కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం డోన్, బనగానపల్లె మండలాల్లో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గోస్పాడులో 45, ఆత్మకూరులో 44.2, ఆళ్లగడ్డలో 44.2, బండిఆత్మకూరులో 44.2 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతల తీవ్రత కాస్త తగ్గింది. కర్నూలులో 42.5, మంత్రాలయంలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దుర్తి, సి.బెళగల్, గూడూరు, కల్లూరు, కోడుమూరు, కోసిగి, కర్నూలు మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా.. ఉమ్మడి జిల్లాలోరెండు, మూడు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి.
breaking news
Breadcrumb
- HOME
నంద్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు
Published Sat, Apr 20 2024 1:20 AM
Ad - Sakshi_Home_Sticky
adsolute_video_ad
Related news
-
No Headline
● వ్యవసాయ రంగానికి జగన్ సర్కార్ పెద్దపీట ● బ్యాంకుల ద్వారా విస్తృతంగా రుణాలు ● టీడీపీ హయాంలో కన్నా రెట్టింపు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ● చంద్రబాబు హయాంలో వరికి రూ. 25 వేలు రుణపరిమితి ● వైఎస్సార్సీపీ పాలనలో రూ. 43 వేలు ● అన్ని పంటలకు పెరిగిన రుణ పరిమితి ● ఏటా రూ. 13,500 పెట్టుబడి సాయం -
చైతన్య సెల్ఫీ
ప్రతి ఓటు విలువైనదని.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని దృఢమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లో స్వీప్ యాక్టివిటీలలో భాగంగా ఓటు సెల్ఫి పాయింట్ను ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగంపై సంతకాల ప్రచార భారీ ఫ్లెక్సీని కలెక్టర్ ప్రారంభించారు. లోక్సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికలలో ఎలాంటి బెదిరింపులు, ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. – నంద్యాల -
రెండో రోజు ఆరు నామినేషన్లు
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు నంద్యాల: నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజు శుక్రవారం నంద్యాల జిల్లాలోని శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి, ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. శ్రీశైలం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరపున శిల్పా చక్రపాణిరెడ్డి ఒకసెట్, జైభారత్ నేషనల్ పార్టీ తరపున సయ్యద్ మహమ్మద్ సికిందర్బాషా, నందికొట్కూరు నియోజకవర్గానికి మూడు నామినేషన్లు రాగా ఇందులో బహుజన సమాజ్ పార్టీ తరఫున గద్దల లాజర్, ప్రజాబంధ్ పార్టీ ఇండియా అభ్యర్థిగా పల్లె నాగరాజు, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ తరపున వెంకటేశ్వర్లు నామినేషన్లు వేశారు. నంద్యాల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్ఎండీ ఫరూక్ నామినేషన్ దాఖలు చేశారు. -
ప్రధాన పంటల గరిష్ట రుణ పరిమితి ఇలా
పంట 2018లో 2024లో (ఎకరాకు రూ.) (ఎకరాకు రూ.) వరి 18,000 43,000 వేరుశనగ 18,000 38,000 జొన్న 12,000 25,000 మొక్కజొన్న 16,000 33,000 కంది 12,000 20,000 పప్పుశనగ 20,000 34,000 పత్తి 31,000 42,000 పచ్చిమిరప 49,000 76,000 ఎండుమిరప 66,000 1 లక్ష మల్బరీ 55,000 1.05 లక్షలు టమాట 55,000 90,000 ఉల్లి 30,000 44,000 కరివేపాకు 35,000 47,000 అరటి 55,000 1.20 లక్షలు దానిమ్మ 56,000 97,000 కర్భూజ 35,000 55,000 ద్రాక్ష 80,000 లక్ష మామిడి 25,000 38,000 చెరకు 38,000 45,000 -
ఏటా పెట్టుబడిసాయం..
కోవెలకుంట్ల: వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన వైఎస్సార్సీపీ సర్కార్ అన్నదాతకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది. విత్తనం మొదలుకొని పంట ఉత్పత్తుల కొనుగోలు వరకు అడుగడుగునా తోడుగా ఉంటోంది. అన్నదాత సంక్షేమమే లక్ష్యంగా రైతులకు అనేక పథకాలు అమలు చేస్తోంది. పంటల సాగుకు పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేసి అవస్థలు పడకుండా రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏటా రూ.13,500 నగదు, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తోంది. గత టీడీపీ సర్కార్ హయాంలో ఉన్న దానికన్నా గరిష్ట రుణపరిమితి గణనీయంగా పెంచి రైతులకు చేయూత నిస్తోంది. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఏటా ఖరీఫ్ సీజన్లో 2.28 లక్షల హెక్టార్లు, రబీ సీజన్లో 1.14 లక్షల హెక్టార్లలో రైతులు వరి, పత్తి, మినుము, మొక్కజొన్న, జొన్న, పప్పుశనగ, పెసర, పొగాకు, కంది, ఉల్లి, వేరుశనగ, మిరపతోపాటు ఉదాన్యవన పంటలైన మామిడి, సపోట, చీని, ద్రాక్ష, అరటి, తదితర పంటలు సాగు చేస్తున్నారు. పెరిగిన రుణపరిమితి ఇలా 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు బ్యాంకుల ద్వారా అందించే పంటరుణాలకు సంబంధించి స్కేల్ఆఫ్ ఫైనాన్స్ పెరిగేలా చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఆధ్వర్యంలో నాబార్డు, లీడ్బ్యాంకు, ప్రధాన బ్యాంకర్లు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ (డీఎల్డీసీ) సమావేశమై వాస్తవ పరిస్థితులపై చర్చించి రుణపరిమితి ప్రతిపాదనలు తయారు చేస్తారు. ఆ ప్రతిపాదనలను రాష్ట్ర సాంకేతిక కమిటీ (ఎస్ఎల్టీసీ)కి పంపించి రుణపరిమితి ఖరారు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఈ ప్రక్రియ తూతూ మంత్రంగా చేపట్టి రైతులకు అరకొరగా రుణాలు ఇచ్చేవారు. దీని వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం కలిగేది కాదు. అయితే 2019 తర్వాత రైతులకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా పంట రుణ సదుపాయం కల్పిస్తూ వస్తోంది. 2018లో వరి సాగుకు బ్యాంకుల ద్వారా ఎకరాకు గరిష్టంగా రూ. 18 వేలు రుణం ఇవ్వగా ప్రస్తుత వైఎస్సార్సీపీ హయాంలో రూ. 43 వేలు అందజేస్తున్నారు. వేరుశనగకు రూ. 18 వేలు ఇవ్వగా ఆ మొత్తాన్ని రూ. 38 వేలకు పెంచడం గమనార్హం. ఇలా వివిధ ప్రధాన పంటలకు రుణపరిమితిని భారీగా పెంచారు. ఏప్రిల్ నెల నుంచి ఆగస్టు వరకు రైతులు పంట రుణాల రెన్యువల్స్, కొత్త రుణాల కోసం బ్యాంకులను వినియోగించుకుంటూ పంట రుణాలు పొందుతున్నారు. భీమునిపాడులోని రైతు భరోసా కేంద్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఏటా వివిధ పంటల సాగుకు రైతులు ఇబ్బందులు పడకుండా ఖరీఫ్ సీజన్కు ముందే రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడిసాయం అందిస్తోంది. జూన్లోనే మొదటి విడతలో వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిషాన్ కింద రూ. 7,500, అక్టోబర్లో రూ. 4 వేలు, జనవరి నెలలో రూ. 2వేల చొప్పున అందజే స్తోంది. పెట్టుబడి సాయంతోపాటు గ్రామ సచివాలయాలకు అనుగుణంగా జిల్లాలో 394 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, కల్తీలేని ఎరువులు, ఆయా పంటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తోంది. మరోవైపు వివిధ బ్యాంకుల ద్వారా పంట రుణాల రెన్యువల్, కొత్తగా పంట రుణాల పంపిణీకి ప్రాధాన్యత కల్పించింది. పంట పెట్టుబడులు, ఆయా పంటల్లో వస్తున్న దిగుబడులను బేరీజు వేసుకుని గరిష్ట రుణపరిమితి(స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ఖరారు చేసి రైతులకు మేలు చేస్తోంది.
Related News by category
-
ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
నంద్యాల: సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు వెల్లడించారు. గురు వారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో ఎన్నికల నిర్వహణ, సీజర్ మేనేజ్మెంట్, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ.. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నామినేషన్ల ప్రక్రియ, స్క్రూటిని, పరిశీలన ముగిసిన అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తింపు చిహ్నాలు ఇవ్వడం జరిగిందన్నారు. నంద్యాల పార్లమెంట్ బరిలో 31 మంది అభ్యర్థులు, జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో 16 మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న నేపథ్యంలో అన్ని పోలింగ్ బూతులలో రెండు బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాకు అదనపు బ్యాలెట్ యూనిట్లు వచ్చాయని శుక్రవారం నుంచి కమి షన్ ఆఫ్ ఈవీఎంస్ పూర్తి చేసి సంబంధిత నియోజకవర్గాలకు చేరవేస్తామ న్నారు. ఇందుకు సంబంధించి స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలకు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐదు ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అత్యవసర సర్వీసులకు చెందిన 17 వేల మంది సిబ్బంది నుంచి ఫార్మ్– 12డి దరఖాస్తుల స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. ఈ మేరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ నెల 5, 6, 7 తేదీలలో ఆళ్లగడ్డలో వైపీపీఎం గవర్నమెంట్ హైస్కూల్, నంద్యాలలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్, బనగానపల్లెలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, నందికొట్కూరులో జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్, డోన్లో జెడ్పీహెచ్ఎస్ గర్స్ల్ హైస్కూల్లో పోస్టల్ బ్యాలెట్ల కోసం ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సి–విజిల్ యాప్ ద్వారా వచ్చిన 225 ఫిర్యాదులన్నిటిని పరిష్కరించామన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీనివాసులు -
No Headline
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు రంగమ్మ. మండల కేంద్రం కొలిమిగుండ్లలోని పోస్టాఫీస్ సమీపంలో నివాసం ఉంటుంది. వయస్సు మీద పడటంతో పాటు కాలు విరగడంతో స్టాండ్ సాయంతో తీవ్రమైన ఎండలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్కు అతి కష్టంగా చేరుకుంది. ఓ వైపు ఎండలకు తాళలేక పోతేంటే మరో వైపు పింఛన్ కోసం ఇంతలా కష్టపెడుతున్నారని కన్నీటి పర్యంతమైంది. గతంలో ఇంటికి వచ్చి ఇచ్చే వాళ్లని, రెండు నెలల నుంచి ఇబ్బందులు పెడుతున్నారని వాపోయింది. – కొలిమిగుండ్లఇంత కష్టపెడతారా.. -
నిప్పుల వర్షం
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి జిల్లాలో నిప్పుల వర్షం కురుస్తోంది. గురువారం భానుడు మరింత ఉగ్రరూపం దాల్చాడు. నంద్యాల జిల్లాలో 29 మండలాలు ఉండగా.. ఏకంగా 22 మండలాల్లో హీట్వేవ్ నమోదైంది. కర్నూలు జిల్లాలో గూడూరు, కౌతాళం మండలాల్లో హీట్ వేవ్ నమోదు కావడం గమనార్హం. వడగాడ్పుల తీవ్రతకు వృద్ధులు, బాలింతలు, గర్భిణిలు, చిన్న పిల్ల లు, రోగులు అల్లాడుతున్నారు. నంద్యాల జిల్లాలోని 8 మండలాల్లో 46 డిగ్రీలపైన, 10 మండలాల్లో 45 డిగ్రీలకుపైన, 4 మండలాల్లో 44 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బనగానపల్లి, డోన్లలో 46.7, ఆళ్లగడ్డలో 46.6, మహానందిలో 46.4, నందికొట్కూరు, సంజామలలో 46.3, దొర్నిపాడు, కోవెలకుంట్లలో 46.1, పాణ్యంలో 45.9, మిడుతూరులో 45.9, బండిఆత్మకూరులో 45.7, శ్రీశైలంలో 45.6, రుద్రవరంలో 45.5, పగిడ్యాలలో 45.3, ఆత్మకూరు, చాగలమర్రిలో 45.2, కొత్తపల్లిలో 45.1, శిరువెళ్లలో 45, గడివేములలో 44.9, పాములపాడు, అవుకులో 44.7, నంద్యాలలో 44.6 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మండలాల్లో హీట్వేవ్ నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. కర్నూలు జిల్లా గూడూరు, కర్నూలులో 45.3, కౌతాళంలో 44.9, ఎమ్మిగనూరులో 44.5, కోడుమూరులో 44.4 సి..బెళగల్లో 44.1 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో ఆళ్లగడ్డ, దొర్నిపాడు, నంద్యాల, కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ, గోస్పాడు మండలాల్లో హీట్వేవ్ నమోదయ్యే అవకాశం ఉంది. బనగానపల్లి, డోన్లో 46.7 డిగ్రీలు కర్నూలు, గూడూరుల్లో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత -
మళ్లీ పాత రోజులు గుర్తుకొచ్చాయి
ఐదేళ్ల పాటు ఇంటి వద్దనే వలంటీర్లు పింఛన్లు అందజేశారు. ఇప్పుడు రెండు నెలల నుంచి పింఛన్ సొమ్ము తీసుకునేందుకు అవస్థలు పడుతున్నాం. మే నెల పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో వేయడంతో డబ్బులు తీసుకునేందుకు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. 2019 సంవత్సరానికి ముందు పడిన కష్టాలు గుర్తుకొచ్చాయి. పింఛన్ల పంపిణీలో చంద్రబాబు మాలాంటి వృద్ధులపై కక్ష కట్టడం సరికాదు. – నారాయణ, పింఛన్ లబ్ధిదారుడు, సౌదరదిన్నె, కోవెలకుంట్ల మండలం ఎందుకు ఇలా చేస్తున్నాడో వలంటీర్ ద్వారా వేరుగా ఇంటికే ఒకటో తేదీన పింఛన్ ఇస్తుంటే టీడీపీ నాయకులు ఎందుకు అడ్డుకున్నారో తెలియడం లేదు. ముసలోళ్లు బ్యాంకులకు వెళ్లి పింఛన్ తెచ్చుకోవాలంటే ఆటో ఖర్చులు ఎవరు ఇస్తారు. నాకు గోస్పాడు బ్యాంక్లో ఖాతా ఉంది. అందులో నా పింఛన్ డబ్బు వేశారని సచివాలయ సిబ్బంది చెప్పారు. వెళ్లాలంటే నాకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. ముసలోల్లను ఇలా ఇబ్బంది పెట్టే వారికి ఓటుతో గుణపాఠం చెబుతాం. – సెబాస్టిన్, పసురపాడు, గోస్పాడు మండలం బాబు ఎంత పని చేశావయ్యా.. మా మనవడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాటు పింఛన్ సొమ్ము కోసం ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఠంఛన్గా ప్రతి నెల 1వ తేదీన వలంటీర్లు ఇంటికి తీసుకువచ్చి ఇచ్చేవారు. చంద్రబాబు చేసిన పనికి పింఛన్ తీసుకునే వాళ్లంతా ఇబ్బందులు పడుతున్నాం. బాబుకు మా ఉసురు తగులుతుంది. వలంటీర్లు పింఛన్ పంపిణీ చేయకుండా అడ్డుకోవడం దారుణం. పింఛన్ తీసుకునేవాళ్లంతా ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెబుతారు. – చింతా సుశీలమ్మ, వెంకటలక్ష్మమ్మ, ఉయ్యాలవాడ ఆధార్ లింక్ కాలేదట వలంటీర్లను రాకుండా చంద్రబాబునాయుడు అడ్డుకోవడం బాధాకరం. నాకు ఆత్మకూరు బ్యాంక్లో అకౌంట్ ఉండటంతో పొద్దునే పోయా. రెండు గంటల పాటు క్యూలో ఉండి అడిగితే నా బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ కాలేదని పింఛన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరినీ అడిగాలో దిక్కుతోచడం లేదు. చంద్రబాబుకు పేదలు బాగుపడితే సహించదు. కరివేన నుంచి ఆత్మకూరుకు వచ్చిపోవాలంటే రూ. 50 ఖర్చు అవుతుంది. – వెంకటలక్ష్మమ్మ, కరివేన,ఆత్మకూరు మండలం -
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
నంద్యాల(అర్బన్): ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా గురువారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు ఓటు హక్కుపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించామన్నారు. 2019 ఎన్నికల్లో నంద్యాల పట్టణంలో 70 శాతం పోలింగ్ జరిగిందని, ఈ విడత ఎన్నికల్లో 85 నుంచి 90 శాతం పోలింగ్ కావాలని సూచించారు. మద్యం, నగదు ఇతర ప్రలోభాలకు ఓటర్లు గురికాకుండా తమ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు. 18–19 సంవత్సరాల మధ్య వయసున్న ఓటర్లుగా నమోదు చేసుకున్న వారందరూ పోలింగ్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులతో ఓటర్ స్లిప్లు ఇంటింటికీ పంపిస్తామన్నారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న అధికారులు ప్రజలందరి చేత ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి
Photos
View allVideo
View allBullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019