భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని పోలీస్ ఉన్నతాధికారులు సోమవారం దర్శించుకున్నారు. డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ శివధర్ రెడ్డి, సీఆర్పీఎఫ్ డీజీ శబరి, ఐజీ సుమతి, జిల్లా ఎస్పీ రోహిత్రాజ్ తదితరులు ఆలయానికి చేరుకోగా, అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పండితులు వేదాశీర్వచనం చేసి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు విజయరాఘవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
breaking news
Breadcrumb
- HOME
రామయ్య సన్నిధిలో పోలీస్ ఉన్నతాధికారులు
Published Tue, Apr 23 2024 8:40 AM
Ad - Sakshi_Home_Sticky
adsolute_video_ad
Related news
-
అంధకారంలో ఆస్పత్రి
● నిలిచిన రక్తశుద్ధి సేవలు ● పని చేయని జనరేటర్ ● బాత్రూమ్ల్లోనూ నీళ్లులేని వైనం కొత్తగూడెంరూరల్: జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రి అంధకారమయమైంది. ఆదివారం సాయంత్రం వచ్చిన భారీ గాలులు, వర్షంలో ఆస్పత్రి ఆవరణలోని విద్యుత్ స్తంభాలపై చెట్లు విరిగి పడ్డాయి. ఇక ఆస్పత్రిలో ఉన్న జనరేటర్కు టెక్నీషియన్ లేకపోవడంతో అది కూడా ఆన్ చేయలేదు. దీంతో పేషెంట్లు, సహాయకులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఉక్కపోతతో పేషెంట్లు సతమతం కాగా, సహాయకులు విసనకర్రలు, అట్ట ముక్కలతో ఊపుతూ కనిపించారు. సోమవారం ఉదయం కూడా ఎక్స్రే, స్కానింగ్, డయాలసిస్ సెంటర్, ల్యాబ్ పని చేయలేదు. డయాలసిస్ బాధితుల అవస్థలు.. జిల్లా సర్వజన ఆస్పత్రిలో ఉన్న రక్త శుద్ధి కేంద్రంలో ప్రతీ రోజు 20 నుంచి 24 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రక్తశుద్ధి చేస్తారు. ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో రక్త శుద్ధి కేంద్రంలోని పేషెంట్లను ఖాళీ చేయించారు. ఇక్కడ నిత్యం షిఫ్టుల వారీగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 1 వరకు, తిరిగి 1 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు రక్తశుద్ధి చేస్తారు. పెరిగిన ఓపీ సేవలు.. కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశాల మేరకు ఈ ఆస్పత్రిలో ఇటీవల ఓపీ సేవలు పెంచారు. ప్రస్తుతం నిత్యం ఔట్ పేషెంట్లు 500 మంది వరకు వస్తున్నారు. కాగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ఆస్పత్రి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సోమవారం సాయంత్రం వరకు కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడంతో పేషెంట్లతో పాటు ఆస్పత్రి సిబ్బంది సైతం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రిలోని వాష్ రూమ్ల్లోనూ నీటి సరఫరా లేక పేషంట్లు మల, మూత్ర విసర్జనకు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం ఆస్పత్రిని సందర్శించి, పేషెంట్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆస్పత్రి అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గాలి, వానతో భారీ నష్టం
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో వర్షం, గాలి, దుమారాలతో విద్యుత్ శాఖకు, పంటలకు నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అకాల వర్షం ఆగమాగం చేసింది. వరి, మొక్కజొన్న, జొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది. జిల్లాలో 13.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. పినపాక మండలంలో అత్యధికంగా 61.4 మి.మీ వర్షపాతం కురిసింది. కరకగూడెంలో 11, చర్లలో 2, దుమ్ముగూడెంలో 8.2, అశ్వాపురంలో 6.2, మణుగూరులో 3.2, ఆళ్లపల్లిలో 2, గుండాలలో 1.6, ఇల్లెందులో 28, టేకులపల్లిలో 56.4, జూలూరుపాడులో 0.6, చుంచుపల్లిలో 44.8, సుజాతనగర్లో 10.8, కొత్తగూడెంలో 30.2, లక్ష్మీదేవిపల్లిలో 22, పాల్వంచలో 5, ములకలపల్లి మండలంలో 19.2 మి.మీ వర్షం కురిసింది. 670 ఎకరాల్లో పంటలకు నష్టం.. గాలి వాన బీభత్సానికి జిల్లాలో 285 మంది రైతులకు సంబంధించిన 670 ఎకరాల్లో పంటలకు నష్టం సంభవించింది. ఇందులో 188 మంది రైతులకు చెందిన 498 ఎకరాలల్లో వరి, 31 మంది రైతులకు సంబంధించి 68 ఎకరాల్లో జొన్న, 65 మంది రైతులకు చెందిన 103 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. ఒక ఎకరంలో నువ్వుల పంటకు నష్టం వాటిల్లింది. విద్యుత్ శాఖకు రూ 68 లక్షల నష్టం గాలి దుమారానికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు, కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడడంతో అవి ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరగగా ట్రాన్స్ఫార్మర్లు ధెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 278 స్తంభాలకు, 48 ట్రాన్స్ఫార్మర్లకు నష్టం వాటిల్లింది. దీంతో పలు మండలాల్ల్లో సోమవారం మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొత్తంగా విద్యుత్ శాఖకు రూ. 68 లక్షల నష్టం వాటిల్లిందని ఎస్ఈ రమేష్ తెలిపారు. జిల్లాలో సరాసరి వర్షపాతం 13.6 మి.మీ. దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, జొన్న పంటలు 285 మంది రైతులకు చెందిన 679 ఎకరాల్లో పంటలకు నష్టం తెగిన విద్యుత్ లైన్లు, కూలిన స్తంభాలు -
పాలిసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
సింగరేణి(కొత్తగూడెం): ప్రభుత్వ, ప్రవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్కు దరఖాస్తు గడువు పొడిగించినట్లు కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ కన్వీనర్ బి.నాగముని నాయక్ తెలిపారు. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు సోమవారం ముగియగా, ఈనెల 28 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. అలాగే, రూ.100 జరిమానాతో 30వ తేదీ వరకు, రూ.300 అపరాధ రుసుముతో మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అయితే, పరీక్ష మాత్రం యథావిధిగా మే 24న జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు. -
మానుకోటలో మూడు నామినేషన్లు
మహబూబాబాద్: మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి సోమవారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, స్వతంత్ర అభ్యర్థి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారని అధికారులు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్కు అభ్యర్థులు నామినేషన్పత్రాలు అందజేశారు. బీజేపీ నుంచి అజ్మీరా సీతారాంనాయక్ నామినేషన్ దాఖలు చేయగా, యూసీసీఆర్ఐ (ఎంఎల్) పార్టీ అభ్యర్థి పగిడి ఎర్రయ్య, స్వతంత్ర అభ్యర్థిగా మైపతి అరుణ్కుమార్తో పాటు స్వతంత్ర అభ్యర్థిగా పాల్వంచ దుర్గ రెండో సెట్ నామినేషన్ సమర్పించారు. ‘తాండ్ర’కు బీ ఫామ్ఖమ్మం మామిళ్లగూడెం: బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్రావు సోమవారం పార్టీ బీ ఫామ్ అందుకున్నారు. ఆయన ఖమ్మంలో బీజేపీ పార్లమెంట్ ప్రభారి శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ బీ ఫామ్ అందజేశారు. ఈసందర్భంగా వినోద్రావు మాట్లాడుతూ ఈసారి ఖమ్మంలో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.పెద్దమ్మతల్లి ఆలయంలో నేడు చండీహోమంపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా మంగళవారం చండీ హోమం నిర్వహించనున్నట్లు ఈఓ జి.సుదర్శన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోమంలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్రనామాలు నమోదు చేసుకోవాలని కోరారు. సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి రావాలని సూచించారు. కాగా, తలనీలాలు, చీరలు పోగు చేసుకోవడం, పూలదండల విక్రయం, ఫొటోలు తీసేందుకు ఈనెల 26న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టికెట్లు, వాల్పోస్టర్ల ముద్రణ, ఇతర సామగ్రి, పూలదండల సరఫరాకు కూడా వేలం ఉంటుందని, ఆసక్తి గల వారు 26వ తేదీ ఉదయం 11 గంటల్లోగా రూ.200 చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని వెల్లడించారు. 25 నుంచి ‘ఓపెన్’ పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలోని ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు ఈనెల 25 నుంచి మే 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరచారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు విడతలుగా పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని సెయింట్ మేరీస్, సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల, బాబూ క్యాంప్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రాల్లో నిర్వహించనుండగా 846 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. పాత కొత్తగూడెంలోని జెడ్పీ హైస్కూల్ (ఆనందఖని పాఠశాల), చుంచుపల్లి, బూడిదగడ్డ ప్రభుత్వ ఉన్న త పాఠశాలలతో పాటు బాబూక్యాంప్లోని లిటిట్ బర్డ్స్ పాఠశాల కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్ పరీక్షలకు 978 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని వివరించారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాల వద్దకు చేరుకోవాలని, ఉదయం పరీక్షకు 9.05 గంటల వరకు, మధ్యాహ్నం 2.35 గంటల వర కు మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. ప్రతి సెంటర్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వైద్య సిబ్బంది, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంటాయని, మాల్ప్రాక్టీస్ జరుగకుండా సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఏసీజీఈ ఎస్.మాధవరావు(8919279238)ను సంప్రదించాలని సూచించారు. -
నిబంధనలకు నీళ్లు..
చర్లలో ఏజెన్సీ చట్టాల ఉల్లంఘన ● నిషేధాజ్ఞలు బేఖాతర్, ఎడాపెడా ఇసుక తవ్వకం ● అక్షయ పాత్రల్లా మారిన ఇసుక స్టాక్ పాయింట్లు ● మాఫియాకు అధికార యంత్రాంగం వత్తాసుసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞాలను ఇసుక మాఫియా ఏ కోశానా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాలకు వక్ర భాష్యాలు చెబుతూ లెక్కా పత్రం లేకుండా గోదావరి నుంచి ఇసుకను అక్రమంగా దోచేస్తున్నారు. తవ్వకాలపై నిషేధం ఉన్నా.. గోదావరిలో ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం రెండు నెలల క్రితం విధించిన నిషేధం అమల్లో ఉంది. స్టాక్ పాయింట్లో ఉన్న ఇసుకను మాత్రమే అమ్మాలి. కానీ చర్ల మండలంలో రెండు నెలలు గడిచినా స్టాక్ పాయింట్లలో ఇసుక అమ్మకం పూర్తి కాలేదు. నిత్యం లారీల్లో ఇక్కడి నుంచి ఇసుక తరలిపోతోంది. అయినప్పటికీ ఈ స్టాక్ పాయింట్లో ఇసుక అయిపోవడం లేదు. ప్రతీరోజు అక్షయ పాత్ర తరహాలో కొత్త ఇసుక రాశులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక్కడ నిత్యం ఇసుక అమ్మకాలు సాగుతున్నా స్టాక్ పాయింట్లో కొరత అన్న పదమే వినిపించక పోవడానికి ప్రభుత్వ నిషేధాజ్ఞల ఉల్లంఘనే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇసుక అమ్ముకునేందుకు తమకు అనుమతులు ఉన్నాయంటూ భారీ యంత్రాలతో నది నుంచి ఇసుకను తోడేస్తున్నారు. ఎవరికీ కనిపించడం లేదు చర్ల మండల పరిధిలో గోదావరి తీరం వెంట సుబ్బంపేట, వీరాపురం, పెద్దిపల్లి, కొత్తపల్లిలో ఇసుక ర్యాంపులు ఉన్నాయి. ప్రభుత్వ నిషేధం అమల్లోకి రాగానే స్టాక్ పాయింట్లో ఇసుక అమ్మకం పూర్తయిన తర్వాత పెద్దిపల్లి, కొత్తపల్లి మినహా మిగిలిన చోట్ల ర్యాంపుల్లో కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. కానీ పెద్దిపల్లి ర్యాంపుల్లో అక్షయ పాత్ర తరహాలో ఇప్పటికీ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి. గోదావరి నుంచి ఇసుకను తీయొద్దనే ప్రభుత్వ నిషేధాన్ని పూర్తిగా గోదావరిలో కలిపేశారు. ఆఖరికి పెసా వంటి ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తూ లారీలు, ప్రొక్లెయినర్లు (జేసీబీ) వంటి భారీ యంత్రాలను రాత్రీ పగలు తేడా లేకుండా గోదావరిలోకి పంపిస్తున్నారు. నది నుంచి ఇసుకను ఎడాపెడా తోడేస్తున్నారు. కన్నెత్తి చూడరు చర్ల మండలంలో జరుగుతున్న ఇసుక దందాకు అధికార యంత్రాంగం అండదండలు దండిగా ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. స్టాక్ పాయింట్లో ఇసుక అమ్ముతున్నారనే ముసుగులో నది నుంచి నిత్యం భారీ యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నా చూసీచూడనట్టుగా ఇక్కడి అధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రతీ రోజు వందల సంఖ్యలో ఇసుక లారీలు ఇటు భద్రాచలం, అటు వెంకటాపురం మీదుగా రాకపోకలు సాగిస్తున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. గిరిజనుల హక్కులకు రక్షణగా ఉన్న చట్టాలను అమలు చేయించాల్సిన అధికారులు అందుకు భిన్నంగా మిన్నకుండి పోతున్నారు. నిబంధనలు ఇలా కాగితాలపై కనిపించే నిబంధనలు ఒకలా ఉంటే, క్షేత్రస్థాయిలో వాటి అమలు తీరు మరోలా ఉంటోంది. చర్ల మండలం ఏజెన్సీ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ గిరిజనుల రక్షణ కోసం పెసా చట్టాన్ని అమలు చేయాల్సి ఉంది. దీని ప్రకారం ఇక్కడున్న ప్రకృతి వనరులపై తొలి హక్కు గిరిజనులకే దక్కుతుంది. ఈ క్రమంలో గిరిజనులకు ఎక్కువ లబ్ధి జరిగేలా పనులు జరగాలి. యంత్రాలను ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువ ఇసుకను తోడేందుకు వీలు లేదు. స్థానిక గిరిజనులకు ఎక్కువ రోజులు ఉపాధి దొరికేందుకు వీలుగా మానవ శక్తితోనే ఇసుక తవ్వకాలు చేపట్టాలి. అంతేకాదు.. ఇసుక క్రయవిక్రయాలు, తోడటం వంటి పనులు నిర్వహించేందుకు గిరిజనులతోనే సొసైటీలు ఏర్పాటు చేయాలి.
Related News by category
-
‘విద్యుత్’ పోస్టర్ల ఆవిష్కరణ
సూపర్బజార్(కొత్తగూడెం): విద్యుత్ భద్రతా వారోత్సవాల పోస్టర్లను గురువారం సర్కిల్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి సబ్డివిజన్ ఓఅండ్ఎం, సర్కిల్ సిబ్బందికి విద్యుత్ ప్రమాదాలు–నివారణపై నిర్వహించిన అవగాహన సదస్సులో విద్యుత్ ఎస్ఈ కె.రమేష్ మాట్లాడుతూ భద్రతా సూత్రాలను పాటిస్తూ ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సిబ్బందికి రక్షణ పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఆఫీసర్ ఇ.మురళి, నందయ్య, బి.వెంకటరత్నం, కె.వేణు, ఎండీ యాసిన్, పి.ప్రభాకర్, ఎ.రఘురామయ్య, పి.బుజ్జికన్నయ్య, హెచ్.దేవా, ఎస్కే రజియాబేగం, కె.పావని, కె.హరిత పాల్గొన్నారు. -
ఆ ఐదింటి సంగతేంటి?
● లోక్సభ ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి విలీన పంచాయతీలు ● అదే హామీ ఇస్తున్న ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ● పదేళ్లుగా పట్టించుకోలేదని భద్రాచలంవాసుల ఆవేదన భద్రాచలం: లోక్సభ ఎన్నికల వేళ విలీన ఐదు పంచాయతీల విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ ఊళ్లను తిరిగి తెలంగాణలో కలిపేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ప్రధాన పార్టీల అభ్యర్థులు తాజా ప్రచారంలో పేర్కొంటుండగా, గత ఎన్నికల్లో కూడా ఇదే హామీఇచ్చారని, ప్రతీసారి ఎన్నికల ప్రచా ర అస్త్రంగా మాత్రమే వాడుకుంటున్నారనే తప్ప అభివృద్ధి కుంటుపడుతున్నా పట్టించుకోవడంలేదనే భా వన భద్రాచలం ప్రాంతవాసుల్లో వ్యక్తమవుతోంది. పలుమార్లు ఆందోళన చేపట్టినా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో తొలుత భద్రాచలం డివిజన్లోని కూనవరం, వీఆర్పురం, చింతూరు, కుక్కునూరు వేలేరుపాడు మండలాలను పూర్తిగా, భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో కొన్ని గ్రామాలను ఏపీలో కలుపుతున్నట్లు గెజిట్ విడుదల చేశారు. అనంతరం స్వల్ప కాలంలోనే భద్రాచలం మండలంలోని పిచుకులపాడు, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం, యటపాక గ్రామపంచాయతీలను సైతం ఏపీలో విలీనం చేస్తున్నట్లు మరో గెజిట్ విడుదల చేశారు. దీంతో భద్రాచలం పట్టణం మినహా ఇతర ప్రాంతాలన్నీ ఏపీలో కలిసిపోయాయి. ఆ ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని అక్కడి ప్రజలతోపాటు భద్రాచలం ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఐదు గ్రామపంచాయతీల ప్రజలు తీర్మానాలు కూడా చేశారు. పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. భద్రాచలం పర్యటనకు వచ్చిన నాటి గవర్నర్ తమిళి సైను కలిసి వినతిపత్రం ఇచ్చారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదు. ప్రతీసారి ఎన్నికల హామీగా.. విలీన ఐదు గ్రామపంచాయతీల ప్రజల ఓటర్లు ఏపీలోని పాడేరు నియోజకవర్గ పరిధిలోకి వస్తారు. భద్రాచలాన్ని ఆనుకుని అధిక భూభాగం ఉండటంతో పాటు, రామాల య భూములు ఆ గ్రామపంచాయతీల పరిధిలోనే ఉన్నాయి. భద్రాచలం అభివృద్ధి వాటిపైనే ఆధారపడి ఉంది. విలీన వ్యవహారం ఇరు రాష్ట్రాలతోపాటు కేంద్రం కూడా చొరవ చూపాల్సి రావడం, భద్రాచలంలోని అత్యధిక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు లోక్సభ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు ఇదే కీలక హామీగా మారుతోంది. 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పంచాయతీల విలీనానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా 2024 ఎన్నికల ప్రచారంలోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు అదే హామీ ఇస్తున్నాయి. గడిచిన పదేళ్లలో అధికార, ప్రతిపక్షాలు తమ సమస్యను పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు పంచాయతీలు తిరిగి తెలంగాణలో ఎందుకు కలపాలంటే.. ● పేరుకు ఆంధ్రప్రదేశ్లో కలిపినా కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాకలు భౌగోళికంగా ఇప్పటికీ భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్నాయి. ● భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న పురుషోత్తపట్నం, ఎటపాక, గుండాలలో ఖాళీ భూములు అనేకం ఉన్నాయి. భద్రాచలం విస్తరణకు ఈ భూములు తప్పనిసరి. ● భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన భూములు సుమారు 900 ఎకరాలు పురుషోత్తపట్నంలోనే ఉన్నాయి. దీనివల్ల ఆలయ అభివృద్ధి పనులు ముందకు సాగటం లేదు. ● తెలంగాణలోని భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వెళ్లి రావాలంటే ఏపీకి చెందిన ఎటపాక, పిచుకలపాడు, కన్నాయిగూడెం మీదుగా వెళ్లి రావాలి. ● గోదావరి వరదల సమయంలో సహాయక చర్యలు సకాలంలో చేపట్టలేకపోతున్నారు. -
దక్కని ప్రాతినిధ్యం
జిల్లా నుంచి ఒక్కరూ పార్లమెంట్లో అడుగుపెట్టని వైనం ● ఖమ్మం స్థానానికి 17సార్లు ఎన్నికలు జరిగినా రాని అవకాశం ● భద్రాచలం, మహబూబాబాద్లోనూ మొండిచేయేభద్రాచలంలోనూ.. భద్రాచలం పార్లమెంటు స్థానాన్ని ఎస్టీలకు రిజర్వ్ చేస్తూ తొలిసారిగా 1967లో ఎన్నికలు నిర్వహించారు. చివరిసారిగా ఈ స్థానానికి 2004లో ఎన్నికలు జరిగాయి. భద్రాచలం పార్లమెంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, బూర్గంపాడులతో పాటు విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉండేది. దీంతో ఇక్కడి నుంచి ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసే అవకాశం ఎక్కువగా ఆంధ్రా నేతలకే దక్కింది. కొద్దిమంది ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలకు పోటీ చేసి చట్టసభలో అడుగు పెట్టే అవకాశం వచ్చినా, ప్రస్తుతం ఆ ప్రాంతాలు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పరిధిలోకి వెళ్లాయి. ఈ స్థానానికి 11 సార్లు ఎన్నికలు జరగగా ఐదుగురు పార్లమెంటుకు వెళ్లారు. వీరిలో అత్యధికంగా నాలుగుసార్లు ఎన్నికై న రాధాబాయి ఆనందరావు స్వస్థలం ఖమ్మం కాగా విద్యాభ్యాసం రాజమండ్రిలో జరిగింది. మిగిలిన వారిలో సోడే రామయ్య కొండ్రాజుపేట(వీఆర్ పురం), కర్రెద్దుల కమలకుమారి లక్కవరం (చింతూరు మండలం), దుంపా మేరి విజయకుమారి విశాఖపట్నం, మిడియం బాబూరావు రాజమండ్రి ప్రాంతాలకు చెందినవారు. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం : దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటాయి. పార్లమెంటుకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 18వ పార్లమెంట్కు ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు ఏజెన్సీ ప్రాంతం విస్తరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతలకు దిగువసభలో అడుగు పెట్టే అవకాశం రాలేదు. ఖమ్మం నుంచి.. జిల్లా పరిధిలోని ఇల్లెందు, పినపాక, భద్రాచలం అసెంబ్లీ స్థానాలు మహబూబాబాద్ (ఎస్టీ) పార్లమెంటు పరిధిలో, కొత్తగూడెం, అశ్వారావుపేట ఖమ్మం (జనరల్) పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. ఖమ్మం పార్లమెంటు స్థానానికి 17సార్లు ఎన్నికలు జరగ్గా తొమ్మిది మంది ఎంపీలుగా పార్లమెంటుకు వెళ్లారు. 1952, 1957లలో జరిగిన తొలి, మలి ఎన్నికల్లో టీబీ విఠల్రావు కమ్యూనిస్టు పార్టీల తరఫున గెలిచారు. ఆయన స్వస్థలం ప్రస్తుతం మహారాష్ట్ర పరిధిలో ఉండగా, గతంలో అవిభాజ్య హైదరాబాద్ రాష్ట్రంలో ఉండేది. ఆ తర్వాత వరుసగా జలగం కొండలరావు, జలగం వెంగళరావు, పీవీ రంగయ్య నాయుడు, తమ్మినేని వీరభద్రం, నాదెండ్ల భాస్కరరావు, రేణుకా చౌదరి, నామా నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఎంపీలుగా గెలుపొందారు. వీరిలో పీవీ రంగయ్యనాయుడు, రేణుకా చౌదరి, నాదెండ్ల భాస్కరరావుల జన్మస్థలాలు ఏపీలో ఉండగా మిగిలినవారు ప్రస్తుత ఖమ్మం జిల్లాకు చెందిన వారుగా ఉన్నారు. మొత్తం తొమ్మిది మందిలో ఒక్కరూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూలాలు ఉన్న వారు లేరు. మహబూబాబాద్లో కూడా నో చాన్స్.. భద్రాచలం పార్లమెంటు నియోజకవర్గం 2008లో రద్దుకాగా ఆ స్థానంలో మహబూబాబాద్ కొత్తగా ఏర్పడింది. ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరగగా, తొలి, మలి ఎన్నికల్లో ములుగు జిల్లాకు చెందిన పోరిక బలరాంనాయక్, అజ్మీర సీతారాంనాయక్ గెలిచారు. మూడో ఎన్నికల్లో మహబూబాబాద్ జిల్లా మూలాలు ఉన్న మాలోత్ కవిత విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఈ ముగ్గురే మూడు ప్రధాన పార్టీల తరఫున పోటీ పడుతున్నారు. దీంతో మరోసారి ఈ స్థానం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నేతలకు నిరాశే ఎదురైంది. ఒక్కసారి కూడా.. ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్ స్థానాల నుంచి భద్రాద్రి జిల్లాకు చెందిన వారికి ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసే అవకాశం దక్కలేదు. గతంలో ప్రజారాజ్యం, వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను విజయం వరించలేదు. అయితే, ఈసారి మాత్రం ఖమ్మం నుంచి పోటీలో ఇద్దరు భద్రాద్రి జిల్లా వాసులు ఉన్నారు. జిల్లాలోని ములకలపల్లి మండలానికి చెందిన బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు, కొత్తగూడేనికి చెందిన బీఎస్పీ అభ్యర్థి యెర్రా కామేష్ పోటీలో ఉన్నారు. -
తొలి రోజు ముగ్గురు
నల్లగొండ: వరంగల్– ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు తొలిరోజైన గురువారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బండారు నాగరాజు, ప్రజావాణి పార్టీ తరఫున పాటి శ్రీకాంత్రెడ్డి, తెలంగాణ సకల జనుల పార్టీ నుంచి నందిపాటి జానయ్య ఒక్కో సెట్ నామినేషన్ వేశారు. మొత్తం ముగ్గురు అభ్యర్థులు మూడు సెట్ల నామినేషన్లు సమర్పించారని నల్లగొండ కలెక్టర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్లు ప్రారంభం -
బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం
రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటికొత్తగూడెంరూరల్: ఎంపీగా నామ నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేస్తానంటూ ఖమ్మంలో జరిగిన బస్సు యాత్రలో మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారని, దీనిని బట్టి బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని అర్థమవుతోందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం చుంచుపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పలువురు నాయకులు ఊకంటి గోపాల్రావు, గడిపల్లి కవిత, వీరబాబు తదితరులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ కాంగ్రెస్లో చేరినవారికి అండగా ఉంటానని తెలిపారు. కేసీఆర్ పదేళ్లలో అక్రమంగా సంపాదించిన సొమ్ముతో పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టారని ఆరోపించారు. ఇక బీజేపీ కులమతాల మధ్య చిచ్చు పెడుతోందని, రామాలయాన్ని రాజకీయంలోకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని పేర్కొన్నారు. ఖమ్మం అభ్యర్ధి రామసహాయం రఘురాంరెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఈ నెల 4న సీఎం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు, 7న సినీ హీరో వెంకటేష్ ప్రచారం చేయనున్నట్లు వివరించారు. కాంగ్రెస్లో చేరిన ఊకంటి గోపాల్రావు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో వేరే అభ్యర్థికి మద్దతు తెలిపి తప్పు చేశానని, ఇక నుంచి జీవితాంతం శ్రీనన్నతోనే ఉంటానని అన్నారు. అనంతరం ప్రకాశం స్టేడియంలో నిర్వహించే సీఎం సభ ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్, జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు అళ్ల మురళి, తూము చౌదరి, తూళ్లురు బ్రహ్మయ్య, ఎడవల్లి కృష్ణ, నాగేంద్ర త్రివేది, నాగసీతారాములు, రాయల శాంతయ్య, గడిపల్లి కవిత, బిందు చౌహన్, జేవీఎస్ చౌదరి, మండె వీరహనుమంతరావు, పిడమర్తి రవి, వీరబాబు, పిచ్చిరెడ్డి, పరమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Photos
View allVideo
View allBullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019