Sakshi News home page

ప్రచార వాహనంపై టీడీపీ గూండాల దాడి

Published Tue, May 7 2024 1:10 PM

ప్రచార వాహనంపై టీడీపీ గూండాల దాడి

నగరి : మండలంలోని కావేటిపురంలో మంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్‌కే రోజా ప్రచారవాహనంపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. గురువారం కావేటిపురం ప్రాంతంలో టీడీపీ అభ్యర్ధి భానుప్రకాష్‌ ప్రచారం ఉండటంతో పచ్చమూకలు వైట్‌హౌస్‌ వద్ద సుమారు 50 మంది వేచివున్నారు. మంత్రి ప్రచార ఆటో నడిపే ఆర్‌.నాగభూషణం ఆ ప్రాంతానికి చెందినవాడు కావడంతో వాహనంతో అటువైపుగా వెళ్లాడు. పంచాయతీలో అధికశాతం వైఎస్సార్‌సీపీలో చేరిపోవడంతో జీర్ణించుకోలేకపోతున్న పచ్చమూకలు తమ ప్రతాపాన్ని ప్రచారవాహనంపై చూపాయి. ఆటోను ఆపి డ్రైవర్‌ను కిందకుతోసి ఫెక్లీలోని మంత్రి చిత్రపటాన్ని బ్లేడ్లతో కోసేశారు. దీనిపై ఆర్‌ఓ, పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వైఎస్సార్‌సీపీ నేతలు తెలిపారు.

అకస్మాత్తుగా వచ్చి పడ్డారు

శ్ఙ్రీమంత్రి రోజమ్మ ప్రచార ఆటోను నడుపుతూ రోజూ ఈ మార్గంలోనే వెళతాను. అక్కడ టీడీపీ రౌడీలు ఉన్నది గమనించలేదు. అకస్మాత్తుగా వచ్చి పడ్డారు. ఆటోను అడ్డుకున్నారు. నన్ను కిందకుతోసేశారు. మంత్రి ఫెక్సీని ధ్వంసం చేశారు.. ఏందిరా నీ ప్రచారం అంటూ బూతులు తిట్టారు. చిరంజీవి అనే అతను నన్ను తోసేస్తే సెల్వమణి, పుష్ఫరాజ్‌, బాబు, రాజ్‌కుమార్‌ అనేవాళ్లు మరికొందరితో కలిసి ప్లెక్సీలు చింపేశారుశ్రీశ్రీ అని బాధితుడు నాగభూషణం తెలిపాడు.

Advertisement

homepage_300x250