breaking news
-
అంధకారంలో ఆస్పత్రి
● నిలిచిన రక్తశుద్ధి సేవలు ● పని చేయని జనరేటర్ ● బాత్రూమ్ల్లోనూ నీళ్లులేని వైనం కొత్తగూడెంరూరల్: జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రి అంధకారమయమైంది. ఆదివారం సాయంత్రం వచ్చిన భారీ గాలులు, వర్షంలో ఆస్పత్రి ఆవరణలోని విద్యుత్ స్తంభాలపై చెట్లు విరిగి పడ్డాయి. ఇక ఆస్పత్రిలో ఉన్న జనరేటర్కు టెక్నీషియన్ లేకపోవడంతో అది కూడా ఆన్ చేయలేదు. దీంతో పేషెంట్లు, సహాయకులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఉక్కపోతతో పేషెంట్లు సతమతం కాగా, సహాయకులు విసనకర్రలు, అట్ట ముక్కలతో ఊపుతూ కనిపించారు. సోమవారం ఉదయం కూడా ఎక్స్రే, స్కానింగ్, డయాలసిస్ సెంటర్, ల్యాబ్ పని చేయలేదు. డయాలసిస్ బాధితుల అవస్థలు.. జిల్లా సర్వజన ఆస్పత్రిలో ఉన్న రక్త శుద్ధి కేంద్రంలో ప్రతీ రోజు 20 నుంచి 24 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రక్తశుద్ధి చేస్తారు. ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో రక్త శుద్ధి కేంద్రంలోని పేషెంట్లను ఖాళీ చేయించారు. ఇక్కడ నిత్యం షిఫ్టుల వారీగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 1 వరకు, తిరిగి 1 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు రక్తశుద్ధి చేస్తారు. పెరిగిన ఓపీ సేవలు.. కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశాల మేరకు ఈ ఆస్పత్రిలో ఇటీవల ఓపీ సేవలు పెంచారు. ప్రస్తుతం నిత్యం ఔట్ పేషెంట్లు 500 మంది వరకు వస్తున్నారు. కాగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడంలో ఆస్పత్రి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సోమవారం సాయంత్రం వరకు కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోవడంతో పేషెంట్లతో పాటు ఆస్పత్రి సిబ్బంది సైతం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రిలోని వాష్ రూమ్ల్లోనూ నీటి సరఫరా లేక పేషంట్లు మల, మూత్ర విసర్జనకు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం ఆస్పత్రిని సందర్శించి, పేషెంట్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆస్పత్రి అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పాలిసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
సింగరేణి(కొత్తగూడెం): ప్రభుత్వ, ప్రవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్కు దరఖాస్తు గడువు పొడిగించినట్లు కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ కన్వీనర్ బి.నాగముని నాయక్ తెలిపారు. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు సోమవారం ముగియగా, ఈనెల 28 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. అలాగే, రూ.100 జరిమానాతో 30వ తేదీ వరకు, రూ.300 అపరాధ రుసుముతో మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అయితే, పరీక్ష మాత్రం యథావిధిగా మే 24న జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు. -
మానుకోటలో మూడు నామినేషన్లు
మహబూబాబాద్: మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి సోమవారం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, స్వతంత్ర అభ్యర్థి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారని అధికారులు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అద్వైత్కుమార్సింగ్కు అభ్యర్థులు నామినేషన్పత్రాలు అందజేశారు. బీజేపీ నుంచి అజ్మీరా సీతారాంనాయక్ నామినేషన్ దాఖలు చేయగా, యూసీసీఆర్ఐ (ఎంఎల్) పార్టీ అభ్యర్థి పగిడి ఎర్రయ్య, స్వతంత్ర అభ్యర్థిగా మైపతి అరుణ్కుమార్తో పాటు స్వతంత్ర అభ్యర్థిగా పాల్వంచ దుర్గ రెండో సెట్ నామినేషన్ సమర్పించారు. ‘తాండ్ర’కు బీ ఫామ్ఖమ్మం మామిళ్లగూడెం: బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్రావు సోమవారం పార్టీ బీ ఫామ్ అందుకున్నారు. ఆయన ఖమ్మంలో బీజేపీ పార్లమెంట్ ప్రభారి శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ బీ ఫామ్ అందజేశారు. ఈసందర్భంగా వినోద్రావు మాట్లాడుతూ ఈసారి ఖమ్మంలో తన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.పెద్దమ్మతల్లి ఆలయంలో నేడు చండీహోమంపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా మంగళవారం చండీ హోమం నిర్వహించనున్నట్లు ఈఓ జి.సుదర్శన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. హోమంలో పాల్గొనే భక్తులు రూ.2,516 చెల్లించి గోత్రనామాలు నమోదు చేసుకోవాలని కోరారు. సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి రావాలని సూచించారు. కాగా, తలనీలాలు, చీరలు పోగు చేసుకోవడం, పూలదండల విక్రయం, ఫొటోలు తీసేందుకు ఈనెల 26న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టికెట్లు, వాల్పోస్టర్ల ముద్రణ, ఇతర సామగ్రి, పూలదండల సరఫరాకు కూడా వేలం ఉంటుందని, ఆసక్తి గల వారు 26వ తేదీ ఉదయం 11 గంటల్లోగా రూ.200 చెల్లించి వేలంలో పాల్గొనవచ్చని వెల్లడించారు. 25 నుంచి ‘ఓపెన్’ పరీక్షలుకొత్తగూడెంఅర్బన్: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలోని ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలు ఈనెల 25 నుంచి మే 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరచారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు రెండు విడతలుగా పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని సెయింట్ మేరీస్, సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల, బాబూ క్యాంప్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల కేంద్రాల్లో నిర్వహించనుండగా 846 మంది విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. పాత కొత్తగూడెంలోని జెడ్పీ హైస్కూల్ (ఆనందఖని పాఠశాల), చుంచుపల్లి, బూడిదగడ్డ ప్రభుత్వ ఉన్న త పాఠశాలలతో పాటు బాబూక్యాంప్లోని లిటిట్ బర్డ్స్ పాఠశాల కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్ పరీక్షలకు 978 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని వివరించారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాల వద్దకు చేరుకోవాలని, ఉదయం పరీక్షకు 9.05 గంటల వరకు, మధ్యాహ్నం 2.35 గంటల వర కు మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. ప్రతి సెంటర్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, వైద్య సిబ్బంది, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంటాయని, మాల్ప్రాక్టీస్ జరుగకుండా సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే ఏసీజీఈ ఎస్.మాధవరావు(8919279238)ను సంప్రదించాలని సూచించారు. -
అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపిక
జూలూరుపాడు: నేపాల్ దేశంలోని టోకరా ప్రాంతంలో జరిగే అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్కు జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్యా తులసీనాయక్ ఎంపికయ్యాడు. మార్చి 22, 23, 24 తేదీల్లో హైదరాబాద్లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో అండర్–19 క్రికెట్ పోటీలు జరిగాయి. మహారాష్ట్ర – తెలంగాణ జట్ల మధ్య జరిగిన క్రికెట్ పోటీలో తులసీనాయక్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. దీంతో మే 16వ తేదీన నేపాల్లో జరిగే ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో ఇండియా టీమ్లో ఆడేందుకు తనను ఎంపిక చేశారని తులసీనాయక్ విలేకరులకు తెలిపాడు. ఈ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల్లో ఆడేందుకు రూ. 50 వేలు అవసరమని, పేద కుటుంబానికి చెందిన తాను అంత డబ్బు సమకూర్చుకోవడం కష్టమని వాపోయాడు. రెండేళ్ల క్రితమే తన తండ్రి లోకా మృతిచెందాడని, తల్లి సుజాత అనారోగ్య సమస్యతో బాధపడుతోందని చెప్పాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనేందుకు తనకు ఆర్థిక సాయం చేయాలని దాతలకు విజ్ఞప్తి చేశాడు. ఆర్థిక సాయం అందించేవారు 95737 38199 నంబర్కు ఫోన్ పే చేయాలని కోరుతున్నాడు. ఆర్థిక సాయం చేయాలని వేడుకోలు -
రామయ్య సన్నిధిలో పోలీస్ ఉన్నతాధికారులు
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని పోలీస్ ఉన్నతాధికారులు సోమవారం దర్శించుకున్నారు. డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ శివధర్ రెడ్డి, సీఆర్పీఎఫ్ డీజీ శబరి, ఐజీ సుమతి, జిల్లా ఎస్పీ రోహిత్రాజ్ తదితరులు ఆలయానికి చేరుకోగా, అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పండితులు వేదాశీర్వచనం చేసి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు విజయరాఘవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Pagination
Tuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
Business Test Home Title
Politics title check 911
Articles in Sitemap
Invalidation article updation 2
Test article qid_004
Test article for validation home
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ : 800 వందల మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
Sports Article 1
Test article qid_002
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019