Sakshi News home page

విద్యుత్‌ శాఖకు రూ.50 లక్షల ఆస్తి నష్టం

Published Sat, Apr 20 2024 1:15 AM

సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు చేస్తున్న సిబ్బంది - Sakshi

నిజామాబాద్‌నాగారం: వడగళ్ల వానతో విద్యుత్‌ శాఖకు సుమారు రూ. 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు ఎస్‌ఈ రవీందర్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఈ దురు గాలులు, వడగళ్లకు గంటల వ్యవధిలో 10 ట్రాన్సుఫార్మర్‌లు, 150 వరకు విద్యుత్‌ స్తంభాలు, వైర్లు దెబ్బతిన్నాయి. కరెంట్‌ సరఫరాలో ఇక్కట్లు రావడంలో అధికారులు, విద్యుత్‌ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సాయంత్రం 5 గంటల నుంచే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించే పనిలో పడ్డా రు. పట్టణాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పల్లెలో అర్ధరాత్రి వరకు కరెంట్‌ సరఫరా అందిస్తామన్నారు.

Advertisement

adsolute_video_ad

homepage_300x250