Sakshi News home page

నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి

Published Tue, May 7 2024 6:10 AM

-

మహబూబాబాద్‌: నిష్పక్షపాతంగా లోక్‌సభ ఎన్ని కల విధులు నిర్వర్తించాలని సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నితేష్‌వ్యాస్‌ అధికారులకు సూచించారు. గురువారం న్యూఢిల్లీ నుంచి ఆయన ఎన్నికల పోలింగ్‌ నిర్వహణ, విధులు, ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా నితేష్‌వ్యాష్‌ మాట్లాడుతూ.. అధికారులు చిన్న పొరపాటు కూడా జరగకుండా అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అదనపు బ్యాలెట్‌ యూనిట్లు, ఎఫ్‌ఎల్‌సీ, ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. వందశాతం ఓటర్‌ స్లిప్‌లు పంపిణీ చేయాలన్నారు. డబ్బు, మద్యం, గిఫ్ట్‌ల పంపిణీ జరుగకుండా పక్కా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సీ విజిల్‌ యాప్‌ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. వీసీలో ఆర్వో, కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌, ప్రధాన పరిశీలకులు రచిత్‌రాజ్‌, వ్యయ పరిశీలకులు రమాకాంత్‌ ద్రుపాటి, ఎస్పీ సుధీర్‌రాంనాథ్‌ కేకన్‌ పాల్గొన్నారు.

Advertisement

homepage_300x250