అలంపూర్: మాజీ ఎమ్మెల్యే అబ్రహం బీజేపీలో చేరుతున్నారనే పోస్టులు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈమేరకు బీజేపీ రాష్ట్ర పెద్దలు ఆయనకు ఫోన్ చేసి సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని మరొకరికి టికెట్ కేటాయించడంతో అసంతృప్తికి గురైన ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి అందరికి అశ్చర్యానికి గురి చేశారు. తాజాగా బీజేపీలో చేరుతున్నారనే వార్తలకుతోడు ఎంపీ పోతుగంటి రాములుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయమై ఆయన సన్నిహితులను ఆరా తీయగా.. పార్టీ మార్పు వార్తల్లో నిజం లేదని, కావాలని కొందరు పాత ఫోటోలను పోస్టు చేస్తున్నారని తెలిపారు. నోటిఫికేషన్ వెలువడనున్న ఈ తరుణంలో పార్టీల మార్పు అంశం ఏ మేరకు ఉంటుందో వేచి చూడాలి.
breaking news
Breadcrumb
- HOME
బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే అబ్రహం..?
Published Thu, Apr 18 2024 9:30 AM
Ad - Sakshi_Home_Sticky
adsolute_video_ad
Related news
-
జగదభిరాముడి కల్యాణం.. జగమంతా ఆనందం
వనపర్తి జిల్లాలో..సిర్సనగండ్లలో మాంగళ్యధారణ ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు చారకొండ: అపర భద్రాద్రిగా విరాజిల్లుతున్న సిర్సనగండ్ల క్షేత్రంలో జగదానంద కారకుడు, జగదాభిరాముడు కల్యాణ వేడుక...బుధవారం కనులపండువగా సాగింది. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని.. కనులారా వీక్షించి భక్తజనం పులకించారు. ఉదయం 10 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, భక్తుల జయజయ ద్వానాల మధ్య కల్యాణమూర్తులను ఊరేగింపుగా కల్యాణవేదిక వద్దకు తీసుకురాగా.. ఆలయ చైర్మన్ డేరం రామశర్మ పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు జిలకర్ర బెల్లం, మాంగళ్యధారణ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. లోకమంతా వేయికళ్లతో ఎదురుచూసిన అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో రామయ్య మాంగళ్యధారణ చేశారు. వేలాది భక్తుల రామనామస్మరణ మధ్య ఆ జగదభిరాముడు జానకమ్మను మనువాడాడు. రాముడు దోసిట తలంబ్రాలు నీలపురాసులుగా జానకి దోసిట తలంబ్రాలు మణిమాణిక్యాలై సాక్ష్యాత్కరించిన వేళ.. సిర్సనగండ్ల క్షేత్రం భక్తి పారవశ్యంతో ఓలలాడింది. ఈ సందర్భంగా జైశ్రీరాం నినాదాలు మార్మోగాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. వీఐపీ తాకిడితో పాటు ఎండలు ఎక్కువగా ఉండడంతో భక్తులు కొంత ఇబ్బంది పడ్డారు. కల్యాణోత్సవానికి దాదాపు 30 వేల మందికి పైగా భక్తులు హాజరైనట్లు దేవస్థాన చైర్మన్, ఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. వనపర్తిటౌన్: జిల్లావ్యాప్తంగా బుధవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ఆలయాల ఎదుట పచ్చటి పందిళ్లు వేసి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు, సన్నాయి, డప్పు వాయిద్యాల నడుమ సీతారాముల కల్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా ఆలయాలకు తరలివచ్చారు. జిల్లాకేంద్రంలోని రామాలయం, వేంకటేశ్వర దేవాలయం, రాంనగర్, బండారునగర్లోని రామాలయాలు, పీర్లగుట్టలోని అభయాంజనేయస్వామి, నాగవరంలోని కోదండరామస్వామి, మర్రికుంటలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో కల్యాణ క్రతువు జరిపించారు. రామాలయంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, వేంకటేశ్వరస్వామి ఆలయంలో జిల్లా న్యాయమూర్తులు సునీత, రవికుమార్ పాల్గొన్నారు. ఆలయాల్లో భక్తులకు అన్నదానం చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి.. వీపనగండ్ల: శ్రీరామచంద్రుడి దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బుధవారం మండలంలోని గోవర్ధనగిరి, వల్లాభాపురంలో జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామస్తులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. గోవర్ధనగిరిలో మంత్రి జూపల్లి కృష్ణారావు నయనానందంగా సాగిన రాములోరి కల్యాణం జనసంద్రంగా మారిన సిర్సనగండ్ల క్షేత్రం మార్మోగిన జైశ్రీరామ్ నినాదాలు -
ముందస్తు చెల్లింపుపై రాయితీ
సద్వినియోగం చేసుకోవాలి.. ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపుపై 5 శాతం రాయితీని పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ నెలాఖరు వరకే అవకాశం ఉంది. ప్రస్తుతం రూ.10 వేలకు రూ.500 ఆదా అవుతుంది. ముందస్తు చెల్లింపులతో కలిగే లాభాలను వివరిస్తూ ప్రత్యేక చార్ట్ను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. – ఎం.పూర్ణచందర్, పుర కమిషనర్, వనపర్తి 2024–25 ఆర్థిఽక సంవత్సరానికి వర్తింపు ● పుర ప్రజలను ప్రోత్సహించేందుకు అధికారుల యత్నం ● జిల్లాలో 5 శాతం రిబేట్తో రూ.33 లక్షల వరకు ఆదా ●వనపర్తి టౌన్: పురపాలికల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం 5 శాతం రాయితీ ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఉన్న ప్రజలకు మొత్తంగా రూ.33 లక్షల వరకు ఆదా కానుంది. ఎలాంటి పాత బకాయిలు లేకుండా ఈ ఏడాది పన్ను చెల్లించే వారికి మాత్రమే రాయితీ వర్తించనుంది. గతేడాది ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం చేరకపోవడంతో ప్రభుత్వం ప్రకటించిన రాయితీ ప్రజలు, పురపాలక సంఘానికి కలిసి రా నుందని చెప్పవచ్చు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో పన్ను బకాయిల వడ్డీపై 90 శాతం ఇవ్వడం.. పుర అధికారులు మార్చిలో బృందాలుగా ఏర్పడి బకాయిల వసూళ్లకు తిరగడంతో కొంత మేర లాభం చేకూరింది. ముందస్తు పన్ను చెల్లింపుదారులకు ఈ నెల 30 వరకు అవకాశం ఇవ్వడంతో పురపాలికలకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ¢ జిల్లాకేంద్రంలో మొత్తం 17,649 అసెస్మెంట్లు ఉండగా.. 9,126 మంది యజమానులు 5 శాతం రిబేట్కు అర్హత సాధించారు. రూ.3.21 కోట్ల డిమాండ్ ఉండగా.. రూ.15.91 లక్షలు ఆదా కానుంది. పుర అధికారులు ఇప్పటి వరకు రూ.32 లక్షలు వసూలు చేశారు. ¢ అమరచింతలో 5 శాతం రిబేట్కు 1,726 అసైస్మెంట్లు అర్హత ఉండగా.. రూ.28.32 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. పుర ప్రజలకు రూ.1.41 లక్షల వరకు ఆదా కానుంది, రాయితీతో ఇప్పటి వరకు రూ.1.05 లక్షలు వసూలు చేశారు. ¢ ఆత్మకూర్ మున్సిపాలిటీలో 5,428 అసైస్మెంట్లు ఉన్నాయి. రూ.1.90 కోట్లు లక్ష్యం కాగా.. 5 శాతం రాయితీతో రూ.9.50 లక్షలు ఆదా కానున్నాయి. ఇప్పటి వరకు రూ.17 లక్షలు వసూలు చేశారు. మిగిలిన కొత్తకోట, పెబ్బేర్ మున్సిపాలిటీల్లోనూ పుర అధికారులు పన్ను వసూళ్లు చేపడుతున్నారు. ప్రచారం అంతంతే.. ముందస్తు చెల్లింపు రాయితీపై పుర ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో 14 రోజులే అవకాశం ఉండటంతో లక్ష్యం చేరుకుంటారా? లేదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు వసూలు చేసింది 10 శాతంలోపే కావడం గమనార్హం. -
నేటి నుంచి లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం
సాక్షి, నాగర్కర్నూల్: లోక్సభ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. గురువారం నుంచే అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో లోక్సభ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 25 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించనుండగా.. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండనుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తాము నామినేషన్ వేసేందుకు ముహూర్తాలను ఖరారు చేసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లు తమ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా జాతీయ, రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల హాజరు, భారీ ర్యాలీలతో నామినేషన్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. బడా నేతలు హాజరు.. ముహూర్త బలం దృష్టిలో ఉంచుకుని ప్రధాన పా ర్టీల అభ్యర్థులు ఈ నెల 19, 23, 24, 25 తేదీల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఈ నెల 19న మొదటి సెట్టు నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్రెడ్డి హాజరవుతారని తెలుస్తోంది. అలాగే ఈ నెల 24న పార్టీ శ్రేణులో కలిసి భారీ ర్యాలీతో మరోసారి నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఆ రోజున బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీశ్రావు హాజరవుతారని సమాచారం. కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి ఈ నెల 23న నామినేషన్ వేసేందుకు సిద్ధం అవుతున్నారు. నామినేషన్ రోజున పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పార్టీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ తమ అభ్యర్థుల నామినేషన్ల ఘట్టానికి జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను రంగంలోకి దింపనుంది. ఈ నెల 25న బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ప్రసాద్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనుండగా.. నామినేషన్ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్రపటేల్ హాజరుకానున్నారని సమాచారం. ఈ మేరకు భారీ ర్యాలీలు, అనంతరం ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశాలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఉపసంహరణకు చివరి తేది ఏప్రిల్ 29 నామినేషన్ల స్వీకరణకు చివరి తేది ఏప్రిల్ 25 పోలింగ్ తేది : మే 13ఎన్నికల ఫలితాలు: జూన్ 4 -
No Headline
సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, సీఎం రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులతో పాటు మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్, నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, భరత్ప్రసాద్, బీజేపీ నేత ఆచారి తదితర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. కల్వకుర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీఐ విష్ణువర్ధన్రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్తో పాటు పలువురు ఎస్ఐలు పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. సిర్సనగండ్లకు చెందిన రాచమళ్ల నర్సింహ కుటుంబసభ్యులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం, రాంపురం గ్రామానికి చెందిన చిలుకాని బాల్రెడ్డి, వెంకటమ్మ జ్ఞాపకార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. భారతిసిమెంట్, ఇతర సేవా సంస్థల ద్వారా తాగునీటి వసతి, మజ్జిగ అందజేశారు. కాగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల ప్రజాప్రతినిధులు, ఎంపీ అభ్యర్థులు, నాయకులు ఒకే వేదికపై కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. -
లౌకిక శక్తులను గెలిపించాలి : సీపీఎం
పెబ్బేరు రూరల్: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించి వామక్ష లౌకిక శక్తులను గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్వెస్లీ కోరారు. బుధవారం జిల్లాకేంద్రంలోని యాదవభవన్లో జరిగిన వామపక్షాల జిల్లా సదస్సుకు ఆయనతో పాటు సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర నాయకుడు కృష్ణారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటాయనిఽ, అదుపు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, పుట్టా ఆంజనేయులు, జీఎస్ గోపి, బాల్రెడ్డి, లక్ష్మి, మేకల ఆంజనేయులు, ప్రసాద్, రాజన్న, గణేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. రామన్పాడులో నీటిమట్టం తగ్గుముఖం మదనాపురం: రామన్పాడు జలాశయంలో నీటిమట్టం రోజురోజుకు తగ్గుతోంది. బుధవారం 1,011 అడుగులు ఉండగా.. జూరాల ఎడమ, సమాంతర కాల్వ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. తాగునీటి అవసరాలకు 20 క్కూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని ఏఈ సింగిరెడ్డి రనీల్రెడ్డి వివరించారు. సివిల్స్ ర్యాంకర్ అనన్యరెడ్డికి సన్మానం అడ్డాకుల: యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయస్థాయి మూడవ ర్యాంక్ సాధించిన పొన్నకల్ గ్రామవాసి దోనూరు అనన్యరెడ్డిని బుధవారం హైదరాబాద్లో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు. జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించి, పాలమూరు జిల్లాకే కాకుండా రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు మహిమూద్, విజయకుమార్రెడ్డి, కృష్ణ, నర్సింహారెడ్డి, ప్రభాకర్రెడ్డి, ప్రతాప్రెడ్డి, జాజాల రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
Related News by category
-
నాగర్కర్నూల్ జిల్లాలో..
గురువారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతల వివరాలు.. మహబూబ్నగర్ జిల్లా.. మండలం ఉష్ణోగ్రతలు జడ్చర్ల 45.1 చిన్నచింతకుంట 45.0 బాలానగర్ 44.9 మహబూబ్నగర్ 44.4 అడ్డాకల్ 44.0 మండలం ఉష్ణోగ్రతలు వంగూరు 46.0 కొల్లాపూర్ 46.0 వెల్దండ 45.4 కల్వకుర్తి 45.0 బిజినేపల్లి 44.5 -
వనపర్తి
శుక్రవారం శ్రీ 3 శ్రీ మే శ్రీ 2024వివరాలు IIలో uపలు మండలాల్లో రెడ్ అలర్ట్కు చేరుకున్న ఉష్ణోగ్రతలు ● ఉమ్మడి జిల్లాలో నేడు, రేపు మరింత పెరిగే అవకాశం ● తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక ● అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని నిపుణుల సూచన 45 డిగ్రీలు దాటితే.. ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మే నెల ప్రారంభంలోనే పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువయ్యాయి. గురువారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో అత్యధికంగా 45.1 డిగ్రీలు, చిన్నచింతకుంట 45.0, నారాయణపేట జిల్లా కృష్ణాలో 45.2, ధన్వాడలో 45.1, కొత్తపల్లి మండలంలో 45, గద్వాల జిల్లాలో వడ్డేపల్లి 45.7, అయిజ 45.2, అలంపూర్ 45, నాగర్కర్నూల్ జిల్లాలో వంగూరు, కొల్లాపూర్ 46.0, వెల్దండ 45.4, కల్వకుర్తి 45.0 డిగ్రీలతో రెడ్ అలర్ట్ చేరుకున్నాయి. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మండుటెండలో పనిచేసే కూలీలు, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని నిపుణులు సూచిస్తున్నారు. దాహంతో సంబంధం లేకుండా రోజంతా తగినంత నీరు, నిమ్మకాయ నీరు, మజ్జిగ లాంటి ద్రావణాలను తరచుగా తీసుకోవాలని చెబుతున్నారు. జో. గద్వాల జిల్లా.. మండలం ఉష్ణోగ్రతలు వడ్డేపల్లి 45.7 అయిజ 45.2 అలంపూర్ 45.0 ఇటిక్యాల 44.9 ధరూర్ 44.8 వనపర్తి జిల్లా.. మండలం ఉష్ణోగ్రతలు మదనాపురం 44.8 ఖిల్లాఘనపూర్ 44.6 కొత్తకోట 44.5 పాన్గల్ 44.2 గోపాల్పేట 44.0న్యూస్రీల్ -
బీర్లు.. నో స్టాక్
15 రోజుల నుంచి తీవ్రమైన కొరత మహబూబ్నగర్ క్రైం: మండే ఎండల నుంచి ఉపశమనం కోసం మందుబాబులు చల్లని బీర్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో చల్లదనం ఉన్న బీర్లు మార్కెట్లో కొరత ఏర్పడటంతో భారీగా డిమాండ్ పెరిగింది. ఒక్క ఏప్రిల్ నెలలోనే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,02,961 కాటన్ల బీర్ల విక్రయాలు జరిగాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని తిమ్మాజిపేట, కొత్తకోట మద్యం డిపోలకు బీర్లు సరఫరా చేస్తున్నారు. అయితే ఎండలు విపరీతంగా పెరగడంతో పాటు ఇటీవల ప్రొడక్షన్ సక్రమంగా లేకపోవడం ఇందుకు కారణమైంది. ఇప్పటికే జిల్లాలో చాలావరకు బీర్ల కొరత ఉండగా.. రాబోయే రోజుల్లో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే బీర్లకు డిమాండ్ ఉంటుంది. కానీ, ఇప్పుడే కొరత తలెత్తడంతో ఇటు మందుబాబులు, అటు వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 230 మద్యం దుకాణాల్లో అన్నిచోట్ల నో–స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. 15 రోజులుగా ఉమ్మడి జిల్లాలో స్టాక్ వచ్చిన పది నిమిషాల్లో ఖాళీ అవుతున్నాయి. తిమ్మాజిపేట, కొత్తకోట డిపోల నుంచి ఒక్కో దుకాణానికి 2–5 కేసుల వరకు మాత్రమే బీర్లు ఇస్తున్నారు. ఇచ్చిన స్టాక్ నిమిషాల వ్యవధిలో అయిపోవడంతో కష్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు డిమాండ్కు తగ్గట్టుగా బీర్లు లేకపోవడంతో వ్యాపారులు సైతం నష్టపోతున్నారు. విపరీతంగా పెరిగిన ఎండలకు తోడు ఇటీవల లారీల సమ్మె జరగడంతో బీర్ల సరఫరా, ఉత్పత్తిలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇప్పటి అక్కడక్కడ కొంత వరకు బీర్ల కొరత ఉండగా.. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని, సాధ్యమైనంత వరకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. నో స్టాక్ బోర్డులు ఒక్క ఏప్రిల్లోనే ఉమ్మడి జిల్లాలో 4,02,961 కాటన్లవిక్రయం ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి అంటున్న ఎకై ్సజ్ అధికారులు ఉత్పత్తి తక్కువ కావడం వల్లే.. గతంలో ప్రతి ఏడాది వేసవి కోసం డిసెంబర్, జనవరి నెలల్లో ఓవర్ టైం పనిచేసి బీర్లు అధికంగా ఉత్పత్తి చేసి స్టాక్ చేసేవాళ్లు. ఈసారి అలా చేయకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా కొరత ఏర్పడింది. ఈ నెల చివరి నాటి వరకు జిల్లాలో బీర్ల కొరత ఉంటుంది. ప్రొడక్షన్ తక్కువ కావడం వల్ల ఈ సమస్య వచ్చింది. – విజయ్భాస్కర్రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్, మహబూబ్నగర్ -
పోలింగ్ రోజున సెలవు
● జిల్లా ఎన్నికల అధికారి తేజస్ పవార్ వనపర్తి: పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఈ నెల 13న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ పవార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రంగా ఉన్న పాఠశాలలు, కార్యాలయాలకు ముందురోజు నుంచే సెలవు ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి ఓటరు తన ఓటుహక్కును తప్పకుండా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం పోలింగ్ రోజున సెలవు మంజూరు చేసేందుకు కలెక్టర్లకు అధికారం ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బందికి కలెక్టరేట్లోని ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటువేసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఫెసిలిటేషన్ సెంటరుకు వచ్చి ఓటు వేసేందుకు ఉద్యోగికి ఒకరోజు ప్రత్యేక సెలవు (స్పెషల్ క్యాజువల్ లీవ్) మంజూరు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మరుగుదొడ్లకు తాళాలు..
నాలుగేళ్ల కిందట ప్లాట్ఫాం ఒకటి, రెండుపై రూ.15 లక్షలు వెచ్చించి నిర్మించిన నాలుగు మరుగుదొడ్లు అన్ని వసతులతో నిర్మించారు. కానీ వీటికి తాళాలు వేసి ఉండటంతో వృథాగా మారాయి. మరుగుదొడ్డి తాళం చెవి విధుల్లో ఉన్న స్టేషన్ మాస్టర్ వద్ద అందుబాటులో ఉన్నాయంటూ స్టిక్కర్లు అతికించారు. అది కూడా ఆంగ్లంలో రాసి ఉండటంతో నిరక్షరాస్యులకు అర్థం కావడం లేదు. మహిళలు యువకులు స్టేషన్ మాస్టర్ వద్దకు వెళ్లి తాళం చెవి ఇవ్వమని అడగలేకపోతున్నారు. ప్రయాణికుల ఒత్తిడి మేరకు స్టేషన్ ప్రధాన కార్యా లయం పక్కనున్న ఒక మరుగుదొడ్డిని వాడు కునే అవకాశం కల్పించారు. అత్యవసర సమయంలో కొందరు ప్రయాణికులు స్టేషన్ వెలుపల ఉన్న ముళ్ల పొదల్లోకి వెళ్తున్నారు. స్టేషన్ ప్రధాన కార్యాల యం పక్కనే ఉన్న ప్రయాణికులు వేచి ఉండే గదికి కూడా తాళం వేశారు. రెండో ప్లాట్ఫాంపై షె డ్ లేకపోవడంతో ప్రయాణికులు ఎండ, వర్షంలో రైళ్ల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని ప్రయాణికులు వాపోతున్నారు.
Photos
View allVideo
View allBullet List Block
- rabri devi: రబ్రీ దేవి ఇంటికి సీబీఐ బృందం
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- PR Sreejesh: ఆవును అమ్మి.. కొడుకు కలను సాకారం చేసి
- Bellamkonda Sreenivas: మరో సూపర్ హిట్ రీమేక్తో వస్తోన్న బెల్లంకొండ
- Andhra Pradesh SSC Exam 2021: పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి
- Telangana Lok Sabha Election 2019