breaking news
Ad - Sakshi_Home_Sticky
-
నిజాయితీకి మారుపేరు నారాయణస్వామి
వెదురుకుప్పం : ‘అతనెవరో థామస్ అట..టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి...నేనింతవరకూ చూసింది కూడా లేదు..రావడం.. తిట్టడం ఇదే పనిగా పెట్టుకున్నారు... నిజాయితీకి మారు పేరు మా తండ్రి డిప్యూటీ సీఎం నారాయణస్వామిని, నన్ను నిత్యం ఆడి పోసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు...నేనొక్కటే చెబుతున్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ప్రజలే తరిమికొడతారు’ అని వైఎస్సార్సీపీ గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని ఎనమలమంద గ్రామంలో ఎన్నికల ప్రచారం అనంతరం మీడియాతో మాట్లాడారు. నీతిగా రాజకీయాలు చేసిన తన తండ్రిని అవినీతి పరుడు అంటూ సంస్కారం లేని వ్యక్తులందరూ విమర్శలు చేయడం బాధేస్తుందన్నారు. కష్టానికి నిదర్శనం మానాన్న... విలువ తెలిసిన వ్యక్తిగా మానాన్న పేద ప్రజల గుండెల్లో ఉన్నారు.. నేను ఎక్కడికెళ్లినా మన అన్న నారాయణస్వామి కుమార్తె అంటూ అక్కున చేర్చుకుంటున్నారు. అలాంటిది ఓ మహిళ అనే ఇంగితం కూడా లేకుండా థామస్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఏం చేయదలచుకున్నారో అది చెప్పుకోవాలి కానీ, మమ్మల్ని చులకన చేసి మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. క్రిమినల్ కేసులున్న వ్యక్తి కూడా తమపై నిందలు వేయడం దారుణమన్నారు. టీడీపీ అభ్యర్థి థామస్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. -
ప్రచార వాహనంపై టీడీపీ గూండాల దాడి
నగరి : మండలంలోని కావేటిపురంలో మంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా ప్రచారవాహనంపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. గురువారం కావేటిపురం ప్రాంతంలో టీడీపీ అభ్యర్ధి భానుప్రకాష్ ప్రచారం ఉండటంతో పచ్చమూకలు వైట్హౌస్ వద్ద సుమారు 50 మంది వేచివున్నారు. మంత్రి ప్రచార ఆటో నడిపే ఆర్.నాగభూషణం ఆ ప్రాంతానికి చెందినవాడు కావడంతో వాహనంతో అటువైపుగా వెళ్లాడు. పంచాయతీలో అధికశాతం వైఎస్సార్సీపీలో చేరిపోవడంతో జీర్ణించుకోలేకపోతున్న పచ్చమూకలు తమ ప్రతాపాన్ని ప్రచారవాహనంపై చూపాయి. ఆటోను ఆపి డ్రైవర్ను కిందకుతోసి ఫెక్లీలోని మంత్రి చిత్రపటాన్ని బ్లేడ్లతో కోసేశారు. దీనిపై ఆర్ఓ, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. అకస్మాత్తుగా వచ్చి పడ్డారు శ్ఙ్రీమంత్రి రోజమ్మ ప్రచార ఆటోను నడుపుతూ రోజూ ఈ మార్గంలోనే వెళతాను. అక్కడ టీడీపీ రౌడీలు ఉన్నది గమనించలేదు. అకస్మాత్తుగా వచ్చి పడ్డారు. ఆటోను అడ్డుకున్నారు. నన్ను కిందకుతోసేశారు. మంత్రి ఫెక్సీని ధ్వంసం చేశారు.. ఏందిరా నీ ప్రచారం అంటూ బూతులు తిట్టారు. చిరంజీవి అనే అతను నన్ను తోసేస్తే సెల్వమణి, పుష్ఫరాజ్, బాబు, రాజ్కుమార్ అనేవాళ్లు మరికొందరితో కలిసి ప్లెక్సీలు చింపేశారుశ్రీశ్రీ అని బాధితుడు నాగభూషణం తెలిపాడు. -
‘ఆయుష్మాన్ భారత్’తో వైద్య సేవలు సులభం
చిత్తూరు రూరల్(కాణిపాకం): ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (అభ) ద్వారా దేశవ్యాప్తంగా వైద్యసేవలను సులభంగా పొందవచ్చని డీఎంహెచ్ఓ ప్రభావతీదేవి తెలిపారు. గురువారం చిత్తూరులోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో అభ డిజిటలైజేషన్పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయుష్మాన్భారత్పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ వివరాలను డిజిటలైజేషన్ చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు హర్షవర్థన్, సుదర్శన్, జార్జ్, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 16,571 పోస్టల్ బ్యాలెట్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో వివిధ కేటగిరీలకు సంబంధించి మొత్తం 16,571 మంది పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకున్నారని, వారందరికీ బ్యాలెట్ అందిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులందరూ ఈ నెల 5,6 తేదీల్లో ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలన్నారు. ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ముందస్తుగా ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. నిర్దేశిత తేదీల్లో ఆయా సెంటర్లలో దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులను నేరుగా పరిశీలించి పోస్టల్బ్యాలెట్ ఇచ్చి అప్పటికప్పుడే ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు ఆయా నియోజకవర్గాల్లో, ఇతర జిల్లాల ఉద్యోగులు కలెక్టరేట్లోని డీఆర్డీఏ భవనం వద్ద ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవచ్చన్నారు. ఈ నెల 5 న పీఓ, ఏపీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్లు, 6వ తేదీన అత్యవసరశాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయాల్సి ఉంటుందని చెప్పారు. ఏప్రిల్ 26వ తేదీలోపు పోస్టల్బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోలేని ఉద్యోగులు ఈ నెల 5,6 తేదీల్లో నేరుగా సంబంధిత ధ్రువీకరణపత్రాలు చూపించి ఓటు హక్కు సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పించామని వివరించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే సమయంలో తమ వెంట ఆధార్ కార్డు, ఓటరు ఐడీ, ఎన్నికల విధులకు సంబంధించి ఉత్తర్వులు తీసుకెళ్లాలని సూచించారు. హోమ్ ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న 566 మందికి ఈ నెల 6,7 తేదీల్లో ఇంటి వద్దకే ఓటు వేయించే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. 3,380 మంది సర్వీసు ఓటర్లు తమకు అందిన పోస్టల్ బ్యాలెట్ను డౌన్లోడ్ చేసుకొని తమ పోస్టల్ బ్యాలెట్ ను సంబందిత ఆర్ఓ కార్యాలయాలకు ఈ నెల 10వ తేదీలోపు చేరేలా పోస్టులో పంపాలని కోరారు. జిల్లావ్యాప్తంగా ఓటర్ స్లిప్ల పంపిణీని ఈ నెల 6వ తేదీలోపు పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా రూ.2.63 కోట్ల నగదు సీజ్ చేశామని తెలిపారు. సరైన ఆధారాలు చూపిన వారికి నగదు తిరిగి చెల్లిస్తున్నామని చెప్పారు. సమా వేశంలో చిత్తూరు అసెంబ్లీ ఆర్ఓ శ్రీనివాసులు, ట్రైనీ కలెక్టర్ హిమవంశీ, డీఆర్ఓ పుల్లయ్య పాల్గొన్నారు. -
పింఛన్ నగదుకు పాట్లు
● బ్యాంకుల్లో అవ్వాతాతల బారులు ● మండుటెండల్లో ముసలోళ్ల తిప్పలు ● చంద్రబాబు అండ్ కో తీరుపై విరుచుకుపడుతున్న వృద్ధులుఏం సాధించావు చంద్రబాబు మాకు ఫించన్లు రానివ్వకుండా మేము కష్టాలు పడేలా చేసి నువ్వు ఏం సాధించావు చంద్రబాబు. వలంటీర్లు ఉన్నప్పుడే కరెక్టుగా డబ్బులు ఇచ్చి వెళ్లేవారు. మాకు ప్రశాంతంగా ఉండేది. మా కష్టాలను వలంటీర్లకు చెప్పుకుంటే పరిష్కరించేవారు. పింఛన్లను ఇంటి వద్దకు ఇవ్వనివ్వకుండా చేసింది చంద్రబాబునాయుడే. ఇది కరెక్టు కాదు . చంద్రబాబు మోసాలను మేము నమ్మం. బ్యాంకుల్లో ఏ మాత్రం మమ్మల్ని పట్టించుకోవడంలేదు. సందేహాలు అడిగితే విసుక్కుంటున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటికి అవసరమయ్యే బియ్యం, నిత్యావసర వస్తువులు తీసుకునేదాన్ని. ఇప్పుడేమో ఇబ్బందులు పడుతున్నా. ఇందుకు చంద్రబాబే ప్రధాన కారణం. – శాంతి, గిరింపేట, చిత్తూరు
Pagination
Bullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019