● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు
నంద్యాల: నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజు శుక్రవారం నంద్యాల జిల్లాలోని శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి, ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. శ్రీశైలం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరపున శిల్పా చక్రపాణిరెడ్డి ఒకసెట్, జైభారత్ నేషనల్ పార్టీ తరపున సయ్యద్ మహమ్మద్ సికిందర్బాషా, నందికొట్కూరు నియోజకవర్గానికి మూడు నామినేషన్లు రాగా ఇందులో బహుజన సమాజ్ పార్టీ తరఫున గద్దల లాజర్, ప్రజాబంధ్ పార్టీ ఇండియా అభ్యర్థిగా పల్లె నాగరాజు, జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ తరపున వెంకటేశ్వర్లు నామినేషన్లు వేశారు. నంద్యాల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్ఎండీ ఫరూక్ నామినేషన్ దాఖలు చేశారు.