మాకు ఫించన్లు రానివ్వకుండా మేము కష్టాలు పడేలా చేసి నువ్వు ఏం సాధించావు చంద్రబాబు. వలంటీర్లు ఉన్నప్పుడే కరెక్టుగా డబ్బులు ఇచ్చి వెళ్లేవారు. మాకు ప్రశాంతంగా ఉండేది. మా కష్టాలను వలంటీర్లకు చెప్పుకుంటే పరిష్కరించేవారు. పింఛన్లను ఇంటి వద్దకు ఇవ్వనివ్వకుండా చేసింది చంద్రబాబునాయుడే. ఇది కరెక్టు కాదు . చంద్రబాబు మోసాలను మేము నమ్మం. బ్యాంకుల్లో ఏ మాత్రం మమ్మల్ని పట్టించుకోవడంలేదు. సందేహాలు అడిగితే విసుక్కుంటున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటికి అవసరమయ్యే బియ్యం, నిత్యావసర వస్తువులు తీసుకునేదాన్ని. ఇప్పుడేమో ఇబ్బందులు పడుతున్నా. ఇందుకు చంద్రబాబే ప్రధాన కారణం. – శాంతి, గిరింపేట, చిత్తూరు