వెంకటగిరి రూరల్ : వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ బలంగా ఉందని, భవిష్యత్లో టీడీపీ టూలెట్ బోర్డులు పెట్టుకునే పరిస్థితికి వస్తుందని వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఎద్దేశా చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర పరిశీలకులు ఎమ్మార్సీరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు కొడవలూరు ధనంజయ్యరెడ్డితో వెంకటగిరిలోని కలిమిలి నివాసంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కలిమిలి రాంప్రసాద్రెడ్డి, బాలాయపల్లి, డక్కిలి ఎంపీపీలు గూడూరు భాస్కర్రెడ్డి, రాజశేఖర్, రూరల్ నాయకులు తంబిరెడ్డి శివారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తొలుత కలిమిలి నివాసానికి విచ్చేసిన నేదురుమల్లికి డక్కిలి జెడ్పీటీసీ కలిమిలి రాజేశ్వరి శాలువ కప్పి పుష్పగుచ్ఛంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయ సాధన దిశగా రాష్ట్రంలో 175కి 175 స్థానాలు వైఎస్సార్సీపీ కై వసం చేసుకునేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. కలిమిలి రామ్ప్రసాద్రెడ్డి సేవలు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీకి ఎంతో అవసరమని చెప్పారు. అనంతరం కలిమిలి రామ్ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వెంకటగిరి నియోజకవర్గంలో గత మెజార్టీ కన్నా అత్యధిక మెజార్టీతో నేదురుమల్లి రామ్కుమార్రెడ్డిని గెలిపిస్తామని చెప్పారు. అనంతరం వెంకటగిరి రాజాలు, ఎస్వీబీసీ చైర్మన్ డాక్టర్ వీబీ.సాయికృష్ణయాచేంద్ర, సర్వజ్ఞకుమార యాచేంద్రలను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దొంతుశారద, పట్టణ కన్వీనర్ జీ.ఢిల్లీబాబు, కౌన్సిలర్ ఆరి శంకరయ్య, నాయకులు దొంతు బాలకృష్ణ, బొల్లంపల్లి కృష్ణ, పేచీరాజ్, తలపల మల్లికార్జున్, అల్లంసాయి తదితరులు పాల్గొన్నారు.
breaking news
Breadcrumb
- HOME
● కలిమిలిని కలసిన నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ● గతంకంటే అత్యధిక మెజార్టీ సాధిస్తామని వెల్లడి
Published Fri, Apr 19 2024 1:40 AM
Ad - Sakshi_Home_Sticky
adsolute_video_ad
Related news
-
రైలు నుంచి జారిపడి మహిళ మృతి
గూడూరు రూరల్: నెల్లూరు నుంచి గూడూరు వైపు వచ్చే రైలు మార్గంలో గురువారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్కు ఉత్తరం వైపున సుమారు 35 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని మహిళ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ కొండప్పనాయుడు తెలిపారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఈమేరకు గుర్తు తెలియని మహిళగా కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మహిళ అనుమానాస్పద మృతి శ్రీకాళహస్తి : ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పట్టణంలోని ముత్యాలమ్మగుడి వీధిలో గురువారం చోటుచేసుకుంది. ఒకటవ పట్టణ సీఐ నరసింహారావు అందించిన వివరాల మేరకు.. శ్రీకాళహస్తి మండలం, టీఎంవీ కండ్రిగకు చెందిన వెంకటేష్రెడ్డి, వాణి దంపతుల కుమార్తె గౌరి(28)ని పట్టణంలోని ముత్యాలమ్మ గుడివీధికి చెందిన పురం అనిల్కుమార్కు ఇచ్చి 2019లో వివాహం జరిపించారు. అనిల్కుమార్ పట్టణంలో ఓ ఎలక్ట్రానిక్ దుకాణం నడుపుతున్నాడు. ఈ దంపతులకు భరత్(7), హర్షవర్దన్(5) ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం మధ్యాహ్నం షాపు నుంచి ఇంటికి వెళ్లి చూడగా గౌరి ఇంట్లో ఉరివేసుకుని ఉన్నట్లు అనిల్కుమార్ చెబుతుండగా.. మృతురాలు గౌరి తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె మృతిపట్ల అనుమానం ఉందని అంటున్నారు. దీంతో గౌరి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. పూరిల్లు దగ్ధం వాకాడు : వాకాడు ముస్లిం కాలనీలో గురువారం పూరిల్లు దగ్ధమైంది. స్థానికుల కథనం.. గ్రామంలో ఎస్కే అల్లాబాషా నివాసం ఉంటున్నాడు. ఆయన శుక్రవారం పనిమీద బయటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఏమి జరిగిందో కానీ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టు పక్కల వారు గమనించి ఇంటి యజమానికి తెలియజేసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం కోట అగ్నిమాపకశాఖ సిబ్బంది అక్క డి కి చేరుకుని మంటలను ఆర్పేశారు. సుమారు రూ. 50 వేల వరకు ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు తెలిపారు. -
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సమరోత్సాహం
40 టీడీపీ కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక 150 కటుంబాలు చేరిక టీడీపీకి టూలెట్ బోర్డు తప్పదు నెరబైలు: వైఎస్సార్సీపీలో చేరిన వారితో తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి తిరుపతి రూరల్: ఎర్రావారిపాళెం మండలం, నెరబైలు పంచాయతీ వైఎస్సార్సీపీకి కంచుకోటగా మారుతోంది. పంచాయతీలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి 20 కుటుంబాలు చేరాయి. గురువారం తుమ్మలగుంట నివాసం వద్ద తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్రెడ్డి వారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో గంటా నారాయణ, నాగేంద్రబాబు, రెడ్డెప్ప, చిరంజీవి, నాగులయ్య, సుబ్బయ్య, మణి, చిట్టిబాబు, ఎం.సుబ్బయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ పంచాయతీ అధ్యక్షులు హరినాథ్రెడ్డి, ఎంపీటీసీ సుధాకర్రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగార్జున, తలకోన బోర్డ్ మెంబర్ జయంత్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి మండలం, ఎంపేడు పంచాయతీ నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. శ్రీకాళహస్తి వైఎస్సార్సీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు నాగోలు శ్రీనివాసులురెడ్డి సారథ్యంలో 40 కుటుంబాలకు పార్టీతీర్థం పుచ్చుకున్నారు. పట్టణ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చెంచయ్య యాదవ్, పుల్లూరు చెంచురామిరెడ్డి, నెల్లూరు ప్రతాప్, ముండే వెంకటేష్, తాటిపర్తి కిరణ్కుమార్రెడ్డి, బుడతొట్టి చిరంజీవి, మనవాసి నరసింహయాదవ్, పుల్లూరు చెంగారెడ్డి, పాదం సునీల్, రాజు తదితరులు ఉన్నారు. 21వ వార్డులో 30 మంది చేరిక శ్రీకాళహస్తి పట్టణంలోని 21వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు 30మంది వైఎస్సార్సీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకటగిరి రూరల్: బాలాయపల్లి వైఎస్సార్సీపీ కన్వీనర్ వెందోటి కార్తీక్రెడ్డి, బాలాయపల్లి వైస్ ఎంపీపీ వాన పార్వతి, సర్పంచ్ ఒప్పతొట్టి అంకయ్య ఆధ్వర్యంలో కడగుంట గ్రామం నుంచి సుమారు 150 కుటంబాలు వెంకటగిరిలో నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరాయి. వారికి రామ్కుమార్రెడ్డి వైఎస్సార్సీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతించారు. జేసీఎస్ కన్వీనర్ బాబిచౌదరి, వైఎస్సార్సీపీ నాయకులు ఆరి కోటేశ్వరరెడ్డి, రామలచేను మాధవయ్య, సొడారం వజ్రం, వాన చినకాటయ్య, కృష్ణయ్య, ప్రసాద్, పెద్దగంగయ్య, నాగువులు, మేకల చిన్నయ్య, ఒప్పతొట్టి చిన అంకయ్య తదితరులు పాల్గొన్నారు. -
తిరుమలలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు శ్రీసీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు సహస్రదీపాలంకారసేవ నిర్వహించారు. ఆ తరువాత శ్రీసీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులను తిరు మాడ వీధుల్లో ఊరేగించారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత శ్రీసీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం సుగ్రీవుడు, అంగధుడు ఉత్సవమూర్తులను వేంచేపు చేసి, వారితోపాటు ఆంజనేయస్వామివారికి పుష్పమాలలు సమర్పించారు. -
ఎన్నికల నియమావళి పాటించాలి
సూళ్లూరుపేట రూరల్: ఎన్నికల నియమావళిని అఽభ్యర్థులు, రాజకీయ నాయకులు తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల ఆర్వో చంద్రముని తెలిపారు. సూళ్లూరుపేట తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ అందజేసిన ఎన్నికల నియమావళి పత్రాలను ఆర్వో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ అభ్యర్థులతో వచ్చే వ్యక్తులు నామినేషన్ కేంద్రం వద్ద వంద మీటర్ల దూరంలో ఉండాలన్నారు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 22వ తేదీలోపు సబంధిత తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. -
చంద్రబాబు కూటమి
వంచించడానికే● ఎన్ని పొత్తులు పెట్టుకున్నా గెలుపు జగనన్నదే ● తిరుపతి ప్రజల గుండెల్లో అభివృద్ధి ప్రధాతగా అభినయ్ ● 31వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే భూమన తిరుపతి మంగళం: మాయమాటలతో ప్రజలను వంచించడానికే చంద్రబాబు, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. తిరుపతి 31వ డివిజన్లో గురువారం పార్టీ సీనియర్ నాయకులు బొమ్మగుంట రవి, దుద్దేల బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేతోపాటు మేయర్ డాక్టర్ శిరీష ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో భూమనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం బొమ్మగుంట రవి నివాసం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్.జగన్మోహన్రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు ప్రపంచ రాజకీయాలకే ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమం, అభివృద్ధే పరమావధిగా జగనన్న పాలన సాగిందన్నారు. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న దురాలోచనతో చంద్రబాబు కూటమి ఏర్పాటు చేసుకున్నాడని మండిపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో పెత్తందారులకు కొమ్ముకాయడం తప్ప పేదలకు చేసిందేమీ లేదని ఎద్దేవాచేశారు. అందుకే ఈ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కడిగా పోటీచేసే ధైర్యం లేక జనసేన, బీజేపీతో పొత్తులు పెట్టుకున్నాడని మండిపడ్డారు. తిరుపతిలో అభినయ్ చేసిన అభివృద్ధిని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారన్నారు. తిరుపతిలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేని కూటమి నాయకులు తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆరోపణలకు భయపడి అభివృద్ధిని ఆపే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, పాముల రమేష్రెడ్డి, దేవదానం, తొండమనాటి వెంకటేష్రెడ్డి, కంకనాల రమేష్, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లం రవిచంద్రారెడ్డి, తాతయ్యగుంట గంగమ్మ ఆలయ చైర్మన్ కట్టా గోపీయాదవ్, కార్పొరేటర్లు శేఖర్రెడ్డి, పొన్నాలచంద్ర, నరేంద్ర, ఆరణి సంధ్య, ఆధిలక్ష్మి, దూదికుమారి, కల్పనా యాదవకృష్ణ, మట్లి వెంకటరెడ్డి, పార్టీ నాయకులు తిమ్మారెడ్డి, చిరంజీవి, చెంగల్రాయులు, కన్నయ్య, దాము, ఊతుకుంట మోహన్, ఇమ్రాన్, యాదవకృష్ణ, పుష్పలత, గల్లా కవిత, పుణీత, శారద పాల్గొన్నారు.
Related News by category
-
విధులకు హాజరుకావాల్సిందే
తిరుపతి సిటీ: ఎన్నికల విధుల నిర్వహణలో పీఓ, ఏపీఓలు ప్రమత్తంగా ఉండాలని, విధులు కేటాయించిన ప్రతి ఉద్యోగి హాజరు కావాల్సిందేనని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ స్పష్టం చేశారు. గురువారం పద్మావతి మహిళా వర్సిటీలోని ధృతి ఆడిటోరియంలో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పీఓ, ఏపీఓల శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరై ఎన్నికల విధులపై దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈవీఎంలు, పోలింగ్ కేంద్రాలలో సమస్య ఏర్పడితే వెంటనే సెక్టోరల్ అధికారికి సమాచారం అందించాలని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గానికి సంబంధించి ఓటరు స్లిప్పులు బీఎల్ఓలకు అందజేశామని, వారు నిర్ణీత సమయంలోపు ఓటరుకు అందజేయాలని ఆదేశించారు. చంద్రగిరి ఆర్ఓ నిషాంత్రెడ్డి, పీఓలు, ఏపీఓలు పాల్గొన్నారు. 92,79 శాతం మందికి పింఛన్లుతిరుపతి అర్బన్: సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ 92.79 శాతం పూర్తయినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. మొత్తం 69,522 మంది లబ్ధిదారులకు గాను 64,506 మందికి పింఛన్లు పంపిణీ చేసినట్టు వెల్లడించారు. రూ.20,21,73,000లకుగాను బుధ, గురువారాల్లో రూ.18,79,05,000 లబ్ధిదారులకు అందజేసినట్టు పేర్కొన్నారు. శుక్రవారానికి వంద శాతం పూర్తి చేస్తామని కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. నేడు డయల్ యువర్ ఈఓ తిరుమల: డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుపతి టీటీడీ పరిపాలనా భవంలోని సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్టు టీటీడీ పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ప్రత్యక్ష ప్రసారం చేయన్నట్టు వెల్లడించింది. భక్తులు తమ సందేహాలు, సూచనలను టీటీడీ ఈఓ ఏవీ.ధర్మారెడ్డికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలపవని సూచించింది. భక్తులు 0877–2263261 నంబర్లో సంప్రదించాలని టీటీడీ పేర్కొంది. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 16 కంపార్ట్మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 72,510 మంది స్వామివారిని దర్శించుకోగా 30,441 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.62 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 16 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
No Headline
దివ్యాంగులు, పండుటాకులపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన అనుచరులు కక్షగట్టారు. కుట్రపూరితంగా వలంటీర్ వ్యవస్థపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించారు. దీంతో ఎన్నికల కమిషన్ వలంటీర్ వ్యవస్థను పక్కనబెట్టింది. ఇంటికే చేరుతున్న పింఛన్ అందకుండా పోయింది. రెండు నెలల నుంచి పండుటాకులు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. వీసీ ఆదేశాలతో గత నెలలో సచివాలయాల ద్వారా పింఛన్ నగదు పొందగా.. ఇప్పుడు బ్యాంక్కు వెళ్లి తీసుకోవాల్సి వస్తోంది. తమపై కక్షగట్టి ముప్పుతిప్పలు పెడుతున్న చంద్రబాబు తీరుపై అభాగ్యులు ఒంటికాలుతో లేస్తున్నారు. ‘మేం ఏం పాపం చేశామని.. ఇలా ఇబ్బంది పెడుతున్నాడు’ టూ శాపనార్థాలు పెడుతున్నారు. – సాక్షి, నెట్వర్క్ -
No Headline
ఏర్పేడు/రేణిగుంట: రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడులో జాతీయ విద్యాసంస్థలైన ఐఐటీ, ఐజర్లను నెలకొల్పుతున్నట్లు కేంద్రం 2014లో ప్రకటించింది. ఏర్పేడు సమీపంలోని మేర్లపాక రెవెన్యూ పరిధిలో 548 ఎకరాలు ఐఐటీ కోసం భూసేకరణ చేశారు. అలాగే ఐజర్ కోసం ఏర్పేడు మండలం, జంగాలపల్లి సమీపంలో 260 ఎకరాలు సేకరించారు. ఇదే అదునుగా 2015లో అప్పటి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అడ్డదారులు ఎంచుకున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనయుడు బొజ్జల సుధీర్రెడ్డి రెచ్చిపోయారు. అప్పటి తహసీల్దార్ లక్ష్మీనరసయ్యతో కలసి దాదాపు 150 ఎకరాల భూమికి పట్టాలు లేకపోవడంతో అప్పటికప్పుడు పాత తేదీలతో నకిలీ పట్టాదార్ పాసుపుస్తకాలను తయారు చేశారు. ఇంకేముంది.. రూ.కోట్ల పరిహారం మొత్తాన్ని కాజేశారు. అప్పట్లో ఎకరా భూమికి రూ.10లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం అందించింది. ఈ కుంభకోణంలో జంగాలపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు అన్నీ తానై వ్యవహరించారు. ఇలా అక్రమాలకు పాల్పడి అవినీతి సొమ్మును బొజ్జల సుధీర్రెడ్డికి ముట్టజెప్పినట్లు అప్పట్లోనే చెడ్డపేరు మూటగట్టుకున్నారు. దీంతో జిల్లా అధికారులకు ఫిర్యాదులు అందడంతో అప్పటి తహసీల్దార్పై చర్యలు తీసుకున్నారు. అలాగే తొట్టంబేడు మండలంలో ఏర్పాటు చేసిన ఖజారియా పరిశ్రమకు కేటాయించిన భూములకు సంబందించి పొందిన పరిహారంలోనూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మన్నవరంలో ఆక్రమించి చదును చేసిన ప్రభుత్వ భూమి పవిత్ర పుణ్యక్షేత్రంలోని ప్రజలు నమ్మి 30 ఏళ్ల పాటు పాలించే అవకాశాన్ని కల్పించారు.. ఓటేసిన ప్రజలను నడిసంద్రంలో ముంచేసి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్రమార్జనే ధ్యేయంగా సొంత ఆస్తులను కూడబెట్టుకున్నారు.. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జాతీయ విద్యాసంస్థలు ఏర్పేడు ఐఐటీ, ఐజర్ భూసేకరణలో భాగంగా రైతులకు అందాల్సిన పరిహారాన్ని బినామీ పేర్లతో కొట్టేశారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వ భూములపై కన్నేసి వందలాది ఎకరాలను తన అనుచరుల పేర్లతో పట్టాలు చేసుకుని దర్జాగా అనుభవిస్తున్నారు.. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్రెడ్డి. బినామీ పేర్లతో అన్యాక్రాంతం శ్రీకాళహస్తి మండలంలోని మన్నవరం, ఇనగలూరు, ఎంపేడు గ్రామాల్లో తన బినామీల పేర్లతో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను బొజ్జల సుధీర్రెడ్డి కూడగట్టారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి పట్టాలు చేసుకుని పెద్ద ఎత్తున భూకుంభకోణానికి పాల్పడినట్లు అప్పట్లో జిల్లా అధికారులకు ఫిర్యాదులందాయి. ఆ భూములకు సంబంధించి పట్టాదార్ పాసుపుస్తకాలను బ్యాంకుల్లో పెట్టి పంటరుణాలు పొంది బ్యాంకులను బురిడీ కొట్టించారు. తొట్టంబేడు మండలంలో సైతం తన అనుచరుల పేర్లతో ప్రభుత్వ భూములను పట్టాలు చేసుకుని వాటిని విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. అలాగే ఏర్పేడు మండలం కోబాక రెవెన్యూ పరిధిలో గోవు పోరంబోకు భూములను బొజ్జల సుధీర్రెడ్డి అనుచరులు అక్రమించి పట్టాలు చేసుకుని సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నారు. అనేకమార్లు ఈ ఆక్రమణలపై ఫిర్యాదులు చేసినా ఆక్రమణదారులు ఈ భూములను వదిలిపెట్టలేదు. మళ్లీ బొజ్జల సుధీర్రెడ్డికి అధికారం ఇస్తే నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములను వదిలిపెట్టడని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
ముసలోళ్ల గోడు వెంటాడుతుంది
మా మూసలోళ్ల పింఛన్పై చంద్రబాబు రాజకీయం చేయడం ఏమిటి. వేకువజామున తలుపుతట్టి 5 గంటలకే గ్రామ వలంటీర్లు ఇది వరకు పింఛన్ అందజేసేవారు. అయితే ఎన్నికల సాకుతో వలంటీరు వ్యవస్థను నిలుపుదల చేయించిన చంద్రబాబుకు మేము ఓట్ల రూపంలో బుద్ధి చెప్పుతాము. గత నెలలో సచివాలయాల దగ్గర ఇస్తే.. ఈ నెల బ్యాంకుల్లో జమచేశారని చెప్పారు. బ్యాంకు ఉన్న మండల కేంద్రానికి నేను నివాసం ఉన్న గ్రామానికి 10 కిలో మీటర్లు దూరం. అసలే మండుటెండల్లో నాలాంటి వృద్ధాప్యం ఉన్నవారు బ్యాంకులో క్యూలో నిలబడి తీసుకోవడం ఎంత కష్టం. ఇంతగా కష్టపెడుతున్న మా వృద్ధుల గోడు చంద్రబాబును వెంటాడక తప్పదు. ఎప్పుడు ఎప్పుడని జగనయ్య ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నాం. – సరోజనమ్మ, నెలటూరు. వరదయ్యపాళెం మండలం మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి చంద్రబాబునాయుడు ప్రభుత్వ హాయంలో పింఛన్ల్ కోసం పంచాయతీ కార్యాలయాలు, పోస్టు ఆఫీసు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాసేవాళ్లం. చంద్రబాబు కుట్రలతో మళ్లీ నేడు చంద్రబాబు పాలన గుర్తుకు వస్తోంది. వయసు మీదపడి నీరక్షరాస్యులమైన మేము నగదు ఎలా తీసుకోవాలి..? కనీసం బ్యాంకుల వద్ద నగదు తీసుకునేందుకు విత్డ్రా ఫారమ్ రాసి ఇచ్చే దిక్కులేదు. వందల కొద్దీ పింఛన్దారులు ఒక్కసారిగా బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య మేము పింఛన్ తీసుకోవడం సాధ్యమేనా. – అమ్మణమ్మ, తాగేలి, వరదయ్యపాళెం మండలం -
బాబు వల్లే మాకు ఈ కష్టాలు
ప్రతినెలా ఒకటో తేదీనాడే వలంటీర్లు మా ఇళ్ల వద్దకొచ్చి పింఛన్ ఇచ్చేవారు. చంద్రబాబు, ఆయన అనుచరుల కారణంగా నేడు మేము నానా కష్టాలు పడుతున్నాం. ఈనెలలో మాకు పింఛను బ్యాంకు అకౌంట్లలో జమచేసినట్టు చెప్పారు. పింఛను కోసం మండుటెండలో బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈ వయసులో మేము ఇలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి రావడం ఎంతో కష్టంగా ఉంది. ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టి చంద్రబాబు ఏం సాధిస్తాడో..? అర్థం కావడంలేదు. ఈ కష్టాలకు కారణమైన బాబుకు మా ఉసురు తగలక పోదు. – వీరదాసరి రమణమ్మ, కలువాయి భయమేస్తోంది ఒకటో తేదీన తెల్లవారుజామునే ఇంటి తలుపు తట్టి పెన్ష్న్ సొమ్ము ఇచ్చే వలంటీర్లను తీసేశారు. ఇప్పుడు బ్యాంకు వద్దకు వెళ్లితే ఆ జనాన్ని చూస్తే భయమేస్తోంది. ఆ క్యూలో నిలుచుకునే ఓపిక కూడా లేదు. నిరుపేదలను కష్టపెట్టే వారికి మా గోడు తప్పక తగలుతుంది బాబు. – వెంకటాద్రి, పెట్లూరు, వెంకటగిరి మండలం
Photos
View allVideo
View allBullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019