Sakshi News home page

నాణ్యమైన విద్యుత్‌ అందించాలి

Published Tue, May 7 2024 6:10 AM

నాణ్యమైన విద్యుత్‌ అందించాలి

నెహ్రూసెంటర్‌: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని విద్యుత్‌శాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ జె.నరేష్‌ సూచించారు. మహబూబాబాద్‌, కేసముద్రం సబ్‌ డివిజన్‌ పరిధిలోని విద్యుత్‌శాఖ సిబ్బందికి గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. విద్యుత్‌ సరఫరాపై అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్‌ వినియోగదారుల నుంచి వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అనంతరం సేఫ్టీ వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యుత్‌ ప్రమాదాల నివారణకు అందరూ పాటుపడాలన్నారు. క్రమంతప్పకుండా బిల్లులు చెల్లించాలని సూచించారు. మాస్టర్‌ ట్రైనర్స్‌ రవీందర్‌, సంజీవ్‌, ఉమా మహేశ్వర్‌రావు, వీరయ్య ఆధ్వర్యంలో సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈలు విజయ్‌, సునీత, అకౌంట్‌ ఆఫీసర్‌ సంతోష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

homepage_300x250