breaking news
Ad - Sakshi_Home_Sticky
-
ప్రధాన పంటల గరిష్ట రుణ పరిమితి ఇలా
పంట 2018లో 2024లో (ఎకరాకు రూ.) (ఎకరాకు రూ.) వరి 18,000 43,000 వేరుశనగ 18,000 38,000 జొన్న 12,000 25,000 మొక్కజొన్న 16,000 33,000 కంది 12,000 20,000 పప్పుశనగ 20,000 34,000 పత్తి 31,000 42,000 పచ్చిమిరప 49,000 76,000 ఎండుమిరప 66,000 1 లక్ష మల్బరీ 55,000 1.05 లక్షలు టమాట 55,000 90,000 ఉల్లి 30,000 44,000 కరివేపాకు 35,000 47,000 అరటి 55,000 1.20 లక్షలు దానిమ్మ 56,000 97,000 కర్భూజ 35,000 55,000 ద్రాక్ష 80,000 లక్ష మామిడి 25,000 38,000 చెరకు 38,000 45,000 -
ఏటా పెట్టుబడిసాయం..
కోవెలకుంట్ల: వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన వైఎస్సార్సీపీ సర్కార్ అన్నదాతకు అన్ని విధాలా అండగా నిలుస్తోంది. విత్తనం మొదలుకొని పంట ఉత్పత్తుల కొనుగోలు వరకు అడుగడుగునా తోడుగా ఉంటోంది. అన్నదాత సంక్షేమమే లక్ష్యంగా రైతులకు అనేక పథకాలు అమలు చేస్తోంది. పంటల సాగుకు పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేసి అవస్థలు పడకుండా రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏటా రూ.13,500 నగదు, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తోంది. గత టీడీపీ సర్కార్ హయాంలో ఉన్న దానికన్నా గరిష్ట రుణపరిమితి గణనీయంగా పెంచి రైతులకు చేయూత నిస్తోంది. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో ఏటా ఖరీఫ్ సీజన్లో 2.28 లక్షల హెక్టార్లు, రబీ సీజన్లో 1.14 లక్షల హెక్టార్లలో రైతులు వరి, పత్తి, మినుము, మొక్కజొన్న, జొన్న, పప్పుశనగ, పెసర, పొగాకు, కంది, ఉల్లి, వేరుశనగ, మిరపతోపాటు ఉదాన్యవన పంటలైన మామిడి, సపోట, చీని, ద్రాక్ష, అరటి, తదితర పంటలు సాగు చేస్తున్నారు. పెరిగిన రుణపరిమితి ఇలా 2019 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు బ్యాంకుల ద్వారా అందించే పంటరుణాలకు సంబంధించి స్కేల్ఆఫ్ ఫైనాన్స్ పెరిగేలా చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఆధ్వర్యంలో నాబార్డు, లీడ్బ్యాంకు, ప్రధాన బ్యాంకర్లు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ (డీఎల్డీసీ) సమావేశమై వాస్తవ పరిస్థితులపై చర్చించి రుణపరిమితి ప్రతిపాదనలు తయారు చేస్తారు. ఆ ప్రతిపాదనలను రాష్ట్ర సాంకేతిక కమిటీ (ఎస్ఎల్టీసీ)కి పంపించి రుణపరిమితి ఖరారు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఈ ప్రక్రియ తూతూ మంత్రంగా చేపట్టి రైతులకు అరకొరగా రుణాలు ఇచ్చేవారు. దీని వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం కలిగేది కాదు. అయితే 2019 తర్వాత రైతులకు మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా పంట రుణ సదుపాయం కల్పిస్తూ వస్తోంది. 2018లో వరి సాగుకు బ్యాంకుల ద్వారా ఎకరాకు గరిష్టంగా రూ. 18 వేలు రుణం ఇవ్వగా ప్రస్తుత వైఎస్సార్సీపీ హయాంలో రూ. 43 వేలు అందజేస్తున్నారు. వేరుశనగకు రూ. 18 వేలు ఇవ్వగా ఆ మొత్తాన్ని రూ. 38 వేలకు పెంచడం గమనార్హం. ఇలా వివిధ ప్రధాన పంటలకు రుణపరిమితిని భారీగా పెంచారు. ఏప్రిల్ నెల నుంచి ఆగస్టు వరకు రైతులు పంట రుణాల రెన్యువల్స్, కొత్త రుణాల కోసం బ్యాంకులను వినియోగించుకుంటూ పంట రుణాలు పొందుతున్నారు. భీమునిపాడులోని రైతు భరోసా కేంద్రం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఏటా వివిధ పంటల సాగుకు రైతులు ఇబ్బందులు పడకుండా ఖరీఫ్ సీజన్కు ముందే రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడిసాయం అందిస్తోంది. జూన్లోనే మొదటి విడతలో వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిషాన్ కింద రూ. 7,500, అక్టోబర్లో రూ. 4 వేలు, జనవరి నెలలో రూ. 2వేల చొప్పున అందజే స్తోంది. పెట్టుబడి సాయంతోపాటు గ్రామ సచివాలయాలకు అనుగుణంగా జిల్లాలో 394 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు, కల్తీలేని ఎరువులు, ఆయా పంటల్లో అధిక దిగుబడులు సాధించేందుకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అందజేస్తోంది. మరోవైపు వివిధ బ్యాంకుల ద్వారా పంట రుణాల రెన్యువల్, కొత్తగా పంట రుణాల పంపిణీకి ప్రాధాన్యత కల్పించింది. పంట పెట్టుబడులు, ఆయా పంటల్లో వస్తున్న దిగుబడులను బేరీజు వేసుకుని గరిష్ట రుణపరిమితి(స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) ఖరారు చేసి రైతులకు మేలు చేస్తోంది. -
నంద్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు
కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం డోన్, బనగానపల్లె మండలాల్లో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గోస్పాడులో 45, ఆత్మకూరులో 44.2, ఆళ్లగడ్డలో 44.2, బండిఆత్మకూరులో 44.2 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఉష్ణోగ్రతల తీవ్రత కాస్త తగ్గింది. కర్నూలులో 42.5, మంత్రాలయంలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దుర్తి, సి.బెళగల్, గూడూరు, కల్లూరు, కోడుమూరు, కోసిగి, కర్నూలు మండలాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా.. ఉమ్మడి జిల్లాలోరెండు, మూడు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. -
రెండో రోజు ఆరు నామినేషన్లు
● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు నంద్యాల: నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజు శుక్రవారం నంద్యాల జిల్లాలోని శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి, ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. శ్రీశైలం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరపున శిల్పా చక్రపాణిరెడ్డి ఒకసెట్, జైభారత్ నేషనల్ పార్టీ తరపున సయ్యద్ మహమ్మద్ సికిందర్బాషా, నందికొట్కూరు నియోజకవర్గానికి మూడు నామినేషన్లు రాగా ఇందులో బహుజన సమాజ్ పార్టీ తరఫున గద్దల లాజర్, ప్రజాబంధ్ పార్టీ ఇండియా అభ్యర్థిగా పల్లె నాగరాజు, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ తరపున వెంకటేశ్వర్లు నామినేషన్లు వేశారు. నంద్యాల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్ఎండీ ఫరూక్ నామినేషన్ దాఖలు చేశారు. -
చైతన్య సెల్ఫీ
ప్రతి ఓటు విలువైనదని.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని దృఢమైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్లో స్వీప్ యాక్టివిటీలలో భాగంగా ఓటు సెల్ఫి పాయింట్ను ఏర్పాటు చేశారు. ఓటు హక్కు వినియోగంపై సంతకాల ప్రచార భారీ ఫ్లెక్సీని కలెక్టర్ ప్రారంభించారు. లోక్సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికలలో ఎలాంటి బెదిరింపులు, ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. – నంద్యాల
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019