్వారపు అనూరాధ, ఎన్.కోటేశ్వర చౌదరి, లుకలాపు గోవిందరావు, ఆలయ సూపరింటెండెంట్ కృష్ణమాచార్యులు, జిల్లా కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు శ్రీకాకుళం పాతబస్టాండ్: పోలింగ్ రోజున ది వ్యాంగులు, వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, పోలింగ్ కేంద్రాల్లో వీల్చైర్లు ఏర్పాటు చేస్తామ ని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. కలెక్టరేట్ ఆవరణలో గురువారం కలెక్టర్ అధ్యక్షతన వీల్చైర్లను నియోజకవర్గాల వారీగా పంపిణీ చేశారు. 1700 వీల్ చైర్లు, కంటి చూపు తక్కువ ఉన్నవారికి మాగ్నిఫయింగ్ అద్దాలు (భూతద్దాలు) 1700 వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డీఆర్ఓ ఎం.గణపతి రావు, విభిన్న ప్రతిభావంతుల శాఖ, సహాయ సంచాలకులు కవిత తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు లేదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: పద్నాలుగేళ్లు సీఎంగా ఉండి ఏనాడూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని చంద్రబాబుకు జనాలను ఓటు అడిగే హక్కు లేదని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. ఆయన గురువారం శ్రీకాకుళంలోని జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పౌరుల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన అందించారని తెలిపారు. నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, అమ్మ ఒడి తో విద్యా రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేశామని గుర్తు చేశారు. అభివృద్ధిలో భాగంగా నాలుగు సీ పోర్టులు నిర్మిస్తున్నామని, టెక్కలి దగ్గర రూ.4 వేల కోట్లతో మూలపేట పోర్టు వేగంగా జరు గుతున్నాయని, ఈ పనులు పూర్తయితే మరో రెండు, మూడు నెలల్లో ప్రపంచంతో కనెక్టివిటీ ఏర్పడుతుందన్నారు. అలానే ఉద్దానం ప్రాంతంలో ఉన్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం రూ.800 కోట్లతో వాటర్ స్కీమ్, కిడ్నీ ఆస్పత్రి నిర్మించామని చెప్పారు. శ్రీకాకుళంలోని రిమ్స్లో ఎప్పుడూ సిబ్బంది కొరత ఉండేదని, కానీ ఈ ఐదేళ్లలో వైద్య వ్యవస్థలో సమూల మార్పులు చేసి ఖాళీలను భర్తీ చేశామన్నారు. సమ గ్ర భూ సర్వే ద్వారా రాష్ట్రంలో ఉన్న 17 వేల రెవె న్యూ గ్రామాలకు సంబంధించి ఇప్పటికే నాలుగు వేల గ్రామాల్లో పనులు పూర్తి చేశామన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లోకి రాదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు రాష్ట్రంలో అమలులోకి రాదని ధర్మాన స్పష్టం చేశారు. అనేక అధ్యయనాల తర్వాత కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్తో ఓ మోడల్ యాక్ట్ను తీసుకుని వచ్చిందన్నారు. కానీ అమలు చేయలేదని, దీని అమలుకి ముందు న్యాయవాదుల, మేధావుల సూచనలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబు హయాంలో శ్రీకాకుళానికి తీవ్ర అన్యాయం జరిగిందని, ఒక్క కేంద్ర సంస్థనైనా ఇక్కడ నెలకొల్పలేదని గుర్తు చేశారు. అమరావతి అంటూ వ్యాపారం చేశారన్నారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ఆచరణ సాధ్యమేనా అన్నది గమనించాలన్నారు. చంద్రబాబు మళ్లీ జనాలను మోసగించేందుకు చూస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామని జగన్ చెబుతుంటే ఎందుకు అడ్డు పడుతున్నారని ప్రశ్నించారు. మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయితే ఉత్తరాంధ్ర స్థితిగతులు మారుతాయన్నారు. జనాలకు మేలు జరగాలంటే వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే రావాలన్నా రు. కార్యక్రమంలో భాగంగా మంత్రి ధర్మాన ప్రసాదరావుని, పేరాడ తిలక్ను సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్సెల్ ప్ర ధాన కార్యదర్శి పిట్లా దామోదరరావు, రాష్ట్ర కార్యదర్శి పొన్నాడ వెంకటరమణారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి ఈశ్వరరావు, కార్యదర్శి ప్రస న్న, మాజీ అధ్యక్షులు ఎన్ని సూర్యారావు, ఆగూరి ఉమామహేశ్వరరావు, తంగి చంద్రశేఖరరావు, బైరి దామోదరావు, ఎన్ విజయ్కుమార్, మామిడి క్రాంతి, చిన్నాల జయకుమార్, గేడెల ఇందిరాప్రసాద్, జి.వాసుదేవరావు, పీస చంద్రశేఖర్ ఉన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ సమావేశంలో రెవెన్యూ మంత్రి ధర్మాన, వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ -
‘హోమ్ ఓటింగ్పై దృష్టి సారించాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: పోలింగ్లో ఎక్కడా పొరపాట్లు జరగకూడదని, హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. ఆయన గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, డీఆర్ఓ ఎం.గణపతిరావుతో కలసి రిటర్నింగ్ అధికారులు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ ఏర్పాట్లపై ఆర్ఓలను అడి గి తెలుసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ పేపర్ల ముద్ర ణ, ఈవీఎం బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన సమాచారం, ఈవీఎం కమిషన్ కేంద్రాలు, ఈవీఎం జాబితాల 2వ ర్యాండమైజేషన్ అభ్యర్థి ఏజెంట్ నియామకం, పోలింగ్ ఏజెంట్ నియామకం తదితర అంశాలను వివరించారు.
Photos
View allVideo
View allBullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019